జగన్‌ కోసం జనం సంతకం కార్యక్రమానికి పెద్ద ఎత్తున సంఘీభావం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్‌ కోసం జనం సంతకం కార్యక్రమానికి పెద్ద ఎత్తున సంఘీభావం

జగన్‌ కోసం జనం సంతకం కార్యక్రమానికి పెద్ద ఎత్తున సంఘీభావం

Written By news on Sunday, December 30, 2012 | 12/30/2012

 కుటిల రాజకీయాలపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జననేత వైఎస్ జగన్ ను తమ నుంచి దూరం చేయటాన్ని నిలదీస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో టీడీపీ, సీబీఐ కుమ్మక్కై చేస్తున్న కుట్రలపై మండిపడుతున్నారు. జగన్‌ కోసం జనం సంతకం కార్యక్రమానికి పెద్ద ఎత్తున సంఘీభావం తెలుపుతున్నారు. 

*హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడ చౌరస్తాలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు చేపట్టిన జగన్‌ కోసం జనం సంతకం కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది.
*నారాయణగూడలో వైఎస్‌ఆర్ సీపీ నేతల ఆధ్వర్యంలో జగన్ కోసం జనం సంతకం కార్యక్రమానికి అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. 

*గుంటూరు జిల్లా నరసరావుపేట ఏంజిల్‌ టాకీస్‌ సెంటర్‌ వద్ద చేపట్టిన కోటి సంతకాల సేకరణకు అనూహ్య స్పందన లభించింది. డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి అన్ని వర్గాల ప్రజలు సంఘీభావం తెలిపారు.
*మాచర్లలో జగన్ కోసం జనం సంతకం కార్యక్రమాన్ని వైఎస్‌ఆర్ సీపీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ ప్రారంభించారు. 
*గుంటూరు లాడ్జిసెంటర్‌లో నగర్ ఎస్సీ కన్వీనర్ విజయ్‌కిషోర్ ఆధ్వర్యంలో జగన్ కోసం జనం సంతకం ప్రారంభమైన కార్యక్రమానికి ఉమారెడ్డి వెంకటేశ్వర్లు, లేళ్ల అప్పిరెడ్డి, కావటి మనోహర్ తదితరులు హాజరయ్యారు. 

*వైఎస్‌ జగన్‌ను విడుదల చేయాలని కోరుతూ విద్యార్థి లోకం గొంతెత్తి నినదిస్తోంది. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఏర్పాటు చేసిన కోటిసంతకాల సేకరణ శిబిరం యువతతో కిక్కిరిసి పోయింది. లక్షలాది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌తో ఉన్నత చదువులు చదువుకునే అవకాశం కల్పించిన మహానేత తనయుడిని జైలుపాల్జేయటంపై యువత ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. స్వచ్ఛందంగా కోటి సంతకాల సేకరణలో పాల్గొని జగన్‌ను తక్షణం విడుదల చేయాలని కోరుతోంది.

*వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అక్రమ అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ మెదక్‌ జిల్లా సంగారెడ్డిలో కోటి సంతకాల సేకరణ చేపట్టారు. అన్ని వర్గాలు ప్రజలకు ఈ కార్యక్రమానికి సంఘీభావం తెలుపుతూ సంతకాలు చేశారు. ప్రజల ఆశీస్సులతో త్వరలోనే జగన్‌ బయటకు వస్తారని వైఎస్‌ఆర్‌ సీపీ నేతలు, కార్యకర్తలు ఆశాభావం వ్యక్తం చేశారు.

*జగన్ అక్రమ అరెస్టును నిరసిస్తూ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని తిరుపతిలో ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ప్రారంభించారు. వర్షాన్ని సైతం లెక్కచేయని జనం... సంతకాలు చేయడానికి భారీగా క్యూకట్టారు. వైఎస్‌ జగన్‌ అండగా మేమున్నామంటూ పెద్ద ఎత్తున మహిళలు తరలివచ్చారు.

*వైఎస్‌ఆర్ సీపీ యువజన విభాగం నేత సురేష్‌బాబు ఆధ్వర్యంలో ఒంగోలులో జగన్ కోసం జనం సంతకం కార్యక్రమం చేపట్టారు.

*వైఎస్‌ఆర్‌ జిల్లా కమలాపురం నియోజకవర్గంలో జగన్‌ కోసం జనం సంతకం కార్యక్రమంలో కడప మాజీ మేయర్‌ రవీంద్రనాథ్‌రెడ్డి పాల్గొన్నారు. 

Share this article :

0 comments: