'జనం చెక్కిన శిల్పం వైఎస్' పుస్తకావిష్కరణ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 'జనం చెక్కిన శిల్పం వైఎస్' పుస్తకావిష్కరణ

'జనం చెక్కిన శిల్పం వైఎస్' పుస్తకావిష్కరణ

Written By news on Thursday, December 27, 2012 | 12/27/2012

మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డిపై 'కదలిక' దినపత్రిక సంపాదకుడు ఇమామ్ రచించిన 'జనం చెక్కిన శిల్పం వైఎస్' పుస్తకాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు ఎంపి మేకపాటి రాజమోహన్ రెడ్డి గురువారమిక్కడ ఆవిష్కరించారు. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు రచయితలు , సాహిత్యాభిమానులు, వైఎస్ఆర్ సిపి నేతలు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా మేకపాటి మాట్లాడుతూ ఎన్ని కష్టాలు వచ్చినా ...ఇచ్చిన మాట కోసం మడప తిప్పని నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని అన్నారు. రాష్ట్ర ప్రజలు జగన్‌ లోని నాయకత్వ లక్షణాలను గుర్తించారన్నారు. ఆత్మస్తుతి ...పరనిందతో కాంగ్రెస్, టీడీపీలు తమను తాము మోసం చేసుకుంటున్నాయని ఆయన మండిపడ్డారు. చంద్రబాబుకు విశ్వసనీయత లేదని మేకపాటి విమర్శించారు.
Share this article :

0 comments: