విద్యార్థుల మెస్ చార్జీలు పెంచాల్సిందే - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » విద్యార్థుల మెస్ చార్జీలు పెంచాల్సిందే

విద్యార్థుల మెస్ చార్జీలు పెంచాల్సిందే

Written By news on Wednesday, October 10, 2012 | 10/10/2012


రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులకు ఇచ్చే మెస్ ఛార్జీలను ప్రభుత్వం వెంటనే పెంచాలని లేకపోతే ఆందోళన చేపడతామని వైఎస్సార్ కాంగ్రెస్ యువజన విభాగం అధ్యక్షుడు పుత్తా ప్రతాప్‌రెడ్డి హెచ్చరించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గత మూడేళ్లలో రాష్ట్రంలో అన్ని నిత్యావసర వస్తువుల ధరలు 200 రె ట్లు పెరిగినా ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా మెస్ చార్జీలు పెంచలేదన్నారు. సంక్షేమ హాస్టళ్లకు చెల్లిస్తున్న 17 రూపాయల రోజువారీ మెస్ ఛార్జీలు ఏ మాత్రం చాలక విద్యార్థులు అర్ధాకలితో కాలం గడుపుతున్నారన్నారు. 

ఒక్కొక్క విద్యార్థికి నెలవారీ మెస్ చార్జీల కింద 1090 రూపాయలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ కమిషన్ సిఫార్సు చేస్తే అతీగతీ లేకుండా పోయిందని విమర్శించారు. అడక్కుండానే సబ్సిడీ బియ్యం ధరను రెండు రూపాయల నుంచి రూపాయికి తగ్గించిన రాష్ట్ర ప్రభుత్వం హాస్టళ్లకు మాత్రం నాలుగు రూపాయలకు సరఫరా చేస్తోందని తప్పుబట్టారు. సబ్సిడీ వంట గ్యాస్‌ను హాస్టళ్లకు కూడా ఏడాదికి ఆరు సిలిండర్లకే పరిమితం చేస్తామని చెప్పడం దారుణమని విమర్శించారు. మీకోసం అంటూ పాదయాత్ర చేస్తున్న టీడీపీ అధినేత ఎన్.చంద్రబాబునాయుడు కూడా ఈ విషయాలను పట్టించుకోకుండా ఎంత సేపూ వై.ఎస్.రాజశేఖరరెడ్డి, వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిలపై విమర్శలు చేస్తూ కాలం వెళ్లబుచ్చుతున్నారని పుత్తా ఆగ్రహం వ్యక్తం చేశారు.
Share this article :

0 comments: