హోంమంత్రితో వైఎస్ఆర్ సీపీ నేతల భేటీ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » హోంమంత్రితో వైఎస్ఆర్ సీపీ నేతల భేటీ

హోంమంత్రితో వైఎస్ఆర్ సీపీ నేతల భేటీ

Written By news on Friday, September 7, 2012 | 9/07/2012

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు గురువారం హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ పట్ల పోలీసుల అనుచిత ప్రవర్తనపై ఫిర్యాదు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలను పోలీసులు వేధిస్తున్నారని హోంమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు హోంమంత్రిని కోరారు.

హోంమంత్రిని కలిసిన వారిలో ఎమ్మెల్యేలు శోభానాగిరెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, అమర్నాధరెడ్డి, గుర్నాథరెడ్డి, గొల్ల బాబురావు, బాలరాజు ఉన్నారు. భేటీ అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాట్లాడుతూ బంద్ సందర్భంగా ధర్మాన కృష్ణదాస్, ఆయన సతీమణి పద్మప్రియలపై పోలీసులు అనుచితంగా ప్రవర్తించారన్నారు. శ్రీకాకుళం జిల్లా గార పోలీసులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వారు హెచ్చరించారు. 
Share this article :

0 comments: