వైఎస్సార్ పార్టీలోకి పోటెత్తుతున్న వలసలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్సార్ పార్టీలోకి పోటెత్తుతున్న వలసలు

వైఎస్సార్ పార్టీలోకి పోటెత్తుతున్న వలసలు

Written By news on Sunday, September 16, 2012 | 9/16/2012

 రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. పలు జిల్లాల్లో భారీ సంఖ్యలో వైఎస్సార్ పార్టీలోకి వలస వస్తున్నారు. అనంతపురం జిల్లా హిందూపురంలో 500 మంది కార్యకర్తలు వైఎస్సార్ సీపీలో చేరారు. 

కరీంనగర్‌లోని సంతోష్‌నగర్‌ యూత్ జిల్లా కన్వీనర్ మందల మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో 100 మంది పార్టీలోకి వచ్చారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలం ఇందిరానగర్‌లో వైఎస్సార్ సీపీ కేంద్ర కమిటి సభ్యులు కేకే మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో 300 మంది పార్టీలో చేరారు. 

వరంగల్ జిల్లా కేసముద్రం, ఇనుగుర్తిలో వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి, నూనావతు రాధా ఆధ్వర్యంలో వివిధ పార్టీలకు చెందిన 200 మంది వైఎస్సార్ పార్టీలోకి వలస వచ్చారు. 

మెదక్‌ జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గ ఇంఛార్జ్‌ అంజిరెడ్డి ఆధ్వర్యంలో బీహెచ్‌ఈఎల్ ఎల్‌ఐజీ కాలనీకి చెందిన 400 మంది యువకులువైఎస్సార్ పార్టీలో చేరారు. 
Share this article :

0 comments: