తెలుగుదేశం పార్టీకి మరో షాక్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » తెలుగుదేశం పార్టీకి మరో షాక్

తెలుగుదేశం పార్టీకి మరో షాక్

Written By news on Saturday, October 27, 2012 | 10/27/2012

తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం ఎమ్మెల్యే తానేటి వనిత తెలుగుదేశం పార్టీని వదలి వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లో చేరవచ్చని చెబుతున్నారు. దీనికి ముఖ్యకారణం కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే , టిడిపి సీనియర్ నేత పెండ్యాల వెంకట కృష్ణారావు పార్టీకి గుడ్ బై చెప్పి వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లో చేరుతుండడమే. ఆయనకు ముఖ్య అనుచరుడుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే బాబాజీరావు కుమార్తె వనతి. ఆ రాజకీయ సంబందాల రీత్యా కృష్ణారావు ప్రతిష్టాత్మకంగా తీసుకుని టిడిపి ఎమ్మెల్యేను కూడా తనతోపాటు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లోకి తీసుకు వెళితే అది తనకు ప్రతిష్టగా ఉంటుందని ఆయన భావించి ఉంటారు. ఇటీవలే చింతలపూడి కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేశ్ కూడా పార్టీకి గుడ్ బై చెబుతున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అదే జిల్లాకు చెందిన టిడిపి ఎమ్మెల్యే వనిత కూడా వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ వైపు వెళ్లడం వల్ల ఆ పార్టీకి కొంత బలం పెరుగుతుంది.

http://kommineni.info/articles/dailyarticles/content_20121027_7.php
Share this article :

0 comments: