01 July 2012 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

రాజన్న కావ్యం

Written By news on Saturday, July 7, 2012 | 7/07/2012


రాజన్న !
కవిని కాకున్నా కవిలా ఒక కావ్యం రాద్దామని ఎప్పటినుండో కకృత్తి పడేవాడ్ని
కాని కదిలే కావ్యంగా నువ్వు ఉన్నంత కాలం
ఆ సాహసం చెయ్యలేక పోయాను.
నీ తెల్లని పంచ కట్టుతో జత కట్టి
మా చీకటి బతుకులు సైతం
తెల్లవారుతాయన్న సందేశాన్నిచ్చిన నీ చల్లని
నవ్వుకున్నా చల్లని కావ్యం ఎలా పుడుతుంది ?
గోదావరి బ్యాసిన్ గ్యాసు విషయాన గ్యాసు మనుషులంతా
గ్యాసు కొడుతుంటే
నువ్వు కళ్ళు చిట్టించగా వచ్చి పడ్డ మెరుపుకన్న , నీ తెలుగు పౌరుషంకన్నా
వాడి వేడైన కావ్యం ఎలా పుడ్తుంది ?
ఆ మెరుపు ఎంత శక్తిమంతమైనవంటే చివరికి
నువ్వు బతికుంటే వారి బతుకులు భయిట పడి పోతాయని
వారిని వనికించింది.
నువ్వు మరణిస్తేనే వారికి బతుకని భయపెట్టింది.
వారి భయం మాకు అభయమై ఉన్న నీకు అపాయంగా మారింది.
రాజన్నా !
నువ్వు అర్ద దశాబ్దమే పరిపాలించావని అర్దాంతంగా పోయావని
కొందరు భ్రమ పడుతున్నారు
నువ్వు ఒక శతాబ్ద కాల అభివృద్దిని
సంక్షేమాన్ని అందించి అంబరానికి ఎగిసి పోయావు.
అక్కడి దేవతల, అమరుల స్థాయికి ఎదిగి పోయావు
ఈ సత్యం ఇక నిత్యం వారికి సైతం గుర్తుండి పోతుంది.
ఇటీవల జరిగిన ఉప ఎన్నికలు – వాటిలో నీ పేరు
సాధించిన విజయం
ఎన్నటికీ మరువలేరు వారు.
నేడు బాహుటంగా బయిట పడింది
ప్రజాభిప్రాయాన్ని దిక్కరించి
తిక్క తిక్కగా కలుపు మొక్కలకు
నీరు పోసే ఆదిష్ఠానం యొక్క తత్వం
నువ్వెలా భరించావయ్యా ఈ తరహా యాతన
ఒక్కోసారి అక్కడి శిలువ దిగి గాని రాజదానికి చేరేవాడివి కాదేమో
నువ్వు వెళ్ళి పోయాక – నువ్వు తెచ్చి పెట్టిన అధికారాన్ని
బినామి ఆస్తిగా ఉంచి లబ్ది పొంద చూసారే కాని
నువ్వు ఏ మాట ఇచ్చి ఆ అధికారాన్ని తెచ్చి పెట్టావో
క్షణం కూడ ఆలోచించలేదు.
నువ్వు హిమాలయాన్ని కరిగిస్తానని మాటివ్వలేదు
హిందు మహాసముద్రాన్ని ఇంకిస్తానని చెప్ప లేదు
పేదవానికి ఇంకొంత బియ్యమిస్తానన్నావు
రైతుకు మరో రెండు గంటల విద్యుత్ ఇస్తానన్నావు.
నీ మాటతో వీరికి పని లేదు
కాని ఆ గద్దె పట్టుకుని నల్లుల్లా వ్రేలాడటం మాత్రం వచ్చు..
చీ ..చీ..
అక్కడేమో నెహౄ పోతే ఇందిర – ఇందిర పోతే రాజీవ్
రాజీవ్ పోతే సోనియా – సోనియా పోక ముందే రాహుల్
ఇంతకీ అధికారం దక్కక మునుపు వారీ దేశం కోసం కాని -కాంగ్రెస్ పార్టి కోసం కాని
వెలగ పెట్టింది ఏమి లేదు.
వారసత్వంగా లభించిన పగ్గాలతో వారు వేసినవి పిల్లి మొగ్గలే
ఇది అక్కడి దృశ్శం.
మరి ఇక్కడేమో…
ప్రజా స్వామ్యమంటే అది నాలుగు స్థంబాలాట
లెజిస్లేచర్, ఎగ్సిక్యూటివ్, జుడీషియరి.
నాలుగో స్థంభం మీడియా.
ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించాల్సిన పత్రికలు
ఏకంగా తమ కోరికలను ,ప్రజా భిప్రాయాలుగా సమాజం పై రుద్దే
ప్రయత్నం చేసినప్పుడు
యెల్లో మీడియా దూకుడుకు అడ్డు కట్ట వేస్తే కాని కాంగ్రెస్ గట్టెక్కదన్న
క్లీష్థ పరిస్థితిలో ఆంథ్ర రాష్ఠ్ర ప్రజల మన: సాక్షిగా వెలిసింది సాక్షి
నాడు సాక్షి వెలిసి ఉండక పోతే కాంగ్రెస్ మట్తిలో కలిసి పోయేది.
ఆ సాక్షిని తెచ్చింది జగన్. నిలపెట్టింది జగన్.
నాడు జగన్ లేకుంటే సాక్షి లేదు. సాక్షి లేకుంటే విజయం లేదు
కాని ఆ జగన్ను ఏంచేసింది అదిష్ఠానం?
పెళ్ళి కొడుకును తోడు పెళ్ళి కొడుకు చేసిన చందాన
రోశయ్యను సి.ఎం గా ప్రపోజ్ చెయ్యమంది.
చెదరని చిరునవ్వుతో – అదీ చేసాడు జగన్.
జనం నీ మరణంతో తమకున్న ఏకైక బరోసా
పోయిందని గుండె పగిలి చస్తే -ప్రాణార్పణ చేస్తే
ఆ మృతుల కుటుంభాలకు ఓదార్పై భయలు దేరాడు
నీ కుమారుడు..
జనం నీరాజనం పలికేరు. అదిష్ఠానానికి వెన్నులో చలి పుట్టింది.
బాధితిలను ఒక చోటకు చేర్చి ఓదార్చాలనేరు.
నువ్వు మాకు కేవలం విధేయత పాఠాలే నేర్ప లేదు.
ఆత్మగౌరవ పాఠాలు కూడ నేర్పావు కదా..
ఎక్కడో ఉన్న మేం సైతం బుద్దిగా చదువుకుంటుంటే
నీ నీడన పెరిగిన ఆ పులి బిడ్డ నేర్చి ఉండదా పాఠాలు?
పార్ఠి మనుగడ కోసం ఈనాడు -ఆంథ్రజ్యోతి వంటి కొండలతో డీ కొట్టిన సాక్షి చేదైంది
ఆ సాక్షిని నెలకొల్పిన జగన్ చేదయ్యాడు. కాని వాడయ్యాడు.
కాని నువ్వు రాష్ట్ర ప్రజా దనాన్ని ఆదిష్ఠానానికి దోచి పెట్టావని
నీలాప నిందలు వేసిన వారు మాత్రం అయినవారయ్యేరు.
వారి గుమ్మం ముందు చెయ్యి చాచి
నిలబడేరు.
నపుంసకుని వద్ద పుత్రదానం యాచించినట్టు
ప్రజలచే తిరస్కరింప వారి చరణు వేడి
ప్రజాబలం పొంద చూసేరు.
రాజన్నా !
ఇవన్ని నీకు తెలియవని కాదు. నువ్వు ఊహించనివి కావు.
నువ్వు చూసి ఎరుగని అదిష్ఠానమా ఇది?
అందుకే డిల్లిలో నిన్ను కలిసి ప్రశ్నల వర్షం కురిసే విలేకర్లతో చెప్పేవాడివేమో ?
మీరడగ కూడదు నేను చెప్ప కూడదని
అడగ కూడనివి , చెప్ప కూడనివి సైతం దిగ మ్రింగి మా పళ్ళాలను అన్నంతో నింపావు .
విషం తాను మ్రింగి అమృతం పంచిన రుద్రుడిలా
అందుకే నీ ముక్తి స్థలి రుద్ర కొండ అయ్యిందేమో.
హే రాజన్నా !
మనిషిగా పుట్టిన నువ్వు
మహాత్మునిగా ఎలా ఎదిగావయ్య ?
నువ్వు నీ ఆత్మ కథ రచించి ఉంటే అది మరో సత్య శోధన అయ్యేదేమో?
కేవలం విదేశి కంపెనీలకు భూ తర్పణాలకే పరిమితమైన కసాయి గుండెలకేం తెలుసు
ప్రజల గుండెలో ఇంత చోటు ఎంత విలువైందో ?
ప్రేమలో పడ్డాకే అత్త కూతురి కట్టు, బొట్టు తెలిసొచ్చినట్టుగా
2003 పాద యాత్రలోని నీ అడుగులు ప్రజల గుండెకేసే అన్న సత్యం
నాకు బోధ పడలేదు.
నాయకుడు పుడతాడని కొందరు
కాదు కాదు తనే శిలై, తనే శిల్పి అయ్యి తీర్చి దిద్దుకుంటాడని మరి కొందరు
అంటుంటే తలపట్టుకుంటిని
ఆ ప్రశ్నకు జవాబు ఏ చరిత్రలోను దొరక్క
నీ జీవిత పుస్తకం తెరిచా సమాదానం చూసి మురిసా…
అన్నట్టు జీవిత పుస్తకం ఏంది సిల్లీగా .. అదో చరిత్ర..
నాయకుడు పుడతాడు రేగు చుక్కలా ?
ప్రజల జీవితాలను కారు చీకటి కమ్ముకున్న వేళ
వారి కళ్ళు తమ ఇల వేల్పు కొరకు ఆకాశానికేసి
చూస్తే……….
అప్పుడు కనిపిస్తుంది ఆ రేగు చుక్క !
ఈ ముక్క నాకు తెలిపిన నీ జీవితం ధన్యం
ఆ చుక్క ఎప్పుడో పుట్టింది
ప్రజ కంట మరెప్పుడో పడింది
హే జన హృదయ నేత !
కొందరు నయవంచకులు
మా నమ్మకాలను వొమ్ము చేసి
మమ్ము ప్రపంచ బ్యాంకుకు అమ్మ చూస్తే
ఆ అంబ అమ్ముల పొదిలోని ఆగ్నేయాస్త్రంలా అడుగు ముందుకేసావు
కరుణ అడుగంటిన అవకాశ వాదులను చెడుగుడు ఆడించావ్
శల్య సారథ్యాలు, స్వపక్షీయుల దాడులు,
పద్మవ్యూహాల నడుమ అభిమణ్యువును తలపించావు
అందరు డాక్టర్లు తమ చేతి స్టెత్తు తో రోగి గుండె చప్పుడు వింటారు
కాని నువ్వు రాష్ఠ్ర గుండె చప్పుడు విన్నావు
నాటి హైటెక్ ఇంద్రజాలం పై వాస్తవికతపు మంత్ర జలం చల్లావు
కోడి పిల్ల గుంట నక్కై కనిపించింది.
ఆమ్మో నాటి రోజులు తలుస్తే గుండె లయం తప్పుతుంది
ఆ చీకటి రోజుల్లో రాష్ఠ్ర వ్యవసాయరంగం అహల్యలా బండబారి పోయుంటే
శ్రీరామునివలే నీ పాదం మోపి , ప్రాణం పోసావు.
గుల్బర్గాలో నువ్వు మెడిసిన్ చదువుతున్న రోజుల్లో
నీ అభిమాన కథానాయకుడు ఎన్.టి.ఆర్ .
ఎవరినన్నా ప్రభావితం చెయ్యగల నటుడని నువ్వే కొనియాడిన
అతను రాయల శీమ ప్రాజెక్టులను విశ్మరిస్తే అసెంబ్లీ ముందే నిల బెట్టి నిల దీసావు
ఇది మొన్నటి సత్యం
ఎన్.టి.ఆర్ పేదవానికి కూడు అందించటానికి మొదలు పెట్టిన ప్రయత్నాన్ని నువ్వు కొనసాగించావు
ప్రత్యర్ది పథకం అమలు చేస్తే కీర్తి ఎక్కడ వారిని వరిస్తుందోనని
కకృత్తి పడక పిల్లి ఏ రంగుదైనా సరే అది ఎలుకలను పట్టాలంతే అంటూ
మాసేదుంగ్ లా అమలు చేసావు రెండు రూపాయలకే కిలో భియ్యం
స్వంత అల్లుడు తుంగలో తొక్కిన పథకానికి పునర్జీవం పోసావు
అసలైన వారసుడ్ని నేనని చెప్పక చెప్పావ్.
నాటి రాజులు సైతం తమ కోటల్లో నిల్వ చేసే వారు బియ్యం
కాని సామాన్యులను వెంటాడింది ఆకలి దెయ్యం
దీంతో భూత వైద్యుని అవతారమూ ఎత్తావు
భూతాన్ని భూస్థాపితం చేసావ్
అభిమానాన్ని రాజకీయాన్ని
స్నేహాన్ని వ్యవహారాన్ని
వేరు చేసి అభిమానం చాటావు
స్నేహాన్ని నిల బెట్టావు
ఆ విశాల హృదయంలోని ఆత్మకు నేల మీదనుండి పైకి ప్రయాణించడం ఇరుకని
నింగికి దగ్గరగా ఉన్న కొండను ఎంచుకున్నావేమో నీ ప్రాణార్పణకు
నాటి పాలకులు నాడు 2 శాతమే ఉన్న నెటిజన్ల కోసం ఇల్లు పీకి పందిరేస్తే
నువ్వేమో 70 శాతం ప్రజానీకాన్ని పోషించే
వ్యవసాయ రంగం పై దృష్ఠి సారించావు
ఆకలితో ఉన్నవానికి చేపలివ్వకు చేపలు పట్టడం నేర్పు అన్నాడో మేధావి
ఆ పూటకు చేపలిచ్చి , చేపలు పట్టడం కూడ నేర్పాలన్నావ్..నువ్వు
అవును రైతుల విద్యుత్ భకాయిలను రద్దు చేసి ఉచిత విద్యుత్ అందించి ఆ పై
మొదలు పెట్టావు జలయజ్ఞం
ఎడ తెగని కరవుతో ఆత్మ స్థైర్యం కోల్పోయిన రైతుల వద్దనుండి
విద్యుత్ భకాయిలను వసూలు చేసి తీరుతామని
హూమ్కరించింది నాటి ప్రభుత్వం
జప్తులు, క్రిమినల్ కేసులతో రైతు గుండెల్లో రైళ్ళు
పరుగుడితుంటే
ఆ అంధకారంలో అరుణ కిరణంలా ఉఅదయించి
మండుటెండల్లో పాదయాత్ర చేపట్టావు.
కాని దాన్ని సైతం భవిష్యత్తు కబ్జల నిమిత్తమే చేసావు సర్వే అని
తూలలాడిన కుర్రకారును చూసాం.
అతను తూలి పడి పుడమి తల్లిను ముద్దాడినప్పుడే అర్థమైంది
సత్యం నిలిచింది నీ వెంటేనని
నువ్వు క్రైస్తవుడని అన్య మత ప్రచారాన్ని ప్రోత్సహించావని గొంతు చించుకున్నవారు
గుళ్ళో పూజారికి, దేవతకు సైతం కాసుల వర్షం కురిపించిన సంగతిని మాత్రం ఏంచక్కా దాచేరు
దాస్తే దాగేదా సత్యం
నీ తండ్రిని పొట్టన పెట్టుకున్నవారిని సైతం క్షమించిన శాంతి పావురమా
అందుకే నీ ముక్తి స్థలి పావురాల గుట్టైందేమో?
హే ఆశ్రిత కల్ప వృక్షమా !
ఇంకో శతాబ్ద కాలానికి నా బో(పోటి) కవులకు సైతం కల్ప వృక్షమయావు నువ్వు
నిన్ను కీర్తించాలని దలచిన అదే క్షణం
సరస్వతి దేవి వారి నాలిక పై ఓంకారం దిద్దినంతగా
ఆసువుగా కవితలు దొరులుతాయి
అశేష ప్రజానీకం సంక్షేమమే సంకల్పంగా నువ్వు ఆశువు బాసినా
మమ్ములను ఆసు కవులు చేసావు
నువ్వూ ఓ తల్లి కడుపునే పుట్టావ్
మరి దేవుడివి ఎలా అయ్యావయ్యా ?
అమరలోకంలోని దన్వంత్రి ఆత్మ నీలో ప్రవేశించిందా ?
ఆరోగ్య శ్రీతో మమ్మాదుకున్నావు
అన్న దాతలకోశం, అన్నార్తుల కోశం నువ్వు చేపట్టిన పాద యాత్రతో
ఆ అన్న పూర్ణేశ్వరి గుండె కరిగి పోయి
శివుని ఆకలి తీర్చిన గరటిని నీకిచ్చిందేమో ?
భిన్న రుచులు కలిగిన లోకులను మురిపించి
వారి అహం మరిపించి ఎలా దగ్గరయ్యావయ్యా ఇన్ని కోట్ల మందికి ?
40 సం.ల వయస్సుకే తేజస్సు క్షీణించి
అబధ్రతకు లోనయ్యే ఈ తరం యువతరం పుట్టుకతో వృద్దులై బతికేస్తుంటే
60 సం.ల వయస్సుకి నువ్వు కలలు కన్న ఉషస్సు కొరకు
పరుగులు తీసి యెనలేని యశస్సును కూడ కట్టుకున్న
నిత్య యవ్వనం నీకెలా సంప్రాప్తించింది
నీ నిస్వార్థమే నిన్ను అమృతమై పరుగులు తీయించిందేమో ?
కాస్త పెద్ద పదవి వరించగానే పేదవాని జీవణ్మరణ సమస్య చీమకాన్న చిన్నదై కనబడే ఈ కలిలో
అంత పెద్ద పదవిలో ఉన్నా పీడిత ప్రజానీకం సమస్యలను ఎలా గుర్తుపెట్టుకో గలిగావు
సరస్వతి ఆకు తిన్నావా ?
చేతికొచ్చిన కొడుకు
చేతి వేళ్ళల్లోని గోళ్ళను కొరుకుతుంటే
మందలించావు
అతను పరోక్షంగా నీ పొగ అలవాటు పై దాడి చేస్తే
పగ అలవాటు లేని నీ గుండెకు
పొగను సైతం దూరం చేసావు
నాడు తీపి మానమని కొడుక్కి సలహా ఇవ్వమని
కోరిన తల్లిని తాను తీపి మానేంత వరకు తిప్పించిన
రామ కృష్ణ పరహంసుని గుర్తుకు తెచ్చావ్
పేరు పేరున పలకరించే నీ మదిలో జ్ఞాపకాలు జాం అయ్యి
ఆ పేరు భయిట పడటానికి ముందు “ఏం షార్” అని పలకరించి
వెన్ను తట్టి కౌగిలించుకునే నాన్నతనం మమ్ము పులకరింప చేస్తుంది
నాడు ఏ కొత్త పథకం అమలు కాకున్నా
ఏ కొత్త ప్రాజెక్టు ప్రారంభం కాకున్నా
ఉన్నవి సైతం ఊడ్చుకు పోయినా
అధికారులకు మాత్రం వత్తిడి తప్పేది కాదు
నువ్వు అన్ని సంవత్సరాలు ఎన్నికల సం. వలే పథకాలు అమలు చేస్తున్నా
ప్రాజెక్తులు చేపడుతున్నా వారిని కంటి నిండా నిద్ర పోనిచ్చావ్
పరిపాలన పై నీదైన చెరగని ముద్ర వేసావు
పుట్టనున్న పిల్లల కోసం జననీ సురక్ష పెట్టావ్
గిట్టిన వారి సతీమణుల కోసం వితంతు పించన్లు
వారసులచే తిరస్కరింప బడిన వృద్దులకు పించన్లు
కకా వికలమైన వికలాంగుల బతుకుల్లో వెలుగును నింపే పించన్లు
నువ్వు లెక్కలేని పథకాలు పెట్టి
మేమందరం నీకు ఏడేడు జన్మలకు రుణపడేలా చేసి
ఒక పథకం ప్రకారం శోక సముద్రాన ముంచి వెళ్ళావ్
60 కి విరమిస్తానని
ఇచ్చిన మాట నిలుపుకోవటం కోసం 10 సం.ల శ్రమ 5 సం.ల్లో చేసి ఇలా వెళ్ళి పోతావా రాజన్నా!
నాకో అనుమానం. అస్తమానం సోమ పాన సేవనంతో స్వర్గ శీమ నరకమైతే
దానిని మళ్ళీ స్వర్గం చేసేందుకు నీకు పిలుపందిందేమో ?
హ..! అదెంత పని నీకు. ఐదేళ్లలో పూర్తి గావించి కీర్తి గాంచి
తిరిగి వచ్చేస్తావుగా రాజన్నా !
ఏళ్ళ తరబడి ఉద్యోగ ఖాళీల భర్తి పై నిషేదం ఉంటే
నిర్వేదంతో నీరశించిన నిరుధ్యోగుల మనసుల్లో కొత్త ఆశలు రేకెత్తించినావు
పంచె కట్టుతో వ్యవాసయ రంగాన్నే కాదు. అభివృద్ది పై వాంచతో
పారిశ్రామీకరణ చే పట్టావ్
ప్రత్యేక ఆర్థిక మండళ్ళు ఏర్పాటు చేసావు
పొరుగు రాష్ఠ్రాలు తన్నుకు పో చూసిన పరిశ్ర్మలను ఇక్కడికి తెచ్చావ్
నీ లెక్క లేని పథకాలను ప్రస్తావించటంతో
ఈ కవితాంజలి న్యూస్ బుల్లిటిన్లా ఏడ్చింది
రాజన్నా ! నువ్వు అప్పట్లో ఎం.పి. వి.
పొరుగు రాష్ఠ్రపు టైర్ కంపెని సేల్స్ రెప్ నిన్ను కలవాలని కడప వచ్చాడు
టీ కొట్టులో వాకబు చేసాడు
“ఎం.పి. ఇల్లెక్కడని”
టీ కొట్టువాడు అన్నాడు. అందాక ఎందుకు కాసేపాగు. ఆయనే వస్తాడన్నాడు
అప్పుడు అక్కడికి దూసుకొచ్చింది ఓపెన్ టాప్ జీపొకటి.
దానిని డ్రైవ్ చేసుకుంటూ నువ్వు – నీ పెదాల మీద అదే నవ్వు
అదీ మా రాజన్నంటే .
ఒంటరి సింహం పై అఠవి పందుల దాడి చందాన
ఎన్నికల పోరు సాగితే నీ చేతి కరవాలంగా తిరింగింది సాక్షి
రాజన్నా !
తెలుగు సినిమాల్లో ఒక కథానాయకుడు డజన్ల కొద్ది రౌడీలతో ఉత్తుత్తే ఫైట్ చేస్తే నెత్తికెక్కించుకునేవారు
వారి అభిమానులు
మరి నువ్వు రాజకీయ రణ రంగంలో ఒకే ఒక్కడై ధీరత్వంతో రియల్ ఫైట్ చేస్తే హీరోలు జీరోలయ్యేరు.
అపర చాణక్యుల వ్యూహాలు బెడిసి కొట్టాయి.
పులి బిడ్డ పులేగా..
అందుకే నేడు జగన్ వన్ మ్యేన్ ఆర్మిలా దూసుకు పోతున్నాడు.
ప్రత్యర్థులందరు ఏకమైనా -ఎల్లో మీడియా -సి.బి.ఐ కుమ్మక్కైనా
కించిత్తైనా జంకు బొంకు లేక
దూసుకు పోతున్నాడు నీ బిడ్డ.
కేసులు పెడితే మీసాలు మెలెయ్యడం మానేస్తాడని కలలు కనేరు
వారి కల వికలం అయ్యింది
జైల్లో పెడితే దార్లోకొస్తాడని ఆశించేరు
వారి ఆశ నిరాశే అయ్యింది.
రాజన్నా!
నువ్వు కొలువున్న ప్రతి గుండె జగన్ జగన్ అంటూ కొట్టుకుంటుంటే
ఆ గుండె చప్పుళ్ళకు జైలు కోడలే కాదు – ఈ ప్రభుత్వాలు సైతం
కుప్ప కూలక తప్పదు.
మా వెంట నువ్వున్నావన్న బరోసా చాలు.
మేమందరం జగన్ వెంట ఉంటాం
నీ బాలకుని మా పాలకుని చేసుకుంటాం
మా రాజన్న రాజ్యాన్ని తెచ్చుకుంటాం
నీ జలయజ్నం పూర్తి చేస్తాం.
ప్రతి నీటి చుక్కను సేద్యానికి వినియోగిస్తాం!
పండిన ప్రతి గింజతో పేదవాని ఆకలి తీరుస్తాం !!

'రంగారెడ్డిని కరువుజిల్లాగా ప్రకటించాలి'

దమ్మాయిగూడ: మహానేత వైఎస్ రాజశేఖరెడ్డి మరణం రాష్ట్రానికి, దేశానికి తీరని లోటని రంగారెడ్డి జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ కన్వీనర్ బి.జనార్దన్‌రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లాను కరువుజిల్లాగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా కీసర మండలం దమ్మాయిగూడలో 350 మంది కార్యకర్తలు ఆయన సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. నాగారంలో వైఎస్సార్ కాంగ్రెస్ జెండాను జనార్దన్‌రెడ్డి ఆవిష్కరించారు.

'వైఎస్ జయంతిని అధికారికంగా జరపాలి'

దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర మాజీ మంత్రి పి. శంకర్రావు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సీఎంగానే వైఎస్‌ఆర్ దివంగతులయ్యారని, ఆయన జయంతిని పార్టీపరంగానే గాక, ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలన్నారు. వైఎస్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు ప్రజాదరణ పొందాయన్నారు. వైఎస్‌ పధకాలు పార్టీకి, ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చాయని అభిప్రాయపడ్డారు.

ప్రజల నడ్డివిరుస్తున్న సర్కారు: పద్మ

కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ను అంధాంద్రప్రదేశ్‌గా మారుస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ నేత వాసిరెడ్డి పద్మ విమర్శించారు. విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పేరుతో ప్రజల నడ్డివిరుస్తోందని ఆమె మండిపడ్డారు. వైఎస్సార్ జయంతి సందర్భంగానైనా ఆయనను గుర్తుచేసుకుని ప్రభుత్వం బుద్ధి తెచ్చుకోవాలన్నారు. వైఎస్ హయాంలో ఎన్నడూ ఒక్కరూపాయి కూడా ఛార్జీలు పెంచలేదని ఆమె గుర్తు చేశారు. 

కిరణ్ సర్కారు తుగ్లక్ కంటే దారుణంగా పాలిస్తోందని దుయ్యబట్టారు. మంత్రులు, ముఖ్యమంత్రి జిల్లాల పర్యటనకు వెళ్తే మహిళలు తరిమికొడతారని హెచ్చరించారు. వివాదస్పద 26 జీవోలపై రాష్ట్రప్రభుత్వ వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఈ జీవోలపై ప్రభుత్వం ఇప్పటికైనా విధానపరమైన నిర్ణయం ప్రకటించాలని వాసిరెడ్డి పద్మ కోరారు.

Thuglak Administration in AP: Vasireddy padma fire on Govt

CVC Orders to CBI JD Lakshminarayana for Report

Vijayalakshmi to hold reins (deccanchronicle)

YSR Congress honorary president Y.S. Vijayalakshmi is welcomed by party activists as she arrives at the party office at Jubilee Hills in Hyderabad on Friday for the YSRC’s general body meeting for the first time.    — DC
For the first time, YSR Congress honorary president Y.S. Vijayalakshmi came to the party office on Friday and presided over a meeting of the party’s extended state council.
At the meeting, it was decided to authorise party president Y.S. Jagan Mohan Reddy to decide the party’s stand in the Presidential polls.
Ms Vijayalakshmi called upon the party cadre to be prepared to face local body elections in the state. She said she would be holding the reins till Mr Jagan Mohan Reddy returned.
At the meeting it was resolved to highlight the “failure of the state government to solve farmers’ problems; the growing attacks on dalits and dilution of welfare schemes introduced by YSR and emanded a judicial inqu-iry into the conduct of the CBI which alleged was working in collusion with Mr Jagan Mohan Reddy’s political and business rivals.
The meeting adopted resolutions condemning the attitude of the state government towards the welfare of weavers, minorities, fishermen, tribals and the poor power supply to farmers.
The party decided to celebrate YSR’s birth anniversary on July 8, which will be observed by the cadres to highlight the problems of farmers. The party dem-anded a judicial inquiry into the former CM’s death in a helicopter crash.
The party took a serious note of Mr Jagan Mohan Reddy’s arrest and accused the ruling Congress, main opposition Telugu Desam, the CBI and his business adversaries of joining hands against him. The YSRC demanded an inqu-iry by a sitting Supreme Court judge into the arrest.
Ms Vijayalakshmi informed the attendees about her two-day Delhi visit and the assurances given by Prime Minister Manmohan Singh, agriculture minister Sharad Pawar and other leaders about the course of the CBI investigation against Mr Jagan Mohan Reddy, and on farmers' issues in the wake of the hike in fertiliser prices and the need for increasing input subsidy.

మందుల్లేవు.. డాక్టర్లు రారు



పాము, కుక్కకాటు మందులకూ దిక్కు లేదు
బాధితులకు నాటువైద్యమే శరణ్యం
పీహెచ్‌సీలను వేధిస్తున్న వసతుల లేమి
సెలైన్లు, బ్యాండేజీలు కూడా లేని దైన్యం
నిధుల విడుదలలో సర్కారు అలసత్వం
అంటువ్యాధుల ప్రమాదం పొంచి ఉన్నా మొద్దునిద్రే
తీవ్రంగా వేధిస్తున్న వైద్యులు, సిబ్బంది కొరత
ఉన్న డాక్టర్లూ చుట్టపుచూపుగా వచ్చి వెళ్తున్న వైనం
వైద్యుల అవతారమెత్తుతున్న అటెండర్లు, స్వీపర్లు
‘న్యూస్‌లైన్’ పరిశీలనలో వెల్లడైన చేదు నిజాలు

న్యూస్‌లైన్ యంత్రాంగం: ఖరీఫ్ సీజన్. రైతులు, రైతు కూలీలు తొలకరి పనుల్లో తలమునకలయ్యే సమయం. పాములు, తేళ్ల బెడద బాగా ఉండే సీజన్ కూడా ఇదే. కానీ ఈ సీజన్‌లో గనుక వారు పొరపాటున వాటి కాటుకు గానీ గురయ్యారా.. ఇక అంతే సంగతులు. ఏ నాటు వైద్యాన్నో, మంత్ర తంత్రాలనో నమ్ముకోవాల్సిందే! రాష్ట్రంలోని అత్యధిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పాముకాటు మందు (ఏఎస్‌వీ)కు కూడా దిక్కు లేదు మరి!! నల్లగొండ జిల్లాలో ఏకంగా రాజాపేట మండల కేంద్రంలోనే గురువారం ఓ యువకుని విషాదాంతం ఈ దైన్యానికి అక్షరాలా అద్దం పట్టింది. వైరాగ్యం శివుడు అనే అభాగ్యుడు పశువుల కోసం గడ్డి కోస్తుండగా తాచుపాము కాటేసింది. తక్షణం స్థానిక పీహెచ్‌సీకి తరలించినా ఏఎస్‌వీ లేమి వెక్కిరించింది. వెంటనే భువనగిరికి తరలించినా అప్పటికే ఆలస్యమై అతను నిస్సహాయంగా ప్రాణాలొదిలాడు. ఒక్క పాముకాటనే కాదు.. ఈ సీజన్‌లో పరిపాటైన కుక్క కాటు బారిన పడ్డవారిని కూడా ఆ దేవుడే ఆదుకోవాల్సిన దుస్థితి దాపురించింది. ఎందుకంటే యాంటీ రేబిస్ మందు (ఏఆర్‌వీ)కూ కనీవినీ ఎరగని కరువొచ్చి పడింది. రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 80 శాతం పీహెచ్‌సీల్లో ఏఎస్‌వీ, ఏఆర్‌వీ నిల్వలనేవే లేవు. 2011 ఏప్రిల్‌లో కాకినాడలో రేబిస్ వ్యాధి సోకిన 10 మంది యాంటీ రేబిస్ వ్యాక్సిన్ వేసినా మృత్యువాత పడ్డారు. వ్యాక్సిన్ పని చేయకపోవడమే కారణమని అధికారులు ధ్రువీకరించారు. అయినా అదే మందు ఇప్పటికీ సరఫరా అవుతూనే ఉంది! అంతేకాదు.. వర్షాకాలం రాగానే విజృంభించే అంటువ్యాధులను, విష జ్వరాలను ఎదుర్కొనే ఏర్పాట్లు కూడా సున్నా. కనీసం బాధితులకు ఎక్కించేందుకు సెలైన్ బాటిళ్లు కూడా ఎక్కడా అందుబాటులో లేని దుస్థితి!

మన పీహెచ్‌సీల దైన్యానికి ఇవి కేవలం కొన్ని ఉదాహరణలు మాత్రమే. నిత్యం అవసరమయ్యే అతి మామూలు మందులకు కూడా వాటిలో దిక్కులేదు. దీనికి తోడు తీవ్రంగా వేధిస్తున్న డాక్టర్ల కొరత. ఉన్న వైద్యులు ఎప్పుడొస్తారో, ఎప్పుడు వెళ్తారో ఎవరికీ తెలియదు! పీహెచ్‌సీలకు మందులే కాదు, నిధుల విడుదలలోనూ, సిబ్బంది నియామకంలోనూ సర్కారు అంతులేని అలసత్వం ప్రదర్శిస్తోంది. వెరసి.. నిరుపేదల ఆరోగ్యానికి భరోసా ఇచ్చి ఆదుకోవాల్సిన పీహెచ్‌సీలకే తీవ్రంగా సుస్తీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా పీహెచ్‌సీల పరిస్థితిపై ‘న్యూస్‌లైన్’ చేపట్టిన తాజా పరిశీలనలో విస్మయకర వాస్తవాలు వెలుగు చూశాయి. పలుచోట్ల స్వీపర్లు, అటెండర్లే డాక్టర్ల అవతారమెత్తి, తోచిన మందులిచ్చి రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నా పట్టించుకుంటున్న నాథుడే లేడు! అరకొర మందులతో, వైద్యులు, సిబ్బంది కొరతతో కునారిల్లుతున్న దైన్యమే అన్ని పీహెచ్‌సీల్లోనూ దర్శనమిచ్చింది. పలుచోట్ల పీహెచ్‌సీలు చెట్ల కిందే నడుస్తున్న తీరు అవి ఎదుర్కొంటున్న వసతుల లేమికి అద్దం పడుతోంది. ఈ నేపథ్యంలో సర్కారీ వైద్యంపై ప్రజలకు నమ్మకం పూర్తిగా సడలిపోతోంది. విధి లేక గ్రామీణులు పట్టణాల్లోని ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించి ఆర్థికంగా చితికిపోతున్నారు. పలువురు అభాగ్యులు ఆలోపే ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.

నిధులకూ దిక్కు లేదు

రాష్ట్రవ్యాప్తంగా 1,624 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలుంటే కనీసం ఒక్కచోట కూడా ఐవీ ఫ్లూయిడ్స్ (ద్రవాహార మందులు) లేవు! పాముకాటు మందు (ఏఎస్‌వీ), కుక్కకాటు మందు (ఏఆర్‌వీ) ప్రతి పీహెచ్‌సీలలో విధిగా ఉండాలి. కానీ 80 శాతం కేంద్రాల్లో వాటి జాడే లేదు. సుమారు 30 రకాల లైఫ్ సేవింగ్ డ్రగ్స్ కూడా పీహెచ్‌సీల్లో ఎక్కడా అందుబాటు లేవు. గాయాలకు కట్టు కట్టేందుకు బ్యాండేజీలకు కూడా నెల రోజులుగా ఏ పీహెచ్‌సీలోనూ గతి లేని దుస్థితి! ఆర్థిక సంవత్సరం మొదలై మూడు నెలలవుతున్నా పీహెచ్‌సీల్లో మందుల కొనుగోలుకు ప్రభుత్వం నిధులే విడుదల చేయడం లేదు. దాంతో డయేరియా, మలేరియా, వైరల్ వంటి జ్వరాలొచ్చి నీరసపడితే కనీసం సెలైన్ బాటిళ్లకు కూడా దిక్కు లేదు. డైక్లోఫెనాక్, బీ కాంప్లెక్స్, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, గ్లూకోజ్‌లు, టీటీ మందుల వంటివేవీ అందుబాటులోనే లేవు. ప్లూయిడ్లు, ఇంజెక్షన్ల కొరత తీవ్రంగా ఉంది. వచ్చే మూడు నెలలు అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం పొంచి ఉంది. వర్షాలు పడి, నీళ్లు నిలిస్తే మలేరియా, డయేరియా, డెంగీ వంటివి స్వైర విహారం చేసే ఆస్కారమున్నా ఏ పీహెచ్‌సీలోనూ వాటిని నివారించేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్న దాఖలాల్లేవు. నల్లగొండ జిల్లాలో ఒక్క పీహెచ్‌సీలోనూ అవసరమైన మందుల్లేవు. 

వేసవి, వర్షాకాలాలకు సంబంధించి జిల్లాకు 60 వేల ఐవీ ఫ్లూయిడ్ బాటిళ్లు అవసరం కాగా జిల్లా డ్రగ్ స్టోర్స్‌లో ప్రస్తుతం కేవలం 2,220 మాత్రమే ఉన్నాయి. తొలి క్వార్టర్‌కు సంబంధించి 6.9 లక్షల షుగర్ టాబ్లెట్ల కోసం ప్రభుత్వానికి ఇండెంట్ పెట్టగా, పుణ్యకాలం పూర్తయినా ఇప్పటికీ వాటికి అతీగతీ లేదు. ఖమ్మం జిల్లా భద్రాచలం ఏజెన్సీ పీహెచ్‌సీల పనితీరూ దారుణంగానే ఉంది. విష జ్వరం, జలుబు, దగ్గు మందులు అరకొరగా ఉన్నాయి. ఒక్క పీహెచ్‌సీలో కూడా రేబిస్ వ్యాక్సిన్, డయాబెటిక్ టాబ్లెట్లు, ఐవీ ఫ్లూయిడ్స్ లేవు. వాజేడు, చర్ల, వెంకటాపురం, గౌరీదేవిపేట, కూనవరం పీహెచ్‌సీల్లో ఐవీ ఫ్లూయిడ్స్, పారాసిటమల్, ఫిరోజోలిడన్ (విరేచనాలు), మెట్రోజన్ (జిగట విరేచనాలు), డైక్లోఫామ్ మందులు అసలే లేవు. విజయనగరం జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి! ఏఎన్‌ఎంలు మొక్కుబడిగా అంగన్‌వాడీల్లో అరకొరగా మందులుంచి మమ అనిపిస్తున్నారు. గుంటూరు జిల్లా నకరికల్లు, సత్తెనపల్లి, రాజుపాలెం, కొల్లిపర, కొల్లూరు, తుళ్లూరు, మంగళగిరి పీహెచ్‌సీల్లో నొప్పులు, గ్యాస్, జ్వరాలకు సంబంధించిన మందు బిళ్లలు, ఐరన్ మాత్రలు మినహా ఇతర మందులేవీ లేవు. జిల్లాలోని ప్రత్తిపాడు పీహెచ్‌సీలో తుప్పు పట్టి విరిగిపోయే దశలో ఉన్న పడకలపై పడుకోవడానికే రోగులు భయపడుతున్నారు. 24 గంటలపాటు పనిచేస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో జనరేటర్ల సౌకర్యానికి దిక్కు లేదు. ఇక నెల్లూరు జిల్లాలో పలు పీహెచ్‌సీల్లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లకు అవసరమైన థియేటర్లు కూడా లేవు. సెలైన్ల కొరత కూడా తీవ్రంగా వేధిస్తోంది.

డాక్టర్ల రాక.. దైవాధీనం!

పీహెచ్‌సీలకు డాక్టర్ బాబులు ఎప్పుడు వస్తారో ఎవరికీ తెలియని చందంగా మారింది. సమీప పట్టణాల్లో నివాసముంటూ చుట్టపుచూపుగా వచ్చి పోతున్న వారి సంఖ్యే అధికంగా ఉంది. గత ఆదివారం రంగారెడ్డి జిల్లా వికారాబాద్ ఏరియా ఆస్పత్రిలో డ్యూటీ డాక్టర్ గైర్హాజరీ లావణ్య అనే నిండు గర్భిణితో పాటు ఆమె నవజాత శిశువునూ బలి తీసుకుంది. డ్యూటీ నర్సులు తమ వంతు ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. ప్రసవిస్తూనే తల్లి, భూమ్మీద పడీ పడగానే పసిగుడ్డు నిస్సహాయంగా ప్రాణాలొదిలారు. ఇంత ఘోరం జరిగినా అధికారులు ఏమాత్రమూ పట్టించుకోలేదు. డాక్టర్‌కు సమాచారమిచ్చేందుకు ప్రయత్నించినా ఫోన్ స్విచాఫ్ చేసుకున్నాడంటూ సాక్షాత్తూ డ్యూటీ నర్సులే ఆర్డీఓకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తేనే గానీ అతనిపై చర్యలు తీసుకోలేదు! వరంగల్ జిల్లా ఏటూరునాగారం ఏజెన్సీ బానోజీబంధం గ్రామానికి చెందిన మూడేళ్ల చిన్నారి గణేశ్‌ను కూడా పీహెచ్‌సీ వైద్యుల నిర్లక్ష్యమే బలి తీసుకుంది. జ్వరంతో కూడిన ఫిట్స్ రావడంతో ఆదివారం బాలున్ని తల్లిదండ్రులు చెల్పాక పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. వైద్యులు, సిబ్బంది ఒక్కరూ లేకపోవడంతో ఆర్‌ఎంపీ వద్ద ప్రాథమిక చికిత్స చేయించారు. పరిస్థితి విషమించడంతో ఖమ్మం జిల్లా మణుగూరులో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినా లాభం లేకపోయింది. లేకలేక పదేళ్ల తర్వాత కలిగిన ఏకైక సంతానం కళ్లముందే కడతేరడంతో తల్లిదండ్రుల దుఃఖానికి అంతు లేకుండా పోయింది. పీహెచ్‌సీ విధుల పట్ల వైద్యుల నిర్లక్ష్యానికి ఇవి కేవలం రెండు ఉదాహరణలు మాత్రమే. రాష్ట్రవ్యాప్తంగా చాలాచోట్ల ఇదే పరిస్థితి నెలకొంది! వరంగల్ జిల్లా కురవి మండలం బలపాల పీహెచ్‌సీలో అటెండరే డాక్టరయ్యాడు. 

పరకాల మండలం రాయపర్తిలో స్వీపరే రోగులకు తోచిన మందులిస్తోంది! ములుగు ఏజెన్సీ రాయినిగూడెం పీహెచ్‌సీలో ఇద్దరు వైద్యులు ఎప్పుడో గానీ ముఖం చూపించడం లేదు. మెదక్ జిల్లాలోనూ ఒక్క పీహెచ్‌సీలో కూడా ైవె ద్యులు, సిబ్బంది వేళకు రావడం లేదు. నల్లగొండ జిల్లాలోనూ ఇదే పరిస్థితి. అసలే సిబ్బంది కొరత తీవ్రంగా ఉండగా, ఉన్న వైద్యులు కూడా సమీప పట్టణాల నుంచి చుట్టపు చూపుగా విధులకు వచ్చిపోతున్నారు. బొల్లేపల్లి పీహెచ్‌సీ డాక్టర్ కేవలం సోమవారం మాత్రం వచ్చి మిగతా ఆరు రోజులకు ఏఎన్‌ఎంలకు డ్యూటీ వేస్తున్నాడు. ఖమ్మం జిల్లాలోనూ పీహెచ్‌సీల వైద్యులంతా ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి, వైరాల్లో నివాసముంటున్నారు. జిల్లాలో 12 ప్రాథమిక కేంద్రాలను అప్‌గ్రేడ్ చేశారు. ఇవి 24 గంటలు తెరిచి ఉండాలి. కానీ రాత్రి ఏడు దాటితే వాచ్‌మెనే దిక్కవుతున్నారు. అనంతపురం జిల్లాలోనూ వైద్యాధికారులెవరూ స్థానికంగా ఉండటం లేదు. నెల్లూరు జిల్లాలో మారుమూల పీహెచ్‌సీలకు వైద్యులు మొక్కుబడిగానే వెళ్లి వస్తున్నారు. పైగా కొందరు వైద్యులు చేతులు తడపందే సరిగా వైద్యం చేయడం లేదు. వరంగల్ జిల్లా బచ్చన్నపేట ప్రభుత్వాసుపత్రిలో తన కూతురు ప్రసూతి ఆపరేషన్‌కు డాక్టరే రూ.5 వేలు డిమాండ్ చేశాడంటూ బాలమణి అనే మహిళ వాపోయింది.

వేధిస్తున్న కొరత

వైద్యులు, సిబ్బంది కొరత మూలిగే నక్కపై తాటిపండు చందంగా తయారైంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 350 ఆరోగ్య కేంద్రాల్లో వైద్యుల ఖాళీలున్నాయి. అనంతపురం జిల్లాలోని 100 పీహెచ్‌సీల్లో 183 మంది వైద్యులకు గాను 48 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గుంటూరు జిల్లాలోనైతే 77 పీహెచ్‌సీల్లో ఏకంగా 803 వైద్య సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నాయి!

సార్లుండనే ఉండరు
‘‘సంటి పాపతోని చింతనెక్కొండ శివారు భట్టు తండా నుంచి పొద్దుగాలనంగ దవాఖానకు వచ్చిన. ఎప్పుడచ్చినా డాక్టరుండడు. మిగిలిన సార్లుండరు. ఎవలికి చెప్పాన్నో అర్థమైతలేదు’’
- భట్టు విజయభారతి, భట్టుతండా, వరంగల్
అన్ని రోగాలకూ ఒకటే మందు
‘‘ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పేరుకే ఉంది. డాక్టర్ వచ్చేది వారానికి ఒక్కసారే. అదెప్పుడో మాకెవరికీ తెలియదు. కుక్కకాటు మందు ఎప్పుడడిగినా లేదనే అంటాంటరు. విష పురుగుల బారిన పడితే ప్రాణాల మీద ఆశలు వదులుకునేదే. అన్ని రోగాలకూ ఒకటే రకం మాత్రలిస్తన్నారు. ఏందంటే అవే ఉన్నయంటరు’’
- వెంకటేశ్వర్లు, పగిడ్యాల, కర్నూలు

ఇదీ పీహెచ్‌సీల దుస్థితి..
2001 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో 1,892 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలుండాలి. కానీ 1,624 మాత్రమే ఉన్నాయి. ప్రస్తుత జనాభా ప్రకారం మరో 800 కావాలి.
ప్రతి 30 వేల మంది జనాభాకు ఒక పీహెచ్‌సీ ఉండాల్సి ఉండగా 50 వేల మందికి కూడా ఒకటి లేదు
ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రతి 20 వేల మందికి ఒక పీహెచ్‌సీ ఉండాలి. కానీ 30 వేలమందికి కూడా ఒకటి లేదు
310 పీహెచ్‌సీలలో కనీస మౌలిక వసతుల్లేవని ప్రభుత్వమే తేల్చింది. 214 పీహెచ్‌సీలకు సొంత భవనాల్లేవు
800 పీహెచ్‌సీల్లో ఇద్దరు అదనపు నర్సులతో నిరంతరం సేవలందించాలన్న మార్గదర్శకాలు అమలవలేదు
కనీసం ఒక్క పీహెచ్‌సీ పరిధిలో కూడా వైద్యులు స్థానికంగా ఉండటం లేదని ఉన్నతాధికారులు తేల్చారు
తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, కరీంనగర్ జిల్లాల్లో పీహెచ్‌సీల కొరత బాగా ఉంది

నిత్యం ప్రజల్లో ఉండాలి: పార్టీ నేతలకు విజయమ్మ పిలుపు

వైఎస్సార్ కాంగ్రెస్ విస్తృతస్థాయి సమావేశంలో విజయమ్మ ఉద్వేగభరిత ప్రసంగం
వైఎస్ సీఎంగా బాధ్యతలు చేపట్టాక తొలి సంతకం ‘ఉచిత విద్యుత్’పైనే చేశారు
పాత బకాయిలూ రద్దు చేశారు.. ఐదేళ్లు చార్జీలూ పెంచలేదు 
ఈ రోజు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు 
పాలకులకు ముందస్తు ప్రణాళిక లేదు.. 
రైతులపై లాఠీచార్జీలూ చేస్తున్నారు 
వీటన్నిటినీ ప్రధాని, వ్యవసాయ మంత్రుల దృష్టికి తీసుకెళ్లాం 
జనం మధ్య ఉన్న జగన్‌ను అన్యాయంగా నిర్బంధించారు 
జగన్ వచ్చేవరకూ ప్రజా సమస్యలపై పోరాడేందుకు మీ ముందుకు వచ్చా.. 
కోర్టులు, దేవుని మీద నమ్మకముంది.. 
జగన్‌బాబు త్వరలో తిరిగి వస్తారు

హైదరాబాద్, న్యూస్‌లైన్: ‘‘వైఎస్సార్ కాంగ్రెస్‌ది ప్రజాపక్షం. అందుకు నిత్యం ప్రజల్లో ఉండి వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలి. ప్రజలు మన పార్టీపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి’’ అని ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. శుక్రవారం వైఎస్సార్ కాంగ్రెస్ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఆమె ప్రారంభోపన్యాసం చేశారు. దాదాపు అరగంట పాటు విజయమ్మ ప్రసంగం ఆసాంతం ఉద్వేగభరితంగా సాగింది. ‘‘ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం మీ అందరి సంపూర్ణ సహకారం వల్లే సాధ్యమైంది. మీరు చూపించిన ఉత్సాహం, ప్రేమాభిమానాలకు ప్రత్యేక అభినందనలు. మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఇప్పటికీ మీ హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి ఉన్నారనేందుకు ఇంతకన్నా మరో నిదర్శనం లేదు. గతేడాది ఇదే సమయంలో వైఎస్ జన్మదినం సందర్భంగా ప్లీనరీ జరుపుకున్నాం. కానీ ప్రస్తుతం దురదృష్టమేంటంటే జగన్‌బాబును అన్యాయంగా, అక్రమంగా నిర్బంధించారు. వైఎస్ ఆశ యంకోసమే జగన్‌బాబు తపనపడ్డారు’’ అని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా విజయమ్మ కొంత ఉద్వేగానికి లోనయ్యారు. 

ఆ వెంటనే తేరుకుని మళ్లీ ప్రసంగించారు. ‘‘జగన్‌బాబు ఎప్పుడూ ఒకటి చెప్తుంటాడు. ఎంతకాలం బతికామన్నది కాదు. బతికినంత కాలం ఎలా బతికామన్నదే ముఖ్యం అని అంటుండేవారు. అందుకే ఈ రెండున్నర సంవత్సరాల కాలంలో జగన్‌బాబు కుటుంబ సభ్యులుగా మాతో కంటే ప్రజల మధ్యే ఎక్కువగా గడిపారు. నెలలో 25 రోజులు ప్రజల్లో ఉంటూ వారే తన కుటుంబంగా భావించారు. జగన్ ఒకవైపు ఓదార్పు నిర్వహిస్తూనే మరోవైపు మహానేత ఆశయం కోసం ఎప్పటికప్పుడు ధర్నాలు, దీక్షలు, పాదయాత్రలు చేశారు. పెట్రోధరలు, ప్రాజెక్టు నిర్మాణాల కోసం, రాష్ట్రానికి దక్కాల్సిన నీటి వాటా కోసం, చేనేత కార్మికులు, విద్యార్థులు, రైతుల సమస్యలపై పోరాటాలు, ఉద్యమాలు, ధర్నాలు చేశారు. కానీ ఈ రోజు అన్యాయంగా జైల్లో పెట్టారు. జగన్‌బాబు త్వరలో బయటకొస్తారు. అయితే అప్పటిదాకా వైఎస్ వారసత్వాన్ని నిలబెడుతూ.. జగన్‌బాబు వచ్చేంత వరకూ ప్రజా సమస్యలపై పోరాడేందుకు మీ ముందుకు వచ్చాను’’ అని ఆమె చెప్పారు. 

రైతులకు వైఎస్ నాటి భరోసా ఏది?: ‘‘రైతులకు రాజశేఖరరెడ్డి హయాంలో లభించిన భరోసా నేడు ఎక్కడుంది? ఆయన మొదటి సంతకమే ఉచిత విద్యుత్ ఫైలుపై పెట్టి రైతులపై తనకున్న ప్రేమను చాటుకున్నారు. అంతేకాదు పెండింగ్ బకాయిలు కూడా రద్దు చేశారు. ఐదేళ్ల కాలంలో విద్యుత్ చార్జీలు కూడా పెంచలేదు. విత్తనాలు, ఎరువుల ధరలు కూడా ఏనాడూ పెరగలేదు. ఈ రోజు అన్నింటికీ ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. పాలకులకు ఒక ప్రణాళిక, ముందస్తు ఆలోచన లేనట్లుంది. అందుకే రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. రైతులపై లాఠీచార్జీ చేస్తున్నారు. 12 సార్లు ఎరువుల ధరలు పెంచారు. ప్రస్తుత పరిస్థితుల్లో సాగు చేయాలంటే రైతులకు ధైర్యం చాలటం లేదు. పండించిన పంటకు మద్దతు ధర ఉండటంలేదు. అందుకే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రైతులు క్రాప్ హాలిడే ప్రకటించారు. 

గతంలో 865 కరువు మండలాలుగా ప్రకటించినా ఇప్పటి దాకా ప్రభుత్వం ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వలేదు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులన్నింటినీ ప్రధాని దృష్టికి తీసుకెళ్లాం. ఆయన చాలా బాగా స్పందించారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. అదే విధంగా కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శరద్‌పవార్‌ను కూడా కలిసినప్పుడు బోస్ గారు వివరించారు. ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ కర్ణాటక, మహారాష్ట్రలో మద్దతు ధర చెల్లిస్తున్నట్లుగా ఏపీ చేయటం లేదా? అని అడిగారు. లేదని చెప్పినప్పుడు వెంటనే స్పందించి అధికారుల చేత సమాచారం తెప్పించుకున్నారు. అదేవిధంగా స్వామినాథన్ కమిటీ సిఫారసులను అమలు చేయాలని ప్రధాని వద్ద ప్రస్తావించాం. సకాలంలో విత్తనాలు, ఎరువులు అందజేయాలని కోరాం’’ అని విజయమ్మ చెప్పారు. 

రోల్‌మోడల్‌గా చెప్పుకున్న వ్యక్తులెక్కడ?: ‘‘వై.ఎస్.రాజశేఖరరెడ్డి తమకు రోల్‌మోడల్ అని చెప్పుకున్న వ్యక్తులు.. ఆయన పేరును సీబీఐ అక్రమంగా ఎఫ్‌ఐఆర్‌లో నిందితుడిగా చేరిస్తే ఎందుకు మిన్నకుండిపోయారు? వీరు చెప్పేది ఒకటి.. చేసేది మరొకటని ప్రజలు గ్రహించారు. శంకర్రావు లేఖ రాస్తే దానికి టీడీపీ వత్తాసు పలకటం.. కేసులో ఇంప్లీడ్ అవటాన్ని మీరందరూ గమనిస్తూనే ఉన్నారు. వివాదాస్పదంగా మారిన 26 జీవోలపై ప్రభుత్వం ఎందుకు సమాధానం చెప్పటంలేదని అడుగుతున్నా. ఇదే విషయాన్ని న్యాయస్థానాలు ప్రశ్నించినా ప్రభుత్వం సమాధానం చెప్పకుండా దాటవేసింది. అదే విధంగా సీబీఐ కూడా వక్రదృష్టితో విచారణ చేస్తోంది. న్యాయస్థానం విచారణకు ఆదేశించిన 24 గంటలు గడవక ముందే 28 టీంలను ఏర్పాటు చేసి పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్ల ఇళ్లపై, మా నివాసాలపై దాడులకు తెగబడింది. అంతేకాదు రాష్ట్రంలో ఒక భయోత్పాతాన్ని సృష్టించింది. సీబీఐ ఇప్పటి దాకా మాకు సంబంధించిన 2,000 మంది ఫోన్లను ట్యాప్ చేసినట్లు తెలిసింది’’ అని ఆమె వెల్లడించారు. 

కుట్రపూరితంగా సీబీఐ దర్యాప్తు... 

‘‘వైఎస్ తన ఐదేళ్ల పాలనలో నిబంధనలను ఎక్కడా అతిక్రమించలేదు. సెజ్‌ల కోసం భూములు కేటాయించటమనేది అంతకు ముందున్న ప్రభుత్వాలు చేసినదే కదా? ప్రభుత్వ గైడ్‌లైన్స్‌నే ైవె ఎస్ పాటించారు. అయితే సీబీఐ మాత్రం తన మనసులో ఏదో కుట్ర పెట్టుకొని అదే కోణంలో దర్యాప్తు చేస్తోంది. ఎమ్మార్ కేసు విషయాన్నే చూస్తే.. దానికి భూములు కేటాయించింది చంద్రబాబు. కానీ సీబీఐ వాళ్లు ఆయన్ని ప్రశ్నించరట. అంతేకాదు చంద్రబాబు ఆస్తులపై దర్యాప్తు చేయాలని కోర్టు ఆదేశించి నెల రోజులు గడిచినా దర్యాప్తు ప్రారంభించలేదు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సీబీఐ అధికారులు కోర్టుకు కూడా తప్పుడు సమాచారం ఇస్తున్నారు. ఇండియా సిమెంటు కంపెనీకి వైఎస్ ప్రభుత్వం 0.013 టీఎంసీల నీటిని కేటాయిస్తే, సీబీఐ మాత్రం ‘ఈనాడు’ పత్రికలో 13 టీఎంసీలు అని రాస్తే అదే విషయాన్ని కోర్టుకు చెప్తుంది. దీంతో సీబీఐ దర్యాప్తులో ఉన్న డొల్లతనం బయటపడింది’’ అని విజయమ్మ పేర్కొన్నారు. ‘‘తన జీవితం తెరిచిన పుస్తకం లాంటిదని బతికున్నన్నాళ్లు వైఎస్ ఎప్పుడూ చెప్తుండేవారు.. జగన్‌బాబు జీవితం కూడా తెరిచిన పుస్తకం లాంటిదే’’ అని ఆమె పేర్కొన్నారు. 

అన్యాయంగా అరెస్టు: ‘‘జగన్‌బాబు కోర్టుకు హాజరయ్యే ముందు రోజు అన్యాయంగా సీబీఐ అరెస్టు చేసింది. ఉప ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నప్పటికీ సీబీఐ అందజేసిన నోటీసులను గౌరవించి మూడు రోజుల పాటు విచారణకు సహకరించారు. అయినప్పటికీ విచారణకు సహకరించటం లేదం టూ సీబీఐ అబద్ధాలు చెప్పింది. ఇప్పుడు జగన్‌కు బెయిల్ రాకుండా వింత వాదన చేస్తోంది. జగన్ ఎంపీ అని, సాక్షులను ప్రభావితం చేస్తారని చెప్తోంది. అయితే ఇక్కడ ఒకటి గమనించాలి.. సీబీఐ విచారణ ప్రారంభంకాక ముందే జగన్‌బాబు ఎంపీగా ఉన్నారు. ఇప్పుడూ ఉన్నారు. మునుముందు ఉంటారు. కానీ ప్రజల మధ్య తిరగనీయకుండా సీబీఐ అడ్డుకుంటుంది. అంతేకాదు వైఎస్ కుటుంబాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు నిత్యం ఒక వర్గం మీడియాకు లీకులు చేస్తున్నారు. జైల్లో కరెంటు ఉండదు. కోర్టుకు క్రిమినల్స్ మాదిరిగా ఒక మామూలు వ్యానులో తీసుకెళ్లారు. జగన్ ప్రాణాలకు ముప్పు తెచ్చే విధంగా ప్రవర్తిస్తున్నారు. ఇక్కడ మరో విషయం గమనించాలి.. మూడు చార్జిషీట్లు వేసేదాకా కూడా జగన్‌ను ఒక్కసారి కూడా విచారించలేదు’’ అని విజయమ్మ గుర్తుచేశారు. 

వచ్చే ఎన్నికలకు సిద్ధంకండి

ప్రస్తుత ఉపఎన్నికల్లో సాధించిన విజయం స్పూర్తితో వచ్చే ఎన్నికలకు పార్టీ నేతలంతా సిద్ధంగా ఉండాలని విజయమ్మ పిలుపునిచ్చారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కొనడానికి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పార్టీని మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని, అందుకోసం బూత్ కమిటీల ఏర్పాటును సాధ్యమైనంత తొందరగా పూర్తి చేయాలని చెప్పారు. అనునిత్యం ప్రజల్లో పనిచేయడం ద్వారా వారికి మరింత దగ్గరకావాలన్నారు.

వైఎస్ కుటుంబం చేసిన తప్పేంటి?


‘‘ఈ రోజు ఈ పరిస్థితి ఏ విధంగా వచ్చిందో మీరు గమనిస్తూనే ఉన్నారు. వైఎస్ కుటుంబం చేసిన తప్పేంటి? అని నేను అడుగుతున్నా. ఇంత మంది హృదయాల్లో గూడుకట్టుకోవటమే నేరమా? రాష్ట్రంలో ‘ఈనాడు’ చెప్పేదే వేదంలో ఉన్న పరిస్థితుల్లో మరో కోణం వెలుగులోకి తెచ్చేందుకు ‘సాక్షి’ని ప్రారంభించటమే తప్పా? వైఎస్ మరణం తట్టుకోలేక ప్రాణాలొదిలిన వారి కుటుంబాలను ఓదార్చటమే తప్పా? వైఎస్ లక్ష్యాలను, ఆశయాలను ముందుకు తీసుకెళ్లటమే నేరమా? వైఎస్ సువర్ణయుగం కోసం పోరాటాలు చేయటం తప్పా? ఇన్ని ఇబ్బందులు, వేధింపులు, కుట్రలు ఎందుకని అడుగుతున్నా. వారు ఎన్ని చేసినా జగన్‌బాబు ఏనాడూ భయపడలేదు, వెనుకంజ వేయలేదు. అందుకే ఈ రోజు బలవంతంగా నిర్బంధించారు’’ అని విజయమ్మ వివరించారు. 

జగన్ తప్పకుండా వస్తారు...

‘‘వైఎస్ ఏ తప్పు చేయలేదు. అదే విధంగా జగన్‌బాబు కూడా ఎలాంటి తప్పు చేయలేదని మీకు మనవి చేసుకుంటున్నా. కోర్టుల మీద, దేవుని మీద నాకు నమ్మ కం ఉంది. కచ్చితంగా ధర్మం, న్యాయం గెలిచి తీరుతుం ది. ఎన్నికల్లో నాబిడ్డ నిర్దోషి అని మీరు తీర్పు ఇచ్చారు. జగన్ నాయకత్వం కోరుకున్నారు. తప్పకుండా జగన్ బయటకువస్తారు. ఉప ఎన్నికల సందర్భంగా జగన్‌ను అణచి వేసేందుకు కాంగ్రెస్, టీడీపీ ఎంతగా కుమ్మక్కయ్యారో ఫలితాల సరళి తెలియజేస్తోంది. కొన్ని చోట్ల ఒకరికొకరు సహకరించుకుని డిపాజిట్లు పోగొట్టుకున్నారు. రామచంద్రపురం, నర్సాపురంలో టీడీపీ డిపాజిట్లు కోల్పోయిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అలాగే సురేఖమ్మను ఓడించేందుకు పరకాలలో కాంగ్రెస్, టీడీపీ కలిసి టీఆర్‌ఎస్‌కు ఓట్లు వేయించాయి. అయినా సరే ఈ మూడు స్థానాల్లో కూడా మనదే నైతిక విజయం. వారు గెలిచి ఓడిపోయారు’’ అని విజయమ్మ పేర్కొన్నారు. 

పార్టీ విస్తృత సమావేశంలో తీర్మానాలు


రైతుల సమస్యలు పరిష్కరించటంలో సర్కారు ఘోర వైఫల్యం
8న వైఎస్ జన్మదినం సందర్భంగా ప్రభుత్వంపై నిరసనలు 
రైతు సమస్యలపై వైఎస్ విగ్రహానికి వినతిపత్రాల సమర్పణ 
లక్ష్మీపేట దళితులను హత్యచేసిన దోషులను కఠినంగా శిక్షించాలి 
రాష్ట్రపతి ఎన్నికపై పార్టీ వైఖరి నిర్ణయాధికారం జగన్‌కే 
పార్టీపై విశ్వాసం ఉంచినందుకు ప్రజలకు కృతజ్ఞతలు

హైదరాబాద్, న్యూస్‌లైన్: రాష్ట్రంలో రైతుల కష్టాలను తీర్చటంలో ఘోరంగా విఫలమైన ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరచి వారిని ఆదుకోవాలని వైఎస్సార్ కాం గ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. రైతులు, రైతు కూలీలు, చేనేత కార్మికులు, మత్స్యకారులు, గిరిజనులు, దళి తులు.. అన్ని వర్గాల ప్రజలనూ సర్కారు విస్మరించిందని, వారి సంక్షేమాన్ని ఏ మాత్రం పట్టించుకోవటం లేదని ధ్వజమెత్తింది. శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ అధ్యక్షతన జరిగిన కేంద్ర పాలకమండలి, కార్య నిర్వాహక మండలి, ప్రజాప్రతినిధుల, అనుబంధ సంఘాల విస్తృత సమావేశంలో 11 తీర్మానాలను ఆమోదించారు. సమావేశం వివరాలను పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ కోఆర్డినేటర్ కొణతాల రామకృష్ణ, కమిటీ సభ్యులు డి.ఎ.సోమయాజులు మీడియాకు వెల్లడించారు. తీర్మానాల్లోని ముఖ్యాంశాలివీ... 

విత్తనాలు, ఎరువుల ధరలు పెరిగి పోతున్నాయి కానీ ధాన్యానికి కనీస మద్దతు ధర మాత్రం పెరగటం లేదని సమావేశం అభిప్రాయపడింది. గత ఏడాది మాదిరిగానే రైతులు క్రాప్ హాలిడే ప్రకటించే పరిస్థితులు నెలకొనకుండా తక్షణం ప్రభుత్వం జోక్యం చేసుకుని నివారించాలని డిమాండ్ చేసింది. 

రైతుల కష్టాలను శాశ్వతంగా తీర్చే ప్రాణహిత-చేవెళ్ల, పోల వరం ప్రాజెక్టుల నిర్మాణాన్ని తక్ష ణం చేపట్టాలని విజ్ఞప్తి చేసింది. 

వైఎస్ 63వ జయంతి అయిన ఈ నెల 8న రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకు నివాళులర్పిం చి.. రైతులు, రైతు కూలీల సమస్యల పట్ల రాష్ట్ర ప్రభు త్వ వైఖరిని నిరసిస్తూ వైఎస్ విగ్రహాలకు వినతి పత్రా లు సమర్పించాలని సమావేశంలో నిర్ణయించారు. వైఎస్ విగ్రహాలకు సమర్పించే వినతి పత్రంలో రైతు సమస్యలు పరిష్కరించేలా ప్రభుత్వానికి జ్ఞానోదయా న్ని కలిగించాల్సిందిగా ప్రార్థించాలని నిర్ణయించారు. 
వైఎస్ ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు, ఆరోగ్యశ్రీ, పావలా వడ్డీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, 108, 104 సర్వీసులకు ప్రభుత్వం తిలోదకాలు ఇవ్వటంపై తీర్మానంలో ఆగ్రహం వ్యక్తం చేసింది. వీటన్నింటినీ పూర్తి స్థాయిలో అమలు చేయాలని కోరారు. 

శ్రీకాకుళం జిల్లా లక్ష్మీపేట దళితులను హత్య చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని తీర్మానం చేశారు. హైకోర్టు సిటింగ్ న్యాయమూర్తితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. 

విశాఖపట్నం సమీపంలో ఎన్‌టీపీసీ కాలుష్యం వల్ల మత్స్యకారుల ప్రశాంత జీవితానికి భంగం వాటిల్లకుండా పూర్తి భరోసా ఇవ్వాలని కోరుతూ తీర్మానం చేశారు. అక్కడ ఆందోళన చేస్తున్న వారిపై పోలీసులు లాఠీచార్జి చేయటాన్ని సమావేశం ఖండించింది. 

చేనేత కార్మికులకు ఇవ్వాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలనీ వారి ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లు కల్పించాలనీ తీర్మానం చేశారు. గిరిజనుల సర్వతోముఖాభివృద్ధికి వైఎస్ తీసుకున్న చర్యలను కొనసాగించాలని డిమాండ్ చేశారు. మైనారిటీలకు 4% రిజ ర్వేషన్లు పటిష్టంగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభాన్ని అధిగమించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. 
రాష్ట్రపతి ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన విధానాన్ని నిర్ణయించే అధికారాన్ని అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి అప్పగిస్తూ తీర్మానం చేశారు. 

ప్రచార బాధ్యతలు చేపట్టి ఉప ఎన్నికల్లో ఒంటి చేత్తో పార్టీ అభ్యర్థులను గెలపించినందుకు సమావేశం విజయమ్మను అభినందించింది. వైఎస్సార్ కాంగ్రెస్‌పై అచంచల విశ్వాసంతో ఓట్లేసి జాతీయ స్థాయిలో ఒక శక్తిగా ఎదిగేం దుకు దోహదం చేసిన రాష్ట్ర ప్రజలకు ఒక తీర్మానంలో హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

జగన్ కేసుల విషయంలో సీబీఐ కక్ష సాధింపుతో వ్యవహరిస్తోందనీ, ఎలాంటి నేర నిర్ధారణ కాక పోయి నా అక్రమంగా అరెస్టు చేశారనీ సమావేశం ఒక తీర్మానంలో ఖండించింది. నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన సీబీఐ కొన్ని పత్రికలకు ముందుగానే తప్పుడు సమాచారం చేరవేస్తోందని మండిపడింది. సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ తన విధులను పక్షపాతం తో నిర్వహిస్తున్నారని కాంగ్రెస్, టీడీపీలకు లబ్ధి చేకూర్చే విధంగా విచారణ చేస్తున్నారనే విషయం వెల్లడైందని దీనిని సమావేశం ఖండిస్తోందని తీర్మానం చేశారు.

జగన్ విచారణకు ఈడీకి అనుమతి

సీబీఐ ప్రత్యేక కోర్టు ఉత్తర్వులు
నేటి నుంచి 21వ తేదీ లోపు విచారించవచ్చు
న్యాయవాది సమక్షంలో విచారణ జరపాలి
హైదరాబాద్, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డిని చంచల్‌గూడ జైలులో విచారించేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) అధికారులకు సీబీఐ ప్రత్యేక కోర్టు అనుమతిచ్చింది. శనివారం నుంచి ఈనెల 21లోపు జగన్‌ను జైలులో ఈడీ అధికారులు విచారించుకోవచ్చని ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్‌రావు శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య న్యాయవాది సమక్షంలో విచారించవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జగతి పబ్లికేషన్స్ పూర్వ చైర్మన్, డెరైక్టర్ హోదాలో ఆయన్ను ఈడీ విచారించనుంది. ఈడీ డిప్యూటీ డెరైక్టర్ రాజేశ్వర్‌సింగ్ నేతృత్వంలో అసిస్టెంట్ డెరైక్టర్లు కమల్‌సింగ్, సుశీల్‌కుమార్, ఎస్.యానాదిరెడ్డి, వై.నరసింహారావులతో కూడిన బృందం జగన్‌ను జైలులో విచారించి వాంగ్మూలం నమోదు చేసేందుకు అనుమతించాలని జైలు సూపరింటెండెంట్‌ను ఆదేశించారు.
అంతకు ముందు.. జగతి పబ్లికేషన్స్ చైర్మన్, డెరైక్టర్‌గా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 2011 ఫిబ్రవరి 1న రాజీనామా చేశారని, ఈ నేపథ్యంలో జగతి పబ్లికేషన్స్ డెరైక్టర్‌గా ఉన్నారన్న కారణంగా జగన్‌ను విచారించే అధికారం ఈడీకి లేదని జగన్ తరఫు న్యాయవాది జి.అశోక్‌రెడ్డి సీబీఐ ప్రత్యేక కోర్టుకు నివేదించారు. దర్యాప్తు సంస్థల విచారణకు ఎవరు హాజరు కావాలన్నది సదరు సంస్థ నిర్ణయించుకుంటుందని, నేర విచారణ చట్టం (సీఆర్‌పీసీ) దీన్ని స్పష్టం చేస్తోందని తెలిపారు. సంస్థ ప్రతినిధిగా ఎవరినైనా పంపే విచక్షణ చట్టం కల్పించిందని చెప్పారు. 

ఈ నోటీసులకు జగతి పబ్లికేషన్స్ స్పందిస్తూ.. వారు కోరిన సమాచారాన్ని ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో అందజేశారని, తర్వాత మే 25, జూన్ 14, 15 తేదీల్లో కూడా ఈడీ అడిగిన సమాచారాన్ని అందించారని నివేదించారు. జగతి పబ్లికేషన్స్ తరఫున కోర్టు విచారణకు కంపెనీ సెక్రటరీ సీపీఎన్.కార్తీక్ హాజరయ్యేందుకు ఇదే కోర్టు అనుమతిస్తూ జూన్ 20న ఉత్తర్వులు జారీచేసిన విషయాన్ని గుర్తుచేశారు. జగతి పబ్లికేషన్స్‌లో పెట్టుబడులకు సంబంధించిన సమాచారం కావలిస్తే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని విజ్ఞప్తి చేశారు. జగన్‌ను విచారించేందుకు ఈడీ ఎటువంటి కారణాలు చూపలేదని, ఆధారాలు లేకుండా జగన్‌ను విచారించేందుకు అనుమతి కోరడం చట్టవిరుద్దమని పేర్కొన్నారు. జగతి పబ్లికేషన్స్ వివరాలేవీ జగన్‌కు తెలియవని, కంపెనీకి సంబంధించిన డాక్యుమెంట్లేవీ చూడకుండా జగన్ ఈడీ ప్రశ్నలకు ఎలా సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ఈడీ పిటిషన్‌ను కొట్టివేయాలని విజ్ఞప్తి చేశారు. 

కేసు తీవ్రత దృష్ట్యానే... ఈడీ

మనీలాండరింగ్ కింద కేసులు నమోదు చేయడానికి ప్రాథమిక ఆధారాలున్నాయని, ఈ మేరకు తమకు దర్యాప్తు జరిపే అధికారం ఉందని ఈడీ తరఫున న్యాయవాది గోపాలకృష్ణ గోఖలే వాదనలు వినిపించారు. ఇప్పటికే జగన్ సంస్థల్లో పెట్టుబడుల వ్యవహారంపై ఈసీఐఆర్ (ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్ఫర్శెషన్ రిపోర్ట్) నమోదు చేశామని, మనీలాండరింగ్ చట్టంలోని సెక్షన్ 50 కింద దర్యాప్తు అధికారి ఎవరికైనా సమన్లు, నోటీసులు జారీ చేసి విచారణ చేపట్టవచ్చని తెలిపారు. అయితే ప్రస్తుతం జగన్ జైల్లో ఉన్నందునే విచారించేందుకు న్యాయస్థానం అనుమతి కోరుతున్నామని పేర్కొన్నారు. జగతి పబ్లికేషన్స్ డెరైక్టర్‌గా రాజీనామా చేసినా జగన్‌ను ప్రశ్నించే అధికారం తమకుందని, జైలులోనే జగన్‌ను విచారిస్తామని పేర్కొన్నారు. కేసు తీవ్రత దృష్ట్యానే పలుమార్లు విచారించాల్సి వస్తోందన్నారు. ఈడీ వాదనతో కోర్టు ఏకీభవిస్తూ విచారణకు అనుమతించింది.

జగన్‌ను జైల్లో పెట్టి స్థానిక ఎన్నికలకు కుట్ర

కాంగ్రెస్, టీడీ పీలపై శోభానాగిరెడ్డి మండిపాటు

హైదరాబాద్, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని అక్రమంగా జైల్లో బంధించి స్థానిక ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్, టీడీపీలు కలిసి కుట్ర చేస్తున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ కార్యనిర్వాహక మండలి సభ్యురాలు, ఎమ్మెల్యే భూమా శోభానాగిరెడ్డి ఆరోపించారు. ఏడాదిన్నర కాలంగా స్థానిక ఎన్నికల గురించి ఆలోచించని అధికార పార్టీ.. అకస్మాత్తుగా వాటిని తెరపైకి తేవడంలో ఉన్న ఆంతర్యమేంటని ఆమె ప్రశ్నించారు. జగన్ బయట ఉంటే ఆ ఎన్నికలను కూడా స్వీప్ చేస్తారనే దురుద్దేశంతోనే ఇలా ప్రవర్తిస్తున్నారని దుయ్యబట్టారు. పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. జగన్‌ను అక్రమంగా నిర్బంధించి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మూడు రోజుల పాటు జిల్లాల పర్యటన చేస్తానని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. దివంగత వైఎస్సార్ ప్రవేశపెట్టిన పథకాల పేరు మార్చడం తప్ప సీఎం కొత్తగా చేస్తున్నదేంలేదన్నారు. వైఎస్ మరణంపై తమకు ఇప్పటికీ అనుమానాలున్నాయని తెలిపారు. వైఎస్ మరణంపై విచారణను ఎలా జరిపించుకోవాలో తమ పార్టీకి అవగాహన ఉందని, దాన్ని తప్పకుండా అమలుచేస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్, టీడీపీ నేతలు చేసే విమర్శలకు విజయమ్మ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని ఓ ప్రశ్నకు బదులిచ్చారు. వైఎస్ మరణంపై సమగ్ర దర్యాప్తు చేయించాల్సిన ప్రధాన బాధ్యత అధికారంలో ఉన్న పార్టీకి ఉందన్నారు. అనవసరంగా తమపై బురద చల్లే కంటే ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేయాలని ఆమె డిమాండ్ చేశారు. మూడు నెలల్లో దర్యాప్తు ముగించడం, ప్రమాద స్థలంలో అవయవాలు కూడా సరిగ్గా తీసుకురాకపోవడం దేనికి సంకేతం అని ప్రశ్నించారు.

బొత్స, కొండ్రును బర్తరఫ్ చేయాలి: నల్లా

శ్రీకాకుళం జిల్లా లక్ష్మీపేటలో దళితుల ఊచకోతకు కారకులైన రాష్ట్ర మంత్రులు బొత్స సత్యనారాయణ, కొండ్రు మురళీమోహన్‌లను వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ ఎస్సీ సెల్ కన్వీనర్ నల్లా సూర్యప్రకాష్‌రావు డిమాండ్ చేశారు. ఐదుగురు హత్యకు గురైన ఈ సంఘటనపై హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత సమగ్ర విచారణ జరిపించాలని శుక్రవారం మీడియా సమావేశంలో కోరారు.

Popular Posts

Topics :