తెలంగాణ అంశంపై నెలరోజుల్లోగా నిర్ణయం తీసుకుంటామని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే తెలిపారు. అఖిలపక్ష సమావేశం అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. భేటీలో ఎనిమిది పార్టీలు పాల్గొన్నాయని, అన్ని పార్టీలు సమస్యను త్వరగా పరిష్కరించాలని కోరాయన్నారు.
అందరి అభిప్రాయాలు, వాదనలు విన్నామని, కేంద్రం నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఈ సమావేశంలో వెల్లడైన అభిప్రాయాల మేరకే నిర్ణయం ఉంటుందని షిండే తెలిపారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షకు అనుగుణంగానే నిర్ణయం ఉంటుందని, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలు సంయమనం పాటించాలని ఆయన కోరారు. తెలంగాణపై ఇదే చివరి అఖిలపక్షమని షిండే తెలిపా
అందరి అభిప్రాయాలు, వాదనలు విన్నామని, కేంద్రం నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఈ సమావేశంలో వెల్లడైన అభిప్రాయాల మేరకే నిర్ణయం ఉంటుందని షిండే తెలిపారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షకు అనుగుణంగానే నిర్ణయం ఉంటుందని, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలు సంయమనం పాటించాలని ఆయన కోరారు. తెలంగాణపై ఇదే చివరి అఖిలపక్షమని షిండే తెలిపా
0 comments:
Post a Comment