హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరో పోరుకు సిద్ధమైంది. పెంచిన ఆర్టీసీ ఛార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలంటూ నేడు అన్ని జిల్లా కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు చేపట్టింది. ఛార్జీల పెంపుకు నిరసనగా ప్రజల పక్షాన నిలిచి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు పార్టీ శ్రేణులు సమాయత్తం అవుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం రోజుకో ప్రజావ్యతిరేక విధానాన్ని అవలంబిస్తూ ప్రజల జీవితాలతో ఆటలాడుకుంటోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడుతున్నారు.
source:sakshi
source:sakshi
0 comments:
Post a Comment