08 January 2012 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

చేతనైతే సీబీఐ ముందు రంకెలేయ్’

Written By ysrcongress on Saturday, January 14, 2012 | 1/14/2012

 ‘‘ఏపీఐఐసీకి చెందిన భూముల కేటాయింపు విషయంలో నేను తప్పు చేసినట్లు ఎలాంటి ఆధారాలున్నా సీబీఐకి సమర్పించు. ఉత్తుత్తిగా మీడియా ముందు రంకెలేస్తూ... షో చేయడం కాదు. చేతనైతే సీబీఐ ముందు రంకెలేయ్’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు టీడీపీ నాయకుడు పయ్యావుల కేశవ్‌కు సవాలు చేశారు. ఎమ్మార్ అక్రమాలకు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబును సీబీఐ ప్రశ్నించే పరి స్థితి తలెత్తడంవల్లనే ఆ పార్టీ నేతలు మతిభ్రమించి మాట్లాడుతున్నారని ధ్వజ మెత్తారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశం లో మాట్లాడారు. ‘‘నిబంధనలకు వ్యతిరేకంగా భూములు కేటాయించానంటూ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వద్దకు మీడియాను తీసుకెళ్లి హడావుడి సృష్టించావు. 

అదే మార్గమధ్యంలో మీ పార్టీ అధినేత చంద్రబాబు తన బినామీ బిల్లీరావుకు అప్పనంగా కేటాయించిన భూములను చూపించలేదేం! ఆ పక్కనే ఎమ్మార్‌కు కేవలం రూ.29 లక్షలకే ఎకరం చొప్పున 530 ఎకరాలను కట్టబెట్టిన వాటిని ఎందుకు ప్రస్తావించలేదు? ఎమ్మార్‌కు భూకేటాయింపులకు ముందు చంద్రబాబు తన భార్య పేరుమీదున్న భూమిని ఎకరం రూ.2 కోట్ల చొప్పున అమ్ముకున్న విషయాన్ని మీడియాకు ఎందుకు చెప్పలేదు? ఈ విషయాలన్నీ పయ్యావుల కేశవ్ చెప్పుంటే ప్రజలు ఆయన్ని విశ్వసించేవారు. అలా చేయని వ్యక్తి చేసే వ్యాఖ్యలు ఎవరు నమ్ముతారు?’’ అంటూ అంబటి ప్రశ్నించారు. ఎమ్మార్ అవకతవకలపై బహిరంగ చర్చకు తాను సిద్ధమని ప్రకటిస్తే పయ్యావుల మళ్లీ డొంకతిరుగుడు వ్యాఖ్యలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.

‘కుక్కతోక వంకర’ బుద్ధి

పోరుయాత్రలతో రైతులపై కపట ప్రేమ ఒలకబోస్తున్నాడు 
అధికారంలో ఉండగా అన్నదాతను నిండా ముంచిన ఘనుడు
కరెంటు చౌర్యం సాకుతో జైలుపాలు చేసేందుకూ వెనకాడలేదు!
అందుకోసం ఏకంగా జీవోలే జారీ చేసిన చరిత్ర చంద్రబాబుది
వారెంట్ కూడా లేకుండా అరెస్టుకు వీలు కల్పిస్తూ జీవో 89 జారీ
ఐదేళ్ల శిక్షకు, రూ.50 వేల జరిమానా విధించేందుకూ అనుమతి
అందుకోసం ప్రత్యేక కోర్టును కూడా ఏర్పాటు చేస్తూ జీవో 99

హైదరాబాద్, న్యూస్‌లైన్: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు బుద్ధి కుక్కతోక వంకర చందమంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ దుయ్యబట్టారు. రైతులపై కపట ప్రేమ ఒలకబోస్తూ పోరు యాత్రలు చేస్తున్న బాబు అసలు నైజం, ఆయన సీఎంగా ఉండగా జారీ చేసిన 89, 99 జీవోల ద్వారా బయట పడిందని ధ్వజమెత్తారు. దేశ చరిత్రలో రైతులకు ఏ ముఖ్యమంత్రీ చేయని అన్యాయాన్ని ఆయన చేశారని తూర్పారబట్టారు. పై రెండు జీవోలు అందుకు ఉదాహరణ మాత్రమేనన్నారు. ‘‘రైతులు, రైతు కూలీల గురించి మాట్లాడే నైతిక హక్కు కూడా బాబుకు లేదు. వ్యవసాయమే దండగంటూ రైతాంగాన్ని నిలువునా ముంచిన బాబు, ఇప్పుడు మళ్లీ దొంగ మాటలు మొదలు పెట్టారు’’ అని శుక్రవారం ఒక ప్రకటనలో ఆమె విమర్శించారు.


‘‘బాబుకు వ్యవసాయమంటేనే గిట్టదు. రైతులంటే ఆయనకెంతో చిన్నచూపు! అందుకే వారిని జైళ్లల్లో పెట్టజూశారు. ఏటేటా కరెంటు చార్జీలను విపరీతంగా పెంచారు. వాటిని ముక్కుపిండి మరీ వసూలు చేశారు. ఇలాంటి సీఎం దేశంలో ఇంకెవరూ లేరన్న వాస్తవం, ఆయన జారీ చేసిన జీవోలను చూస్తే తెలిసిపోతుంది. విద్యుత్ చౌర్యాన్ని అరికట్టే ముసుగులో రైతులను, సామాన్య వినియోగదారులను కటకటాల పాలు చేయాల్సిందిగా ఆదేశాలిచ్చిన ఘనుడు బాబు. వారెంట్ కూడా అవసరం లేకుండానే వారి అరెస్టు కు వీలు కల్పిస్తూ 2000 సెప్టెంబర్ 13న జీవోనంబర్ 89 జారీ చేశారాయన. విద్యుత్ చౌర్యానికి కనీసం మూడేళ్ల నుంచి ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.50 వేల దాకా జరిమానా విధించేందుకు దాని ద్వారా వీలు కల్పించారు.


రాష్ట్రవ్యాప్తంగా 31 ప్రత్యేక కరెంటు చౌర్య నిరోధక స్క్వాడ్ పోలీస్‌స్టేషన్లను కూడా ఏర్పాటు చేశారు! బాబు ఇంతటితో ఆగలేదు. ఈ వ్యవహారాలను చూసుకునేందుకు ఏకంగా ప్రత్యేక కోర్టునే ఏర్పాటు చేస్తూ 2000 అక్టోబర్ 17న జీవో ఎంఎస్‌నంబర్ 99ని జారీ చేశారు! ఇండియన్ ఎలక్ట్రిసిటీ (ఆంధ్రప్రదేశ్ అమెండ్‌మెంట్) ఆర్డినెన్స్, 2000 కింద దానికి చైర్మన్, సభ్యులను నియమించారు. హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ కె.బి.సిద్దప్పను చైర్మన్‌గా; ఎం.వి.రామారావు, సి.వి.రాఘవయ్యలను జ్యుడీషియల్ సభ్యులుగా; ఆర్.వి.కె.ఆర్.శర్మ, వి.సుబ్బారావులను సాంకేతిక సభ్యులుగా వేశారు. ఇదీ చంద్రబాబు ఘన చరిత్ర’’ అని వాసిరెడ్డి మండిపడ్డారు.


అన్నదాతను ఆదుకున్నది వైఎస్సే: బాబు తొమ్మిదేళ్ల పాలనలో రైతులను నానా ఇబ్బందులు పెడితే, వైఎస్ 2004లో అధికారంలోకి వస్తూనే వారి సంక్షేమానికి ఎన్నెన్నో చర్యలు తీసుకున్నారని పద్మ వివరించారు. ప్రకృతి వైపరీత్యాలు, కరువు, అప్పుల వంటి కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతు కుటుంబాలను ఆర్థిక పరిహారం ద్వారా ఆదుకోవాలని ఆదేశిస్తూ 2004 జూన్ 1న జీవోఎంఎస్ 421ను జారీ చేశారని గుర్తు చేశారు. ‘‘రైతుల సమస్యల పరిష్కారానికి 2004 మే 31నే మంత్రివర్గ ఉపసంఘాన్ని వైఎస్ నియమించారు. దాని నివేదిక వచ్చేలోపు బాధితులకు మధ్యంతర ప్యాకేజీకి వీలుగా జీవో 421 జారీ చేశారు. 

ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి రూ.లక్ష చొప్పున పరిహారం, అప్పుల చెల్లింపుల నిమిత్తం వన్ టైమ్ సెటిల్‌మెంట్ కింద రూ.50 వేలు అందజేశారు. వీటితో పాటు సదరు కుటుంబాలు నిలదొక్కుకునేందుకు ఇంకెన్నో చర్యలను ఆ జీవో ద్వారా తీసుకున్నారు. పునరావాసం, పిల్లలకు సాంఘిక సంక్షేమ పాఠశాలల్లో ప్రవేశం, ఇందిరా ఆవాస్ యోజన కింద గృహాలు, ప్రభుత్వ పథకాల ద్వారా మరింత ఆర్థిక సాయం, పింఛన్ల వంటివెన్నో వర్తింపజేశారు’’ అని ఆమె వివరించారు.

వైఎస్‌ను చూసి బాబు వాత!: సాగుకు ఉచిత విద్యుతిస్తామని 2004 ఎన్నికలప్పుడు వైఎస్ ప్రకటిస్తే ఎద్దేవా చేసిన బాబు, తానూ ఇస్తానంటూ 2009 ఎన్నికల నాటికి మాయమాటలు వల్లించారంటూ పద్మ ఎద్దేవా చేశారు. ‘‘వైఎస్ ఉచిత విద్యుత్ ప్రకటన అయ్యేదీ కాదు, పొయ్యేదీ కాదన్నారు బాబు. అది అసాధ్యమని తేల్చేశారు. ఒకవేళ ఇస్తే కరెంటు తీగలు బట్టలు ఆరేసుకోవడానికి తప్ప ఎందుకూ పనికి రావంటూ ఎద్దేవా చేశారు. కానీ వైఎస్ అధికారంలోకి వచ్చిన మరుక్షణమే విద్యుత్ బకాయిలను రద్దు చేయడమే గాక వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఫైలు మీదే తొలి సంతకం చేశారు. రైతుకిచ్చిన మాటపై నిలబడ్డారు. 

ఉచిత విద్యుత్ పథకాన్ని విజయవంతంగా అమలు చేసి చూపారు. దాంతో బాబుకు దిమ్మ తిరిగి, తన సంస్కరణల వల్లే ఉచిత విద్యుత్ సాధ్యమైందంటూ అవాకులు పేలారు. అదిచ్చి ఉంటే తాను గెలిచే వాడినన్నారు. తానూ ఉచిత విద్యుతిస్తానంటూ 2009 ఎన్నికల్లో మాయమాటలు వల్లించారు. చిత్తశుద్ధి, విశ్వసనీయత, మాట నిలకడ లేని బాబు మాటల్ని జనం నమ్మకుండా ఓడించి బుద్ధి చెప్పారు. అసలు రైతులకు ఉచితంగా కరెంటు ఎందుకివ్వాలన్న దుగ్ధ ఆయన మనసులో నేటికీ ఉంది. అందుకే, ఉచిత కరెంటిస్తే తీగలపై బట్టలు ఆరేసుకోవడం తప్పదని తాను గతంలో చెప్పిందే నిజమైందంటూ ఇటీవలి కరీంనగర్ పర్యటనలో మనసులో మాటను బయటపెట్టారు. తన బుద్ధి కుక్క తోక వంకర చందమని మరోసారి చాటుకున్నారు’’ అంటూ పద్మ ఎద్దేవా చేశారు.

గూగుల్, ఫేస్‌బుక్‌లపై కొరడా!

మరో 19 వెబ్‌సైట్లపైనా చట్టపరమైన చర్యలు
కేంద్రం పచ్చజెండా 
విదేశీ సైట్లకు మరోసారి ఢిల్లీ కోర్టు సమన్లు

న్యూఢిల్లీ: సమాజంలోని వివిధ వర్గాల మధ్య శత్రుత్వాన్ని రెచ్చగొట్టడం, అభ్యంతరకర, అశ్లీల సమాచారాన్ని పొందుపర్చడం తదితర అభియోగాలపై సామాజిక నెట్‌వర్కింగ్ సైట్లు గూగుల్, ఫేస్‌బుక్ సహా 19 వెబ్‌సైట్లపై చట్టపరమైన చర్యలకు కేంద్రం పచ్చజెండా ఊపింది. విద్వేషాలను రగల్చటం, దేశ సమైక్యతకు భంగం కలిగించడం, అభ్యంతరక సమాచారాన్ని పొందుపర్చడం వంటి అభియోగాల్ని ఆయా సైట్లపై మోపారు. యాహూ, మైక్రోసాఫ్ట్, గూగుల్ తదితర సంస్థలపై చర్యలు తీసుకునేందుకు తమ వద్ద తగిన ఆధారాలు ఉన్నాయని కేంద్రం శుక్రవారం ఢిల్లీ న్యాయస్థానానికి తెలిపింది. రికార్డులను వ్యక్తిగతంగా పరిశీలించిన తరువాత ఆయా వెబ్‌సైట్లపై చర్యలు తీసుకునేందుకు తగిన ఆధారాలున్నట్లు అనుమతుల విభాగం సంతృప్తి చెందినట్లు వెల్లడించింది. వెబ్‌సైట్లపై ఐపీసీ సెక్షన్లు 153-ఎ, 153-బి, 295-ఎ కింద కేసులు నమోదుకు సూచించినట్లు తెలిపింది. ఈమేరకు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ సుధీష్‌కుమార్‌కు రెండు పేజీల నివేదిక అందచేసింది. 

విజయమ్మ పిటిషన్‌పై విచారణ సోమవారానికి వాయిదా

అనారోగ్య కారణంతో వాయిదా కోరిన పిటిషనర్ తరఫు న్యాయవాది

న్యూఢిల్లీ, న్యూస్‌లైన్: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన బినామీల అక్రమాస్తుల కేసుల నిష్పాక్షిక విచారణ నిమిత్తం రాష్ట్రం నుంచి మరో హైకోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ విచారణ సోమవారానికి వాయిదా పడింది. విజయమ్మ తరఫున వాదనలు వినిపిస్తున్న సీనియర్ న్యాయవాది అనారోగ్యంతో బాధపడుతున్నందున విచారణను వాయిదా వేయాలన్న పిటిషనర్ తరఫు మరో న్యాయవాది అభ్యర్థనకు ధర్మాసనం అంగీకారం తెలిపింది. చంద్రబాబు ఆయన బినామీలు ‘నాట్ బిఫోర్’ల ద్వారా విచారణపై అనుమానాలు రేకెత్తిస్తున్నారని, తమకు కావాల్సిన బెంచ్‌ల కోసం ‘నాట్ బిఫోర్’ను వాడుకుంటున్నారని, ఈ పరిస్థితుల్లో కేసును మరో హైకోర్టుకు బదిలీ చేయాలంటూ విజయమ్మ దాఖలు చేసిన పిటిషన్‌ను మరో బెంచ్‌కు బదలాయించాలని ఈ నెల 5న జస్టిస్ దల్వీర్ భండారీ, జస్టిస్ దీపక్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఆదేశించిన సంగతి తెలిసిందే. 

దీంతో విజయమ్మ పిటిషన్ జస్టిస్ బీఎస్ చౌహాన్, టీఎస్ ఠాకూర్‌లతో కూడిన ధర్మాసనం ముందుకు వచ్చింది. పిటిషన్‌పై శుక్రవారం విచారణ ప్రారంభం కాగానే విజయమ్మ తరఫు న్యాయవాది లేచి.. కేసును వాదిస్తున్న సీనియర్ న్యాయవాది అనారోగ్యంతో ఉన్నందున కేసును నాలుగు వారాలపాటు వాయిదా వేయాలని కోరారు. దీనికి ధర్మాసనం అంగీకారం తెలుపకపోవడంతో కనీసం వచ్చే శుక్రవారానికి వాయిదా వేయాలని కోరారు. ఈ సమయంలోనే రిలయన్స్ తరఫున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే లేచి, న్యాయస్థానాలపై నమ్మకం లేదన్న తరహాలో పిటిషనర్‌లు వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానిస్తూ కేసు పూర్వాపరాలను ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వాదనలు విని రిజర్వ్‌లో పెట్టాక ట్రాన్స్‌ఫర్ కోరడం సరికాదన్నారు.

రాష్ట్ర ప్రజలకు జగన్ సంక్రాంతి శుభాకాంక్షలు

రాష్ట్ర ప్రజలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల పలకరింపులతో పల్లె, పట్టణ ప్రాంతాల ప్రజలు అత్యంత ఆనందోత్సాహాలతో పండుగను వేడుకగా జరుపుకోవాలని ఆయన శుక్రవారం ఒక ప్రకటనలో ఆకాంక్షించారు. కొత్తపంటలు, సిరిసంపదలతో రైతు కుటుంబాలు కళకళలాడాలన్న ఆకాంక్షను ఆయనీ సందర్భంగా వ్యక్తం చేశారు. పండుగ సందర్భంగా ప్రజాసమస్యలపై దృష్టి సారించేలా పాలకులకు దేవుడు మంచి బుద్ధిని ప్రసాదించాలని అన్నారు.

Written By ysrcongress on Friday, January 13, 2012 | 1/13/2012


YSR - SCHMES 2004 to 2009(comparison)









                                                                             
                                                                                        by suresh reddy(suresh.katukuri@gmail.com)

YS Jagan Speech at Armour Rythu Deeksha, End Fast




ArmurDeeksha Last Day

తెలంగాణపై జగన్‌కు స్పష్టమైన వైఖరి ఉంది

ప్రభుత్వ వైఫల్యం వల్లే ఆత్మహత్యలు

రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు జరగడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్వాకమే కారణం. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి కాలంలో రైతుల పరిస్థితి ఎంతో మెరుగుపడింది, వ్యవసాయం ఆశాజనకంగా ఉండేది. వైఎస్ ముఖ్యమంత్రి కాకముందు రాష్ట్రంలో 134 లక్షల టన్నుల ధాన్యం ఉత ్పత్తులుంటే, ఆయన సీఎం అయ్యాక 220 లక్షల టన్నులకు ఉత్పత్తులు పెరిగాయి. కానీ మహానేత మరణం తరువాత రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు రైతుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించాయి. ధాన్యానికి గిట్టుబాటు ధరలు లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. పండించిన పంటల పరిస్థితి ఇలా ఉంటే... తినడానికి సరైన తిండిలేకపోవడంతో దేశంలో 42 శాతం పిల్లలు పౌష్టికాహార లోపంతో ఎదుగుదల లేకపోయిందని స్వయంగా ప్రధానమంత్రి ప్రకటించారు. దీన్నిబట్టి దేశంలో, రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో స్పష్టమవుతోంది. వైఎస్సార్ నాటి స్వర్ణయుగం రావాలంటే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వం రాష్ట్రానికి ఎంతో అవసరం. రైతుల పక్షాన అనేక ఉద్యమాలు, దీక్షలు చేస్తున్న జగన్ చరిత్ర సృష్టిస్తున్నారు. ప్రతి ఒక్కరూ జగన్ నాయకత్వాన్ని బలోపేతం చేయాలి.
- మేకపాటి రాజమోహన్‌రెడ్డి, నెల్లూరు ఎంపీ

రైతు దీక్షతో ప్రభుత్వానికి హెచ్చరిక

రైతు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మూడు రోజులపాటు అకుంఠిత దీక్ష చేసి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వానికి హెచ్చరిక పంపించారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఈ ప్రభుత్వం నిద్ర వీడడం లేదు. అందుకే జగన్ రైతుల పక్షాన పోరాడుతూ ప్రభుత్వం కళ్లు తెరిపించేందుకు ప్రయత్నిస్తున్నారు. తొమ్మిదేళ్ల హయాంలో రైతుల జీవితాలతో చెలగాటమాడిన చంద్రబాబు చేస్తున్న రైతుపోరును చూసి జనం నవ్వుకుంటున్నారు. విద్యుత్ చార్జీల భారాన్ని తగ్గించాలని కోరినందుకు ముగ్గురు తెలంగాణ బిడ్డలను కాల్చి చంపిన ఘనత చంద్రబాబుదే. కానీ వైఎస్సార్ అధికారంలోకి రాగానే విద్యుత్ బకాయిలు మాఫీ చేశారు. ఉచిత విద్యుత్ ఫైలుపై తొలి సంతకం చేశారు. రైతులకు బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించడంతోపాటు పంటకు గిట్టుబాటు ధర అందించారు. ఆయన తనయుడు జగన్ అధికారంలోకి వస్తేనే రైతుల జీవితాలు బాగు పడతాయి. 
- కొండా సురేఖ, పరకాల ఎమ్మెల్యే

తెలంగాణపై జగన్‌కు స్పష్టమైన వైఖరి ఉంది

తెలంగాణ ప్రజల ఆకాంక్ష అయిన ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి స్పష్టమైన వైఖరి ఉంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మొదటి ఏడాది ప్లీనరీలోనే తెలంగాణ ప్రజల మనోభీష్టాన్ని గౌరవిస్తున్నామని చెప్పి, తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసిన వారికి శ్రద్ధాంజలి ఘటించారు. తెలంగాణ కోసం రాజీనామా చేసిన ఎమ్మెల్యేల స్థానాల్లో జరిగే ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను నిలపబోమని స్పష్టంగా ప్రకటించారు. తెలంగాణపై రెండు కళ్ల సిద్ధాంతం అవలంబిస్తున్న టీడీపీ... తెలంగాణ తెచ్చేది, ఇచ్చేది తామేనంటున్న కాంగ్రెస్ తెలంగాణపై స్పష్టమైన వైఖరిని వెల్లడించకుండా ఈ ప్రాంత ప్రజలను మోసం చేస్తున్నాయి. జగన్ తెలంగాణకు రావద్దనడానికి ఆ పార్టీలకు సిగ్గుండాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే రెండు ప్రాంతాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఉంటుంది, టీడీపీ, కాంగ్రెస్ పార్టీల పునాదులు కదిలి పోతాయి. జగన్ రైతుదీక్షకు మద్దతు తెలిపిన వేలాదిమంది రైతులకు కృతజ్ఞతలు.
- బాజిరెడ్డి గోవర్ధన్, వైఎస్సార్‌సీపీ నేత

వైఎస్ హయాంలో ముస్లింలకు న్యాయం

మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే ముస్లిం లకు న్యాయం జరిగింది. మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించింది వైఎస్సారే. రైతులు ఆత్మహత్య చేసుకుంటుంటే సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, చిరంజీవి అరకులో గిరిజనులతో కలిసి డ్యాన్స్‌లు చేస్తున్నారు. జగన్‌ను ఎదుర్కొనే సత్తా లేక చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డి ఏకమయ్యారు. కిరణ్ కుమార్‌రెడ్డి కాంగ్రెస్‌కు చివరి కిరణం. చంద్రబాబుకు రైతుల గురించి మాట్లాడే అర్హత లేదు. 
- ఎంఏ రెహమాన్, మాజీ ఎమ్మెల్సీ

జగన్‌కు నిమ్మరసం ఇవ్వడం ఆనందంగా ఉంది

ఆర్మూర్, న్యూస్‌లైన్: రైతు సమస్యలపై మూడు రోజులుగా దీక్ష చేసిన రైతు బాంధవుడు వైఎస్ జగన్‌కు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేయడం ఆనందం గా ఉందని ఆర్మూర్ మండలం మంథని గ్రామానికి చెందిన నక్కల భూమారెడ్డి అనే రైతు సంతోషం వ్యక్తం చేశారు. గురువారం సాయంత్రం భూమారెడ్డి తన చేతులతో జగన్‌కు నిమ్మరసం తాగించి రైతుదీక్షను విరమింపజేశారు. ఈ సందర్భంగా ‘న్యూస్‌లైన్’ మాట్లాడుతూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఎన్నో పథకాలు చేపట్టి రైతులకు మేలు చేశారని, వ్యవసాయ రుణ మాఫీ కింద తనకు ఒక లక్ష రూపాయలు మాఫీ అయినట్లు గుర్తుచేసుకున్నారు. కరెంటు బకాయిలు కూడా మాఫీ అయ్యాయని చెప్పారు. మూడ్రోజులుగా దీక్ష ప్రాంగణంలోనే ఉన్నానన్నారు.
- రైతు నక్కల భూమారెడ్డి స్పందన

వెల్లువలా అన్నదాతలు

తొలిరోజున అంకాపూర్‌కు చెందిన రైతు మోహన్‌రెడ్డి నన్ను కలిశాడు. ‘‘రాష్ట్రమంతటా కరువు ఉంటే చిరునవ్వుతో మేమెందుకున్నామంటే.. మీ నాన్న గుత్ప, అలీసాగర్ ప్రాజెక్టులు మాకిచ్చారు. అంతకుముందు ఎందరో ముఖ్యమంత్రులు వచ్చారు. చూసి వెళ్లి పోయారు. ఎన్నికలప్పుడు వచ్చి ఏదో చేస్తామన్నారు. కానీ మీ నాన్న మా ఊరికొచ్చారు. ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టును పూర్తి చేసి మమ్మల్ని ఆదుకున్నాడు. లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుతోనే మాకు నీళ్లొచ్చాయి. రూ.230 కోట్లతో గుత్ప, రూ.270 కోట్లతో అలీసాగర్ నిర్మించారు..’’ అని మోహనన్న చెప్పినప్పుడు ఆనందమైంది. రైతుల బాధలు అర్థం చేసుకున్న వ్యక్తి దివంగత నేత వైఎస్ ఒక్కరే. అందుకే వారికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. రాజకీయాల్లో విలువలకు అర్థం తెచ్చి.. విశ్వసనీయతకు అద్దంపట్టిన నాయకుడు వైఎస్. కానీ ఇప్పుడు రాజకీయ నాయకులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకమాట... అధికారపక్షం లో ఉన్నప్పుడు ఇంకోమాట మాట్లాడుతూ.. ఎన్నికలప్పు డు మాత్రమే ప్రాజెక్టులకు టెంకాయలు కొడుతున్నారు.

నాకు తల్లి లాంటిది, మన అక్కసురేఖను చూసి గర్వపడుతున్నా. కారణమేమిటంటే... విలువలు, విశ్వసనీయత లేక చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థను కాదని ఆమెతోపాటు 17 మంది ఎమ్మెల్యేలు మాత్రం నిఖార్సుగా పేదల పక్షాన నిలిచారు. ప్రజలందరూ మనవైపు చూస్తున్నారు.. రాష్ట్రంలో రైతులు కష్టాల్లో ఉన్నారు.. పేద విద్యార్థి చదవలేని పరిస్థితి.. పేదలు బతకలేకపోతున్నారు.. ఈ చెడిపోయిన వ్యవస్థలో మార్పు తీసుకురావటానికి మనల్ని చూస్తున్నారు. చంద్రబాబు ఏ దురుద్ధేశపూర్వకంగా అవిశ్వాసం ప్రవేశపెట్టినా కూడా.. మనం మాత్రం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాల్సిందే.. అని నేను వారికి చెప్పా. ఈ రాజ కీయ వ్యవస్థలో విలువలు కావాలి.. విశ్వసనీయత ఉండాలి అని, ప్రతి ఒక్కరూ రైతుల కోసం నిలబడాలని, పేద ప్రజల కోసం పోరాడాలని అని నేను చెప్పిన మాటను గౌరవించి వారంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేశారు. త్వరలోనే ఎన్నికలు కూడా జరగబోతాయి. ఆ రోజు ఎమ్మెల్యేలందరూ భయపడ్డారు కూడా. ఎందుకంటే అధికార పక్షంతో పోటీ. వాళ్లు కోట్లతో కుమ్మరిస్తారు. మంత్రులంతా నియోజకవర్గాల్లో మకాం వేస్తారు. పోలీసు యంత్రాంగం కూడా వారి చెప్పుచేతల్లో ఉంటుంది. కానీ.. వారికి నేనొక్కటే చెప్పా.. విలువలు, విశ్వసనీయతకు కట్టుబడదామని. మొట్టమొదటిసారి రైతుల కోసం పేదల కోసం ఎన్నికలు జరగబోతున్నాయి.. చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ఎన్నికలు జరగబోతున్నాయి.
 
ఉప్పొంగిన జనవాహిని, పోటెత్తిన కర్షకుల ఆదరాభిమానాల మధ్య... రైతులు, రైతు కూలీల సమస్యల పరిష్కారం కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేసిన రైతు దీక్ష విజయవంతం అయింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో మూడు రోజుల పాటు సాగిన ఆయన దీక్ష రైతులకు మనో నిబ్బరాన్ని కలిగించింది. పెరిగిన విత్తనాలు, ఎరువుల ధరలతో కష్టాల సాగును కొనసాగించలేక, అష్టకష్టాలు పడి పండించిన పంటకు గిట్టుబాటు ధరల్లేక రైతాంగం అల్లాడుతున్న తరుణంలో... నేరుగా రైతుల వద్దకు వెళ్లి దీక్ష చేయడం ద్వారా జగన్ వారి హృదయాల్లో చోటు సంపాదించుకున్నారు. ఆయన వస్తున్నారని తెలిసిన రోజు నుంచే నిజామాబాద్ రైతుల్లో ఎనలేని ఉత్సాహం నెలకొంది. మంగళవారం తొలి రోజున జిల్లాలో అడుగు పెట్టింది మొదలు, అడుగడుగునా ఆయనకు లభించిన స్పందనే అందుకు నిదర్శనం. 

మంగళవారం రాత్రి 8 గంటలకు ప్రారంభించిన దీక్షను గురువారం 5 గంటలకు జగన్ విరమించారు. రైతులకు జీవనాధారమైన సాగునీటి వసతి కోసం తన తండ్రి, దివంగత సీఎం వైఎస్ నిజామాబాద్ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు నిర్మించిన విధంగానే తానూ అన్నదాత సంక్షేమానికి పాటు పడతానంటూ భరోసా ఇచ్చారు. ఆయనను కలుసుకోవడానికి వృద్ధులు, రైతులు, మహిళలు, పిల్లలు దీక్షా శిబిరం వద్ద బారులు తీరారు. జగన్ కూడా వారి కష్ట సుఖాలు తెలుసుకుని, వారి ఆవేదనలో పాలు పంచుకున్నారు. ఆర్మూర్ చుట్టు పక్కల నుంచే కాక ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ వంటి పొరుగు జిల్లాల నుంచి కూడా రైతులు మూడు రోజులూ భారీగా తరలి వచ్చారు. ఇక గురువారం ముగింపు సభకు రైతులు పోటెత్తడంతో మైదా నం కిక్కిరిసిపోయింది. ఆద్యంతమూ ‘జై జగన్’, ‘వైఎస్సార్ అమర్ రహే’ నినాదాలతో మారుమోగింది. ఆర్మూర్‌వాసులు ఆయనపై ఆద్యంతం అంతులేని ప్రేమాభిమానాలు కురిపించారు. 

రైతులతో మమేకమై, వారి సమస్యల పట్ల చలించి జగన్ చేసిన ప్రసంగం వారిని విశేషంగా ఆకట్టుకుంది. వారి కష్టాలను అసలే పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వ నిష్క్రియాపరత్వాన్ని, విపక్ష నేత చంద్రబాబు మోసపూరిత విధానాలను ఆయన ఆద్యంతం తూర్పారబట్టారు. తాను దీక్ష చేశానని కాకుండా, దీన్ని యావత్ రైతుల విజ్ఞప్తిగా భావించి సమస్యలు పరిష్కరిం చాలంటూ జగన్ చేసిన సూచన పట్ల హర్షధ్వానాలు మిన్నం టాయి. సీఎం కిర ణ్‌ను, బాబును ఆయన దునుమాడినప్పుడల్లా చప్పట్లు మారుమోగాయి. జగన్ దీక్ష రైతులకు ఊరటనివ్వడంతో పాటు స్థానిక రాజకీయ నాయకులను కూడా ఎంతగానో ప్రభావితం చేసింది. మాజీ ఎం.పి కె.గంగారెడ్డి తదితర నేతలు ఆయన సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడమే ఇందుకు రుజువు. తెలంగాణలో జగన్ తొలి పర్యటన దిగ్విజయంగా ముగియడం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, శ్రేణుల ఉత్సాహాన్ని ద్విగుణీకృతం చేసిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

కష్టం చెప్పుకుంటూ, కరచాలనాలు చేస్తూ...

ఎవరిని కదిలించినా.. కన్నీటి గోడు.. కరువు కష్టనష్టాలు.. అన్నదాతను సర్కారు పట్టించుకోవటం లేదనే ఆవేదన.. ఆత్మహత్యలు తప్ప గత్యంతరం లేదనే మనో వేదన... రైతన్నల కన్నీటి గోసతో వైఎస్సార్ దీక్షా ప్రాంగణం మూడు రోజుల పాటు ప్రతిధ్వనించింది. తమ తరఫున పోరాడేందుకు వచ్చిన జగన్‌ను కలిసేందుకు, కష్టాలను మొరపెట్టుకునేందుకు అన్నదాతలు పోటీపడ్డారు. పొరుగు జిల్లాల నుంచి కూడా వచ్చి, గంటల కొద్దీ క్యూ లైన్లలో నిలబడి జన నేతపై అభిమాన్ని, తమకున్న విశ్వాసాన్ని చాటారు. నష్టాల ఊబిలో చిక్కిన ఆర్మూర్ పసుపు రైతులైతే జగన్‌కు జేజేలు పలికారు. తమకోసం పోరాడేందుకు వచ్చిన నేతను సాదరంగా ఆదరించి అభిమానం చూపారు. 

హైదరాబాద్‌లో తాము రెండు రోజులు ఆందోళన చేసినా సర్కారు పట్టించుకోలేదంటూ శాపనార్థాలు పెట్టారు. జగన్ రాకతో తమ కష్టాలు తీరతాయనే విశ్వాసం వారిలో వ్యక్తమైంది. ‘ఎంత పెట్టుబడి పెట్టారు? ఎంత దిగుబడి తగ్గింది? ఎంత ధర గిట్టింది?’ అంటూ వారందరి వెతలనూ జగన్ మరీ మరీ అడిగి తెలుసుకున్నారు. పెట్టుబడి కూడా తిరిగి రాక నిండా మునిగిపోతున్నామంటూ ఐదెకరాల్లో పత్తి వేసిన కారేపల్లి గిరిజన రైతులు భీక్యానాయక్, అంబాడీ నాయక్ తదితరులు బోరుమన్నారు. అంత బాధలోనూ మహా నేతను, ఆయన చేసిన సేవలను అన్నదాతలతో పాటు అన్ని వర్గాల వారూ మరీ మరీ గుర్తు చేసుకున్నారు! వైఎస్ తెచ్చిన ఫీజు రీయింబర్స్‌మెంట్ సరిగా అమలవడం లేదని, రెండేళ్లుగా స్కాలర్‌షిప్‌లే లేవని మామిడిపెల్లికి చెందిన బీటెక్ విద్యార్థులు అలేఖ్య, శ్రీలేఖ, దివ్య వాపోయారు. వైఎస్ తెచ్చిన ఆరోగ్యశ్రీతో బైపాస్ జరిగి తన కొడుకు ప్రాణం దక్కిందంటూ జానకంపేటకు చెందిన కాకర్ల ప్రకాశ్ పొంగిపోయాడు. జగన్‌ను కలిసేందుకు ఆయన నాలుగు గంటల పాటు నిరీక్షించాడు!

దీక్షలో నేతలు...

ఆర్మూర్‌లో జరిగిన రైతుదీక్షలో పలువురు నేతలు ఉత్సాహంగా పాల్గొన్నారు. వీరిలో వైఎస్సార్ సీపీ కేంద్ర పాలకమండలి సభ్యులు బాజిరెడ్డి గోవర్ధ్దన్, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, పార్టీ జిల్లా కన్వీనర్ కెపి వెంకటరమణారెడ్డి, ఎంఎల్‌ఏలు కొండా సురేఖ, శోభానాగిరెడ్డి, అమరనాథ్‌రెడ్డి, ఎమ్మెల్సీలు కొండా మురళి, జూపూడి ప్రభాకర్, సేవాదళం అధ్యక్షుడు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర నాయకులు భూమానాగిరెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి, అంబటి రాంబాబు, కొణతాల రామకృష్ణ, గట్టు రాంచంద్రరావు, మాజీ మంత్రులు మారెప్ప, సంతోష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి, ఎడ్మ కిష్టారెడ్డి, బోడ జనార్ధ్దన్, మాజీ ఎంపీ రవీంద్రనాయక్, పార్టీ నేతలు ఆది శ్రీనివాస్, చందా లింగయ్య, సోమిరెడ్డి, బట్టి జగపతి, శ్రీనివాస్‌రెడ్డి, కెప్టెన్ కరుణాకర్‌రెడ్డి, కొండా రాఘవరెడ్డి, కేకే మహేందర్‌రెడ్డి, పుట్ట మధు, రహ్మాన్, జనక్‌ప్రసాద్, నిరంజన్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

 

విజయసాయిరెడ్డి కస్టడీ పొడిగింపు ఉత్తర్వులు రద్దు

సాయిరెడ్డి కేసులో హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు
అలాంటి అధికార పరిధి ఇన్‌చార్జి కోర్టుకు లేదు
జగన్, సాయిరెడ్డి కుట్రపన్నారనే సీబీఐ ఆరోపణలను నిర్ధారించడం సహించరాని విషయం
జడ్జి ఒత్తిడికి లోనై ఉత్తర్వులు జారీ చేసినట్లు అనిపిస్తోంది
కస్టడీ కావాలంటే సీబీఐ కోర్టునే ఆశ్రయించండి
హైదరాబాద్, న్యూస్‌లైన్: ఆడిటర్ విజయసాయిరెడ్డి కస్టడీని వారం రోజుల పాటు పొడిగిస్తూ ఈ నెల 10న ఇన్‌చార్జి కోర్టు హోదాలో ఆర్థిక నేరాల ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు గురువారం రద్దు చేసింది. అలాంటి అధికార పరిధి ఇన్‌చార్జి కోర్టుకు లేదని స్పష్టం చేసింది. కస్టడీ పొడిగింపు ఉత్తర్వులు జారీ చేసిన జడ్జి సుధాకర్‌నాయుడు తీరును న్యాయమూర్తి జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి తప్పుపట్టారు. ఈ కేసులో జగన్‌మోహన్‌రెడ్డి (ఏ1), విజయసాయిరెడ్డి (ఏ2)లు కలిసి కుట్ర పన్నారని జడ్జి తన ఉత్తర్వుల్లో నిర్ధారించడాన్ని న్యాయమూర్తి ఎత్తిచూపారు. అది కేవలం సీబీఐ ఆరోపణ మాత్రమేనని, ఆరోపణను ఆరోపణగా ప్రస్తావించాల్సింది పోయి, చార్జిషీట్ కూడా దాఖలు చేయని కేసులో ఆరోపణలు నిర్ధారిం చడం ఎంత మాత్రం సహించరాని విషయమని ఘాటుగా వ్యాఖ్యానించారు. అన్ని కేసుల్లోనూ జడ్జి ఇలాగే వ్యవహరిస్తున్నారా..! అనే సందేహాన్ని న్యాయమూర్తి వ్యక్తం చేశారు. జడ్జి సుధాకర్ నాయుడు ఒత్తిడికి లోనై ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు అనిపిస్తోందని వ్యాఖ్యానించారు. 

ఇది ఫోరం పర్చేజ్ కిందకు వస్తుంది

సాయిరెడ్డి కస్టడీ విషయంలో ఒకరోజు ఆగితే వచ్చిన నష్టమేమిటని సీబీఐని నిలదీశారు. ఒక్కరోజు కూడా ఆగకుండా.. ఇన్‌చార్జి కోర్టులో కస్టడీ పొడిగింపు కోసం దరఖాస్తు చేయాల్సిన అవసరమేమొచ్చిందని సీబీఐని ప్రశ్నించారు. ఇలా చేయడం ఫోరం పర్చేజ్ (ఏ న్యాయమూర్తి ముందు కావాలంటే అక్కడ కేసు దాఖలు చేసుకోవడం) కిందకు వస్తుందని మండిపడ్డారు. ‘సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం జడ్జి సెలవులో ఉన్నారు. సెలవు పూర్తి చేసుకుని ఆయన వచ్చేంత వరకు వేచి ఉండటం వల్ల మీకొచ్చిన నష్టమేమిటి..? ఒక రోజులో మునిగిపోయేదేముంది..? అంత అత్యవసరంగా ఇన్‌చార్జి కోర్టును ఆశ్రయించాల్సిన అవసరం ఏముంది..?’ అని న్యాయమూర్తి ప్రశ్నించారు. విజయసాయిరెడ్డి కస్టడీ పొడిగింపు కావాలనుకుంటే.. కేసును విచారిస్తున్న సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ముందు దరఖాస్తు దాఖలు చేసుకోవాలని సీబీఐ అధికారులకు సూచించారు. ఈ మేరకు జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. తన కస్టడీని వారం రోజుల పాటు పొడిగిస్తూ ఇన్‌చార్జి కోర్టు హోదాలో ఆర్థిక నేరాల ప్రత్యేక న్యాయస్థానం ఈ నెల 10న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ విజయసాయిరెడ్డి హైకోర్టులో గురువారం మధ్యాహ్నం అత్యవసరంగా పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ నర్సింహారెడ్డి విచారణ జరిపారు. పిటిషనర్ తరఫున ఎస్.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. సీబీఐ అధికారులు విజయసాయిరెడ్డిని ఇప్పటికే 30 రోజులకు పైగా విచారించారని, ఇంత సుదీర్ఘ విచారణ చేపట్టిన అధికారులు, తిరిగి కస్టడీ కోరడం ఆశ్చర్యంగా ఉందని ఆయన కోర్టుకు నివేదించారు.

సాయిరెడ్డి సీబీఐ విచారణకు ప్రతి దశలోనూ సహకరించారని, అరెస్టు చేసే రోజు కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు సాయిరెడ్డిని సీబీఐ అధికారులు ప్రశ్నించారని ఆయన కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అరెస్టుకు తగిన కారణాలను వెల్లడించకుండానే అరెస్టు చేశారని తెలిపారు. సాయిరెడ్డిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచిన సీబీఐ అధికారులు.. రిమాండ్ రిపోర్ట్ లేకుండానే కస్టడీ కోరారని, ఇందుకు ప్రత్యేక న్యాయస్థానం సైతం అంగీకారం తెలుపుతూ ఐదు రోజుల కస్టడీకి ఇచ్చిందని ఆయన వివరించారు. కస్టడీ ముగిసిన వెంటనే సీబీఐ అధికారులు సాయిరెడ్డిని ప్రత్యేక న్యాయస్థానం జడ్జి సెలవులో ఉన్నందున.. ఇన్‌చార్జి కోర్టయిన ఆర్థిక నేరాల ప్రత్యేక న్యాయస్థానం జడ్జి ముందు హాజరుపరిచి, కస్టడీ పొడిగింపునకు దరఖాస్తు చేశారని తెలిపారు. సీబీఐ అభ్యర్థన మేరకు జడ్జి వెంటనే స్పందించి సాయిరెడ్డి కస్టడీని వారం రోజుల పాటు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారని వివరించారు. దీనిపై సీబీఐ తరఫు న్యాయవాది కేశవరావు స్పందిస్తూ.. తగిన సమయం లేకపోవడం వల్లే ఇన్‌చార్జి కోర్టును ఆశ్రయించామని తెలిపారు. సీఆర్‌పీసీ సెక్షన్ 167 క్లాజ్ 1, సబ్ క్లాజ్ 2 ప్రకారం ఏ మేజిస్ట్రేట్ అయి నా కస్టడీని పొడిగించవచ్చునని వివరించారు. అయితే న్యాయమూర్తి జస్టిస్ నర్సింహారెడ్డి ఈ వాదనలను తోసిపుచ్చారు. కస్టడీ కోసం సీబీఐ అనుసరించిన పద్ధతి మంచి పద్ధతి కాదని.. ఇన్‌చార్జి కోర్టు కస్టడీ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం పరిధి దాటి వ్యవహరించడమే అవుతుందని తేల్చి చెప్పారు. సెక్షన్ 167 క్లాజ్ 1, సబ్ క్లాజ్ 2లను వేర్వేరుగా చూడాలని, రెండింటినీ అన్వయించడం సరికాదని పేర్కొన్నారు. ఐదు రోజుల కస్టడీ పూర్తయిన తరువాత.. కస్టడీ పొడిగింపు కోసం అదే కోర్టుకు (సీబీఐ కోర్టు) వెళ్లాలే తప్ప.. ఇన్‌చార్జి కోర్టుకు వెళ్లి ఉత్తర్వులు పొందడం సరికాదని స్పష్టం చేస్తూ.. సాయిరెడ్డి కస్టడీని పొడిగిస్తూ జడ్జి సుధాకర్‌నాయుడు ఇచ్చిన ఉత్తర్వులను న్యాయమూర్తి రద్దు చేశారు.

Popular Posts

Topics :