బంద్‌ను నీరు గార్చాలని చూశారు: వాసిరెడ్డి పద్మ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బంద్‌ను నీరు గార్చాలని చూశారు: వాసిరెడ్డి పద్మ

బంద్‌ను నీరు గార్చాలని చూశారు: వాసిరెడ్డి పద్మ

Written By news on Saturday, September 1, 2012 | 9/01/2012

సర్కారుకు ప్రధాన ప్రతిపక్షం మద్దతు స్పష్టమైందని ధ్వజం 

విద్యుత్ సంక్షోభాన్ని పరిష్కరించటంలో రాష్ట్ర ప్రభుత్వం చేతకానితనానికి నిరసనగా తమ పార్టీ చేపట్టిన బంద్‌ను నిర్వీర్యం చేయటానికి ఓ వైపు నుంచి అధికారపక్షం మరో వైపు నుంచి ప్రధాన ప్రతిపక్షం ప్రయత్నించాయని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తారు. కరెంటు లేక చీకటి బాధలు అనుభవిస్తున్న ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌కు సహకరిస్తుంటే పోలీసులు రంగంలోకి దిగి బలవంతంగా వాణిజ్య సంస్థలు, షాపులను తెరిపించారని విమర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్ బంద్‌కు సహకరించరాదని తమ కార్యకర్తలందరికి టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు పిలుపునిచ్చారని.. దీన్నిబట్టి ఆ పార్టీ ప్రభుత్వానికి ఎంత మద్దతునిస్తోందో అర్థం అవుతోందని ఈసడించారు. ఆమె శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. బంద్‌కు సహకరించొద్దని ఎర్రబె ల్లి చెప్పటమంటే.. విద్యుత్ సంక్షోభాన్ని పరిష్కరించటంలో ప్రభుత్వ వైఫల్యాన్ని టీడీపీ సమర్ధించినట్లే కదా అని నిలదీశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం పోలీసులను భారీగా మోహరించి తమ పార్టీ శ్రేణులపై అణచివేత చర్యలకు దిగిందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్‌టీసీ బస్సులను తిప్పాల్సిందిగా ప్రభుత్వమే ఆదేశాలిచ్చింద ని, పోలీసులు కూడా అతిగా జోక్యం చేసుకున్నారని ధ్వజమెత్తారు. సాధారణంగా అయితే బలవంతంగా షాపులు మూయించే వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలి కానీ.. అందుకు భిన్నంగా దుకాణదారులు స్వచ్ఛందంగా మూసేసుకుంటూ ఉంటే పోలీసులు బలవంతంగా తెరిపించారని పేర్కొన్నారు. తమ పార్టీకి చెందిన నాయకులను ఇష్టమొచ్చినట్లు అరెస్టు చేశారంటూ ఖండించారు. బంద్ ప్రారంభమయ్యీ కాక ముందే.. బంద్ ప్రభావం ఏమీ లేదంటూ ఓ వర్గం మీడియా అదే పనిగా ప్రసారాలు చేశారని.. తప్పుపట్టారు. ‘‘ఉదయం ఎనిమిది గంటలకే ప్రభుత్వ కార్యాలయాలను చూపించి ఇంకా మూయలేదని అంటున్నారు.. వాస్తవానికి అవి పనిచేసేది పది గంటలకు కదా!’’ అని ఆమె ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా బంద్ ప్రశాంతంగా విజయవంతంగా జరిగిందంటూ.. పాల్గొన్న ప్రజలందరికీ కతజ్ఞతలు తెలిపారు. ఇది బలవంతపు బంద్ ఏమీ కాదని ప్రభుత్వ వైఫల్యంపై ఆగ్రహంతో ప్రజలందరూ మౌనంగా తమ సంఘీభావాన్ని తెలిపారని ఆమె అభివర్ణించారు.
Share this article :

0 comments: