టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పచ్చి అబద్దాల కోరు అని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖరరావు వ్యాఖ్యానించారు. రెండువేల ఎనిమిదిలోనే తెలంగాణకు అనుకూలంగా తాము చెప్పామని చంద్రబాబు అంటున్నారని, ఆ తర్వాత జరిగిన పరిణామాల గురించి ప్రస్తావించకుండా ఆ సంగతి చెబితే సరిపోదన్నట్లుగా ఆయన మాట్లాడారు. రెండువేల ఎనిమిదిలో తీర్మానం చేశాక, తమతో పొత్తు పెట్టుకున్నారని,అంతేకాక అఖిలపక్ష సమావేశంలో కూడా తెలంగాణకు అనుకూలంగా చెప్పి, తదుపరి డిసెంబరు తొమ్మిదిన తెలంగాణ ప్రకటన వచ్చాక పదో తేదీన చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు ఇప్పుడు ఏమి చెప్పినా తెలంగాణ ప్రజలు నమ్మరని ఆయన అన్నారు.తెలంగాణపై అఖిలపక్ష సమావేశంలో ఏమీ జరగదని , అయినా కూడా తాము వెళుతున్నామని ఆయన చెప్పారు. కేంద్రానికి చిత్తశుద్ది ఉంటే నేరుగా బిల్లు పెట్టవచ్చని ఆయన తెలిపార
http://kommineni.info/articles/dailyarticles/content_20121228_3.php
http://kommineni.info/articles/dailyarticles/content_20121228_3.php
0 comments:
Post a Comment