లక్షల పాదాలు షర్మిల వెంట: భూమన - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » లక్షల పాదాలు షర్మిల వెంట: భూమన

లక్షల పాదాలు షర్మిల వెంట: భూమన

Written By news on Sunday, October 21, 2012 | 10/21/2012

అనంతపురం : షర్మిల చేపట్టిన పాదయాత్ర టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు కుక్కకాటుకు చెప్పుదెబ్బ వంటిదని తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. అనంతపురంలో షర్మిల మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర పోస్టర్‌ను ఆదివారం ఆయన ఆవిష్కరించారు. ఈ నెల 23 నుంచి అనంతలో షర్మిల పాదయాత్ర మొదలవుతుందన్నారు. 

మహానేత వైఎస్‌ఆర్‌ సంక్షేమ పథకాలను తుడిచివేయాలని చూస్తున్న కాంగ్రెస్‌, అందుకు వంతపాడుతున్న చంద్రబాబుకు పాదయాత్ర ద్వారా సమాధానం చెబుతామన్నారు. లక్షల పాదాలు షర్మిల వెంట కదులుతున్నాయని ఆయన అన్నారు. బాబు పాదయాత్ర నీరసయాత్రలా, ప్రజా ఛీత్కార యాత్రగా మారిందన్నారు. గత మూడేళ్లలో అవనీతి పెరిగిందని బొత్స సత్యనారాయణ అంగీకరిస్తారా అని భూమన ప్రశ్నించారు.


వైఎస్ఆర్ జిల్లా: ప్రతిపక్ష నేత చంద్రబాబు, ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్ రెడ్డిలు కుమ్మక్కై రాష్ట్రాన్ని పాలిస్తున్నారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి మండిపడ్డారు. మొదటగా వైఎస్‌ఆర్ కుటుంబాన్ని టార్గెట్‌ చేసి వైఎస్ జగన్‌కు అవినీతి అంటగట్టారని ఆమె అన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్‌తో ములాఖత్ అయ్యారని ఆమె అన్నారు. ఇప్పుడు వైఎస్ఆర్ సీపీపై మతపరమైన కుట్రలూ చేస్తున్నారని శోభానాగిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా ప్రజల మద్దతు వైఎస్ఆర్ సీపీ కే ఉంటుందని శోభానాగిరెడ్డి స్ఫష్టం చేశారు.
Share this article :

0 comments: