అనంతపురం: మరోప్రజాప్రస్థానం పేరిట వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన పాదయాత్ర శనివారం పదోరోజుకు చేరనుంది. గొల్లపల్లి క్రాస్ నుంచి ప్రారంభం కానున్న శనివారం పాదయాత్ర.. గరుడంపల్లి క్రాస్, వసంతపురం క్రాస్, చిగిచర్ల, ఉప్పునేసినపల్లి క్రాస్, హంసాపురం క్రాస్ ల మీదుగా కొనసాగుతుంది. షర్మిల రాక కోసం ఆయా ప్రాంతాల్లోని ప్రజలు, వైఎస్ అభిమానులు ఎదురుచూస్తున్నారు.
source:sakshi
source:sakshi
0 comments:
Post a Comment