వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన ‘మరో ప్రజా ప్రస్థానం’ 51వ రోజు పాదయాత్ర శుక్రవారం మహబూబ్నగర్ జిల్లాలోని కేశంపేటలో ముగిసింది. ఉదయం కొండేడు గ్రామం నుంచి ప్రారంభమైయిన పాదయాత్ర చిన్న ఆదిరాల, పెద్ద ఆదిరాల, ఎక్వాయపల్లి, తొమ్మిది రేకుల, కాకునూరు, సుందరాపూర్ క్రాస్, కేశంపేట మీదుగా సాగింది. అనంతరం కేశంపేటలో ఏర్పాటుచేసిన సభలో షర్మిల ప్రసంగించారు. ఈ రాత్రికి కేశంపేట గ్రామ శివారు ప్రాంతంలో ఏర్పాటు చేసిన టెంట్లో షర్మిల బస చేస్తారు. ఈరోజు షర్మిల 19 కిలోమీటర్ల వరకు నడిచారు. ఇప్పటివరకు షర్మిల 724 కిలోమీటర్లు పాదయాత్ర కొనసాగించారు.
Home »
» ముగిసిన షర్మిల 51వ రోజు పాదయాత్ర
ముగిసిన షర్మిల 51వ రోజు పాదయాత్ర
Written By news on Friday, December 7, 2012 | 12/07/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment