తెలంగాణ అంశంపై అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపాలని కేంద్రాన్ని కోరినట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలిపింది. తెలంగాణపై రాజకీయ పార్టీలు ఏమీ చెప్పినా ప్రయోజనం లేదని, ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్ర విభజనపై సర్వాధికారాలు కేంద్రానివేనని ఆపార్టీ పేర్కొంది.
కేంద్రం అనాలోచిత నిర్ణయాల వల్ల రాష్ట్రం రావణ కాష్టంలా మారిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. రాష్ట్రాభివృద్ధి పూర్తిగా కుంటుపడుతోందని, ఇప్పటికైనా అన్ని విషయాలు, అన్ని సమస్యలు కేంద్రం పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్ చేసింది. తెలంగాణ ప్రజల మనోభావాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవిస్తోందని తెలిపింది.
కేంద్రం అనాలోచిత నిర్ణయాల వల్ల రాష్ట్రం రావణ కాష్టంలా మారిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. రాష్ట్రాభివృద్ధి పూర్తిగా కుంటుపడుతోందని, ఇప్పటికైనా అన్ని విషయాలు, అన్ని సమస్యలు కేంద్రం పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్ చేసింది. తెలంగాణ ప్రజల మనోభావాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవిస్తోందని తెలిపింది.
0 comments:
Post a Comment