విజయమ్మను కలిసిన భూనిర్వాసితులు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » విజయమ్మను కలిసిన భూనిర్వాసితులు

విజయమ్మను కలిసిన భూనిర్వాసితులు

Written By news on Monday, August 20, 2012 | 8/20/2012

పులివెందుల : యురేనియం కార్పోరేషన్ కింద భూములు కోల్పోయిన భూ నిర్వాసితులు సోమవారం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మను కలుసుకున్నారు. జీవనాధారమైన భూములు కోల్పోయినా కూడా ... ఇంతవరకూ యురేనియంలో ఉద్యోగ అవకాశాలు కల్పించలేదని వారు ఈ సందర్బంగా విజయమ్మ దృష్టికి తీసుకెళ్లారు. దీనికి స్పందించిన వైఎస్ విజయమ్మ యురేనియం భూనిర్వాసితులకు ఉద్యోగాలు కల్పించాలని యురేనియం కార్పోరేషన్‌ డైరెక్టర్ బెహల్‌కు ఈ విషయమై లేఖ రాశారు. 

కాగా ఈరోజు మధ్యాహ్నం విజయమ్మ 3 గంటలకు తొండూరు మండలం ఇనగలూరులో ఆర్‌వో ప్లాంటుతోపాటు అంగన్‌వాడీ కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమాలలో పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు పాలూరు గ్రామంలో పాఠశాల అదనపు తరగతి గదులను ప్రారంభిస్తారు. మంగళవారం యథావిధిగా ఎమ్మెల్యే కార్యాలయంలో విజయమ్మ ప్రజలకు అందుబాటులో ఉంటారు.
Share this article :

0 comments: