ఆస్తుల కేసులో తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశాల్లేవని వైఎస్సార్సీపీ స్పష్టంచేసింది. జగన్ను అరెస్ట్ చేయాలన్న నిబంధన ఆస్తుల కేసులో ఎక్కడాలేదని తేల్చిచెప్పింది. సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్ను పెద్ద ఫ్రాడ్గా అభివర్ణించింది. జగన్ను ఏ-1గా పేర్కొంటూ చార్జిషీట్ ఎలా దాఖలు చేస్తారని ప్రశ్నించింది. జగన్ అక్రమాస్తుల కేసులో కోర్టులో సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసిన నేపథ్యంలో ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు, పార్టీ నేత సోమయాజులు శనివారం ఇక్కడ పార్టీ కార్యాలయంలో విడివిడిగా మాట్లాడారు.
ఆస్తుల కేసులో జగన్ను అరెస్ట్ చేస్తే రాష్ట్రంలో విప్లవాలు పుడతాయని, ప్రజలు తిరగపడుతారని జూపూడి హెచ్చరించారు. అయినా జగన్ ఏ నేరం చేశారని అరెస్ట్ చేసి, శిక్షిస్తారని ఆయన ప్రశ్నించారు. "జగన్ ఎంత శక్తివంతుడో ప్రజాబలం చూస్తేనే తెలుస్తోంది. జగన్పై చేయేసి చూస్తే ఆ తర్వాత పరిస్థితి వారికే తెలుస్తుంది.
ఆస్తుల కేసులో జగన్ను అరెస్ట్ చేస్తే రాష్ట్రంలో విప్లవాలు పుడతాయని, ప్రజలు తిరగపడుతారని జూపూడి హెచ్చరించారు. అయినా జగన్ ఏ నేరం చేశారని అరెస్ట్ చేసి, శిక్షిస్తారని ఆయన ప్రశ్నించారు. "జగన్ ఎంత శక్తివంతుడో ప్రజాబలం చూస్తేనే తెలుస్తోంది. జగన్పై చేయేసి చూస్తే ఆ తర్వాత పరిస్థితి వారికే తెలుస్తుంది.