కర్నూలు: వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల మరో ప్రజాప్రస్థానంలో భాగంగా శుక్రవారం 15.5 కి.మీటర్లు నడవనున్నారు. మద్దికెర మండల కేంద్రంలోని శివార్లలో రాత్రి బస చేసిన షర్మిల శుక్రవారం ఉదయం అక్కడి నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. హంపా క్రాస్, పెరవల్లి, తుగ్గలి మీదుగా జాతీయ రహదారి వరకు పాదయాత్ర సాగుతుంది. రాత్రి తుగ్గలి శివార్లలో బస చేస్తారని వైఎస్ఆర్సీపీ ప్రోగ్రాం కన్వీనర్ తలశిల జయరాం, జిల్లా పార్టీ కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
|
Home »
» నేడు పాదయాత్ర సాగుతుందిలా...
నేడు పాదయాత్ర సాగుతుందిలా...
Written By news on Friday, November 9, 2012 | 11/09/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment