అసెంబ్లీలో ప్రజా వాణి వినిపించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభాపక్షం సిద్ధమవుతోంది. సోమవారం నుంచి ప్రారంభం కానున్న శాసనసభా సమావేశాల్లో ప్రజా సమస్యలపై అనుసరించాల్సిన వ్యూహాన్ని చర్చించేందుకు పార్టీ గౌరవాధ్యక్షురాలు, శాసనసభాపక్ష నాయకురాలు వైఎస్ విజయమ్మ అధ్యక్షతన పార్టీ ఎమ్మెల్యేలు ఆదివారం ఉదయం సమావేశమవుతున్నారు. విద్యుత్ సంక్షోభం, తద్వారా ఉద్యోగ, ఉపాధి, వ్యవసాయ రంగాలు దెబ్బతింటున్న అంశం, చిన్న, మధ్య తరహా పరిశ్రమల భవిష్యత్తు అంధకారంగా మారడం, వ్యవసాయరంగం, ఎరువులు, విత్తనాల కొరత, ఫీజులు, లక్ష్మీపేట ఉదంతం, డీజిల్ ధరలు వంటి అంశాలపై సమావేశంలో చర్చించి.. అసెంబ్లీలో చర్చకు వచ్చేలా చూడాలని పార్టీ భావిస్తోంది.
Home »
» నేడు వైఎస్సార్ కాంగ్రెస్ ఎల్పీ భేటీ
నేడు వైఎస్సార్ కాంగ్రెస్ ఎల్పీ భేటీ
Written By news on Sunday, September 16, 2012 | 9/16/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment