జగన్ బెయిల్ పై విచారణ వాయిదా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ బెయిల్ పై విచారణ వాయిదా

జగన్ బెయిల్ పై విచారణ వాయిదా

Written By news on Friday, September 28, 2012 | 9/28/2012

న్యూఢిల్లీ : వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు మరోసారి వాయిదా వేసింది. వచ్చే శుక్రవారం దీనిపై తదుపరి విచారణ ఉంటుందని న్యాయస్థానం తెలిపింది. తమ తరపు న్యాయవాది మారారని... విచారణను వాయిదా వేయాలని సీబీఐ న్యాయవాది మోహన్ పరాశరన్ విజ్ఞప్తిని అత్యున్నత న్యాయస్థానం మన్నించింది.

సీబీఐ తరపున అడిషనల్ సోలిసిటర్ జనరల్ మోహన్ పరాశరన్, సీనియర్ న్యాయవాది అశోక్ బాన్, జగన్ తరపున గోపాల్ సుబ్రహ్మణ్యం, విశ్వనాథన్ ధర్మాసనం ఎదుట హాజరయ్యారు. జస్టిస్ అఫ్తాబ్ ఆలం, జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్ తో కూడిన ధర్మాసనం ముందుకు ఈకేసు విచారణకు వచ్చింది. వాస్తవానికి బెయిల్ పిటిషన్ సెప్టెంబర్ 14ననే ధర్మాసనం ముందుకు వచ్చినా... సీబీఐ కౌంటర్ పిటిషన్ పరిశీలించాల్సి ఉందని న్యాయమూర్తులు విచారణను నేటికి వాయిదా వేశారు. కాగా బెయిల్ పిటిషన్ పై విచారణ తిరిగి అక్టోబర్ 5న జరగనుంది.
Share this article :

0 comments: