అనంతపురం: అనంతపురం జిల్లా ధర్మవరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి సోదరి షర్మిల పాదయాత్రకు ఘనస్వాగతం లభించింది. ధర్మవరంలో గతంలో ఏ నేతకు రానంత ప్రజా స్పందన కనిపించింది. పట్టణ ప్రజలు షర్మిల అడుగులో అడుగువేశారు. పట్టణం అంతా జనంతో కిక్కిరిసిపోయింది. వీధులు, మేడలు, మిద్దెలు జనంతో నిండిపోయాయి. ఇసుకవేస్తే రాలనంతగా జనం చుట్టుపక్క గ్రామాల నుంచి తరలి వచ్చారు. 'మరో ప్రస్థానం' బహిరంగ సభా స్థలం వద్ద జనం భారీ సంఖ్యలో గుమ్మిగూడారు. ఈ ప్రాంతంలోని చేనేత కార్మికులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.
Home »
» ధర్మవరంలో షర్మిలకు ఘనస్వాగతం
ధర్మవరంలో షర్మిలకు ఘనస్వాగతం
Written By news on Friday, October 26, 2012 | 10/26/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment