పాలమూరులో మరో ప్రజాప్రస్థానం 16 రోజులు - 257.1 కిలోమీటర్లు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పాలమూరులో మరో ప్రజాప్రస్థానం 16 రోజులు - 257.1 కిలోమీటర్లు

పాలమూరులో మరో ప్రజాప్రస్థానం 16 రోజులు - 257.1 కిలోమీటర్లు

Written By news on Saturday, December 8, 2012 | 12/08/2012

‘‘ అన్నంపెట్టే అన్నదాత ఏడుస్తుంటే పాలకులకు ఏమాత్రం కనికరం లేకుండా పోయింది.. విత్తనాలు, ఎరువుల రేట్లు పెంచి చోద్యం చూస్తున్నారు. రైతులారా..మా కష్టాలు పట్టించుకొనే వారు ఎవరూ లేరని అధైర్యపడొద్దు..మీకు అండగా మేం నిలుస్తాం..జగనన్నను ఆశీర్వదిస్తే పండించిన పంటను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది.’’ -షర్మిల 

మహబూబ్‌నగర్, న్యూస్‌లైన్ ప్రతినిధి: మరో ప్రజాప్రస్థానంలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల శుక్రవారం కొండేడులో పాదయాత్రను ప్రారంభించి కేశంపేట వరకు కొ నసాగించారు. ఈ సందర్భంగా పెద్ద ఆదిరాల గ్రామంలో ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమంలో పలువురు మహిళలు తమ సమస్యలను షర్మిలకు వివరించారు. ‘‘ వ్యవసాయం చేస్తేనే మో నష్టం వస్తోంది. ఉపాధి పనులకు వెళ్తే రూ. 50కు మించి కూలి రావడం లేదు. ప్రభుత్వం రూపాయికి కిలో బియ్యం ఇచ్చి మిగిలిన సరుకులన్నీ నాలుగు రెట్లు పెంచింది. 

దీంతో కుటుంబం గడవడమే దుర్భరంగా మారింది’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకు షర్మిల స్పందిస్తూ..‘‘ ఎ న్ని ఇబ్బందులొచ్చినా ఏడాది ఆగండి. ఆ తర్వాత జగనన్న ముఖ్యమంత్రి అవుతాడు. అప్పుడు పేదల సమస్యలన్నీ తీరిపోతాయి.’’అని హామీ ఇచ్చారు. రైతుల పరిస్థితి ఏమాత్రం బాగలేదని, విత్తనాలు, మందుల రేట్లు ఎక్కువగా ఉన్నా మద్దతు ధర లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జగనన్నను ఆశీర్వదిస్తే రైతులు పండిం చిన పంటను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు. 

రైతుల పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని, అప్పుల్లో ఉన్నా ఆదుకోవడంలో విఫలమైందని ఆరోపించారు. వైఎస్ హ యాంలో ఏడు గంటల పాటు ఉచిత విద్యుత్ ఇ వ్వడంతోపాటు మద్దతు ధర కూడా వచ్చేదని గుర్తు చేశారు. అన్నంపెట్టే అన్నదాత ఏడుస్తుంటే పాలకులకు ఏమాత్రం కనికరం లేకుండా పో యిందని, ప్రభుత్వానికి పోయే కాలం దగ్గర వచ్చినందుకే అన్ని వర్గాలను విస్మరిస్తోందని ఆరోపించారు. జగనన్న అధికారంలోకి వస్తే అందరికీ పక్కా ఇళ్లతోపాటు రైతులకు, మహిళలకు వడ్డీ లేని రుణాలు అందుతాయన్నారు. అనంతరం మండల కేంద్రమైన కేశంపేటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో షర్మిల మాట్లాడారు. మహబూబ్‌నగర్ జిల్లాలో వలసలను అరికట్టి ఈ ప్రాం తాన్ని సస్యశ్యామలం చేయాలనే ఉద్దేశంతో మ హానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నెట్టెంపాడు, బీమా, కల్వకుర్తి, కోయిల్‌సాగర్ ప్రాజెక్టుల నిర్మాణం కోసం రూ. 7 వేల కోట్లు కేటాయించారన్నారు. 

అప్ప ట్లో 70 శాతం పనులు పూర్తి చేస్తే ఈ ప్రభుత్వం మూడేళ్లయినా మిగిలిన 30 శాతం పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. పా లమూరు ఎత్తిపోతల పథకం ఏర్పాటుకు వైఎస్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. మహబూబర్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలకు ఈ పథకం ద్వారా సాగునీరు, తాగునీరు ఇవ్వాలన్నదే వైఎస్ ఆశయం అన్నారు. ఈ ఆశయానికి ప్రభుత్వం నీ ళ్లొదిలిందన్నారు. 

విద్యార్థులను పాఠశాలకు, కళాశాలలకు వెళ్లనీయకుండా తల్లిదండ్రులు వారిని కూలి పనులకు తీసుకెళ్తున్నారని, ఇది దేశానికే అవమానం అన్నారు. జిల్లాలో ఇంత దారుణం జ రుగుతున్నా.. పార్లమెంటు సభ్యుడిగా చంద్రశేఖర్‌రావు స్పందిం చడం లేదని ఆరోపించారు. ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ఆయన పూర్తిగా విఫలమయ్యారని దుయ్యబట్టారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన పాలనా కాలంలో రైతులపై అక్రమ కేసులు పెట్టి జైల్లో వేయించారన్నారు. విద్యుత్ బిల్లులు చెల్లించని రైతుల ఇళ్లలో సామానులు ఎత్తికెళ్లిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయని గుర్తు చేశారు. 

పాలమూరులో మరో ప్రజాప్రస్థానం
16 రోజులు - 257.1 కిలోమీటర్లు 
Share this article :

0 comments: