నిరసన తెలిపినందుకు నాన్‌బెయిలబుల్ కేసులు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నిరసన తెలిపినందుకు నాన్‌బెయిలబుల్ కేసులు

నిరసన తెలిపినందుకు నాన్‌బెయిలబుల్ కేసులు

Written By news on Friday, December 28, 2012 | 12/28/2012

ఢిల్లీలో విద్యార్థినిపై గ్యాంగ్‌రేప్‌ను నిరసిస్తూ బుధవారం ఖమ్మంలో భారీ ర్యాలీ నిర్వహించిన వైఎస్సార్ కాంగ్రెస్ నేతలపై పోలీసులు కక్షగట్టారు. మమత వైద్యకళాశాలలు, పువ్వాడ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బుధవారం పట్ట ణంలో నిర్వహించిన విద్యార్థుల ర్యాలీకి ప్రజల నుంచి అనూహ్య మద్దతు లభించింది. ర్యాలీ ని ర్వహణకు పువ్వాడ ఫౌండేషన్ చైర్మన్, వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా కన్వీనర్ పువ్వాడ అజయ్‌కుమార్ ముందుగా పోలీసుల అనుమతి కూడా తీసుకున్నారు. అయినప్పటికీ ర్యాలీతో ప్రజలకు, ట్రాఫిక్‌కు ఇబ్బందులు కలిగించారనే అభియోగంతో స్థానిక వన్‌టౌన్ పోలీసులు అజయ్‌కుమార్ తదితరులపై నాన్‌బెయిలబుల్ సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేశారు.
Share this article :

0 comments: