అనంతపురం జిల్లాలో దివంగత మాజీ మంత్రి పరిటాల రవీంద్ర కుమారుడు శ్రీరామ్ పై ధర్మవరం రూరల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. సుధాకరరెడ్డి అనే కాంగ్రెస్ నాయకుడి హత్య కు కుట్ర పన్నారన్న అభియోగం ఆయనపై వచ్చింది.దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు శ్రీరామ్ తో సహా పది మంది పై కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు. పరిటాల రవీంద్ర కుటుంబంలో మూడో తరం కూడా ఫ్యాక్షన్ కేసులో చిక్కుకున్నట్లయింది.శ్రీరామ్ తల్లి, పరిటాల రవి భార్య సునీత రాప్తాడు నియోజకవర్గానికి శాసనసభ్యురాలిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
http://kommineni.info/articles/dailyarticles/content_20121231_10.php?fb_comment_id=fbc_486455864726717_5379042_486457161393254
ఈ హత్యకు రాప్తాడు టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత కొడుకు శ్రీరాం, పలు హత్యకేసులలో నిందితుడిగా ఉన్న నాగూర్ హుస్సేన్, డ్రైవర్ రాము ఆయుధాలు సరఫరా చేశారని ధర్మవరం డీఎస్ పి నవాబ్జాన్ చెప్పారు. మొత్తం 8 మంది నిందితుల్లో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునిత పాత్రపై ఆరా తీస్తున్నట్లు ఆయన చెప్పారు.
0 comments:
Post a Comment