నేటి నుంచి ఆటోచార్జీల మోత! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నేటి నుంచి ఆటోచార్జీల మోత!

నేటి నుంచి ఆటోచార్జీల మోత!

Written By news on Thursday, August 23, 2012 | 8/23/2012

రాష్ట్రవ్యాప్తంగా ఆటోచార్జీలు మోత మోగించనున్నాయి. ఆటోచార్జీలను పెంచుతూ ప్రభుత్వం బుధవారం జీవో జారీ చేసింది. పెరిగిన చార్జీలు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం సహా రాష్ట్రవ్యాప్తంగా గురువారంనుంచి అమలులోకి రానున్నాయి. ఇప్పటిదాకా వసూలు చేస్తున్న కనీస చార్జీ రూ.14 (తొలి 1.6 కి.మీ.వరకు) ఇకపై రూ.16 కానుంది. ఆపై ప్రతి కి.మీ.కు అదనంగా రూ.9 వసూలు చేయనున్నారు. నిరీక్షణ చార్జీల్లో ఎలాంటి మార్పు చేయలేదు. ప్రస్తుతం నిమిషం వెయిటింగ్‌కు వర్తింపజేస్తున్న 25 పైసలే ఇకపై కూడా అమలులో ఉంటుంది. రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజాము 5 వరకు మీటరు చార్జీపై 50 శాతం అదనంగా వసూలు చేస్తారు. ఈ మేరకు ఆటో రిక్షాల్లోని డిజిటల్ మీటర్లలో మార్పులు చేయాలని అధికారులను రవాణాశాఖ ముఖ్యకార్యదర్శి లక్ష్మీపార్థసారథి ఆదేశించారు.
Share this article :

0 comments: