12 February 2012 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Jagan response on Budget

Written By ysrcongress on Saturday, February 18, 2012 | 2/18/2012

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ వంచన, ఆత్మవంచనల మేళవింపుగా ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి విమర్శించారు. 2012-2013 రాష్ట్ర బడ్జెట్ పై ఆయన స్పందించారు. ఈ ప్రభుత్వం మహానేత డాక్టర్ వైఎస్ రెక్కల కష్టం అన్నారు. అయితే ఆయన హయాంలోని మానవీయ కోణం ఈ బడ్జెట్ లో లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ధ్యాసంతా పన్నులపైనే ఉందన్నారు. ఈ ప్రభుత్వం ఇంకెన్ని పన్నులు వేస్తుందోనని జనం వణకుతున్నారన్నారు. ప్రజాసంక్షేమంపై ప్రభుత్వ పగబట్టినట్లుగా ఉందని విమర్శించారు. ప్రజలంటే ముఖ్యమంత్రికి ఇంత చులకనా? ఈ ప్రభుత్వం ఉంది ఎవరికోసం? అని జగన్ ప్రశ్నించారు.

ఫీజు రీయింబర్స్ మెంట్ కు కేటాయించిన నిధులు గత సంవత్సరం బకాయిలకు కూడా సరిపోవన్నారు. ఆరోగ్యశ్రీ పథకం ప్రభుత్వాసుపత్రులకే పరిమితమైందన్నారు. 104, 108లకు నిధులు తక్కువ కేటాయించారని తెలిపారు. మహిళా స్వావలంబనకు గండికొడుతున్నారని విమర్శించారు. ఉచిత విద్యుత్, 30 కిలోల బియ్యం హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ప్రభుత్వం ప్రచారం కోసం వందల కోట్ల రూపాయలు తగలేస్తుందని విమర్శించారు.

Current affairs on Palagummi sainath


Chandrababu Naidu – A politician a youngster may not want to be

Article  from www.manajagan.com:

Politics is the art of the impossible said Ottovon Bismarck – the German Chancellor. . The term “politics” is not such a bad word at all. In English as a noun it means “art and science of administration of government”. People in “politics” in a parliamentary form of democracy derive their legitimacy to be in public life, and be in the art of “governance” through people’s ballot. Many politicians in the present day world master the art of manipulation, conniving treachery and brazen self-promotion and ensconce themselves to the seat of power. They by their very presence in the field of activity, make “politics” a bad word, politicians detestable and the very polity a no go zone.
One person who in the recent past who eptiomises everything that is ugly about politics, politicians and polity is “benami chandrababu naidu”. His conduct and progress (at what cost) in life defines treachery, deceit, manipulation, malevolence. From the humble beginnings in life, he has risen to a stage, according to his own statement, where he telephonically decided who the Prime Minister of the Country should be. A country of one billion, got the Prime Minister this illegitimate, corrupt and a deceitful politician decided? One of the many tall claims of this person, who has absolutely no legitimacy of existence.
Route to ascendancy
A politician who started his political life as a Student leader in Sri Venkateswara University, thriving on violence, casteist fanaticism and other essential anti-democratic facets which have the tendency to capture people’s imagination in the short run. So building up his career, he became a MLA in State Legislature of A.P and became a Minister.


Thereabouts, his father-in-law, the cinema thespian, the icon of telugu film industry, Sri N.T. Rama Rao joined politics and started a Political Party by name Telugu Desam. Sri Naidu ridiculed his father in law by being in Congress, and then after Sri NTR rode the national politics in his own inimitable style, he built bridges with NTR and joined Telugu Desam party. He was aware that his connection to fame can only be by latching on to a person who is popular, charismatic, a good orator and above all, a genuine politician who can connect to the people. As a thinking (conniving) politician, he was aware, that he can never become
popular – owing to his distrusting and suspicious personality
charismatic – congential disability
a good orator – lacking in honesty and integrity to carry conviction
genuine politician – he cant be genuine towards anything or
anybody in life
His violent ways with his political opponents and also his congenital hatred towards kapu community had come to the fore, when it was widely believed that it was he who had planned the killing of vangaveeti mohan ranga rao, the popular politician from Krishna District. Of course, as with in any other case, he was not prosecuted.

When NTR went out of power, he stayed with him and when NTR came back to power in 1994, he became no. 2. The great human being that NTR was, had begun to be loyal to Lakshmi Parvathi, a biographer, who sought to write about NTR and took care of him, when NTR was out of power, when his own progeny and others disowned him. Since Naidu was being sidelined in the day to day politics, he engineered a split in the Telugu Desam Party in the year 1995, with the active support of another henchman Ramoji Rao a benami for the illgotten assets of Chandrababu Naidu. All the MLAs owing allegiance to Chandra babu Naidu were holed in a hotel by name Viceroy for 3-4 days and were allowed to indulge in all their fantasies. The scenes of NTR going in a vehicle to their hotel only to be thrown chappals at, is something etched in the minds of all the democracy loving people of the State. Naidu became the Chief Minister, on the basis of the mandate earned by Sri NTR and continued until 1999. He lacked the legitimacy of the popular leader, but with his conniving ways, managed to remain as such for the full term.
Come 1999, he latched on to Atal Bihari Vajpayee bandwagon, ditched the third front, for whom, he supposedly picked the Prime Minister, on telephone and got re-elected to power. All through his tenure as Chief Minister, he took pride in the fact that he has the unbridled power as C.E.O of the State, called himself a visionary, designed a document named “vision 2020” and he epitomizes pachydermy.

He killed domestic industry, agrarian sector, rural sector and pandered to foreign investment thereby alienating major sections of the society. He would think that with “eenadu” promoting and projecting him, he would ride on the wave of artificial hype created by Eenadu.

While all the pollsters and psephologists predicted Naidu’s loss by a distance, Eenadu published a front page story about an electoral meeting, in which hardly 10,000 people appeared under the title “jana chandrama”. So much was the blinded allegiance, on the basis of social affinity, (belong to the same caste) that Ramoji Rao created stories after stories eulogizing Sri Naidu, and late YSR, literally and metaphorically, “walked into one bastion after the other” of Sri Naidu, and came to power in 2004 in A.P. to hearld an era of concern of agrarian economy, basic needs, to bring a new definition to the concept of Welfare State.



Current affairs on Palagummi sainath:

YSR Party Consoles Families of fire victims

వాస్తవాలను మరుగుపరిచి అరచేతిలో స్వర్గం చూపిన ‘ఆనం’


1,45,854 కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌ను సమర్పించిన ఆర్థికమంత్రి
ప్రణాళికేతర వ్యయం రూ. 91,824 కోట్లు, ప్రణాళిక వ్యయం 54,030 కోట్లు
పన్నుల రూపేణా రూ. 66,021 కోట్లు రాబడతామని ప్రకటన
జనంపై రూ.13 వేల కోట్ల దాకా పన్నుల బాదుడు ఖాయం!
వైఎస్ హామీ ఇచ్చిన ‘9 గంటల కరెంటు, 30 కిలోల సబ్సిడీ బియ్యం’ ఊసే లేదు
రైతు సమస్యలు పట్టలేదు, దేశాన్నే కుదిపేసిన ‘క్రాప్ హాలిడే’ ప్రస్తావనే లేదు
విద్య, వైద్యం వంటి కీలక సామాజిక పథకాలన్నింటికీ మొండిచేయే
బకాయిలకే చాలని రీతిలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు కేటాయింపులు
ధరల నియంత్రణకు చర్యలు శూన్యం.. బడ్జెట్‌లో కానరాని ప్రజా మాల్స్
కొండలా పెరిగిన రాష్ట్ర అప్పులు.. బడ్జెట్‌కు మించి రూ.1.60 లక్షల కోట్లకు...

సాక్షి ప్రత్యేక ప్రతినిధి:
రాష్ట్రానికి వెన్నెముకైన రైతన్న ఊసు లేదు. అతని సమస్యల ప్రస్తావన అసలే లేదు. విద్య, వైద్యం వంటి అత్యంత కీలకమైన ప్రజా సంక్షేమ రంగాలను పట్టించుకునే పెద్ద మనసు లేదు. వాటిని పట్టి పీడిస్తున్న సమస్యను పరిష్కరించాలన్న మనస్సాక్షి అస్సలు లేదు. ఉన్నదల్లా ఆద్యంతం అంకెల గారడీ! అవాస్తవాలతో కళ్లకు గంతలు కట్టే గడుసుతనం!! అంతకు మించి బడ్జెట్‌లో అసలేమీ లేదు. 

పేరుకు రూ.1,45,854 కోట్లతో ఆర్థిక మంత్రి శుక్రవారం అసెంబ్లీలో అట్టహాసంగా ప్రవేశపెట్టిన 2012-13 రాష్ట్ర బడ్జెట్ అచ్చం ఆత్మ లేని శరీరాన్ని తలపించింది. రాష్ట్ర వ్యవసాయ సంక్షోభ తీవ్రతను జాతీయ స్థాయిలో ప్రతిధ్వనింపజేసిన క్రాప్ హాలిడే వంటి పెను విపత్తు కనీసం ప్రస్తావనకు కూడా నోచుకోలేదు. రైతు సమస్యలపై కిరణ్ సర్కారు మొద్దు నిద్రకు నిరసనగా ఏకంగా శాసనసభ్యత్వాలనే వదులుకునేందుకు కూడా 17 మంది ఎమ్మెల్యేలు సిద్ధపడ్డ అపూర్వ ఘట్టాన్ని ఇటీవలే రాష్ట్రంతో పాటు దేశమంతా అబ్బురపాటుతో వీక్షించింది. అయినా సరే, బడ్జెట్లో మాత్రం రైతు సమస్యల పరిష్కార చర్యల ఊసే లేదు! సామాజిక పెట్టుబడిగా పరిగణించాల్సిన ఉదాత్తమైన విద్యా రంగాభివృద్ధిపైనా అదే నిర్లక్ష్యం. ఓవైపు విద్యా హక్కు కోసం కేంద్రం చట్టమే తెచ్చింది. కానీ కిరణ్ సర్కారు మాత్రం ఇంత కీలక రంగానికి సంబంధించి తనపై ఉన్న సామాజిక బాధ్యతను కనీస స్థాయిలో నెరవేర్చేందుకు కూడా ఏ మాత్రమూ సిద్ధంగా లేనని బడ్జెట్ సాక్షిగా తేల్చి చెప్పింది. పేద పిల్లలు పెద్ద చదువులు చదవాలన్న ఉదాత్త ఆశయంతో మొదలు పెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకానికి, బకాయిల చెల్లింపునకే కనాకష్టంగా సరిపోయే బొటాబొటి కేటాయింపులతో సరిపెట్టింది! 

ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు, సమాజానికి దీని ద్వారా ఏం సందేశమివ్వాలనుకుంటున్నారో ఏలిన వారికే తెలియాలి. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసే ఉదాత్త లక్ష్యంతో దివంగత వైఎస్ తలపెట్టిన బృహత్తర కార్యక్రమం జలయజ్ఞం. గణాంకాలు, ఆర్థిక కోణాలను పక్కన పెట్టి.. ఎంత ఆయకట్టు సాగులోకి వస్తుంది, తద్వారా సాధ్యపడే అదనపు దిగుబడి, ఉపాధి ద్వారా ఎన్ని లక్షల మందికి లబ్ధి చేకూరుతుందనే సామాజిక కోణంలో ఆలోచించి, మనస్ఫూర్తిగా అమలు చేయాల్సిన పథకమిది. కానీ అందుకు కూడా ప్రభుత్వానికి మనసు రాలేదు.

జలయజ్ఞానికి పెంపు లేదు...

జలయజ్ఞానికి ఈసారీ నిధులు పెంచలేదు. అసలు గత బడ్జెట్ కేటాయింపుల నుంచే.. కొద్దిపాటి వ్యయంతో నిర్మాణం పూర్తయి సాగునీరందించగల పలు ప్రాజెక్టులకు పైసా కూడా విదల్చలేదు. అలా వాటిని ఖర్చు చేయకపోగా, దాన్నే కారణంగా చూపుతూ ఈసారి కూడా అంతంతమాత్రం నిధులతోనే సరిపెట్టి తెంపరితనాన్ని ప్రదర్శించింది! పేదలకు కార్పొరేట్ వైద్యం అందించి ఆదుకోవడమే గాక లక్షలాది ప్రాణాలను నిలబెట్టిన అపర సంజీవనులైన 104, 108 పథకాలకు చివరికి డీజిల్‌కు కూడా దిక్కు లేని దౌర్భాగ్య పరిస్థితిని ప్రభుత్వమే చేజేతులా కల్పించింది! తాజా బడ్జెట్లోనూ వాటిపై శీతకన్నేసింది. పేదల సంక్షేమం తనకసలే పట్టదని మరోసారి నిరూపించుకుంది. రాష్ట్రంలో విపక్షాలన్నీ ఏకమైనా, రెండే రెండు హామీలతో 2009లో కాంగ్రెస్‌ను వైఎస్ రెండోసారి అధికారంలోకి తీసుకొస్తే, వాటినీ కిరణ్ ప్రభుత్వం విస్మరించింది. రైతులకు 9 గంటల పాటు ఉచిత విద్యుతిస్తామని, సబ్సిడీ బియ్యాన్ని గరిష్టంగా 30 కిలోలకు పెంచుతామని వైఎస్ ఇచ్చిన హామీలను పూర్తిగా అటకెక్కించింది. అధికారంలోకి వచ్చి మూడేళ్లవుతున్నా తాజా బడ్జెట్లో వాటి ఊసే ఎత్తలేదు. చేనేత కార్మికులకు వైఎస్ ప్రకటించిన రూ.312 కోట్ల రుణ మాఫీలో నేటికీ సగం కూడా అమలు చేయలేదు. పన్నుల రూపేణా రూ.66,021 కోట్లు రాబడతామని ఆనం ప్రకటించారు. ప్రస్తుత పన్నుల ఆదాయం కంటే ఇది ఏకంగా రూ.13 వేల కోట్లు అదనం! అంటే వచ్చే ఆర్థిక సంవత్సరం పొడవునా ఆ మేరకు జనం నడ్డి విరుస్తామని అమాత్యులు చెప్పకనే చెప్పారు! మొత్తం మీద ఇది అంకెల గారడీకే తప్ప రాష్ట్రాభివృద్ధికీ, ప్రజా సంక్షేమానికీ పూచికపుల్ల పాటి విలువ కూడా ఇవ్వని పనికిమాలిన బడ్జెట్‌గా మిగిలిపోతుందంటూ ఆర్థిక నిపుణులు పెదవి విరుస్తున్నారు.

ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మరో భారీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టి అరచేతిలో అంకెల గారడీ ప్రదర్శించారు. వాస్తవాలను మరుగునపరిచి, అంతా బాగుందంటూ మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. ఇప్పటికే ప్రకటించిన ఒకటి రెండు కొత్త పథకాలను ప్రస్తావించి, ప్రజల కోసం ఏదో చేస్తున్నామని చెప్పుకునేందుకే ప్రాధాన్యమిచ్చారు. రాష్ట్రాన్ని కలచివేస్తున్న ఏ సమస్యా బడ్జెట్‌లో ప్రస్తావనకు గానీ, పరిష్కారానికి గానీ నోచుకోలేదు. పలు శాఖల్లో పేరుకుపోయిన బకాయిలను ఎలా చెల్లిస్తారో చెప్పనే లేదు. ఇన్‌పుట్ వ్యయం భారీగా పెరిగి, గిట్టుబాటు ధర లభించక క్రాప్ హాలిడే ప్రకటించిన రైతులకు తరుణోపాయం చూపలేదు. జీవన వ్యయం విపరీతంగా పెరిగి అవస్థలు పడుతున్న వృద్ధులు, వికలాంగులకు సామాజిక పెన్షన్లు కాస్తయినా పెంచడానికి కూడా మనసొప్పని ప్రభుత్వం, గొప్పలు చెప్పుకోడానికి మాత్రం ఎక్కడ లేని ప్రాధాన్యమూ ఇచ్చింది. ఆచరణసాధ్యం కాని ఆరున్నర లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల గురించి బడ్జెట్ ప్రసంగంలో చెప్పుకోవడం చూసి ఆర్థిక వేత్తలే విస్తుపోతున్నారు.



రాష్ట్రంలో సమస్యలే లేవా!

భూతద్దం పెట్టి వెదికినా రాష్ట్రంలో సమస్యలే లేవన్నంతగా బడ్జెట్‌లో కనికట్టు చేశారు. అన్ని రంగాల్లోనూ రాష్ట్రం శరవేగంగా అభివృద్ది చెందుతోందనే ఊహల్లో తేలియాడేందుకే పరిమితమయ్యారు. అధిక రాబడిని అంచనా వేసి, కంటికింపుగా కేటాయింపులు చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లోనే పలు కోతలు పెట్టిన ప్రభుత్వం, మరో 40 రోజుల్లో ప్రారంభమయ్యే కొత్త బడ్జెట్ ఒక్కసారిగా ఇన్ని అద్భుతాలను ఎలా చేసి చూపుతుందో వారికే తెలియాలంటూ ఆర్థిక నిపుణులు పెదవి విరుస్తున్నారు. ఇంత భారీ ఆదాయాన్ని ఎక్కడి నుంచి, ఎలా రాబడతారన్న ప్రశ్నకు బడ్జెట్‌లో బదులే లేదు! పైకి చెప్పకపోయినా, పన్నుల రూపేణా రూ.13 వేల కోట్ల దాకా రానున్న రోజుల్లో ప్రజల నడ్డి విరవడం ఖాయమని కొత్త బడ్జెట్ స్పష్టంగానే చెబుతోందని ఆర్థిక నిపుణులంటున్నారు. ఏతావాతా తొమ్మిదేళ్ల చంద్రబాబు పాలనను కిరణ్ సర్కారు మరోసారి గుర్తుకు తెస్తోంది. అప్పులపై ఆధారపడే పరిస్థితికి చేరుకుంది. ఈ ఏడాది అప్పులు రాష్ట్ర బడ్జెట్‌ను కూడా మించి రూ.1.6 లక్షల కోట్లకు చేరిన వైనంపై ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కోతలూ భారీగానే..

పేరుకు ఘనంగా కేటాయింపులు చేస్తున్నా, ఏడాది ఆఖరుకు వచ్చేసరికి మాత్రం శాఖలవారీగా భారీగా కోతలు పెట్టడం పరిపాటైంది. ఇది విస్మయం కలిగించే అంశమని ఆర్థిక నిపుణులు అంటున్నారు. 2009-10 బడ్జెట్‌కు రూ.18,378 కోట్లు కోత పడగా, 2010-11లోనూ రూ.12,800 కోట్ల మేర కోత తప్పలేదని తేలింది. భారీ బడ్జెట్లు పేరు గొప్ప ప్రహసనమేనని ఈ గణాంకాలు చెప్పకనే చెబుతున్నాయి. ఎటూ లక్ష కోట్లు దాటింది కదాని ప్రజలకు లేనిపోని భ్రమలు కల్పించేందుకే ఏటేటా బడ్జెట్ పరిమాణాన్ని పెంచుతూ పోతున్న వైనమూ స్పష్టమవుతోంది. రాష్ట్రం శరవేగంగా పురోగమిస్తోందని, రాబడి బాగా పెరుగుతోందని పైకి చెబుతున్న ప్రభుత్వం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర రాబడుల ఆదాయంలో రూ.3 వేల కోట్లను తక్కువగా సవరించి చూపింది! పురోగతి నిజంగానే శరవేగంగా ఉంటే ఇలా ఎందుకు తగ్గించి చూపించారో ఆర్థిక మంత్రికే తెలియాలి! పలు రంగాలకు కేటాయించిన నిధులను ఖర్చు చేయకపోగా, మరికొన్ని రంగాలకు చెల్లించాల్సిన బకాయిలను కూడా ప్రభుత్వం నిలుపుదల చేసింది. అనేక శాఖలకు మూడో త్రైమాసికం బకాయిల్లో కొన్నింటిని, నాలుగో త్రైమాసికంలో అన్నింటినీ ఆపేసింది! బిల్లులేవీ చెల్లుబాటు కాకుండా ట్రెజరీ కార్యాలయాలకు ఆంక్షలు పెట్టింది. పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా సాగునీటి ప్రాజెక్టులను నిర్మించకపోతే భావి తరాలు క్షమించవని భావించి బృహత్తర జలయజ్ఞం ప్రాజెక్టు చేపట్టిన వైఎస్, 2009-10 బడ్జెట్‌లో దానికి రూ.17 వేల కోట్లు కేటాయిస్తే... తరవాతి రెండేళ్లలో దానికి ప్రాధాన్యతను అమాంతంగా తగ్గించారు. రూ.15 వేల కోట్లకు పరిమితం చేశారు. అందులో కూడా ఏడాది పూర్తయ్యేటప్పటికి కనాకష్టంగా సగం మాత్రమే ఖర్చు చేస్తున్నారు. ఈ లెక్కన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయ్యేదెన్నడో? 

రీయింబర్స్‌మెంట్ నిధులు బకాయిలకే సరి...

విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిల చెల్లింపులదీ అదే పరిస్థితి! ఏటికేడాదీ కేటాయింపులను తగ్గిస్తూ, విద్యా సంస్థలకు ఒక ఏడాది ఆలస్యంగా చెల్లింపులు చేస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరానికి రూ.4,100 కోట్లు అవసరమైతే బడ్జెట్‌లో రూ.3,600 కోట్లు కేటాయించారు. ఇదంతా ప్రస్తుత విద్యా సంవత్సరంలో చెల్లించాల్సిన బకాయిలకే సరిపోతుంది. పథకాన్ని నీరుగార్చేందుకే ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సబ్సిడీ బియ్యం ధరను కిలో రూ.1కి తగ్గిస్తే చాలదని.. పప్పులు, నూనెలు, కూరగాయల వంటి నిత్యావసరాల ధరలనూ తగ్గించాలని ప్రభుత్వ పెద్దలపై ప్రజలు ఏకంగా బహిరంగ సభల్లోనే తిరగబడ్డారు. బ్లాక్ మార్కెటింగ్, ప్రభుత్వ పర్యవేక్షణ లేమే ధరల సమస్యకు కారణమవుతోందని గుర్తించినా ప్రభుత్వం పరిష్కారాలు చూపడంలేదు. బహిరంగ మార్కెట్‌లో ధరల పెరుగుదల నియంత్రణకు త్వరలోనే ‘ప్రజా మాల్స్’ పేరిట భారీ దుకాణ సముదాయాలు నెలకొల్పుతామన్న పౌర సరఫరాల మంత్రి శ్రీధర్‌బాబు ప్రకటనలు బడ్జెట్‌లో ప్రస్తావనకే నోచుకోలేదు.

కష్టాలు యథాతథం..లెక్కల్లోనే ‘ఆనం’దం

వచ్చే ఏడాది.. అంటే 2012-13 విద్యాసంవత్సరానికిగాను ఫీజు రీయిం బర్స్‌మెంట్ పథకానికి రూ.7,600 కోట్లు (బకాయిలు, అవసరాలు కలుపుకొని) కావాలి. కానీ బడ్జెట్‌లో ఈ పథకానికి కేటాయించింది కేవలం రూ.3,620 కోట్లు. అంటే కావాల్సిన బడ్జెట్‌లో సగం నిధులు కూడా ఇవ్వలేదన్నమాట! ఇప్పుడిచ్చిన డబ్బులన్నీ బకాయిలకే పోతే.. మరి వచ్చే ఏడాది పథకం నడిచేదెట్టా? ప్రతిఏటా పథకానికి కేటాయిస్తున్న నిధులు అంతకుముందు ఏడాది బకాయిలకే సరిపోతే చదువులు సాగేదెట్టా? 2012-13కిగాను ఈబీసీ విద్యార్థులను కేవలం ట్యూషన్ ఫీజులకే పరిమితం చేశారు. స్కాలర్‌షిప్‌ల కింద వారికి ఒక్క పైసా కూడా కేటాయించలేదు. 


ధరల దరువుకు కళ్లెమేదీ..?
నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశంలో చేరి సామాన్యులు విలవిల్లాడుతున్నారు. ఏ వస్తువు ధర చూసినా రెండేళ్లలో 75 నుంచి వంద శాతం పెరిగాయి. రూపాయికే కిలో బియ్యం ఇస్తున్నామని ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్నా... అవి తినేందుకు ఏ మాత్రం పనికిరావ డం లేదు. ధరల నియంత్రణకు ఆర్థిక మంత్రి తన ప్రసంగంలో ఎలాంటి పరిష్కారం చూపలేదు.


ప్రాజెక్టులు కదిలేదెలా..? 

నీటి ప్రాజెక్టులు నిర్మించకపోతే భవిష్యత్ తరాలు క్షమించవంటూ అత్యంత సాహసోపేతంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన ప్రాజెక్టులకు అత్తెసరు ప్రాధాన్యం ఇచ్చారు. 2011-12 ఆర్థిక సంవత్సరంలో రూ.15,010 కోట్లు కేటాయిస్తే ఈ సారి కేవలం రూ.3 కోట్లు మాత్రమే పెంచి రూ.15013 కోట్లు చేశారు. ఈ లెక్కన ప్రాజెక్టుల నిర్మాణం ఎప్పటికి పూర్తవుతుందో మరి! వైఎస్సార్ అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టుల నిర్మాణం కోసం ఏటా 10 నుంచి 15 శాతం బడ్జెట్ పెంచితే కిరణ్ సర్కార్ కేవలం రూ.3 కోట్లు పెంచి చేతులు దులుపుకుంది!

గతుకుల ప్రయాణమే..!

పట్టణం, పల్లె తేడా లేకుండా రాష్ట్రంలో రహదారుల పరిస్థితి దారుణంగా ఉంది. అయినా ఆర్థిక మంత్రి తన ప్రసంగంలో పరిష్కారం చూపలేదు. ఆర్ అండ్ బీ లెక్కల ప్రకారమే 6,500 కిలోమీటర్ల రహదారులు గతుకులమయమయ్యాయి. 2,500 కి.మీ. రహదారులు దెబ్బతిన్నాయి. వాటి మరమ్మతులకు ఇప్పటికిప్పుడు రూ.6 వేల కోట్లు కావాలి. కానీ బడ్జెట్‌లో కేవలం రూ.3,210 కోట్లు కేటాయించి మమ అనిపించారు.

సర్కారుకు పట్టని నేతన్న గోడు

గతేడాది నుంచి ఇప్పటిదాకా 80 మంది నేత కార్మికులు బలవన్మరణాలకు పాల్పడినా ప్రభుత్వానికి చీమకుట్టినట్టయినా లేదు. దివంగత నేత వైఎస్ ప్రకటించిన రుణ మాఫీ పథకం నేటికి అమలు కాలేదు. నాడు వైఎస్సార్ రూ.312 కోట్లు రుణ మాఫీ ప్రకటిస్తే ఈ ప్రభుత్వం ఇప్పటిదాకా ఖర్చు చేసింది కేవలం రూ.109 కోట్లు. ఆదుకుంటామంటూ ఆశలు చూపించడమే తప్ప ఆచరణలో వారిని ఆదుకునే ప్రయత్నమే చేయలేదు.

ముందుంది కోతల కాలమే..

రాష్ట్ర చ రిత్రలో ఎన్నడూ లేని విధంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కరెంటు కోతలు అమలు చేస్తున్నారు. ఇక పరిశ్రమలకు విద్యుత్ సరఫరాలో అన్నీ ఆంక్షలే. చార్జీల రూపంలో ఒకవైపు, సర్దుబాటు చార్జీల రూపంలో మరోవైపు జనంపై సుమారు రూ.10 వేల కోట్ల భారం మోపిన ప్రభుత్వం.. విద్యుత్ రంగానికి మొక్కుబడిగా నిధులు కేటాయించింది.

అన్నదాతపై చిన్నచూపు..

ఎన్నడూ లేని విధంగా అన్నదాతలు క్రాప్ హాలిడే ప్రకటించిన ఘనత ఈ ప్రభుత్వానికే దక్కుతుంది. గిట్టుబాటు ధర లేక వ్యవసాయం మానేసిన రైతన్నలకు ధైర్యం చెప్పే యత్నం చేయలేదు. వారిని ఆదుకుని, గిట్టుబాటు ధరలు కల్పిస్తామనే హామీకి కూడా బడ్జెట్‌లో చోటు దక్కలేదు.

రాష్ట్ర బడ్జెట్ 2012 - 2013

వివిధ అంశాలపై ప్రముఖుల సూక్తులను ప్రస్తావిస్తూ ఆనం బడ్జెట్ ప్రసంగం సాగింది...
వ్యవసాయంపై..: నేలను సాగుచేయటం ఆరంభమైన తర్వాతే ఇతర కళలు అనుసరించి వచ్చాయి. కాబట్టి రైతులు మానవ నాగరికతకు ఆద్యులు -డేనియల్ వెబ్‌స్టర్ 
మహిళల సంఘటిత శక్తి సందర్భంలో..: వ్యక్తికి బహువచనం శక్తి -శ్రీశ్రీ 
పాఠశాల విద్యపై..: విద్య అనేది సంపత్తిలో ఆభర ణంగానూ, ప్రతికూల స్థితిలో అండగానూ ఉండగలదు -అరిస్టాటిల్
సాంకేతిక విద్య సందర్భంలో..: శ్రమ రూపం దాల్చనట్టి జ్ఞానమంతయు వృథా -కాళోజీ నారాయణరావు

హైదరాబాద్, న్యూస్‌లైన్: అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టటానికి వీలుగా రాబోయే ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్ రూపకల్పన చేసినట్లు ఆర్థికమంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రం శక్తివంతమైన ఎదుగుదల దిశగా పయనిస్తోందన్నారు. 2012-13 ఆర్థిక సంవత్సరానికిగాను రూ. 1,45,854 కోట్ల భారీ బడ్జెట్ అంచనాలను ఆనం శుక్రవారం మధ్యాహ్నం శాసనసభలో ప్రవేశపెట్టారు. ఇందులో ప్రణాళిక పద్దు కింద రూ. 54,030 కోట్లు (అందులో 5,080 కోట్లు కేంద్ర సాయం), ప్రణాళికేతర పద్దు కింద రూ. 91,824 కోట్లు వ్యయం చేయనున్నట్లు పేర్కొన్నారు. ద్రవ్యలోటు రూ. 20,008 కోట్లు ఉంటుందని తెలిపారు. ప్రస్తుత (2011-12) ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ మిగులు రూ. 3,856 కోట్లుగా ఉంటుందని భావించినా.. సవరించిన అంచనాల ప్రకారం గణనీయంగా తగ్గి రూ. 780 కోట్లుగా ఉంటుందన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదాయం పెరుగుదల 19.5 శాతం ఉందని మంత్రి ఆనం తెలిపారు. 

పన్ను సామర్థ్యాన్ని మెరుగుపరచటం, పన్నుల వసూళ్లలో లొసుగులను అధిగమించటం, కొన్ని పన్నులను విధించటం వల్ల ఆదాయ వనరులను అనుకున్న మేరకు రాబట్టుకోలగమని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. దేశీయ ఆర్థిక వృద్ధి రేటు 8.64 శాతం ఉంటే.. 2005-06 నుంచి 20011-12 మధ్య కాలంలో మన రాష్ట్ర సగటు ఆర్థిక వృద్ధి రేటు 9.26%గా ఉందని చెప్పారు. ప్రస్తుత సంవత్సరంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ప్రతికూల వాతావరణాన్ని ఎదుర్కొందన్నారు. గత సంవత్సరంలో ఖరీఫ్‌లో తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు, ఉద్యమాలు సుదీర్ఘకాలం కొనసాగటం వల్ల.. ఆ పరిణామాలు సాధారణ ఆర్థిక పని తీరును దెబ్బతీశాయన్నారు. ఫలితంగా.. జాతీయ స్థూల ఉత్పత్తితో పోలిస్తే రాష్ట్ర వార్షిక స్థూల ఉత్పత్తి తగ్గిందన్నారు. రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులను ఎదుర్కోటానికి రూ. 3,006 కోట్ల సాయం అందించాలని కేంద్రాన్ని కోరినట్లు చెప్పారు.

ఆర్థికమంత్రి బడ్జెట్ ప్రసంగం ముఖ్యాంశాలివీ..

వివిధ శాఖల కింద యువకిరణాలకు 777 కోట్లు కేటాయించాం. ఇప్పటి వరకు లక్ష ఉద్యోగాలు కల్పించాం. 
రైతులకు, స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాల కోసం 1,075 కోట్లు. 
ఇందిరా జలప్రభ కింద 10 లక్షల ఎకరాల బీడు భూములను సాగుయోగ్యం చేస్తాం. 
రచ్చబండలో ఇప్పటికే 50 లక్షల మందికి రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ, పింఛన్లు, గృహస్థలాలు ఇచ్చాం. 
ప్రస్తుత ఏడాదిలో ఆహార ధాన్యాలు 14.82 శాతం, నూనె గింజలు 36.09 శాతం దిగుబడి తగ్గుతాయని అంచనా. 
మహిళా సంఘాలకు రుణాలు పెంచటానికి స్త్రీనిధి. 

జలయజ్ఞానికి గత సంవత్సరం కేటాయించిన మొత్తాన్నే ఈసారి కేటాయించాం. 
గృహ నిర్మాణానికి రూ.2,300 కోట్లు కేటాయించాం. అందులో 400 కోట్లు రుణాల చెల్లింపునకు. 
విద్యుత్ రంగానికి రూ.5,937 కోట్లు కేటాయించాం. 
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక ఇండోర్, ఔట్‌డోర్ స్టేడియం నిర్మాణానికి రూ.220 కోట్లు కేటాయించాం. 
108, ఆరోగ్యశ్రీ మెరుగుపరుస్తున్నాం. ఉద్యోగులకు ఆరోగ్యశ్రీ అమలు చేస్తాం. 
ఇకపై ఆర్థిక కార్యకలాపాలన్నీ అందరూ చూడటానికి వీలుగా ఆన్‌లైన్‌లో కొనసాగిస్తాం. ఈసారి బడ్జెట్ ప్రతిపాదనలన్నీ ఆన్‌లైన్‌లోనే తెప్పించుకున్నాం. కాగిత రహితంగా బడ్జెట్ కసరత్తు సాగింది. 

మండలిలో శ్రీధర్‌బాబు బడ్జెట్ ప్రసంగం

శాసన మండలిలో బడ్జెట్‌ను పౌర సరఫరాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రవేశపెట్టారు. తెలుగు ప్రసంగం చదవడంలో ఆయన ఇబ్బందులు పడ్డారు. అనేక తప్పులు దొర్లాయి. తెలంగాణ వైతాళికుడైన కాళోజీ నారాయణరావు సూక్తిని కూడా ఆయన సరిగా చదవలేకపోయారు.‘శ్రమరూపం దాల్చనట్టి జ్ఞానమంతయు వృథా’ అన్న కాళోజీ మాటను శ్రీధర్‌బాబు పూర్తిగా తప్పుడు అర్థం దొర్లేలా ‘శ్రమరూపం దాల్చినట్టి జ్ఞానమంతయు వృథా’ అని చదవడంతో సభ్యులంతా నవ్వుకున్నారు. ప్రసంగ ప్రతిలోని పదాలను ఉన్నదున్నట్లుగా చదవలేకపోయారు. కీలక అని ఉన్న ప్రతిచోటా కీలిక అని, ఆకాంక్షలకు బదులు ఆంక్షలు, కౌమార అని ఉంటే కౌమూర, పథకం ఉన్నచోట్ల ప్రథకం, నిష్పత్తికి బదులు నిష్పతి... ఇలా చదివారు.

అస్వస్థతకు గురైన ఆనం - కొంతసేపు ప్రసంగం చదివిన పొన్నాల

మంత్రి ఆనం తన ప్రసంగంలో విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లింపుల గురించి వివరిస్తున్నప్పుడు అస్వస్థతకు గురయ్యారు. నిద్ర లేకపోవటం, శరీరంలో చక్కెర స్థాయి (షుగర్ లెవల్స్) తగ్గిపోవటంతో.. ఆయనకు కళ్లు తిరిగి, విపరీతంగా చెమటలు పట్టాయి. దీంతో ప్రసంగాన్ని మధ్యలోనే ఆపి తన సీట్లో కూర్చుండిపోయారు. కూర్చోవటానికి ముందు ఆయన ‘బడ్జెట్ ప్రసంగం ఆపి కూర్చోవచ్చా?’ అని ఉప ముఖ్యమంత్రిని, స్పీకర్‌ను, ముఖ్యమంత్రిని అడిగారు. ఆనం బడ్జెట్ ప్రసంగాన్ని ఆపటంతో.. సీఎం జోక్యం చేసుకుని పొన్నాల లక్ష్మయ్యను ప్రసంగం చదవాల్సిందిగా కోరారు. ఈ సమయంలో లోక్‌సత్తా పార్టీ సభ్యుడు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్ వచ్చి.. ఆనం చేయి పట్టుకుని నాడి చూశారు. ఆ వెంటనే సీఎం వద్దకు వెళ్లి ఏదో చెప్పారు. ఆ తరువాత భారీ పరిశ్రమల మంత్రి డాక్టర్ గీతారెడ్డి వచ్చి పరిశీలించారు. ఆయనకు నిమ్మకాయ నీళ్లతోపాటు, మంచినీళ్లు తెప్పించారు. అసెంబ్లీలోని డాక్టర్లు, అధికారులు కూర్చున్న గదిలోకి వచ్చి బీపీ మిషన్ తీసుకొచ్చి పరిశీలించాలని ప్రయత్నించారు. కానీ ఆనం బయటకు వెళ్లి చెక్ చేయించుకోకుండా తన స్థానంలోనే 15 నిమిషాలపాటు అలాగే కూర్చుండిపోయారు. తేరుకున్న తరువాత ఆయన పొన్నాల లక్ష్మయ్యను ఆపించి మళ్లీ బడ్జెట్ ప్రసంగాన్ని కొనసాగించారు.







ప్రజా సంక్షేమాన్ని విస్మరించారు:
హైదరాబాద్, న్యూస్‌లైన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజా సంక్షేమాన్ని, ప్రాధాన్యత రంగాలను పూర్తిగా విస్మరించిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అసంతృప్తిని వ్యక్తం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి వైఎస్ నాయకత్వంలో ఇచ్చిన హామీలను కిరణ్ ప్రభుత్వం తుంగలో తొక్కిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమన్వయకర్త కొణతాల రామకృష్ణ దుయ్యబట్టారు. లక్షా యాభై వేల కోట్ల బడ్జెట్ అని గొప్పగా చెప్పుకోవడానికి తప్పితే పేదలకు కించిత్ లాభంలేదని ధ్వజమెత్తారు. ఇద్దరు మంత్రులు చదివి వినిపించడం తప్ప ఈ బడ్జెట్‌లో కొత్తదనమేదీ లేదని ఎద్దేవా చేశారు. పార్టీ నేతలు హెచ్.ఎ.రెహమాన్, గట్టు రామచంద్రరావులతో కలిసి పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 

‘‘బడ్జెట్‌లో వ్యవసాయం, సాగు నీరు, విద్య, వైద్యం సహా అన్ని రంగాలకు నిరాశే మిగిలింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 9 గంటల ఉచిత విద్యుత్తు ఇస్తామన్న హామీని బడ్జెట్‌లో ప్రస్తావించకపోవడం దురదృష్టకరం. పేదలకిచ్చే సబ్సిడీ బియ్యం 20 నుంచి 30 కేజీల పెంపు విషయాన్ని కూడా ప్రస్తావించలేదు’’ అని కొణతాల చెప్పారు. ‘‘గతంలో ఎన్నడూ లేనివిధంగా నవంబర్-డిసెంబర్ నెలల్లో విద్యుత్తు కోత విధించిన ఘనత సీఎం కిరణ్‌కే దక్కుతుంది. రైతులు పండించే ధాన్యానికి కేంద్రం మద్దతు ధర ఇవ్వకపోయినా, రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి అందిస్తామని కిరణ్‌తోపాటు పీసీసీ చీఫ్ బొత్స గొప్పగా ప్రకటించారు. 

కానీ వాటిని బడ్జెట్‌లో మాటమాత్రంగా కూడా చెప్పలేకపోయారు. రైతుల నడ్డి విరిచే విధంగా ఎరువుల ధరలు విపరీతంగా పెంచారు. రైతుకు ఊరటనిచ్చే అంశాలను ఒక్కటీ చేర్చలేకపోయారు. కౌలు రైతులకు పావలా వడ్డీకే రుణాలని చెప్పారు. వాస్తవ పరిస్థితి చూస్తే వారికి ఇప్పటిదాకా గుర్తింపు కార్డులు ఇవ్వలేకపోయారు. ఖజానా నింపుకోవడానికి మాత్రం అడ్డగోలుగా పన్నులు పెంచారు’’ అని దుయ్యబట్టారు. ‘‘వైఎస్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని పూర్తిగా ఎత్తేసే కుట్రలో భాగంగా ఈ పథకానికి సరిపడా నిధులు కేటాయించడంలేదు. దీనివల్ల విద్యార్థుల చదువులు గాల్లో దీపంలా తయారయ్యాయి. ఈ పథకానికి దాదాపు రూ.8 వేల కోట్లు అవసరమవగా కేవలం రూ.4 వేల కోట్లే కేటాయించి ప్రభుత్వం చేతులు దులుపుకొంది. పేదల పాలిట అపర సంజీవనిగా పేరొందిన ఆరోగ్యశ్రీని కూడా పూర్తిగా విస్మరించారు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘మంత్రులు, ఎమ్మెల్యేల జీతాలు మూడు, నాలుగు రెట్లు పెంచిన కిరణ్ ప్రభుత్వం, పేదలకిచ్చే పెన్షన్‌ను పెంచాలనే ఆలోచన చేయకపోవడం దురదృష్టకరం. పేదలకిచ్చే పెన్షన్ చంద్రబాబు హయాంలో నెలకు రూ.75 ఉండగా, వైఎస్ దానిని రూ.200కు పెంచారు. ఈ ప్రభుత్వం పెన్షన్‌ను కనీసం యాభై నుంచి వంద రూపాయలకు పెంచే ఆలోచన చేయలేదు. వాళ్ల జీతాలు మాత్రం విపరీతంగా పెంచేసుకున్నారు. సీఎం కిరణ్ ఆయన విచక్షణ పరిధి కింద రూ.600 కోట్లు పెంచుకోవడం సిగ్గుచేటు. దీనివల్ల పేదలకు ఏమైనా ఉపయోగం ఉంటుందా?’’ అని నిలదీశారు.

మైనారిటీలను విస్మరించిన బడ్జెట్: రెహమాన్

రాష్ట్ర బడ్జెట్‌లో ముస్లిం మైనారిటీలకు తీవ్ర అన్యాయం జరిగిందని వైఎస్సార్ కాంగ్రెస్ రాష్ట్ర ముస్లిం మైనారిటీ సెల్ కన్వీనర్ హెచ్.ఎ.రెహమాన్ దుయ్యబట్టారు. మహా నేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి లేని లోటు ముస్లింలకు స్పష్టంగా కనిపిస్తోందన్నారు. వైఎస్ ఉండి ఉంటే ముస్లిం సంక్షేమానికి బడ్జెట్‌లో వెయ్యి కోట్లు కేటాయించేవారన్నారు. రాష్ట్ర జనాభాలో 18 శాతం ఉన్న జనాభాకు కేవలం 0.1 శాతం నిధులు కేటాయించడం ఏ విధంగా సమర్థనీయమని ప్రశ్నించారు. కిరణ్ ప్రభుత్వం మైనారిటీ శాఖకు ఏదో కొంత విదిల్చి తామెంతో చేశామని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు.

ఫీజుల పథకానికి తూట్లు: పుత్తా

Written By ysrcongress on Friday, February 17, 2012 | 2/17/2012

రాష్ట్ర బడ్జెట్ కేటాయింపుల్లో ముస్లిం మైనారిటీలకు తీవ్ర అన్యాయం జరిగిందని వైఎస్సార్ కాంగ్రెస్ రాష్ట్ర ముస్లిం మైనారిటీ సెల్ కన్వీనర్ హెచ్.ఎ.రెహమాన్ దుయ్యబట్టారు. మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి లోటు ముస్లింలకు స్పష్టంగా కనిపిస్తుందన్నారు. వైఎస్ ఉండి ఉంటే ముస్లిం సంక్షేమానికి బడ్జెట్‌లో వెయ్యి కోట్లు కోట్లు కేటాయించేవారన్నారు. కిరణ్ ప్రభుత్వం మైనారిటీ శాఖకు ఏదో కొంత విదిల్చి తామెంతో చేశామని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. రాష్ట్ర జనాభాలో 18 శాతం ఉన్న జనాభాకు కేవలం 0.1శాతం నిధుల కేటాయించడం ఏ విధంగా సమర్థనీయమని రెహమాన్ నిలదీశారు.

పేద విద్యార్థుల ఉన్నత చదువుల కోసం దివంగత సీఎం వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ఎత్తేసేందుకు కిరణ్ ప్రభుత్వం కుట్రచేస్తుందని వైఎస్సార్ కాంగ్రెస్ యువజన విభాగ అధ్యక్షుడు పుత్తాప్రతాప్‌రెడ్డి దుయ్యబట్టారు. రీయింబర్స్‌మెంట్ పథకానికి ’8వేల కోట్లు అవసరమవగా కేవలం ’3,600 కోట్లు మాత్రమే కేటాయించి పథకానికి తూట్లు పొడుస్తున్నారని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పేద విద్యార్థులను ఉన్నత చదువులకు దూరం చేసేందుకు సీఎం కిరణ్ కుట్ర చేస్తున్నారని విమర్శించారు. అదే విధంగా ‘యువకిరణాలు’ పేరుతో రాష్ట్ర యువతను మోసం చేస్తున్నారన్నారు. డిసెంబర్ నెలలోనే లక్ష ఉద్యోగాలని చెప్పిన సీఎం ఇప్పటిదాకా ఒక్కటీ ఇవ్వలేకపోయారన్నారు. యువకిరణాలపై నమ్మకం లేకనే ప్రధాని మన్మోహన్‌సింగ్ కూడా రాష్ట్ర పర్యటనను రద్దు చేసుకున్నారని, రాష్ట్రానికి ఇంతకన్న అవమానం మరోకటి ఉండదన్నారు. మళ్లీ అదే మాదిరిగా మూడేళ్లలో 15 లక్షల ఉద్యోగాలంటూ ఎవర్ని మోసం చేయాలనుకుంటున్నారని పుత్తా నిలదీశారు.

Konathala Ramakrishna Reaction on Budget 2012-13

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ ప్రజాసంక్షేమాన్ని, ప్రాధాన్యత రంగాలాను పూర్తిగా విస్మరించిందని వైఎస్సార్ కాంగ్రెస్ పూర్తి అసంతప్తిని వ్యక్తం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి వైఎస్ నాయకత్వంలో ఇచ్చిన హామీలను కిరణ్ ప్రభుత్వం తుంగలో తొక్కిందని వైఎస్సార్ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమన్వయకర్త కొణతాల రామకష్ణ దుయ్యబట్టారు. పేరుకు లక్షాయాభైవేల బడ్జెట్ అని గొప్పగా చెప్పుకోవడానికి తప్పితే పేదలకు కించితే లాభంలేదని ధ్వజమెత్తారు. 2012-13 బడ్జెట్‌లో ఉన్న కొత్తదనమల్లా ఇద్దరు మంత్రులు చదివి వినిపించడం తప్పితే మరేమి లేదని ఎద్దేవా చేశారు. పార్టీ రాష్ట్ర మైనారిటీ సెల్ కన్వీనర్ హెచ్.ఎ.రహమాన్, బీసీ సెల్ కన్వీనర్ గట్టు రామచంద్రరావులతో కలిసి పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బడ్జెట్‌లో వ్యవసాయం, సాగునీరు, విద్య, వైద్యంలతో అన్ని రంగాలకు నిరాశే మిగిలిందన్నారు. ‘‘కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 9గంటల ఉచిత విద్యుత్ హామీని కనీసం బడ్జెట్‌లో ప్రస్తావించకపోవడం దురదష్టకరం. అంతేకాదు గతంలో ఎన్నడూ లేనివిధంగా నవంబర్-డిసెంబర్ నెలల్లో విద్యుత్ కోత విధించిన ఘనత సీఎం కిరణ్‌కే దక్కుతుంది.

పేదలకిచ్చే సబ్సిడీ బియ్యం 20 నుంచి 30 కేజీల పెంపు విషయాన్ని కూడా ప్రస్తావించలేదు. రైతులు పండించే ధాన్యానికి మద్దతు ధర కేంద్ర ఇవ్వకపోయినా రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నుంచి అందిస్తామని సీఎం కిరణ్‌తోపాటు పీసీసీ చీఫ్ బొత్స గొప్పగా ప్రకటించారు. కానీ వాటిని కూడా బడ్జెట్‌లో మాటమాత్రం చెప్పలేకపోయారు. రైతుల నడ్డివిరిచే విధంగా ఎరువుల ధరలు విపరీతంగా పెంచి ఊరటనిచ్చే అంశాలను ఒక్కటి చేర్చలేకపోయారు. కౌలు రైతులకు పావలా వడ్డీకే రుణాలని చెప్పారు. కానీ వాస్తవ పరిస్థితి చూస్తే వారికి ఇప్పటిదాకా గుర్తింపు కార్డులు ఇవ్వలేకపోయారు. ఖజానా నింపుకోవడానికి మాత్రం అడ్డగోలుగా పన్నులు పెంచారు’’ అని కొణతాల దుయ్యబట్టారు. విద్యార్థుల చదువులు గాల్లో దీపంలా తయారయ్యాయని అభిప్రాయపడ్డారు. వైఎస్ ప్రవేశపెట్టిన ఫీజురీయింబర్స్‌మెంట్ పథకాన్ని పూర్తిగా ఎత్తేసే కుట్రలో భాగంగా సరిపడా నిధులు కేటాయించడంలేదన్నారు. ఈ పథకానికి దాదాపు 8వేల కోట్లు అవసరమవగా కేవలం నాలుగువేల కోట్లే కేటాయించి ప్రభుత్వం చేతులు దులుపుకుందన్నారు. పేదల పాలిట అపర సంజీవని పేరొందిన ఆరోగ్యశ్రీని కూడా పూర్తిగా విస్మరించారని దుయ్యబట్టారు.

పేదలకిచ్చే పెన్షన్ పట్టదా?

మంత్రులు, ఎమ్మెల్యేల జీతాలు మూడు, నాలుగు రెట్లు పెంచిన కిరణ్ ప్రభుత్వానికి పేదలకిచ్చే నెలనెల పెన్షన్‌ను పెంచాలనే ఆలోచన చేయకపోవడం దురదష్టకరమన్నారు. ‘‘పేదలకిచ్చే పెన్షన్ చంద్రబాబు హయాంలో ఉన్న ’75ను వైఎస్ ’200లకు పెంచారు. వాటిని కనీసం యాభై నుంచి వంద రూపాయలకు పెంచే ఆలోచన చేయలేదు. వీళ్ల జీతాలు మాత్రం విపరీతంగా పెంచేసుకున్నారు. సీఎం కిరణ్ మాత్రం తన విచక్షణ పరిధి కింద ’ 600 కోట్లు పెంచుకోవడం సిగ్గుచేటు. దీని వల్ల పేదలకు ఏమైనా ఉపయోగం ఉంటుందా?’’ అని విమర్శించారు.

మంత్రి ఆనంకే కళ్లు తిరిగాయి

అంకెల గారడితో కూడిన రాష్ట్ర బడ్జెట్‌ను చూసి ఆర్థికమంత్రి ఆనం రాంనారాయణరెడ్డికే కళ్లు తిరిగాయని వైఎస్సార్ అభిమాన ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి ఎద్దేవా చేశారు. లక్షాయాభై వేల కోట్ల బడ్జెట్‌ను చూసిన మంత్రికి వాస్తవమో, అవాస్తవమో నిర్దారించుకోలేక కళ్లు బైర్లుకమ్మాయన్నారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. వైఎస్ ప్రభుత్వం లక్షకోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టినందున అంతకంటే ఎక్కువ పెట్టాలనే దురాలోచనతోనే కిరణ్ ప్రభుత్వం చేస్తుంది తప్పితే వారికి చిత్తశుద్దిలేదని విమర్శించారు. బడ్జెట్ అంత పేపర్ మీద అంకెలగారడీ తప్ప వాస్తవానికి పూర్తి విరుద్దంగా ఉందన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు చెల్లించకపోవడం వల్ల విద్యార్థుల చదువులు అర్దాంతరంగా ఆగిపోయే పరిస్థితి తలెత్తిందన్నారు. ఈ పథకానికి 8వేల కోట్లు అవసరమవగా కేవలం ’3,600 కోట్లే కేటాయించిందన్నారు. అపరసంజీవనిగా పేరొందిన ఆరోగ్యశ్రీని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ మరణానంతరం పేదలకు ఒక్క రేషన్ కార్డు మంజూరు చేయలేకపోయారని విమర్శించారు. పన్నులతో ప్రజల నడ్డివిరిచిన కిరణ్ ప్రభుత్వం ప్రజాసంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిదని అమరనాథరెడ్డి దుయ్యబట్టారు.



 

 

Gattu RamaChandraiah Reaction on Budget 2012-13

రాష్ట్ర బడ్జెట్ రూ.1,45, 854 కోట్లు

ఆర్థికమంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి 1,45,854 కోట్లతో 2012-13 సంవత్సరపు వార్షిక బడ్జెట్ ను శుక్రవారం రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టారు. ద్రవ్యలోటును రూ. 20,008 కోట్లుగా, రెవెన్యూ మిగులును రూ. 4,444 కోట్ల అంచనాగా చూపించారు. జాతీయ సగటు కన్నా రాష్ట్ర వృద్ధిరేటు అధికంగా ఉందని ఆర్థికమంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. 2005-11లో రాష్ట్ర వృద్ధిరేటు 9.26 శాతంగా నమోదు అయిందని, దేశ వృద్ధిరేటు 8.5గా మాత్రమేనని ఆయన పేర్కొన్నారు.

ప్రణాళికేతర వ్యయం : రూ.91,824 కోట్లు
ప్రణాళిక వ్యయం : రూ. 54,030 కోట్లు

2012-13 సంవత్సరపు వార్షిక బడ్జెట్ ముఖ్య అంశాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
వ్యవసాయ రుణాలు రూ.51020 కోట్లు
హోంశాఖ రూ. 4832 కోట్లు
రాజీవ్ యువకిరణాలు రూ. 777 కోట్లు
మత్స్యకారుల భీమాకు రూ. 234 కోట్లు
ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీకి రూ. 151 కోట్లు
గ్రామీణాభివృద్ధికి రూ. 4703 కోట్లు
వ్యవసాయం రూ.2572 కోట్లు
ఇంధనం, విద్యుత్ శాఖ రూ. 5937 కోట్లు
గ్రామీణ ఉపాథి కల్పన రూ.188 కోట్లు
పాల కమిషన్ రూ. 100 కోట్లు
పశువుల వ్యాధి నిరోధకానికి రూ.50 కోట్లు
కార్మిక ఉపాధి శాఖ రూ.500 కోట్లు
రవాణా, రోడ్లు, భవనాలు రూ.5032 కోట్లు
పట్టణాభివృద్ధి రూ.6586 కోట్లు
సాంఘిక సంక్షేమ శాఖ రూ.2677 కోట్లు
సాంకేతిక విద్య రూ.1,087 కోట్లు
పట్టు పరిశ్రమ రూ.188 కోట్లు
గృహ నిర్మాణ శాఖ రూ. 2302 కోట్లు
సాధారణ పరిపాలన శాఖ రూ. 88 కోట్లు
రచ్చబండ కార్యక్రమం రూ.1269 కోట్లు
క్రీడాభివృద్ధి రూ.220 కోట్లు
గిరిజన సంక్షేమం రూ. 1540 కోట్లు
బీసీ సంక్షేమం రూ.3014 కోట్లు
మహిళ సంక్షేమ శాఖ రూ.3014 కోట్లు
వికలాంగుల సంక్షేమం రూ.66కోట్లు
మైనార్టీ సంక్షేమం రూ.489 కోట్లు
ప్రాథమిక విద్య రూ.15510 కోట్లు
సాంకేతి విద్య రూ.1087 కోట్లు
ఉన్నత విద్య రూ. 1841 కోట్లు
నీటి పారుదల రూ.15010 కోట్లు
పరిశ్రమలు రూ.633 కోట్లు
వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమం రూ.5889 కోట్లు
ఆర్టీసీకి రాయితీ రూ.710 కోట్లు
ఒక్కో రైతుకు లక్ష వరకూ వడ్డీలేని రుణం
ఆరు జిల్లాల్లో కళారామాలు ఏర్పాటు
1624 పీహెచ్ సీల సామర్థ్యం పెంచటం.
జిల్లాకో ఇండోర్ స్టేడియం

చిరంజీవి విజిటింగ్ ప్రొఫెసర్

తిరుపతి ఎమ్మెల్యే చిరంజీవి సొంత నియోజకవర్గంలో విజిటింగ్ ప్రొఫెసర్ లావ్యవహరిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించారు. తిరుపతి వాసుల సమస్యలను గాలికొదిలేసిన చిరంజీవి హైదరాబాద్, ఢిల్లీల మధ్య చక్కర్లు కొడుతున్నారని విమర్శించారు. నెల రోజులుగా తిరుపతిలో ప్రజా సమస్యలపై భూమన వార్డు బాట చేపట్టారు. మండుటెండను సైతం లెక్కచేయకుండా వార్డు బాట నిర్వహిస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు.

నేడు 12.10 గంటలకు అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్

* రూ. 54,300 కోట్లతో వార్షిక ప్రణాళిక.. ప్రణాళికేతర వ్యయం 
* రూ. 93,378 కోట్లు.. జలయజ్ఞం, ఇందిరమ్మ ఇళ్లకు పెరగని కేటాయింపులు
* రీయింబర్స్‌మెంట్‌కు రూ. 4 వేల కోట్లు... విద్యుత్ సబ్సిడీకి రూ. 4,100 కోట్లు..
* అసెంబ్లీ నియోజకవర్గాల ఫండ్‌కు రూ. 385 కోట్లు 

హైదరాబాద్, న్యూస్‌లైన్: ఆదాయం పెరిగి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడినా.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్లు లాంటి పథకాలకు, జలయజ్ఞానికి ప్రభుత్వం నిధులు పెంచలేదు. పైగా వైఎస్ సంక్షేమ సూత్రానికి తిలోదకాలిచ్చి కొత్త ప్రాధాన్యతలను తెరపైకి తెచ్చింది. పన్నుల ద్వారా ఆదాయం పెంపుపై దృష్టి సారించిన సర్కారు.. పేదల సంక్షేమానికి కేటాయింపులు పెంచకుండా.. రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా నియోజకవర్గానికో క్రీడా ప్రాంగణం వంటి కార్యక్రమాలు, ఎమ్మెల్యేలను ఆకర్షించడానికి ఉపయోగపడే కేటాయింపులకు ప్రాధాన్యత ఇచ్చింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. 2012-13 ఆర్థిక సంవత్సరానికి సుమారు లక్షన్నర కోట్ల భారీ బడ్జెట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించనుంది. 

రూ. 1,47,378 కోట్ల నుంచి రూ.1,47,678 కోట్ల మధ్య బడ్జెట్‌ను శుక్రవారం మధ్యాహ్నం 12.10 గంటలకు అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సిద్ధమయ్యారు. అదే సమయంలో మంత్రి శ్రీధర్‌బాబు శాసనమండలిలో బడ్జెట్ ప్రవేశపెడ్తారు. 2012-13 ఆర్థిక సంవత్సరానికి.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కన్నా 14 శాతం మేరకు పెంచి రూ.48,630 కోట్లు లేదా రూ.48,900 కోట్లతో రాష్ట్ర వార్షిక ప్రణాళికను రూపొందించారు. దీనికి కేంద్ర ప్రాయోజిత పథకాల కింద వచ్చే రూ.5,400 కోట్లను కలిపి ప్రణాళిక పద్దు కింద మొత్తం రూ.54,030 కోట్లు లేదా రూ.54,300 కోట్లను వ్యయం చేయనున్నట్లు ప్రతిపాదించనున్నారు. 

ప్రణాళికేతర పద్దు కింద (కాంట్రా ఇంట్రెస్ట్, వేజ్ అండ్ మీన్స్‌తో కలిపి) రూ.93,378 కోట్ల వరకు వ్యయం చేయనున్నట్లు ప్రతిపాదించనున్నారు. ద్రవ్యలోటు రూ.20 వేల కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ఇక రాబడిలో.. రాష్ట్ర పన్నుల ఆదాయాన్ని రూ.66 వేల కోట్లకుపైగా ప్రతిపాదించారు. కేంద్ర పన్నుల వాటా నుంచి రూ.26 వేల కోట్లు వస్తాయని అంచనా వేశారు. కేంద్ర పథకాల కింద, గ్రాంట్ల రూపంలో రూ.14 వేల కోట్లు వస్తాయని భావిస్తున్నారు. రాష్ట్ర పన్నేతర ఆదాయం రూ.13 వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా వేశారు. మొత్తం మీద 2012-13 సంవత్సరం ముగిసేనాటికి రూ.3,700 కోట్ల రెవెన్యూ మిగులు తేలుతుందని ఆర్థిక మంత్రి అంచనా వేశారు.

కేటాయింపులు ఇలా..!
భారీ, మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టుల రంగానికి రూ.15 వేల కోట్లనే కేటాయించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కూడా ఈ రంగానికి రూ.15 వేల కోట్లు కేటాయించి, కేవలం రూ.11 వేల కోట్లు విడుదల చేసి నాలుగు వేల కోట్లు కోత పెట్టారు. ఇందిరమ్మ ఇళ్లకు ప్రణాళిక పద్దు కింద కేవలం రూ.1,600 కోట్ల కేటాయింపులతో సరిపుచ్చారు. మరో 700 కోట్లను ప్రణాళికేతర పద్దు కింద రుణాల చెల్లింపునకు కేటాయించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో ఇందిరమ్మ ఇళ్లకు రూ.2,300 కోట్లు కేటాయించినా.. వెయ్యికోట్ల మేరకు కోత విధించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు నాలుగు వేల కోట్లు కేటాయించనున్నారు. ఆరోగ్యశ్రీకి ప్రస్తుతం ఉన్నంత కేటాయింపులనే కొనసాగిస్తారు. కిరణ్ ప్రభుత్వ ప్రాధాన్యతల్లో క్రీడా ప్రాంగణాల నిర్మాణాలు చేరాయి. ప్రస్తుతం క్రీడా రంగం బడ్జెట్ కేవలం రూ.20 కోట్లు ఉండగా...కొత్త బడ్జెట్‌లో ప్రణాళిక పద్దు కింద అదనంగా రూ.200 కోట్లను కేటాయిస్తున్నారు. 

పట్టణ ప్రాంతాల్లో రహదారుల నిర్వహణకు, ఉపాధి హామీ పథకంతో అనుసంధానం చేయడానికి రోడ్లు, భవనాల శాఖకు కొత్తగా రూ.300 కోట్లు కేటాయిస్తున్నారు. రోడ్లు, భవనాల నిధుల కేటాయింపులో పెంపు చూపించే నిమిత్తం పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం కింద రూ.500 కోట్లు కేటాయిస్తున్నారు. అయితే ఈ కేటాయింపులు కాగితాలకే పరిమితం కానున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్వహణకు, ఉపాధి హామీ పథకంలో అనుసంధానం నిమిత్తం పంచాయతీరాజ్ శాఖకు రూ.200 కోట్లు అదనంగా కేటాయిస్తున్నారు. రాజీవ్ యువకిరణాలు పథకానికి రూ.150 కోట్లను, మహిళా సంఘాల వడ్డీ లేని రుణానికి రూ.550 కోట్లను, స్త్రీ నిధికి వందకోట్లు, అభయహస్తానికి రూ.325 కోట్లు కేటాయించనున్నారు. మైనారిటీ సంక్షేమానికి కేటాయింపులను పెంచడంతో ఆ మొత్తం రూ.400 కోట్లకు చేరనుంది. సీఎం విచక్షణాధికార నిధికి రూ.600 కోట్లు కేటాయించనున్నారు. పీలేరు డెవలప్‌మెంట్ అథారిటీకి ప్రస్తుత సంవత్సరం మాదిరే రూ. 50 కోట్లు కేటాయించారు. 

బియ్యం సబ్సిడీకి రూ.3,500 కోట్లు, విద్యుత్ సబ్సిడీకి రూ.4,100 కోట్లు కేటాయించనున్నారు. మైనారిటీలకు ప్రస్తుతం రూ.251 కోట్లు ఉన్న బడ్జెట్‌ను రూ.400 కోట్లకు పెంచుతున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల ఫండ్ కింద రూ.385 కోట్లు కేటాయించారు. వార్షిక ప్రణాళికలో విద్యారంగానికి రూ.3,800 కోట్లు, ఆర్యోగానికి రూ.1990 కోట్లు, వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.18,070 కోట్లు కేటాయించినట్లు సమాచారం. రాష్ట్ర స్థూల ఉత్పత్తి ప్రస్తుతం సవరించిన అంచనాల ప్రకారం రూ.6.70 లక్షల కోట్లు కాగా 2012-13 ఆర్థిక సంవత్సరంలో రూ.7.04 లక్షల కోట్లు ఉంటుందని అంచనా వేశారు. 

ఆరు వందల సెట్లే... 
బడ్జెట్ సమావేశాల సందర్భంగా సాధారణంగా 1,200 బడ్జెట్ పుస్తకాల సెట్‌లను ప్రచురించి అందరికీ పంపిణీ చేసేవారు. కాని ఈసారి అంతా పేపర్‌లెస్‌గా మార్చాలని నిర్ణయించి, కేవలం సీడీలు ఇవ్వాలని భావించారు. చివరి నిమిషంలో కొన్ని పుస్తకాల సెట్లను ప్రచురించాలని ఆర్థికశాఖ ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఆ మేరకు 1,200 సెట్‌లు కాకుండా ఆరువందల సెట్స్‌తోనే సరిపెట్టనున్నారు. ఎక్కువ సంఖ్యలో సీడీలను పంపిణీ చేయాలని ఆర్థిక శాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

ప్రజావసరాలకు తగ్గట్టే బడ్జెట్: మంత్రి ఆనం రామనారాయణరెడ్డి
ప్రజా సంక్షేమానికి, ప్రజావసరాలకు తగ్గట్టే బడ్జెట్ రూపొందించామని ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి చెప్పారు. గురువారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రతిష్ట కోసం కాకుండా వాస్తవాలకు దగ్గరగా బడ్జెట్ ఉంటుందని అన్నారు. శుక్రవారం మధ్యాహ్నం 12.10 నిమిషాలకు శాసనసభ, శాసనమండలిలో ఏకకాలంలో బడ్జెట్ ప్రవేశపెడతామని తెలిపారు. ఈనెల 21వ తేదీ నుంచి ఆరు రోజుల పాటు బడ్జెట్‌పై చర్చ ఉంటుందని అన్నారు. చర్చకు సహకరిస్తామని అన్ని పార్టీలూ స్పీకర్‌కు తెలిపాయని మంత్రి పేర్కొన్నారు. టెక్నాలజీని ఉపయోగించుకోవాలన్న ఆలోచనతోనే బడ్జెట్ ప్రతులను సీడీల రూపంలో ఇవ్వాలని అనుకున్నామని మంత్రి వివరించారు.. టాబ్లెట్ పీసీ ద్వారా బడ్జెట్ ప్రసంగం చేయనున్నట్టు, ఆర్థిక శాఖ వెబ్‌సైట్‌లో వివరాలన్నీ పొందుపరుస్తామని తెలిపారు.

Popular Posts

Topics :