పత్తి రైతులకు కనీస మద్దతు ధర కూడా దక్కని పరిస్థితి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం తనకు సంబంధం లేదన్నట్టుగా వ్యవహరిస్తోందని వైఎస్సార్సీపీ రైతు విభాగం కన్వీనర్ నాగిరెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో పత్తి రైతుకు బాసటగా నిలిచేందుకు బుధవారం మహబూబ్నగర్ జిల్లాలో పార్టీ అధ్వర్యంలో 48 గంటల పాటు నిరసన దీక్ష తలపెట్టినట్టు చెప్పారు. పత్తి కనీస మద్దతు ధర రూ.3900లకు అదనంగా మరో రూ.1500 బోనస్గా ఇవ్వాలని, రంగు మారిన పత్తిని కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసేలా సీసీఐకి ఉత్తర్వులు ఇప్పించాలని డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు.
Home »
» వైఎస్సార్సీపీ నేడు 48 గంటల నిరసన
వైఎస్సార్సీపీ నేడు 48 గంటల నిరసన
Written By news on Wednesday, December 26, 2012 | 12/26/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment