08 July 2012 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

YSRCP MLA's fire on ministers for power cuts

Written By news on Saturday, July 14, 2012 | 7/14/2012

YSR Congress Party maha dharna news

సీబీఐ నన్ను టార్గెట్ చేసింది: నిమ్మగడ్డ ప్రసాద్

బెయిల్ పిటిషన్‌పై విచారణలో నిమ్మగడ్డ ప్రసాద్ వెల్లడి
విచారణకు పూర్తిగా సహకరించినా అరెస్టు చేశారు
ఇతర పెట్టుబడిదారులంతా బయటే ఉన్నారు
విచారణ ఈనెల 16కి వాయిదా

హైదరాబాద్, న్యూస్‌లైన్: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో మొదటి చార్జిషీట్‌లో నిందితులుగా ఉన్న పెట్టుబడిదారులంతా బయటే ఉన్నారని, వాన్‌పిక్ సంస్థల అధినేత నిమ్మగడ్డ ప్రసాద్‌ను సీబీఐ లక్ష్యంగా చేసుకొందని ఆయన తరపు న్యాయవాది రాజశేఖర్ సీబీఐ ప్రత్యేక కోర్టుకు నివేదించారు. విచారణకు ప్రసాద్ సహకరించినప్పటికీ, సీబీఐ ఆయన్ని అరెస్టు చేసిందని తెలిపారు. బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ నిమ్మగడ్డ ప్రసాద్ దాఖలు చేసిన పిటిషన్‌ను ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్‌రావు శుక్రవారం మరోసారి విచారించారు. ఈ సందర్భంగా రాజశేఖర్ వాదనలు వినిపిస్తూ.. నిమ్మగడ్డ ప్రసాద్ సీబీఐ దర్యాప్తునకు పూర్తిగా సహకరించారని, ఆయనకు తెలిసిన అన్ని విషయాలను చెప్పారని తెలిపారు. ప్రసాద్ 8 సార్లు మాత్రమే విచారణకు హాజరైనట్లు సీబీఐ చెబుతోందని, అయితే, ఆయన 13 సార్లు విచారణకు హాజరయ్యారని, ఇందుకు సంబంధించిన ఆధారాలను కోర్టు ముందుంచేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. సీబీఐ కేసు డైరీని నిర్వహించడంలేదని, 13 సార్లు హాజరైనా 8 సార్లు మాత్రమే వచ్చారంటూ కోర్టుకు తప్పుడు సమాచారం ఇస్తోందని ఆరోపించారు. ఇక్కడే సీబీఐ దురుద్దేశం బయటపడుతోందన్నారు. సీబీఐ విచారణకు పిలిచే ముందురోజు వ్యాపార పనుల్లో భాగంగా ప్రసాద్ విదేశాలకు వెళ్లాల్సి ఉందని, అయితే చట్టం మీద గౌరవంతోనే ఆయన విదేశీ పర్యటనను రద్దు చేసుకొని సీబీఐ ఎదుట హాజరయ్యారని తెలిపారు. నిమ్మగడ్డ ప్రసాద్ తప్పు చేసి ఉంటే విదేశాలకు పారిపోయి ఉండేవారని, చట్టబద్ధంగానే లాభాల కోసమే జగన్‌మోహన్ రెడ్డి సంస్థలతోపాటు అనేక సంస్థల్లో పెట్టుబడులు పెట్టారని వివరించారు. 

స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అభివృద్ధికి నోచుకోని వెనుకబడిన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే రస్ అల్ ఖైమా (రాక్)తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని తెలిపారు. ఇందులో భాగంగా పోర్టులకు 4 వేల ఎకరాలు, పారిశ్రామికవాడకు 18 వేల ఎకరాలు కేటాయించిందని చెప్పారు. ఇందులో 13 వేల ఎకరాలు స్వాధీనం చేసుకున్నారని, ఈ భూములకు మార్కెట్ ధర చెల్లించారని తెలిపారు. జీవోల్లోని నిబంధనల మేరకే వీటిని కొనుగోలు చేశారని, ఇందులో ప్రభుత్వానికి ఒక్క పైసా కూడా నష్టం లేదని వివరించారు. రాక్‌తో కలిసి వ్యాపార భాగస్వామిగా రూ.20 వేల కోట్ల ఖర్చుతో ఈ ప్రాంతంలో పారిశ్రామికవాడ, పోర్టులను అభివృద్ధి చేసి ఉపాధి కల్పించాలని ప్రసాద్ భావించారని, ఇప్పటికే కొన్ని కోట్లు ఖర్చు చేశారని చెప్పారు. 2006 డిసెంబర్ నుంచే జగన్ సంస్థల్లో ప్రసాద్ పెట్టుబడులు పెట్టారని తెలిపారు. లాభాల కోసమే ఆయన పెట్టుబడులు పెట్టారని చెప్పారు. పెట్టుబడులు పెట్టడమే నిమ్మగడ్డ ప్రసాద్ వ్యాపారమని వివరించారు. 

వాన్‌పిక్‌కు చెందిన 17 మంది ఉద్యోగులు లెక్కలేనన్ని సార్లు సీబీఐ ఎదుట హాజరై అన్ని వివరాలు సమర్పించారని, ట్రక్కుల్లో డాక్యుమెంట్లను తెచ్చి సీబీఐకి అందజేశారని పేర్కొన్నారు. నిమ్మగడ్డ ప్రసాద్ ఒక్క డాక్యుమెంట్ కూడా ఇవ్వలేదని, ఆయన ఉద్యోగుల ద్వారా తీసుకున్నామని సీబీఐ ఆరోపిస్తోందని, అయితే... ప్రసాద్ అనుమతి లేకుండా ఉద్యోగులు సీబీఐకి సమాచారం ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు. గంగవరం, కృష్ణపట్నం పోర్టుల తరహాలో ఈ ఒప్పందం లేదని సీబీఐ ఆరోపిస్తోందని, అన్ని ఒప్పందాలు ఒకేలా ఉండాల్సిన అవసరం లేదని అన్నారు. నిజాంపట్నం, వాడరేవుల అభివృద్ధితోపాటు పారిశ్రామికవాడ ఏర్పాటుకు రాక్ ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని, ఇందులో నిమ్మగడ్డ మన దేశం తరపున వ్యాపార భాగస్వామి మాత్రమేనని పేర్కొన్నారు. ఒప్పందం చేసుకున్న వాళ్లను వదిలేసి భాగస్వామిగా ఉన్న నిమ్మగడ్డను అరెస్టు చేశారన్నారు. డ్రాఫ్ట్ ఒప్పందానికి, ఎంఓయూకు ఎటువంటి మార్పు లేదని, అన్ని విభాగాల పరిశీలన, మంత్రి మండలి ఆమోదం తర్వాతే ఒప్పందానికి ఆమోదముద్ర వేశారని వివరించారు. బెయిల్ పిటిషన్‌పై సీబీఐ వాదనల కోసం తదుపరి విచారణను కోర్టు ఈనెల 16కు వాయిదా వేసింది.

రైతన్నపై కపట రాజకీయం!



రైతు లేనిదే రాజ్యం లేదు. అన్నదాత కాడి కింద పడేస్తే దేశానికి అనర్థం తప్పదు. ఇలాంటి పడికట్టు పదజాలంతో మన పాల కులు తరచూ ఉపన్యాసాలను ఊకదంపు డుగా దంచేస్తూనే ఉంటారు. మరింత ముం దుకెళ్లి ‘కలకంఠి కంట కన్నీరొలికిన ఇల్లు - కర్షకుని కంట కన్నీరొలికిన దేశం సుభిక్షంగా మనజాలదని సందర్భం వచ్చినప్పుడల్లా ఉపమానాలతో వల్లెవేస్తూ ఉంటారు. అంత వరకే! కర్షకుని కన్నీరు తుడిచే ప్రయత్నం పొరపాటున కూడా చేయరు. కర్షకులకు సంబంధించి ఏవైనా మేలు కలిగించే చర్యలు తీసుకోవాల్సివచ్చినప్పుడు వారికి చేతులేరావు. మాటల్లోని ఉదారతను - చేతల్లో కనబరచేందుకు ఎంతమాత్రం ఇష్ట పడని పాలకులవల్లే రైతుల పరిస్థితి నానాటికి తీసికట్టు అన్నట్లు తయారైంది. కేంద్రంలోని అధికారపక్ష పెద్దల తీరుకు, రాష్ట్రంలోని పాలకుల తీరు భిన్నంగా ఏమీలేదు. దొందూదొందే అన్న రీతిగానే సాగుతోంది. రైతుల విషయంలో రాష్ట్రం చేసే అభ్యర్థనలకు దిక్కూదివాణం లేక పోగా కేంద్రం నుంచి వచ్చే సూచనలకు రాష్ట్ర పాలకులు మోకాలడ్డుతూ ఉండ టం రైతుల పరంగా దురదృష్టకర పరిణామం!

వ్యవసాయరంగం బలోపేతానికి స్వామినాథన్, మహేల్కర్ కమిటీలు చేసిన సిఫారసులను పూర్తిస్థాయిలో అమలుచేశామా లేదా అన్నది సమీక్షించు కోవాల్సి ఉందని మన ప్రధాని తరచూ పేర్కొంటూ ఉంటారు. అయితే ఆ సిఫార్సుల పూర్తి అమలుకు మాత్రం ఆయన పూనుకోరు. మరొకవంక ఆయన ప్రభుత్వమే రైతును ఆర్థికంగా కుంగదీసే దుర్విధానాలను తు.చ. తప్పకుండా అమలు చేస్తూంటుంది. ఆ మధ్య విదర్భ ప్రాంతంలో రైతుల ఆత్మహత్యలు వేలాదిగా పెరిగిపోయినప్పుడు ఇదే ప్రధాని అక్కడకు వెళ్లారు. ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం ఏమేమి చర్యలకు ఉపక్రమించాలో అక్కడి వారిని విచారించారు. తమ పంటలకయ్యే వ్యయాన్ని అనుసరించి ధరలు కల్పిస్తే చాలని వారు తెలిపారు. ఆ తరువాత ప్రధాని ఆ అంశాన్ని సమావేశాలకు, సమీక్షలకే పరిమితం చేసి వదిలిపెట్టారు. ఆ సందర్భంలోనైనా స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల అమలుకు పూర్తిస్థాయిలో ప్రయత్నించలేదు. స్వామినాథన్ అసలు సిసలు సిఫార్సు పెట్టుబడి వ్యయానికి యాభై శాతం వ్యయం అదనంగా కలపాలనేది అప్పుడే కాదు ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు.
పత్తి, చక్కెర తదితరాల ఎగుమతిపై కేంద్రం విధించిన నిషేధాన్ని ఆ శాఖ మంత్రి శరద్ పవార్ తీవ్రంగా ఆక్షేపించాడు. ఆ మేర ప్రధానికి లేఖాస్త్రం కూడా సంధించాడు. చక్కెర ఎగుమతులపై ఆహారమంత్రిత్వశాఖ పెడధోరణి కారణంగా భారీగా నష్టపోవాల్సివచ్చిందని, ఎగుమతులు సజావుగా సాగి ఉంటే చెరకు రైతులకు చెల్లించాల్సిన రూ.8000 కోట్ల బకాయిలు వెంటనే తీర్చేందుకు వీలుకలిగేదని వాపోయాడు. అలాగే పత్తి ఎగుమతుల నిషేధంపై జౌళి మంత్రిత్వశాఖ నిర్ణయమూ రైతుల కడుపుకొట్టిందని బాధపడ్డాడు. నిషేధం విధించిన ఆ ఒక్కరోజులోనే పత్తి ధర దేశీయ మార్కెట్లలో రూ.4,000ల నుంచి 3,000లకు పడిపోవడం తనను ఎంతో ఆవేదనకు గురిచేసిందని చింతించాడు. ఇలా రైతుపక్షం వహించి విలపించే ధోరణిని ప్రదర్శించిన పవార్ చేతల్లో మాత్రం రైతుపట్ల కఠినత్వాన్నే అనుసరిస్తున్నాడు.

గత సీజనులో ప్రపంచంలో అరుదైన అపురూపపు పంట రాయలసీమ ప్రాంతపు కేపీ ఉల్లికి కనీస ధర రాకుండా అడ్డుకున్నాడు. రాష్ట్ర మార్క్‌ఫెడ్ సంస్థ కేపీ ఉల్లి కొనుగోళ్లకు ముందుకొచ్చినప్పటికీ దానికి మార్కెట్ జోక్యం స్కీమును అనుసంధించేందుకు ససేమిరా అన్నాడు. దానితో ఆ రైతులు పూర్తిగా దివాళా తీశారు. ఇటీవల రాష్ట్రంలో మార్క్‌ఫెడ్ చేపట్టిన పసుపు కొనుగోళ్ల విషయంలో మార్కెట్ జోక్యం స్కీమును అనుమతించినప్పటికీ కొనుగోలు ధర నిర్ణయంలో పసుపు రైతులను చావుదెబ్బ కొట్టాడు. రాష్ర్ట ప్రభుత్వం నామమాత్రంగానే సిఫార్సు చేసిన రూ.4,500ల పసుపు ధరను పవార్ ముష్టి కింద దాన్ని రూ.4,000లకు కుదించి తన చేతల విశ్వరూపాన్ని పసుపు రైతులపై ప్రదర్శించాడు. ఫలితంగా మార్క్‌ఫెడ్ పసుపు కొనుగోళ్లు ఆకుకు అందని - పోకకు పొందని విధంగా తయారై పూర్తిగా అటకెక్కాయి. దానితో పసుపు కొనుగోళ్లు ప్రభుత్వ నిర్దేశిత లక్ష్యం 54 వేల మెట్రిక్ టన్నులలో వెయ్యో వంతును కూడా చేరుకోలేక నామమాత్రావశిష్ఠమైపోయాయి. ఈ పరిణామాలు పసుపు రైతులకు అశనిపాతం కాకమరేమిటి?

వ్యవసాయ ఉత్పత్తుల ధరల నిర్ణాయక కమిటీకి నాయకత్వం వహించే అశోక్ గులాటీ రైతుల శ్రేయానికి సంబంధించిన అంశాలలో అభిప్రాయపరంగా మరింత ముందు వరుసలో ఉంటున్నాడు. వ్యవసాయ ఉత్పత్తులపై ఎగుమతి నిషేధం విధించినప్పుడు ప్రభుత్వం వెంటనే కనీస మద్దతు ధరను 10 శాతం పెంచాలనేది ఆయన న్యాయమైన డిమాండ్! వ్యవసాయోత్పత్తుల ఎగుమతులను నిషేధించడం పరోక్షంగా రైతుల ఆదాయానికి అడ్డుపడటంతో పాటు వారిపై పన్ను వేయడమేనని ఆయన వాదన! అందువల్ల రైతులకు కనీస మద్దతు ధరలపై 10 శాతం పెంచి అదనపు పరిహారం వచ్చేలా చూడాలని ఆయన కోరుకుంటున్నాడు. రైతుల ఆదాయంతో వాణిజ్య విధానాన్ని అనుసంధానం చేయాలని, ప్రభుత్వం నిర్ణయిస్తున్న కనీస మద్దతు ధర రైతులకు పెరుగుతున్న వ్యయాన్ని పూర్తిగా ప్రతిబింబించడం లేదని, అందువల్ల ఎగుమతుల వల్లే రైతులకు గిట్టుబాటు ధరలు లభిస్తాయని ఆయన ఆలోచన! అయితే రైతుల పట్ల నాణ్యమైన మేలిమిని తలపించే ఆయన ఉదారవాద ఆలోచనలు ఉత్తుత్తిగానే ఉంటున్నాయి. చేతలు మాత్రం అందుకు విరుద్ధంగా రైతును కాల్చుకుతినేవిధంగా రూపుదిద్దుకుంటున్నాయి.

పంటల పెట్టుబడి వ్యయం-దిగుబడులు... వాటిని అనుసరించి పంటల మద్దతు ధరలను రూపొందించి రాష్ట్రాల వ్యవసాయశాఖలు తమ ప్రభుత్వాల ద్వారా కేంద్రానికి నివేదికల రూపంలో తమ ప్రతిపాదనలు పంపిస్తాయి. వాటిని ప్రాతిపదిక చేసుకొని కేంద్ర ప్రభుత్వ అజమాయిషీలోని వ్యవసాయ ధరల నిర్ణాయక కమిషన్ కనీస మద్దతు ధరలను కేంద్రానికి సిఫార్సు చేస్తుంది. అయితే రాష్ట్రాల వ్యవసాయశాఖలు రూపొందించిన మద్దతు ధరల పట్టికను వ్యవసాయ ధరల కమిటీ యథాతథంగా కేంద్ర కేబినెట్‌కు సిఫార్సు చేయడంలేదు. వాటిని సవరించే విషయం లో ధరల నిర్ణాయక కమిషన్ తన బుద్ధి కుశలతను ఏమీ ప్రదర్శించ డం లేదు. కేంద్రం పెట్టుబడి వ్యయం - దిగుబడి తదితర క్షేత్రస్థాయి పరిస్థితులను పరిగణనలోకి తీసుకోకుండా దేశీయ మార్కెట్‌లో డిమాండ్, సరఫరా అంశాలను మాత్రమే బేరీజు వేసుకొని ధరలను నిర్ణయిస్తోంది.

మన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా మాటల ఔదార్యం లో వెనుక వరుసలో ఉండేందుకు రవ్వంతగా కూడా ఇష్టపడటం లేదు. వీలైతే ఒక మెట్టుపైనే ఉండాలని వాంఛిస్తున్నాడు. గత రబీ సీజన్‌లో రైతులకు సంబంధించి ఆయనొక ప్రకటన చేశారు. రైతులకు వడ్డీ లేని రుణాలు ఇచ్చి వ్యవసాయాన్ని మరింత ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, అది ఈ రబీ నుంచి రైతులు తీసుకున్న అన్ని బ్యాంకుల రుణాలకు వర్తిస్తుందని అందులో పేర్కొన్నారు. రైతులు తిరిగి బ్యాంకులకు రుణం అసలు చెల్లిస్తే సరి! వడ్డీని ప్రభుత్వమే చెల్లిస్తుందని పదేపదే చెబుతూ వచ్చాడు. ఆ మేరకు రబీ తర్వాత అసలు మొత్తాన్ని చెల్లించేందుకు బ్యాంకుల కెళ్లిన రైతులు చెవుల మెలితిప్పి బ్యాంకులు అసలుతోపాటు వడ్డీని కూడా వసూలు చేశాయి. దీంతో రైతుల్లో అసహనం ఏర్పడటంతో తప్పిదాన్ని గ్రహించి సీఎం వెంటనే మాటమార్చాడు. రబీ రుణాల వడ్డీని రైతులు అసలుతో పాటు చెల్లిస్తే తరువాత ప్రభుత్వం రైతులకు చెల్లిస్తుందని చెప్పాడు. వడ్డీ మొత్తాన్ని ఎప్పుడు ఇస్తుందో ఎలా ఇస్తుందో స్పష్టంగా చెప్పని ముఖ్యమంత్రి ఈ ఖరీఫ్ నుంచి వడ్డీలేని రుణ విధానాన్ని అమలు చేస్తామని ప్రకటించి రైతులను ఊరడించే ప్రయత్నం చేశాడు.

ఈ ఖరీఫ్ సీజన్ ప్రారంభాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి రైతులను ఉద్దేశించి ఒక ఉత్తరం రాసి అందులోని విషయాలను పత్రికల ద్వారా రైతులకు చేరవేశారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, కల్పిస్తున్న సదుపాయాలు వినియోగించుకుని రైతులు ప్రయోజనం పొందాలని ప్రతి రైతు ఇల్లు ధాన్య లక్ష్మితో కళకళలాడాలని అందులో ఆయన అభిలషించారు. ఉత్తరం రాసి ఆయన అలా కోరుకోవటం మంచిదే అయినా రైతుల పట్ల ఆకాంక్ష వెలిబుచ్చ టంతోనే సరిపెట్టడం బాధ్యత అనిపించుకోదు. వ్యవసాయానికి ప్రధానమైనది భూమి తర్వాత విత్తనమే! ఆ విత్తనం ఈ ఖరీఫ్‌లో రైతులకు అందనేలేదు. పత్తి విత్తనం చీకటి బజారులో తప్ప బయట ఎక్కడా దొరకని స్థితి ఈ ఏడు తటస్థించింది. అవి కూడా నాసిరకాలే! మొలక శాతం సగం కూడా లేనివే!

రైతుల విషయంలో కేంద్రం, రాష్ట్రం అంటూ తేడా ఏమీలేదు. పాలకు లందరిదీ ఒకే తీరు! మాటల్లో ఔదార్యం ఒలకబోయడం! చేతల్లో కర్కశత్వం చూపెట్టడం! ఇలా ఎందుకు జరుగుతోంది? పాలకులు గుండెల మీద చేయివేసుకుని ఆలోచించాలి. సరే పంటల మద్దతు ధరల నిర్ణయంలోనైనా పాలకులు హేతుబద్ధతతో మెలగుతారా అంటే అదీ లేదు. కనీసం రైతు పక్షంగా గళమైనా విప్పరు. కనీస మద్దతు ధరలు పెంచితే ద్రవ్యోల్బణం పెరుగుతుం దని, అంతేగాకుండా మద్దతు ధరలు పెంచినప్పుడు ఉత్పత్తి బాగా పెరిగినప్ప టికీ ధరలను అదుపుచేయలేమనే తప్పుడు భావనలకు స్వస్తి పలకాలి. ఏదిఏమైనా లోపభూయిష్టమైన మద్దతు ధరల విధానం వలన భారత రైతాంగం ఏటా 2 లక్షల కోట్ల రూపాయలు నష్టపోతున్నదని వ్యవసాయ రంగ నిపుణుల విశ్లేషణ! ఇందుకు విరుగుడు, స్వామినాథన్ కమిషన్ సిఫారసులను పూర్తిస్థాయిలో అమలు చేయటం ఒక్కటే మార్గం. 

రాష్ట్రపతి ఎన్నిక తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో కీలక నిర్ణయాలు!

తెలంగాణ, వైఎస్సార్ కాంగ్రెస్‌ల చుట్టే హస్తినలో చర్చలు

హైదరాబాద్, న్యూస్‌లైన్: రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు తప్పవా? రాష్ట్రానికి సంబంధించి కేంద్రం కీలక నిర్ణయాలు ప్రకటించనుందా? ఆంధ్రప్రదేశ్‌లో పూర్తిగా దెబ్బతిన్న కాంగ్రెస్‌కు కాయకల్ప చికిత్స చేయాలని నిశ్చయించిన ఆ పార్టీ అధిష్టానం, చేయాల్సిన పెను మార్పులపై ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టిందా? రాష్ట్ర రాజకీయ పార్టీల్లో ఇప్పుడిదే హాట్ టాపిక్‌గా మారింది. రాష్ట్రపతి ఎన్నిక, ఆగస్టు తొలి వారంలో ఉప రాష్ట్రపతి ఎన్నికలయ్యాక రాష్ట్రంలో కీలక మార్పులుంటాయని గట్టిగా విన్పిస్తోంది. రాష్ట్ర పరిణామాలు, సంస్థాగతంగా పార్టీ బాగా బలహీనపడ్డ వైనాలపై తొలుత ఉదాసీనంగా వ్యవహరించిన అధిష్టానం, తాజా ఉప ఎన్నికల ఫలితాలు చూసి బెంబేలెత్తింది. దేశంలోకెల్లా అత్యధిక లోక్‌సభ స్థానాలు అందించిన రాష్ట్రంలో ఇంతటి దైన్యానికి కారణమేమిటంటూ తర్జనభర్జన పడుతోంది. రాష్ట్ర నేతల నివేదికలు చూసి, అంతా సవ్యంగానే ఉందని పొరబడ్డామని, ప్రక్షాళన అనివార్యమని భావిస్తున్నట్టు సమాచారం. ఎలా చూసినా కీలక మార్పులు చేస్తే తప్ప రాష్ట్రంలో పార్టీని గాడిలో పెట్టలేమన్న కచ్చితమైన అభిప్రాయానికి వచ్చినట్టు చెబుతున్నారు. ఒకవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఎదుర్కోవడం, మరోవైపు తెలంగాణ అంశాన్ని పరిష్కరించడం ఎలాగన్న రెండు అంశాల చుట్టే చర్చలు సాగుతున్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకుని, మున్ముందు కాంగ్రెస్‌కు రాజకీయంగా లాభదాయకమనుకున్న కోణంలోనే నిర్ణయాలుంటాయని చెబుతున్నారు. ఆ క్రమంలోనే రాష్ట్రం నుంచి ఎంతమంది నాయకులొచ్చినా ఎవరినీ కాదనకుండా ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ అపాయింట్‌మెంట్ ఇస్తున్నారు. చెప్పేదంతా వింటూ, వారిచ్చే నివేదికలు తీసుకుంటున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి రాహుల్‌గాంధీ కూడా రాష్ట్రంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. నేతలను ఒక్కొక్కరుగా పిలిపించుకుని మరీ చర్చలు జరుపుతున్నారు. ప్రధానంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవడంపైనే పరోక్షంగా వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన్ను కలిసిన నేతలంటున్నారు.

అనేక ప్రతిపాదనలు..

చర్చలు, సంప్రదింపుల నేపథ్యంలో అనేక ప్రతిపాదనలు అధిష్టానం ముందుకొచ్చినట్టు తెలుస్తోంది. రాష్ట్ర విభజనతో రాజకీయంగా కాంగ్రెస్‌కొచ్చే లాభనష్టాల బేరీజు, ప్రాంతాలవారీగా బలాబలాల సమీక్ష, జగన్‌కు అడ్డుకట్ట, పొత్తులు, భావి సమీకరణలపై ఢిల్లీ నేతలు దృష్టి సారించారు. తెలంగాణ ఇచ్చేస్తే రాజకీయంగా జరిగే మార్పులు, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పరిస్థితి, కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో వచ్చే సీట్లు తదితరాలపై మల్లగుల్లాలు పడుతున్నట్టు చెబుతున్నారు. ‘‘తెలంగాణ ఇవ్వకుండా ఇంకేమైనా ప్రత్యామ్నాయాలున్నాయా, వాటితో వచ్చే ఎన్నికల్లో లాభమా, నష్టమా వంటి అంశాలనూ అధిష్టానం లోతుగా పరిశీలిస్తోంది. తెలంగాణ అంశాన్ని ఎన్నికల దాకా నాన్చితే జరిగే పరిణామాలతో పాటు రాష్ట్రంలో మార్పుచేర్పులనూ అధిష్టానం బేరీజు వేస్తోంది. అయితే ఏ నిర్ణయం తీసుకున్నా చివరికి వైఎస్సార్ కాంగ్రెస్‌ను అడ్డుకునేలానే ఉండాలి. దాంతోపాటు అంతిమంగా రాష్ట్రం నుంచి అత్యధిక లోక్‌సభ స్థానాలు గెలుచుకోవాలన్నదే పెద్దల అభిమతం’’ అని పీసీసీ ముఖ్య నేత ఒకరన్నారు.

సంచలన ప్రకటన..?

రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలయ్యాక రాష్ట్ర రాజకీయాల్లో సంచలన మార్పుచేర్పులుంటాయని గట్టిగా విన్పిస్తోంది. అయితే అవి ఎలాంటివన్న విషయం మాత్రం ఎవరూ కచ్చితంగా చెప్పలేకపోతున్నారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన చేస్తుందని కొందరు, నాయకత్వ మార్పు వరకే పరిమితమవుతారని మరికొందరు అంటున్నారు. ఏదో ఒక మార్పు మాత్రం తప్పదని అధిష్టానం ఇప్పటికే పలువురు నేతలకు సంకేతాలిచ్చింది. వాటి ఆధారంగానే వారు ప్రాంతాలవారీ విశ్లేషణల్లో మునిగిపోయారు. తెలంగాణపై ఇంకా నానిస్తే నష్టమేనని, ఏదో ఒకటి తేల్చాలనే ఇటీవల పెద్దలను వరుగా కలుస్తున్న కాంగ్రెస్ నేతలంతా కోరుతున్నారు. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కూడా ఈ మధ్య ఎక్కడ మాట్లాడినా, తెలంగాణపై త్వరలోనే కీలక నిర్ణయం వస్తుందని చెబుతున్నారు. ఢిల్లీ నేత ఒకరు కేసీఆర్‌తో సంప్రదింపుల్లో ఉన్నందుకే ఆయన అంత గట్టిగా చెబుతున్నారని టీఆర్‌ఎస్ వర్గాలంటున్నాయి. కానీ ఢిల్లీ వెళ్లొచ్చిన నేతలు మాత్రం, కేంద్రంలో ఆ స్థాయిలో కదలికలేమీ లేవని చెబుతున్నారు. తెలంగాణ అంశం దేశ ప్రయోజనాలతో ముడిపడి ఉందన్న సీఎం కిరణ్ తాజా వ్యాఖ్యలను గుర్తు చేస్తున్నారు.

ఏం జరుగుతోంది ... రాష్ట్ర నేతలతో రాహుల్ ఆరా
రాష్ట్రానికి చెందిన పలువురు కాంగ్రెస్ నేతలతో రాహుల్‌గాంధీ ఇటీవల వరుసగా భేటీ అవుతున్నారు. కొందరు అపాయింట్‌మెంటు తీసుకొని వెళ్తుంటే, మరికొందరిని రాహులే పిలిపించుకొని చ ర్చిస్తున్న వైనం రాష్ట్ర కాంగ్రెస్‌లో చర్చనీయంగా మారింది. ఎంపీలతో పాటు సీనియర్ నాయకులతో కూడా చర్చిస్తున్నారు. ఎంపీలు కావూరి సాంబశివరావు, రాయపాటి సాంబశివరావు, ఎస్పీవై రెడ్డి, మధు యాష్కీ, గుత్తా సుఖేందర్‌రెడ్డి, మందా జగన్నాథం, పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి, మంత్రులు టీజీ వెంకటేశ్, ఎరాసు ప్రతాప్‌రెడ్డి, ఎమ్మెల్సీలు పాలడుగు వెంకటరావు, కేఆర్ ఆమోస్, రుద్రరాజు పద్మరాజు తదితరులు ఆయన్ను కలిశారు. దీని ఆంతర్యంపై పలురకాల విశ్లేషణలు సాగుతున్నాయి. వారితో ఏం మాట్లాడుతున్నారు, ఏం అడుగుతున్నారు, వారేం చెబుతున్నారన్నవి ఆసక్తికరంగా మారాయి. రాష్ట్ర సమస్యలపై లోతైన అవగాహన పెంచుకునేందుకు రాహుల్ ప్రాధాన్యమిస్తున్నారని ఆయన్ను కలిసొచ్చిన నేతలంటున్నారు. పార్టీ, ప్రభుత్వ పరిస్థితులపై ఆరా తీయడంతో పాటు అంతర్గత సమస్యలు, అధిగమించే వ్యూహాలపై రాహుల్ ప్రశ్నలు వేస్తున్నారు. సీఎం కిరణ్, పీసీసీ చీఫ్ బొత్స పనితీరు, వైఎస్సార్ కాంగ్రెస్‌తో ఎదురవుతున్న సమస్యలు, టీడీపీ స్థితిగతులతో పాటు తెలంగాణపైనా ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ అంశంపైనే ఎక్కువ ప్రశ్నలు వేశారని నేతలంటున్నారు. ప్రధాని అభ్యర్థిగా రాహుల్‌ను ఫోకస్‌లోకి తెచ్చే క్రమంలో దేశ పరిస్థితులపై ఆయనకు అవగాహన కల్పించేందుకే ఇదంతా జరుగుతోందని చెబుతున్నారు. ఇతర రాష్ట్రాల నేతలతోనూ రాహుల్ ఇలాగే భేటీ అవుతున్నారని గుర్తు చేస్తున్నారు. రాహుల్ పెద్దగా ప్రశ్నలు వేయకుండా, నేతలు చెప్పేది వినేందుకే ప్రాధాన్యమిస్తున్నారని ఆయన్ను కలిసొచ్చిన సీనియర్లు వివరించారు. అంతే తప్ప ఏ విషయం మీదా తన అభిప్రాయం ఇదీ అని కూడా చెప్పడం లేదన్నారు!

చీకటి రాజ్యం!


పుట్టి మునుగుతున్నదని తెలిసినా నిలువు గుడ్లేసుకుని చూస్తూ కూర్చుంటే ఏమవుతుంది? మన పాలకులు సరిగ్గా ఇలాగే వ్యవహరించడంవల్ల ఇప్పుడు జనం బతుకులు అంధకారమయ్యాయి. ఈ రాష్ట్రంలో విద్యుత్తు సంక్షోభం ఇవాళ కొత్తగా వచ్చిపడింది కాదు. వేసవి కాలానికి చాలాముందే, శీతాకాలంలోనే కోతలకు తెరతీసి జనానికి నిండా వాతలు పెట్టిన చరిత్ర మన ప్రభుత్వానిది. రబీ సీజన్‌లో రైతాంగం, పరీక్షల సీజన్‌లో విద్యార్థులు ఈ కోతలతో పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కాదు. వ్యవసాయ రంగం దారుణంగా దెబ్బతింది. పేరుకు ఏడుగంటల విద్యుత్తును ఇస్తున్నట్టు నమ్మించినా వేళా పాళా లేకుండా మూడు దఫాలుగా ఇచ్చి అందులో గంట కోత పెట్టి ఆ సీజన్‌ను అయిందనిపించారు.

అవసరానికి అసలే అక్కరకు రాని ఆ విద్యుత్తు వల్ల పంటలు దెబ్బతిన్నాయని రైతాంగం గగ్గోలు పెట్టింది. ఇక పోటీ పరీక్షలకు తయారయ్యే క్రమంలో ఉన్న విద్యార్థులదీ అదే బాధ. ఏడాది పొడవునా పడిన కష్టాలకు బోనస్ అన్నట్టుగా రకరకాల సెట్‌లకు తయారయ్యేవారిని చివరివరకూ ఈ కోతలు వదల్లేదు. పరిశ్రమల పరిస్థితీ డిటోయే. ఇదంతా గత ఏడాది సెప్టెంబర్‌లో మొదలై నెలల తరబడి సాగిన కథ కనీసం ఆ తర్వాతైనా ప్రభుత్వం మేల్కొందా? తగిన చర్యలు తీసుకుని విద్యుత్తు సమృద్ధిగా ఉండటానికి పథక రచన చేసిందా? ఏమీ చేయలేదు. ప్రాప్తకాలజ్ఞతలో పడి ప్రజలను గాలికొదిలేసింది.

పర్యవసానంగా ఇప్పుడు ఖరీఫ్ సీజన్‌కి, పరిశ్రమలకు ముప్పుకలిగే పరిస్థితులు ఏర్పడ్డాయి. రాష్ట్రంలో విస్తృతంగా వర్షాలుపడి జలవిద్యుత్తు సరఫరా ముమ్మరించాల్సిన సమయంలో జనం ఉక్కబోతలో ఊపిరాడని స్థితిలో పడ్డారు. పరిశ్రమలకు వారానికి మూడు రోజులున్న కోతను నాలుగు రోజులకు పెంచారు. రోజూ సాయంత్రం ఆరునుంచి నాలుగు గంటలపాటు కేవలం దీపాలు వెలిగించుకోవడానికి సరఫరా చేస్తున్నారు. దీన్ని కూడా లెక్కలోకి తీసుకుంటే, వారానికి అయిదురోజుల కరెంటు కోత ఉన్నట్టు లెక్క. స్టీలు, సిమెంటు, ఫార్మా వంటి రంగాలకైతే మొత్తం డిమాండ్‌లో 50 శాతంమేర మాత్రమే విద్యుత్తును అందించగలమని డిస్కంలు తెలిపాయి.

పరిశ్రమలు ఇలావుంటే, అందులో పనిచేస్తున్న కార్మికులకు ఉద్యోగభద్రత ఉంటుందా? లక్షలాది కార్మికుల కుటుంబాలు రోడ్డున పడవా? గత ఏడాది సెప్టెంబర్‌లో కరెంటు కోతలు ప్రారంభించినప్పుడు తెలంగాణ ప్రాంతంలో సాగిన సకల జనుల సమ్మెను సాకుగా చూపారు. ఆ తర్వాత వేసవి కాలమన్నారు. ఇప్పుడు వర్షాలు పడటంలేదని, రిజర్వాయర్లు నిండటంలేదన్న కారణాలు చెబుతున్నారు. గ్యాస్ ఆధారిత విద్యుత్తు ప్రాజెక్టులకు ఇస్తానన్న గ్యాస్‌లో రిలయన్స్ కోత పెట్టిందని చెబుతున్నారు.

ఈ కారణాలన్నీ వాస్తవమే. అయితే, ఇవన్నీ ఇప్పుడే వచ్చి పడినవి కాదు. రుతు పవనాల గాలివాటంపై ప్రభుత్వానికి అనుమానం రావాలి. సరిగా వర్షాలు పడకపోతే, తగినంతగా జలవిద్యుత్తు సరఫరా కాకపోతే ఏంచేయాలన్న ఆలోచన రావాలి. కానీ, సర్కారు మొద్దు నిద్రపోయింది. ఇప్పుడు సంక్షోభం తీవ్ర స్థాయికి చేరిన తర్వాత రకరకాల కారణాలను ఇప్పుడే గ్రహించినట్టు ఏకరువు పెడుతోంది. సంక్షోభాన్ని పూర్తిగా నివారించేంత స్తోమత లేకపోయినా కనీసం దాని తీవ్రతను తగ్గించడానికైనా ప్రభుత్వం ప్రయత్నించి ఉంటే, ఆ తర్వాత ఇలాంటి మాటలు మాట్లాడి ఉంటే కొంచెమైనా అర్ధం ఉండేది. 2008లో విద్యుత్తు సంక్షోభం తలెత్తవచ్చని ముందుగానే అంచనా వేసుకుని దివంగత ముఖ్యమంత్రి వైఎస్... పంటలను కాపాడటానికి, ప్రజల ఇబ్బందుల్ని నివారించడానికి రూ. 6,000 కోట్లు ఖర్చుపెట్టి అదనపు విద్యుత్తు కొనుగోలు చేశారు.

అంతేకాదు, భవిష్యత్తులో ఈ పరిస్థితి పునరావృతం కాకుండా చూసేందుకు 16,000 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం గల పథకాలకు రూపకల్పన చేశారు. ఇప్పుడు అలాంటి ప్రయత్నమే జరగలేదు. కేంద్రం నుంచి రాష్ట్రాలకు కేటాయించే విద్యుత్తు 150 మెగావాట్లు కేరళ తన్నుకు పోయింది. సకల జనుల సమ్మె సమయంలో మనకు కేటాయించిన 231 మెగావాట్ల విద్యుత్తులో కేంద్రం విపక్ష పాలిత రాష్ట్రమైన కర్ణాటకకు 100 మెగావాట్లు ఇచ్చేసింది. ఏతావాతా ఇది కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైనా మనమే చేతకానివాళ్లలా మిగిలిపోయాం.

మన పెరట్లోనే ఉబికివస్తున్న గ్యాస్ విషయంలో రిలయన్స్ సంస్థ ఆడింది ఆట-పాడింది పాట అయింది. మన రాష్ట్రంలో 2,722 మెగావాట్ల విద్యుత్తు గ్యాస్ ఆధారిత ప్రాజెక్టుల నుంచి రావాల్సి ఉండగా రిలయన్స్ మొండి వైఖరివల్ల అందులో సగం కంటే చాలా తక్కువ ఉత్పత్తి అవుతోందని సాక్షాత్తూ ముఖ్యమంత్రే చెప్పారు. ఒప్పందానికి అనుగుణంగా ఆ సంస్థ గ్యాస్ సరఫరాచేసినట్లయితే విద్యుత్తు ఉత్పత్తిలో మనం మిగులులో ఉండేవాళ్లం. సంక్షోభం ఇంతగా ముదిరాక ఇప్పుడు ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారుగానీ, ఇన్నాళ్లూ ఆయన ప్రభుత్వం రిలయన్స్ మెడలు వంచడానికి చేసిన ప్రయత్నాలేమిటి? అసలు రిలయన్స్ గ్యాస్‌ను మన రాష్ట్రానికి కేటాయించాకే, ఇతర రాష్ట్రాల సంగతి ఆలోచించాలని ఎడతెగకుండా ఒత్తిళ్లు తెచ్చిన వైఎస్ ఎంతగా ఒత్తిళ్లు తెచ్చారో ప్రస్తుత పాలకులకు తెలియదా? కనీసం ఆ పోరాటాన్ని కొనసాగించినా పరిస్థితి ఇంతగా విషమించేది కాదు. కానీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రిలయన్స్ అడుగులకు మడుగులొత్తుతున్నాయి.

ఈ లొంగుబాటు వైఖరే సమస్యను ఇంతవరకూ తెచ్చింది. రిలయన్స్ మాటలా ఉంచి ల్యాంకో లాంటి సంస్థలు యూనిట్ విద్యుత్తును రూ. 5.50కి అమ్ముతుంటే ప్రభుత్వం చేష్టలుడిగి ఉండిపోయింది. గత ఏప్రిల్ నెలలో ప్రజలపై రూ. 4,500 కోట్ల మేర విద్యుత్తు చార్జీల భారం మోపుతూ ప్రజలకు నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేయడానికే ఇలా పెంచవలసి వస్తున్నదని ముఖ్యమంత్రి చెప్పారు. తీరా ఇప్పుడు జరుగుతున్న దేమిటి? ఎటు చూసినా చీకట్లు... అన్ని వర్గాల ప్రజలకూ కష్టాలు. సమస్యను ముందే అంచనా వేసి, పరిష్కారానికి కృషి చేయాల్సిన సర్కారు ఇప్పుడు మేల్కొని ఆ సమస్యను ఏకరువు పెడుతోంది. ఇక ఈ రాష్ట్ర ప్రజలకు దిక్కెవరు?

నేటి నుంచి రాజన్న బాట

నా బాట రాజన్న బాట.. నా మాట జగనన్న మాట.. అని పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు సోమవారం మండల పర్యటనలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం శనివారం నుంచి చేపట్టనున్న ఇందిరమ్మ బాటకు ఓ రోజు ముందుగానే ఆయన రాజన్నబాట ప్రారంభిస్తున్నట్లు రాజవరంలో ప్రకటించారు. ఉదయం 9 గంటల నుంచి అన్ని శాఖల ప్రభుత్వాధికారులను కలుపుకుంటూ రాజవరం, యర్రంపేట, పొంగుటూరు పంచాయతీల్లోని 9 గ్రామాల్లో ప్రజల సమస్యలను వింటూ వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. నిధులు ఉండి కూడా అధికారులు అలసత్వంతో ఇందిర జలప్రభ నిష్ర్పయోజనంగా మారుతోందని పేర్కొన్నారు.

ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంలో నిధులుకేటాయింపులకు ప్రభుత్వాన్ని నిలదీస్తానని, ఈ విషయంలోరాజీపడబోనని ఆయన పేర్కొన్నారు. ఇందిరమ్మ బాట ఉన్నన్నాళ్లూ రాజన్నబాటగానే గ్రామగ్రామాన పర్యటిస్తానని తెలిపారు. రాజవరం దళితపేటలో స్థానికులు ఏర్పాటుచేసుకున్న మహానేత వైఎస్ విగ్రహాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో ఎన్నికలకు ముందు 2,200 గ్యాస్ కనెక్షన్లు మంజూరుచేశారని, ఫలితాలు అధికార పార్టీకి వ్యతిరేకంగా రావడంతో ప్రజలపై కక్షసాధింపు చర్యలకు దిగుతు, ఇప్పటి వరకు వాటిని ఇవ్వలేదని చెప్పారు.

రఘురామరాజు పిటిషన్ కొట్టివేత

Written By news on Friday, July 13, 2012 | 7/13/2012

సీబీఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ కాల్ లిస్ట్ వ్యవహారంలో రఘురామరాజు పిటిషన్ ను హైకోర్టు శుక్రవారం కొట్టివేసింది. ఈ వ్యవహారానికి సంబంధించి తనపై నమోదు అయిన ఎఫ్ ఐఆర్ ను కొట్టివేయాలంటూ ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. రఘురామరాజు పిటిషన్ ను విచారించిన న్యాయస్థానం ప్రస్తుతం విచారణ ప్రాథమిక దశలో ఉన్నందున జోక్యం చేసుకోలేమని పేర్కొంది.

'స్థానిక ఎన్నికలు జరపకుంటే నిధులు కట్'

రాష్ట్రంలో సత్వరమే స్థానిక ఎన్నికలు జరపకపోతే కేంద్ర నిధులు ఆగిపోయే ప్రమాదముందని కేంద్ర గిరిజన సంక్షేమం, పంచాయతీ రాజ్ శాఖమంత్రి కిషోర్‌చంద్రదేవ్‌ అన్నారు. పదవీ కాలం ముగిసిన ఆరునెలల్లో ఎన్నికలు జరపాల్సి ఉంటుందని.. అలా జరపకపోతే కేంద్ర నిధులు ఇవ్వడం కుదరదన్నారు. రాష్ట్రంలో బాక్సైట్‌ తవ్వకాలను నిలిపివేయాలని కిషోర్‌ చంద్రదేవ్‌ కోరారు. గిరిజన ఉత్పత్తులకు కనీస మద్దతుధర వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు.

‘చేతి’లో చెయ్యి... బాబుకి గొయ్యి!



పార్టీని స్థాపించిన తొమ్మిది నెలల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ ఏక పార్టీ పాలనకు శాశ్వతంగా తెరదించిన వెండితెర వేలుపు ఎన్టీ రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీకి ఎంతటి దుస్థితి? రాష్ట్రవ్యాప్తంగా పద్దెనిమిది శాసనసభ స్థానాలకు ఉపఎన్నికలు జరిగితే ఒక్క చోటైనా గెలవలేకపోవడం, ఐదు చోట్ల డిపాజిట్లు గల్లంతుకావడమా? ఏ పరిస్థితులలో జరిగిన ఎన్నికలవి? వైఎస్ హఠాన్మరణానంతర పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశానికి ముందటి కంటే ఘోరంగా దిగజారింది. ప్రజలు ప్రధాన ప్రతిపక్షం వేపు మొగ్గుచూపాల్సిన పరిస్థితి. అలాంటి స్థితిలో ఓటర్లు టీడీపీని ఛీకొట్టడమా? ఇంతటి పరాభవానికి కారణాలపై ఆ పార్టీలో అంతర్మథనమైనా జరుగుతోందా అంటే అదీ శూన్యం. ‘మాకే కాదు, కాంగ్రెస్‌కు కూడా అదే గతి పట్టిందిగా!’ అంటూ అది సంతృప్తి చెందుతోందంటే ఇంతకంటే ఆ పార్టీకి సంప్రాప్తించగల దుర్దశ మరొకటి ఉంటుందా? పైగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అరెస్టు పర్యవసానంగా వెల్లువెత్తిన సానుభూతి కెరటమే ఓటమికి కారణమంటూ ఆత్మవంచన చేసుకుంటోంది. టీడీపీ వర్తమానమే కాదు, భవిష్యత్తు కూడా అంధకారమయంగానే గడచిపోక తప్పదని చెప్పకనే చెబుతోంది.

వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం నారా చంద్రబాబునాయుడు ఆయన చేపట్టిన ప్రతి ప్రజాసంక్షేమ కార్యక్రమాన్ని ఏదో ఒక సాకుతో నిరసిం చారు, ఆయన చేపట్టిన ప్రతి నీటిపారుదల ప్రాజెక్టుకు మోకాలు అడ్డడానికి ప్రయత్నించారు. బాధ్యతాయుత ప్రతిపక్ష నేతగా గాక రంధ్రాన్వేషకునిగా అవిశ్రాంతంగా పనిచేశారు. వైఎస్ ప్రభుత్వంపై బుదరజల్లడమే ప్రధాన కార్యక్రమం చేసుకున్నారు. వైఎస్ ప్రజా సంక్షేమ పాలనకు మెచ్చే ఓటర్లు 2009లో మరోమారు ఆయనకు అధికారం అప్పగించారు. ఈ ఓటమి నుంచి గుణపాఠాలు తీయడానికి బదులుగా బాబు వైఎస్ హఠాన్మరణంలో అర్థంతరంగా అధికార పీఠాన్ని దక్కించుకునే అవకాశాన్ని చూశారు. అందుకే ‘రాజన్న రాజ్యం’ తెస్తానంటూ ఆయన కుమారుడు జగన్ ముందుకు రావడాన్ని, ప్రజలు దాన్ని మెచ్చడాన్ని సహించలేకపోయారు. బాబు పాలనలో ప్రత్యక్ష నరకాన్ని చవిచూసిన పేద, బలహీన వర్గాలలో, రైతాంగంలో వైఎస్‌పై చెక్కుచెదరకుండా నిలిచిన ప్రేమాభిమానాలను బాబు చిన్నచూపు చూశారు. దుష్ర్పచారంతోనే వాటిని చెరిపేయగలమని భావించారు. అందుకే పార్టీకి తనకంటూ ఓ సొంత రాజకీయవ్యూహం అన్నదే లేకుండా చేశారు. వైఎస్‌పైనా, ఆయన రాజకీయ వారసునిగా ప్రజలనుంచి అపూర్వ స్పందనను అందుకుంటున్న జగన్‌పైనా బురద జల్లడమే ఏకైక ఎజెండాగా పార్టీని నడిపారు.

జగన్ అక్రమాస్తుల ఆరోపణలపై సీబీఐ జరుపుతున్న దర్యాప్తు ప్రహసనానికి తెర వెనుక ఉన్న కర్త, కర్మ, క్రియ అన్నీ కాంగ్రెస్ అధిష్టానమేననేది బహిరంగ రహస్యం. అది తెలిసీతెలిసీ బాబు ఇదే అవకాశమని ఆ కేసులో టీడీపీని ఇంప్లీడ్ చేశారు. అంతేకాదు, ఆంధ్రా హజారే అవతారమెత్తడానికి ప్రయత్నిం చారు. బాబు చేష్టలు సహజంగానే టీడీపీని నవ్వుల పాలు చేశాయి వైఎస్ హయాంలో మంత్రులుగా పెత్తనం చెలాయించి ఇప్పుడు వివాదాస్పదమైనవిగా మారిన జీవోలను జారీచేసిన మంత్రులపై నామమాత్రపు విచారణ సాగిస్తూ, 2014 ఎన్నికల నాటికి జగన్‌ను రంగంలో లేకుండా చేసే లక్ష్యం చుట్టూ కేసును తిప్పుతూ సీబీఐ దర్యాప్తు సాగిస్తోంది. సీబీఐ విచారణను, దాని సీరియల్ చార్జిషీట్లను ప్రజలు రాజకీయ కక్షసాధింపుగానే గుర్తిస్తున్నారు.

కార్పొరేట్‌స్వామ్యపు పూజారి బాబు సహజంగానే ఈ ప్రజాభిప్రాయాన్ని గుర్తించలేకపోయారు. అందుకే కాంగ్రెస్ అధిష్టానపు జగన్ వ్యతిరేకవ్యూహం అమలు బాధ్యతను అవుట్‌సోర్సింగ్‌కు పుచ్చుకున్నట్టుగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అస్తవ్యస్త పరిస్థితులను సద్వినియోగం చేసుకొని జగన్ తను స్థాపించిన వైఎస్‌ఆర్‌సీపీని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు, ప్రజా సమస్యలపై ఆందోళనలతో వారి అభిమానాన్ని చూరగొన్నారు. ప్రజలు జగన్‌కు నీరాజనాలు పట్టసాగారు. ఇదంతా కళ్లారా చూస్తూ కూడా బాబు వైఎస్‌ను, జగన్‌ను దుమ్మెత్తి పోయడమే తన విద్యుక్త ధర్మం అని భావిస్తున్నారు. కాంగ్రెస్ తన గోతిని తానే తవ్వుకున్నట్టుగా, దానితో చేయికలిపిన బాబు కూడా ఎన్టీఆర్ నిర్మించిన టీడీపీకి గోతిని తవ్వడానికి అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు. ఆయన ‘శ్రమకు’ తగ్గ ప్రతిఫలమే ఉప ఎన్నికల్లో దక్కింది.

-బలిజేపల్లి శరత్‌బాబు

నేనే బీసీ బాబా.


హైదరాబాద్, న్యూస్‌లైన్: వెనుకబడిన వర్గాలకు వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు ఇస్తానని, అధికారంలోకి వస్తే ఆ వర్గాల వారికి రూ. 10 వేల కోట్లతో ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తానని.. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ప్రకటించిన ‘బీసీ పాలసీ’ ఇటు బీసీ సంఘాల్లోనే కాదు.. అటు సొంత పార్టీలోనూ వివాదాస్పదంగా మారింది. బీసీల సంక్షేమం విషయంలో కానీ.. ఇచ్చిన హామీలను నెరవేర్చటంలో కానీ బాబు ‘ట్రాక్ రికార్డు’ చూస్తే.. ఆయన మాటలను విశ్వసించేది ఎవరని టీడీపీ సీనియర్ నేతలు సైతం ప్రశ్నిస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఆరేళ్ల పాలనలో బీసీల కోసం ప్రత్యేకంగా ఎలాంటి హామీలు ఇవ్వకుండానే.. ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ, గృహనిర్మాణం, పావలా వడ్డీ పథకం వంటి అనేక సంక్షేమ పథకాలతో వారి సామాజిక, ఆర్థిక, రాజకీయ ఎదుగుదలకు బాటలు పరచగా.. చంద్రబాబు తన తొమ్మిదేళ్ల కాలంలో బీసీలకు ఏం ఒరగబెట్టారని ఆయన తాజా హామీలను ఆ వర్గాల ప్రజలు విశ్వసిస్తారని వారు నిలదీస్తున్నారు. ‘‘బీసీ వర్గాల విద్యార్థుల ప్రీమెట్రిక్ స్కాలర్‌షిప్‌ల కోసం బాబు పాలన చివరి ఏడాదిలో కేవలం రెండు కోట్ల రూపాయలు మాత్రమే కేటాయిస్తే.. వైఎస్ పాలన ఐదో సంవత్సరంలో రూ. 9.27 కోట్లు ఇచ్చారు. బీసీలకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌ల కింద చంద్రబాబు పాలన చివరి ఏడాదిలో రూ. 77 కోట్లు మాత్రమే ఇస్తే.. వైఎస్ పాలన ఐదో సంవత్సరంలో రూ. 409 కోట్లు అందించారు. 

బీసీ సంక్షేమ శాఖకు కూడా బాబు చివరి ఏడాది పాలనలో రూ. 348 కోట్లు కేటాయిస్తే.. వైఎస్ ఐదో ఏడాది పాలనలో రూ. 1,305 కోట్లు కేటాయించారు. అలాగే.. వైఎస్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ద్వారా లక్షలాది మంది బీసీ విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించగలిగారు.. వైఎస్ ఐదేళ్ల పాలనలో రూ. 26,000 కోట్లకు పైగా నిధులు ఇందుకు వ్యయం చేశారు. అలాగే.. బాబు తొమ్మిదేళ్ల పాలనలో పైరవీలు చేసుకోగల వారికి తప్ప బీసీ వర్గాల వారికి బలహీనవర్గాల గృహనిర్మాణ శాఖ నుంచి అందిన సాయం నామమాత్రం. కానీ.. వైఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ, ఎస్సీ, ఎస్టీ తదితర వర్గాల వారికి 40 లక్షల ఇళ్లు కట్టిస్తే.. అందులో ప్రధానంగా బీసీ వర్గాల వారికే దాదాపు 20 లక్షల ఇళ్లు కట్టించారు. ఇందులో ఒక్కో ఇంటికి రూ. 13,200 చొప్పున ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చింది. అంటే బీసీ వర్గాల వారికి రూ. 2,640 కోట్ల రూపాయలు వైఎస్ హయాంలో సబ్సిడీగా అందింది. అలాగే.. బాబు హయాంలో బీసీ వర్గాల వారే కాదు.. పేద కుటుంబాల్లో ఎవరికి జబ్బుచేసినా ప్రభుత్వ ఆస్పత్రిలో సైతం సరైన చికిత్స అందే దిక్కు ఉండేది కాదు. కానీ.. వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చాక ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ ఉచిత బీమా పథకంతో.. ఏ జబ్బు చేసినా కార్పొరేట్ ఆస్పత్రిలో సైతం ప్రభుత్వ ఖర్చుతో ఉచితంగా శస్త్రచికిత్సలు జరుగుతున్నాయి. ఈ పథకం కింద ఏడు లక్షల మంది బీసీ వర్గాల వారి శస్త్రచికిత్సల కోసం వైఎస్ హయాంలో రూ. 1,500 కోట్లు ఖర్చు పెట్టారు. ఇక బాబు హయాంలో మహిళా సంఘాలను పార్టీ ఓటు బ్యాంకుగా చూశారు కానీ.. మహిళల సాధికారత కోసం నిజాయతీగా చేపట్టిన చర్యలు సున్నా.

వైఎస్ వచ్చాక మహిళా సంఘాలకు బ్యాంకుల ద్వారా పావలా వడ్డీకే రుణాలు అందించటం ద్వారా బీసీ మహిళలకు రూ. 1,400 కోట్ల మేర వడ్డీ రాయితీ లభించింది. అంతేకాదు.. బ్యాంకుల నుంచి రూ. 28,000 కోట్ల మేర రుణాలు పొంది వివిధ రకాల వ్యాపారాలు, వ్యవసాయాల్లో పెట్టుబడులుగా పెట్టి సాధికారత సాధించే దిశగా పయనిస్తున్నారు. ఇలాంటి పథకాలేవీ అమలు చేయకుండా.. ఎవరికీ వీసమెత్తు ప్రయోజనం కలిగించకుండా.. చంద్రబాబు ఏదో చేశానని.. ఇంకా ఏదేదో చేసేస్తానని అంటే నమ్మేదెవరు?’’ అని తెలుగుదేశం పార్టీకే చెందిన సీనియర్ బీసీ వర్గ నాయకుడు ఒకరు కుండబద్దలు కొట్టారు. 2009 ఎన్నికలకు ముందు టీడీపీ నుంచి బీసీలకు 100 సీట్లు ఇస్తామని అప్పటి మిత్రపక్షాలైన వామపక్షాలు, టీఆర్‌ఎస్ అగ్రనాయకుల సమక్షంలో ఆర్భాటంగా ప్రకటించిన చంద్రబాబు.. వారం తిరక్కుండానే ఆ మాట తప్పి కనీసం 50 మందికి కూడా సీట్లు ఇవ్వకుండా బీసీలను దారుణంగా దగా చేసిన విషయం.. బాబు మర్చిపోయినా బీసీ వర్గాల ప్రజలు మరచిపోలేదని ఆయన స్పష్టంచేస్తున్నారు. చంద్రబాబునాయుడి హామీల్లో విశ్వసనీయత అనేది నేతిబీరకాయలో నెయ్యి చందమేనన్న విషయం ప్రజలకు పూర్తిగా అర్థమైపోయిందని టీడీపీ నాయకులే తేల్చిచెబుతున్నారు. 

చట్టసభల్లో బీసీ రిజర్వేషన్లపై ఏంచేశారు..? 
చట్టసభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్ల కోసం పోరాడతామని ప్రకటించిన చంద్రబాబు ఏనాడూ ఆ అంశంపై ప్రత్యక్ష పోరాటానికి దిగిన సందర్భం లేదని టీడీపీ నేతలు సైతం విమర్శిస్తున్నారు. ‘‘తాను అధికారంలో ఉండగా బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని అసెంబ్లీలో తీర్మానం చేయించారు. అయితే ఈ 15 ఏళ్లలో కొన్ని వందలసార్లు ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు ఏ ఒక్క రోజు కూడా ఆ అంశంపై కేంద్ర ప్రభుత్వ పెద్దలను అడగలేదు’’ అని వారు గుర్తుచేస్తున్నారు. తాను చక్రం తిప్పానని చెప్పుకునే ఎన్‌డీఏ హయాంలో కూడా ఈ అంశంపై దృష్టి సారించలేదని పేర్కొంటున్నారు. పార్టీలో ఒక బీసీ నాయకుడు నంబర్ టూ అంటూ అప్పట్లో ప్రచారం జరిగినప్పుడు పార్టీలో నంబర్ టూ, త్రీలు అంటూ ఎవరూ లేరంటూ హడావుడి చేసి మరీ చెప్పించిన ఘనత బాబుదని.. బీసీ నాయకుల ఎదుగుదలను ఆయన తట్టుకోలేరనటానికి ఇది నిదర్శనమని ఉదహరిస్తున్నారు. 

నాటి 100 సీట్ల మాటలు నీటిమూటలే కదా..! 
అధికారంలో ఉన్నంత కాలం ఇలాంటివేవీ చేయకుండా.. వచ్చే ఎన్నికల్లో తాను బీసీలకు 100 సీట్లిస్తానని, పది వేల కోట్లతో సబ్‌ప్లాన్ ఏర్పాటు చేస్తానని, నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యం కల్పిస్తానని చంద్రబాబు గుప్పిస్తున్న హామీలపై సొంత పార్టీ నేతలు సైతం పెదవి విరుస్తున్నారు. ‘‘2009 ఫిబ్రవరిలో హైదరాబాద్‌లో జరిగిన చేతి వృత్తిదారుల సదస్సులో సీపీఎం నేత రాఘవులు, సీపీఐ నాయకుడు కె.నారాయణ, టీఆర్‌ఎస్ నేత నాయిని నర్సింహారెడ్డి సమక్షంలో బీసీలకు 100 సీట్లిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అంతకుముందు 2008లో వరంగల్‌లో జరిగిన బీసీ గర్జనలో బీసీలకు వంద సీట్లు ఇస్తామని తీర్మానం చేశారు. ఆ సమావేశంలో 93 కులాల పేర్లు చదివి మరీ తనకు తప్ప బీసీలపై ఎవరికీ పేటెంట్ లేదన్నారు. ఈ రకమైన మాటలు, హామీలతో బీసీలు కొంత సంతోషపడినా అది ఎన్నాళ్లో నిలవలేదు. ఆ ఎన్నికల్లో బీసీలను నట్టేటముంచి కేవలం 50 సీట్లతో సరిపుచ్చారు. తాను పోటీ చేసే స్థానాలన్నింటికీ ఒకేసారి లేదా రెండుసార్లలో అభ్యర్థులను ప్రకటిస్తే బీసీల లెక్క తేలుతుందనే ఉద్దేశంతో అర్థరాత్రి, అపరాత్రి, 10 మంది, 15 మందిని అభ్యర్థులుగా దఫదఫాలుగా ప్రకటించారు’’ అని బీసీ సంఘాలతో పాటు, టీడీపీ సీనియర్ నేతలు సైతం బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ‘‘అదే ఎన్నికల్లో వై.ఎస్.రాజశేఖరరెడ్డి పార్టీ అధిష్టానాన్ని ఒప్పించి ఒకే రోజు 200 మందికి పైగా అభ్యర్థుల జాబితాను ప్రకటించగా అందులో 73 మంది బీసీలకు టికెట్లిచ్చారు’’ అని అని టీడీపీ నేతలే గుర్తుచేస్తున్నారు. 

వర్గీకరణపై ఇప్పుడు పోరాడతారా? 
సరైన వ్యూహం కొరవడిన కారణంగానే చంద్రబాబు ప్రతి విషయాన్నీ రాజకీయంగా చూస్తున్నారని పలువురు టీడీపీ నేతలు పేర్కొంటున్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం చేస్తామని చంద్రబాబు చెప్పటం వల్ల ప్రయోజనం ఉండదని వారు వ్యాఖ్యానిస్తున్నారు. గతంలోనే అసెంబ్లీ ఎస్సీ వర్గీకరణపై ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించిందని.. అప్పుడు వైఎస్ రాజశేఖరరెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ కూడా దానికి మద్దతు తెలిపిందని టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. ఇటీవల ఎంఆర్‌పీఎస్ నాయకుడు మంద కృష్ణమాదిగ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని కలిసినప్పుడు ఆయన కూడా వర్గీకరణకు మద్దతు తెలిపిన విషయాన్ని వారు ప్రస్తావిస్తున్నారు. వర్గీకరణను ఏ ఒక్క రాజకీయ పార్టీ వ్యతిరేకించలేదని, టీడీపీ మాత్రమే పోరాటం చేస్తుందని చెప్పుకోవటం వల్ల ఒరిగేదేం ఉంటుందని వారు ప్రశ్నిస్తున్నారు. అయితే ఎన్‌డీఏ హయాంలో చంద్రబాబు కేంద్రంలో చక్రం తిప్పిన సమయంలో వర్గీకరణ బిల్లు ఆమోదం కోసం ఏ ఒక్క ప్రయత్నం చేయలేదన్న విమర్శలు కూడా వచ్చాయని టీడీపీ నేతలు ప్రస్తావిస్తున్నారు. అలాగే దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా కల్పించే అంశంపై చంద్రబాబు ఏనాడూ స్పందించలేదన్న విషయాన్ని ఆ పార్టీ దళిత నేత ఒకరు గుర్తుచేశారు. 

బీసీల విద్య కోసం బాబు ఏంచేశారు? 
సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన కులాలు పైకి రావాలంటే.. ఆ వర్గాల వారికి విద్యాపరంగా, ఆర్థికంగా, రాజకీయంగా తోడ్పాడునందించే పథకాలు ప్రవేశపెట్టి అమలు చేసినప్పుడే సాధ్యమవుతుందని.. చంద్రబాబు పరిపాలనలో అలాంటి ప్రయత్నం ఒక్కటి కూడా జరగలేదన్న విషయాన్ని టీడీపీ సీనియర్ నేతలు గుర్తుచేస్తున్నారు. ‘‘ఉదాహరణకు.. ఒక బీసీ విద్యార్థి ఆర్థిక స్తోమత లేక ఉన్నత చదువులు చదువుకోగలిగే పరిస్థితి చంద్రబాబు హయాంలో లేదు. కానీ వైఎస్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ విద్యార్థి ఉచితంగా ఉన్నత విద్యను అభ్యసించటానికి ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ప్రవేశపెట్టారు. దానివల్ల ఈ రోజు లక్షలాది మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఉన్నత విద్యను పూర్తి చేయగలిగారు. చంద్రబాబు తన తొమ్మిదేళ్ల పాలనలో కనీసం ఒక్క విద్యార్థికైనా ఏ చదువుకూ ఫీజు చెల్లించలేదు’’ అని వారు ప్రస్తావిస్తున్నారు. ‘‘1995-96లో తాను అధికారంలోకి వచ్చిన సంవత్సరంలో బీసీ హాస్టళ్ల నిర్వహణకు రూ. 43.54 కోట్లు కేటాయించిన చంద్రబాబు.. తాను దిగిపోయే సంవత్సరంలో ఇచ్చింది కేవలం రూ. 100 కోట్లే. అదే వైఎస్ హయాంలో తొలుత రూ. 106 కోట్లున్న బడ్జెట్ ఐదో సంవత్సరానికి రూ. 241 కోట్లకు పెంచారు.

వైఎస్ అధికారంలోనికి రాకముందు స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తు చేసుకున్న 100 మంది బీసీ విద్యార్థులలో కేవలం 30 మంది వరకు మాత్ర మే మంజూరు చేసేవారు. ప్రతిభతో పాటు ముందు దరఖాస్తు చేసుకున్న వారికి ప్రాధాన్యం ప్రాతిపదికన స్కాలర్‌షిప్‌లకు కేటాయించిన బడ్జెట్ అయిపోయేంత వరకు ఇచ్చి నిలిపివేసేవారు. ప్రైవేటు కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల స్కాలర్‌షిప్‌లను నిలిపివేయాలంటూ చంద్రబాబు హయాంలోనే జీవో నం. 90 జారీ చేశారు. అదే వైఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత లక్షలాది మంది బీసీ విద్యార్థులకు శాచ్యురేషన్ పద్ధతిన స్కాలర్‌షిప్‌లు, ట్యూషన్ ఫీజు మంజూరయ్యాయి. దాదాపు 40 లక్షల మంది బడుగు, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు ఇంజనీరింగ్, మెడిసిన్‌లాంటి వృత్తివిద్యాకోర్సులను చదువుకుని ఉన్నతస్థాయికి వెళ్లే దిశలో మరో అడుగు దూరంలో ఉన్నారు. ఇక, కళాశాల హాస్టళ్ల విషయానికొస్తే 23 జిల్లాల్లో 23 హాస్టళ్లు ఏర్పాటు చేస్తానన్న హామీని చంద్రబాబు నెరవేర్చుకోలేకపోయారు. అదే వైఎస్ హయాంలో నియోజకవర్గానికి ఒకటి బాలురకు, ఒకటి బాలికలకు చొప్పున దాదాపు 600 హాస్టళ్లను మంజూరు చేశారు. ఇప్పుడు అందులో 500కు పైగా హాస్టళ్లలో విద్యార్థులు ఉంటూ చదువుకుంటున్నారు. బాబు హయాంలో సంక్షేమ హాస్టళ్లలో పౌష్టికాహారం కల్పించటానికి నిధులు కూడా అవసరమైన మేరకు విడుదల చేయలేదన్న విషయాన్ని ప్రభుత్వ రికార్డులే చెప్తున్నాయి’’ అని వారు వివరిస్తున్నారు. 

బీసీ మహిళలకు ఆలంబన ఏదీ..? 
‘‘అలాగే.. స్వయం సహాయక సంఘాల సభ్యులు ఆర్థికంగా నిలదొక్కుకుని సమాజంలో సగౌరంగా తలెత్తుకుని జీవించే పరిస్థితులు కల్పించాలన్న ఉద్దేశంతో రాజశేఖరరెడ్డి హయాంలో పావలా వడ్డీ పథకాన్ని ప్రారంభించారు. దాదాపు కోటి 20 లక్షల మంది మహిళలకు ఇప్పటి వరకు పావలా వడ్డీ పథకం కింద సుమారు రెండు వేల కోట్ల రూపాయలు మహిళా సంఘాలకు చెల్లించారు. అందులో దాదాపు 70 లక్షల మంది బీసీ మహిళలు పావలా వడ్డీ కింద దాదాపు గడిచిన ఎనిమిదేళ్ల కాలంలో 1,400 కోట్ల రూపాయల మేరకు లబ్ధిపొందారు. ఇది కాకుండా బ్యాంకుల నుంచి మహిళా సంఘాలకు దాదాపు రూ. 40 వేల కోట్ల మేర రుణాలు ఇప్పిస్తే.. అందులో 70 శాతం నిధులు బీసీ మహిళలు తీసుకుని వ్యాపారాలు చేయడం, వ్యవసాయ అవసరాలకు వినియోగించుకుని కుటుంబాల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోగలిగారు. వచ్చే ఎన్నికల్లో బీసీలకు ఏదో మేలు చేస్తానని చెప్తున్న చంద్రబాబు తన తొమ్మిదేళ్ల పాలనలో ఏనాడూ మహిళా సంఘాలకు పావలా వడ్డీ రుణాలు ఇవ్వాలన్న ఆలోచన కూడా చేయలేకపోయారు’’ అని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. 

బీసీల అభ్యున్నతిపై ఆలోచించిందెన్నడు..? 
‘‘ఆర్థికంగా పేదవాడికి ఉండటానికి ఇళ్లు, ఆ కుటుంబంలోని విద్యార్థి పై చదువుల కోసం ఫీజు రీయింబర్స్‌మెంట్, జబ్బు చేస్తే ఆరోగ్యశ్రీ, వృత్తుల కోసం పావలావడ్డీకే రుణాలు వంటి పథకాలపై చంద్రబాబు ఏనాడూ కనీసం ఆలోచన కూడా చేయలేదు. దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్న చేనేత వర్గాలకు రుణాలను మాఫీ చేయటం, అధికారంలోకి రాగానే విద్యుత్ బకాయిలను మాఫీ చేయటం వంటి అనేక కీలకమైన నిర్ణయాలను వైఎస్ తీసుకున్నారు.. మా నాయకుడు విద్యుత్ చార్జీలను పెంచి మరింత భారం మోపారే తప్ప వెనుకబడిన వర్గాలకు ఇది చేశారంటూ చెప్పుకోవడానికి ఒక్కటీ లేదు’’ అని సదరు నాయకుడు అసంతృప్తి వెళ్లబుచ్చారు. ‘‘వెనుకబడిన కులాలు ముఖ్యంగా బీసీ కులాల సామాజికంగా అభివృద్ధి సాధించాలన్న అంశాన్ని పరిగణనలోకి తీసుకోకుండా వారిని కేవలం కుల వృత్తి చేసుకునే వర్గాలుగా చూస్తూ చంద్రబాబు హయాంలో ఆదరణ పేరుతో ఇస్త్రీ పెట్టెలు, మోకులు, మొగతాళ్లు, సైకిళ్లు (అవి కూడా ఏమాత్రం నాణ్యత లేనివన్న విషయం అప్పట్లోనే చెప్పుకున్నారు) ఇచ్చి ఎంతో చేశానని విస్తృత ప్రచారం చేసుకున్నారు. వెనుకబడిన వర్గాలకు చెందిన ఒక కుటుంబం బాగు పడాలంటే వృత్తులను ప్రోత్సహిస్తూనే అన్ని రంగాల్లో పైకి తేవలసిన అవసర ం ఉంటుందన్నది గుర్తించింది, అందుకు తగ్గ చర్యలు తీసుకుంది వైఎస్సే’’ అని టీడీపీకి చెందిన మరో బీసీ వర్గ నాయకుడు వ్యాఖ్యానించారు. బీసీ వర్గాల్లో వృద్ధులను ఆదుకోవటానికి వైఎస్ పెన్షన్లు మంజూరు చేస్తే.. గతంలో చంద్రబాబు హయాంలో పెన్షనర్లలో ఒకరు చనిపోతే వారి స్థానంలో కొత్త వారికి పెన్షన్ ఇచ్చే విధానం అమలులో ఉండేదని వారు గుర్తుచేస్తున్నారు. 

బీసీలకు ఇళ్ల నిర్మాణంలోనూ వివక్షే..! 
‘‘వైఎస్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత బలహీన వర్గాల ఇళ్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇచ్చారు. సంతృప్త స్థాయిలో పేదలందరికీ ఇళ్లు ఇచ్చారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో.. అత్యధిక లబ్ధిదారులు బీసీలే. వైఎస్ హయాంలో మొత్తం 45 లక్షల ఇళ్లు పూర్తి కాగా.. మరో 15 లక్షల ఇళ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. పూర్తయిన 45 లక్షల ఇళ్లలో దాదాపు 20 లక్షల ఇళ్లు బీసీలకు కేటాయించినే. వీటికి బీసీ వర్గాల వారికి రూ. 2,640 కోట్ల మేర సబ్సిడీ రూపంలో అందించారు. నిర్మాణంలో ఉన్న ఇళ్లలోనూ 5 లక్షల ఇళ్లు బీసీలకు చెందినవే. కానీ.. చంద్రబాబు హయాంలో బలహీన వర్గాల ఇళ్ల నిర్మాణ పథకంలో బీసీ లబ్ధిదారుల సంఖ్య స్వల్పం. పార్టీ నేతల వద్ద పలుకుబడి ఉన్న కొద్ది మంది బీసీలకే నాటి టీడీపీ ప్రభుత్వం ఇళ్లు కేటాయించింది’’ అని టీడీపీ నేతలు పెదవి విరుస్తున్నారు. 

నాడు ఆరోగ్య, సంక్షేమ చర్యలేవీ?
‘‘చంద్రబాబు పాలనలో బీసీ, ఎస్సీ, ఎస్టీ కుటుంబాల్లో ఎవరు అనారోగ్యం పాలైనా.. ఎవరికి ఏ జబ్బు చేసినా.. వైద్యం కోసం ఆ ఇంట్లో పుస్తెలతాడు, పశువులు, చివరికి పూరిపాకనూ అమ్ముకునే దుస్థితి ఉండేది. పాతికా పరకా భూములను తాకట్టు పెట్టి అధిక వడ్డీలకు అప్పులు చేసి.. చివరకు దానినీ కోల్పోయిన వాళ్లే. వైఎస్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన రూపొందించిన ఆరోగ్యశ్రీ పథకం అమలులోకి వచ్చాక ఆ పరిస్థితి పూర్తిగా మారింది. ఆరోగ్యశ్రీ కార్డుతో నేరుగా పెద్దపెద్ద కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యం నిరుపేదలకు ఉచితంగా అందుబాటులోకి వచ్చింది. ఇప్పటి వరకూ ఈ పథకం కింద 15.18 లక్షల మంది శస్త్రచికిత్సలు చేయించుకుంటే.. వీరిలో దాదాపు ఏడు లక్షల మంది పై చిలుకు బీసీ వర్గాల వారు ఉన్నారు. వారి శస్త్రచికిత్సల కోసం వైఎస్ హయాంలో రూ. 1,500 కోట్లు వ్యయం చేశారు’’ అని టీడీపీకే చెందిన మరో సీనియర్ నాయకుడు పేర్కొన్నారు. 

అబద్ధాల్లో బాబుకు పద్మవిభూషణ్ ఇవ్వాలి

బీసీలకు వందస్థానాలు ఇస్తామనడం బూటకం
రూ. పదివేల కోట్లు కేటాయిస్తామనడం నాటకం
అధికారంలోకి రావాలనే మోసపూరిత ప్రకటనలు
బీసీలు లబ్ధిపొందింది వైఎస్ హయాంలోనే
వారి అభివృద్ధికి వైఎస్ రూ.1,600 కోట్లు కేటాయించారు
ఫీజులు మాఫీ చేశారు... మెస్ చార్జీలు 65శాతం పెంచారు
33శాతం రిజర్వేషన్లకోసం ఏకగ్రీవ తీర్మానం చేయించారు
అదేబాటలో జగన్ బీసీల సంక్షేమానికి పాటుపడతారు

హైదరాబాద్, న్యూస్‌లైన్: బీసీలకు వంద అసెంబ్లీ స్థానాలు, సబ్‌ప్లాన్ కింద రూ. పదివేల కోట్లు కేటాయిస్తామని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు చేసిన ప్రకటన బలహీన వర్గాలను మరోసారి మోసగించే ప్రయత్నమని వైఎస్సార్ కాంగ్రెస్ కేంద్ర పాలక మండలి సభ్యుడు బాజిరెడ్డి గోవర్ధన్ దుయ్యబట్టారు. 2009 ముందు ఇదేవిధంగా వంద స్థానాలని ప్రకటించి కేవలం 54 కేటాయించి బీసీలను దగా చేశారని మండిపడ్డారు. ప్రజలను మోసగించడంలో చంద్రబాబుకు పద్మశ్రీ, పద్మవిభూషణ్ అవార్డులు ప్రకటించాలని ఎద్దేవా చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం బీసీ సెల్ రాష్ట్ర కన్వీనర్ గట్టు రామచంద్రరావుతో కలిసి బాజిరెడ్డి విలేకరులతో మాట్లాడారు. ‘‘ఎన్నికల ముందు జనరంజక వాగ్దానాలు చేసి, ఆ తర్వాత వాటిని తుంగలో తొక్కడం చంద్రబాబు నైజం. రూ.2కే కిలో బియ్యం, మద్య నిషేధం, కరెంటు చార్జీల పెంపు విషయంలో మాట తప్పిన చంద్రబాబు వాటిని తన ‘మనసులో మాట’ పుస్తకంలో సమర్థించుకున్నారు. మళ్లీ ఎలాగైనా అధికారంలోకి రావాలనే దుర్నీతితో ఇప్పుడు రాష్ట్రంలో 50శాతం ఉన్న బీసీలను దగా చేసే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు బీసీల జపం చేస్తున్న తీరును పరిశీలిస్తే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది’’ అని గోవర్ధన్ దుయ్యబట్టారు. అలాంటి చంద్రబాబును బీసీ సంఘాలు అభినందించడం సరైంది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. తొమ్మిదేళ్ల చంద్రబాబు పాలనలో బీసీలకు చేసిన మంచి ఒక్కటైనా ఉందా? అని సూటిగా ప్రశ్నించారు. హైటెక్ పాలనతో బీసీలను పూర్తిగా విస్మరించారని విమర్శించారు. ఇప్పుడు రెండుసార్లు పరాభవం ఎదురయ్యేసరికి ఎటూ పాలుపోలేని స్థితిలో మోసపూరిత ప్రకటనలు చేస్తున్నారని దుయ్యబట్టారు. 

వైఎస్ హయాంలోనే బీసీలకు లబ్ధి చేకూరిందని గోవర్ధన్ చెప్పారు. కులవృత్తులకు దూరమైపోయిన బీసీలకు ఉన్నత విద్య అందుబాటులోకి తెస్తే తప్ప వారి అభ్యున్నతి సాధ్యం కాదని గ్రహించిన వైఎస్.. ఆ కులాలకు చెందిన విద్యార్థులకు పూర్తి స్థాయిలో ఫీజు మాఫీ నిర్ణయం తీసుకున్నారని గుర్తుచేశారు. ‘‘టీడీపీ పాలనలో ఒక్క బీసీ విద్యార్థికి కూడా ఫీజులు మంజూరు చేయలేదు. కేవలం రూ.8 కోట్లుగా ఉన్న సంక్షేమ రంగాల విద్యార్థుల ఫీజు బడ్జెట్ వైఎస్ హయాంలో రూ. 662 కోట్లకు పెరిగిన మాట వాస్తవం కాదా? ఉపకారవేతనాల బడ్జెట్ రూ.67 కోట్ల నుంచి రూ.500 కోట్లకు పెంచారు. 1999 నుంచి 2004 దాకా చంద్రబాబు హయాంలో విద్యార్థులకు ఒక్క రూపాయి కూడా మెస్ చార్జీలు పెరగలేదు. వైఎస్ హయాంలో 65శాతానికి పెరిగాయి. ఒక్క బీసీల అభివృద్ధికే వైఎస్ రూ.1,600 కోట్లు కేటాయించారు’’ అని గుర్తుచేశారు. బీహార్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో 30 ఏళ్లుగా బీసీ ముఖ్యమంత్రులే ఉన్నప్పటికీ వైఎస్ చేసినంత చేయలేకపోయారని చెప్పారు. రాష్ట్రంలో బీసీ విద్యార్థులకోసం వైఎస్ చేపట్టిన పథకాల్లో కనీసం 20 శాతమైనా ఆయా రాష్ట్రాల్లో లేవంటే.. బీసీల కోసం వైఎస్ ఎంత తపన పడ్డారో తెలుస్తోందన్నారు. చట్టసభల్లో బీసీలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర శాసనసభలో ఏకగీవ్ర తీర్మానం చేయించి కేంద్రానికి నివేదించిన వైఎస్, దాని అమలుకోసం పార్లమెంటులో బిల్లు పెట్టేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తూ పలుమార్లు లేఖలు రాసిన విషయాన్ని గుర్తుచేశారు. ఆ మహానేత తనయుడుగా వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి కూడా అదే బాటలో నడుస్తూ బీసీ సంక్షేమాన్ని మరింత ముందుకు నడిపిస్తారని గోవర్ధన్ స్పష్టం చేశారు.

పథకాలకు తూట్లు పొడుస్తుంటే ప్రశ్నించవేం?
దివంగత మహానేత వైఎస్ మరణానంతరం పాలన పగ్గాలు చేపట్టిన కె.రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డిలు బీసీల పథకాలకు తూట్లు పొడుస్తుంటే ప్రతిపక్షనేతగా చంద్రబాబు ఎందుకు ఆందోళనలు చేయడంలేదని గోవర్ధన్ ప్రశ్నించారు. కులవృత్తి చేసుకుంటూ బతుకులీడుస్తున్న దాదాపు రూ.70 లక్షల కుటుంబాల సంక్షేమాన్ని అప్పట్లో చంద్రబాబు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాలు గాలికొదిలేశారని మండిపడ్డారు. బీసీల అభివృద్ధిపై చంద్రబాబు హయాంలో కనబడిన నిర్లక్ష్యమే ఇప్పటి కిరణ్ ప్రభుత్వంలో కొట్టొచ్చినట్లు కనబడుతోందని ఆయన విమర్శించారు. 

టీడీపీలో దళితులకు స్థానం లేదు

తెలుగుదేశం పొలిట్‌బ్యూరో మాజీ సభ్యురాలు ఉప్పులేటి కల్పన వ్యాఖ్య
జగన్, విజయమ్మలను కలిసిన కల్పన
త్వరలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరతానని ప్రకటన

హైదరాబాద్, న్యూస్‌లైన్: టీడీపీ పొలిట్‌బ్యూరో మాజీ సభ్యురాలు ఉప్పులేటి కల్పన గురువారం మధ్యాహ్నం వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు విజయమ్మను ఆమె నివాసంలో కలుసుకున్నారు. అంతకుముందు ఉదయం ఆమె చంచల్‌గూడ జైల్లో పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్ రెడ్డిని కలిశారు.

విజయమ్మతో కొద్దిసేపు సమావేశమైన అనంతరం నివాసం బయట మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ త్వరలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరతానని ప్రకటించారు. తన నియోజకవర్గానికి వెళ్లి అక్కడ కార్యకర్తలు, శ్రేయోభిలాషులతో సమావేశమై పార్టీలో చేరే విషయాన్ని వెల్లడిస్తానని వివరించారు. వాస్తవానికి తన నియోజకవర్గ కార్యకర్తలు ఏడాది నుంచే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరదామని ఒత్తిడి తెస్తున్నారని, వారి అభీష్టానుసారం నడుచుకుంటానని అన్నారు. పార్టీ నుంచి ఏకపక్షంగా తనను బహిష్కరించినందుకే జగన్‌వైపు నిలబడాలనే ఉద్దేశంతో విజయమ్మను కలిశానని స్పష్టంచేశారు. టీడీపీలో దళితులు, బడుగు బలహీనవర్గాలకు స్థానం లేదని, అక్కడ అగ్ర కులాలకు ఓ న్యాయం, దళితులకు మరొక న్యాయం జరుగుతోందని విమర్శించారు. ‘‘విజయవాడలో వల్లభనేని వంశీ.. జగన్‌ను రోడ్డుపై కలిస్తే ఏమీ చేయలేదు. రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి జగన్‌తో మంతనాలు జరిపితే ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. అంతెందుకు బాబు తానే స్వయంగా చిదంబరాన్ని ఎవరికీ తెలియకుండా కలిశారు. మొన్న ప్రణబ్‌తో ఆయన ఫోన్‌లో మాట్లాడారు. 

కానీ నేను రాజమోహన్ రెడ్డిని కలిసినందుకే ఎలాంటి సంజాయిషీ గానీ, వివరణ గానీ కోరకుండా పార్టీ నుంచి సస్పెండ్ చేశారు’’ అని కల్పన విమర్శించారు. సామాజిక సమతౌల్యం కోసమే తనను పాలిట్‌బ్యూరోలోకి తీసుకున్నారని, అంతే తప్ప కీలక నిర్ణయాలు తీసుకునేటపుడు బాబు తమ సూచనలు, సలహాలు తీసుకున్నది లేదని ఆమె అన్నారు. కష్టపడి పనిచేసే వారికే పదవులు ఇస్తానని బాహాటంగా చెప్పే చంద్రబాబు ఆచరణలో అది చేయరని విమర్శించారు. ఎమ్మెల్సీ, రాజ్యసభ పదవులు వచ్చినపుడు ఎవరెక్కువ కోట్లు ఇస్తే వారికే సీట్లు ఇచ్చారని, పదవులను బాబు వేలం వేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఎన్నికోట్లు ఇస్తే జగన్ మాదిరిగా ప్రజాభిమానం పొందగలరని ఆమె ప్రశ్నించారు. కల్పనతో పాటుగా విజయమ్మను కలిసిన వారిలో వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ, పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వి.ఎస్.నాగిరెడ్డి, కృష్ణా జిల్లా అడ్‌హాక్ కమిటీ కన్వీనర్ సామినేని ఉదయభాను, జిల్లా అధికార ప్రతినిధి ముత్తారెడ్డి ఉన్నారు.

జగన్‌కు, ప్రజలకు క్షమాపణలు చెప్పాలి

ముఖ్యమంత్రి అబద్ధాలు చెప్పారు
జీవోలపై హైకోర్టుకు ఎందుకు జవాబు చెప్పలేదు?
ఇపుడు మంత్రుల కోసం సుప్రీంకు జవాబివ్వడం కుట్ర కాదా?

హైదరాబాద్, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చెయ్యని నేరానికి అన్యాయంగా అరెస్టు కావడానికి కారణమైన రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు, రాష్ట్ర ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ఆ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు జూపూడి ప్రభాకరరావు డిమాండ్ చేశారు. ఆయన గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జగన్‌పై మాజీ మంత్రి శంకర్‌రావు కేసు వేసినపుడు 26 జీవోలపై సమాధానం ఇవ్వని ప్రభుత్వం.. ఇపుడు మంత్రులు ఇరకాటంలో పడతారని భావించి వారి తరఫున అవి సక్రమమేనని సుప్రీంకోర్టుకు వివరణ ఇవ్వడానికి సిద్ధపడుతోందని విమర్శించారు. జీవోల జారీ మంత్రివర్గ సమష్టి నిర్ణయం అయినప్పటికీ హైకోర్టుకు మాత్రం ఆ విషయం విన్నవించలేదన్నా రు. 

మంత్రులకు న్యాయసహాయం అందిస్తున్న ప్రభుత్వం గతంలో హైకోర్టుకు ఎం దుకు సమాధానం చెప్పలేదని సీఎంను ప్రశ్నిస్తే.. జగన్ కేసులో రాష్ట్ర ప్రభుత్వం ఒక పార్టీ కాదని కిరణ్‌కుమార్ రెడ్డి చెప్పడం శుద్ధ అబద్ధమని జూపూడి ధ్వజమెత్తారు. ఈ కేసులో ఇం ప్లీడ్ అయిన టీడీపీ నేతలు కె.ఎర్రన్నాయుడు, అశోక్ గజపతి రాజు వేసిన పిటిషన్‌లో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పార్టీలుగా ఉన్నాయని జూపూడి వివరించారు. అందుకు సంబంధించిన కోర్టు ప్రతులను విలేకరులకు ప్రదర్శించారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి కూడా ఇందులో పార్టీగా ఉన్నారని పేర్కొన్నారు.

నాడు ప్రభుత్వం సమాధానం చెప్పనందుకే దర్యాప్తు

హైకోర్టు ఇచ్చిన తీర్పు పాఠంలోని 41వ పేరాలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి జీవోలపై ఎలాంటి సమాధానం రానందునే తాము జగన్ ఆస్తులపై విచారణకు ఆదేశించాల్సి వస్తోందని పేర్కొన్నట్లు జూపూడి గుర్తుచేశారు. కావాలనే రాష్ట్ర ప్రభుత్వం జగన్‌పై విచారణ జరిగేలా చేసి ఆ వ్యవహారం సీబీఐ చేతికి వెళ్లే విధంగా వ్యవహరించిందని ఆయన అన్నారు. సీబీఐ మాత్రం తన విధులను విస్మరించి వ్యక్తిగత కక్షతో జగన్‌పై అభియోగాలు మోపి జైల్లో పెట్టిందని జూపూడి విమర్శించారు. కిరణ్ ఓ వైపు అసలు ఈ జీవోల జారీలో ఎలాంటి ‘క్విడ్ ప్రొ కో’ లేదని చెబుతున్నారని, కానీ గతంలో హైకోర్టుకు అదే విషయం ఆయన చెప్పకుండా నాటకాలాడారని దుయ్యబట్టారు. ‘‘మంత్రులు నిబంధనల్లో భాగంగానే జీవోలు ఇస్తే ఇక ఎవరి తప్పూ లేనట్లే కదా! జగన్‌ను అన్యాయంగా జైల్లో పెట్టడానికి జరిగిన కుట్ర వల్లనే గతంలో స్పందించలేదనేది అర్థం అవుతోందని కదా’’ అని అన్నారు. టీడీపీ మాయలో పడి అపుడు హైకోర్టుకు సమాధానం చెప్పని ప్రభుత్వం ఇపుడు తన మంత్రులను ఎలాగైనా బయటకు తీసుకు రావాలని చూస్తోందని జూపూడి చెప్పారు. అన్యాయంగా జగన్‌ను ఒక నిందితుడిగా చూపే యత్నం చేసి ఆయన కుటుంబాన్ని రోడ్డుమీదకు తీసుకు వచ్చినందుకు ప్రభుత్వం లెంపలు వేసుకోవాలన్నారు.

జగన్ ను కలిసిన ఎన్ పీపీ అధ్యక్షుడు

Written By news on Thursday, July 12, 2012 | 7/12/2012

జమ్మూ కాశ్మీర్ కు చెందిన నేషనల్ పాంథర్స్ పార్టీ(ఎన్ పీపీ) అధ్యక్షుడు బల్వంత్‌సింగ్ మన్‌కోటియా, చైర్మన్ ప్రొఫెసర్ భీమ్‌సింగ్ చంచల్‌గూడ జైల్లో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌ను కలిశారు. రాష్ట్రపతి ఎన్నికలో సంగ్మాకు మద్దతు ఇవ్వాలని జగన్ ను వారు కోరారు.

బాబును ప్రజలు నమ్మడం లేదు: బాజిరెడ్డి

చంద్రబాబును ప్రజలు నమ్మడం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత బాజిరెడ్డి అన్నారు. అధికారంలోకి వస్తే బీసీలకు 100 సీట్లు.. రూ.10 వేల కోట్లని బాబు మభ్యపెడుతున్నారని బాజిరెడ్డి విమర్శించారు. చంద్రబాబు మొసలి కన్నీటిని ఎవరూ నమ్మొద్దని బాజిరెడ్డి అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు హైటెక్ విధానాలను అవలంబించారని, రైతులను విస్మరించారని ఆయన అన్నారు. బీసీలకు వైఎస్ఆర్ కేటాయించినన్ని నిధులు ..దేశంలో ఏ సీఎం అయినా ఇచ్చారా అని బాజిరెడ్డి ప్రశ్నించారు.

YSRCP Leader Jupudi Prabhakar Rao Fire On Congress Government

Uppuleti Kalpana Meet To YS Vijayamma


టీడీపీ పాలిట్‌బ్యూరో మాజీ సభ్యురాలు ఉప్పులేటి కల్పన గురువారం మధ్యాహ్నం వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు విజయమ్మను ఆమె నివాసంలో కలుసుకున్నారు. అంతకుముందు ఉదయం ఆమె చంచల్‌గూడ జైలులో పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డిని కలిశారు. విజయమ్మతో కొద్ది సేపు సమావేశమైన అనంతరం నివాసం బయట మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ త్వరలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరతానని ప్రకటించారు. తన నియోజకవర్గానికి వెళ్లి అక్కడ కార్యకర్తలు, శ్రేయోభిలాషులతో సమావేశమై పార్టీలో చేరే విషయాన్ని వెల్లడిస్తానని వివరించారు. నెల్లూరు ఎం.పి మేకపాటి రాజమోహన్ రెడ్డికి మాతృ వియోగం సంభవిస్తే ఆయన కుటుంబంతో సన్నిహిత సంబంధాలున్న వ్యక్తిగా పరామర్శించడానికి ఆయన కార్యాలయానికి వెళ్లి కలిసిన కొద్ది సేపట్లోనే తనను టీడీపీ నుంచి సస్పెండ్ చేస్తూ ఆ పార్టీ ప్రకటించడం అన్యాయం, దారుణం అనీ దీన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నాననీ కల్పన తెలిపారు.

పార్టీ నుంచి తనను బహిష్కరించి నందుకే జగన్ వైపు నిలబడాలనే ఉద్దేశ్యంతో విజయమ్మను కలిశానని పేర్కొన్నారు. టీడీపీలో దళితులు, బడుగు బలహీనవర్గాలకు స్థానం లేదనీ అక్కడ అగ్రకులాలకు ఓ న్యాయం, దళితులకు మరొక న్యాయం జరుగుతోందని విమర్శించారు. తనను టీడీపీ నుంచి బలవంతంగా బయటకు పంపారనీ ఇపుడు స్వతంత్రురాలిననీ తనపై ఎలాంటి ఆంక్షలు లేవు కనుక జైలులో జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిసి ఆ తరువాత విజయమ్మను కలిశానని తెలిపారు. వాస్తవానికి తన నియోజకవర్గ కార్యకర్తలు ఏడాది నుంచే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరదామని ఒత్తిడి తెస్తున్నారనీ వారి అభీష్టానుసారం నడుచుకుంటానని అన్నారు.

‘విజయవాడలో వల్లభనేని వంశీ జగన్‌ను రోడ్డుపై కలిస్తే ఏమీ చేయలేదు...రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి జగన్‌తో మంతనాలు జరిపితే ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అంతెందుకు బాబు తానే స్వయంగా చిదంబరంను ఎవరికీ తెలియకుండా కలిశారు. మొన్న ప్రణబ్‌తో ఆయన ఫోన్‌లో మాట్లాడారు. కానీ నేను రాజమోహన్ రెడ్డిని కలిసినందుకే ఎలాంటి సంజాయిషీ గానీ, వివరణ గానీ కోరకుండా పార్టీ నుంచి సస్పెండ్ చేశారు’ అని ఆమె అన్నారు. సామాజిక సమతౌల్యం కోసమే తనను పాలిట్‌బ్యూరోలోకి తీసుకున్నారు తప్ప కీలక నిర్ణయాలు తీసుకునేటపుడు బాబు తమ సూచనలు, సలహాలు తీసుకున్నది లేదని ఆమె అన్నారు.

తాను 2004లో పార్టీలో చేరి ఎనిమిదేళ్లుగా కష్టపడి పనిచేస్తున్నాననీ డబ్బు, సమయం వృథా చేసుకున్నానని ఆమె వెల్లడించారు. కష్టపడి పనిచేసే వారికే పదవులు ఇస్తానని బాహాటంగా చెప్పే చంద్రబాబు ఆచరణలో అది చేయరని అన్నారు. ఎమ్మెల్సీ, రాజ్యసభ పదవులు వచ్చినపుడు కోట్లు ఎక్కువగా ఎక్కడి నుంచి వస్తాయో వారికే ఇచ్చారనీ పదవులను బాబు వేలం వేస్తున్నారని ఆమె ఆరోపించారు. ప్యాకేజీలు ఇస్తున్నందునే వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరుతున్నారని బాబు చేస్తున్న విమర్శలన్నీ కట్టుకథలనీ జగన్ వెంట జనం ఉన్నారు కనుకనే అందరూ వస్తున్నారని ఆమె ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఎన్నికోట్లు ఇస్తే జగన్ మాదిరిగా ప్రజాభిమానం పొందగలరని ఆమె అన్నారు.

కల్పనతో పాటుగా విజయమ్మను కలిసిన వారిలో వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ, పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వి.ఎస్.నాగిరెడ్డి, కృష్ణా జిల్లా అడ్‌హాక్ కమిటీ కన్వీనర్ సామినేని ఉదయభాను, జిల్లా అధికార ప్రతినిధి ముత్తారెడ్డి ఉన్నారు.

YS Vijayamma to start Chenetha dharna on 23rd july in Sirisilla

సమస్యలతో సతమతమవుతున్న చేనేత కార్మికుల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పోరుబాట పట్టనున్నారు. చేనేత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఆమె ఈనెల 23న కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో ఒకరోజు ధర్నా చేపట్టనున్నారు. నేతన్న కష్టాలు, సమస్యలను విజయమ్మ ప్రభుత్వం దృష్టికి వెళ్లనున్నారు.



టీడీపీలో దళితులకు చోటులేదు: ఉప్పులేటి

తెలుగుదేశం పార్టీలో దళితులకు చోటు లేదని ఆపార్టీ నుంచి సస్పెండ్ అయిన పొలిట్ బ్యూరో సభ్యురాలు ఉప్పులేటి కల్పన అన్నారు. బాబు హయాంలో పార్టీకి దళితులు, మైనార్టీ, బీసీలు దూరం అవుతున్నారని ఆమె గురువారమిక్కడ అన్నారు. కుట్ర చేసి తనను పార్టీ నుంచి బలవంతంగా బయటకు పంపారని కల్పన ఆరోపించారు.

పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేశానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సామాజిక న్యాయం అని చెప్పుకోవటం కోసమే పార్టీలో తమలాంటి దళితులకు పదవులు ఇచ్చారన్నారు. తనను బయటకు పంపటం దళితులను అవమానపరచటమేనని కల్పన వ్యాఖ్యానించారు.

తాను ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డిని పరామర్శించటానికే కలిశానని, ఆ కారణానికే పార్టీ నుంచి సస్పెండ్ చేయటం దారుణమన్నారు. వివరణ కోరకుండా సస్పెండ్ ఎలా చేస్తారని కల్పన ప్రశ్నించారు. అగ్రకులాలకు ఓ న్యాయం, దళితులకు ఓ న్యాయమా అని నిలదీశారు. బాబు ఏనాడు పొలిట్ బ్యూరో సభ్యుల అభిప్రాయాలను అమలు చేయలేదన్నారు. అభిమానులు, కార్యకర్తలతో సమావేశమై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు చేరేది ప్రకటిస్తానని కల్పన తెలిపారు. జగన్ వెంట ప్రజలు, ప్రజాభిమానం ఉందని ఆమె అన్నారు.

విజయమ్మను కలిసిన ఉప్పులేటి కల్పన

తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్‌ అయిన ఆ పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యురాలు ఉప్పులేటి కల్పన గురువారం వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మతో భేటీ అయ్యారు. విజయమ్మను మర్యాద పూర్వకంగానే కలిసినట్లు ఆమె చెప్పారు. అంతకు ముందు కల్పన వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని చంచల్‌గూడ జైలులో కలిశారు.

Court rejected CBI charge sheet

జగన్ కేసులో అనుబంధ ఛార్జీషీట్ తిరస్కరణ

వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో అనుబంధ ఛార్జీషీట్ ను సిబిఐ కోర్టు తిరస్కరించింది.ఛార్జీ షీట్ లో తప్పులు ఉన్నాయని కోర్టు వ్యాఖ్యానించింది.గతంలో కూడా సిబిఐ ఎమ్.ఆర్., ఒఎమ్సీ కేసులలో కూడా ఛార్జీషీట్లను కోర్టు తిప్పి పంపి మరోసారి వేయించింది. ఇప్పుడు కూడా ఇలాగే జరిగింది.ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే సిబిఐ కేసులలో ఇలా జరగడం ఆ సంస్థకు అప్రతిష్టగానే భావిస్తున్నారు. నాలుగు కంపెనీల పేర్లను నిందితులుగా చేర్చారని, కాని కంపెనీల ప్రతినిదుల పేర్లను చేర్చకపోవడాన్ని కోర్టు ప్రశ్నించింది. కొన్ని సాంకేతిక లోటుపాట్లు ఉన్నాయని, పూర్తిగా సవరించి పంపాలని కోర్టు ఆదేశించింది.


source:kommineni

జగన్ను కలిసిన ఉప్పులేటి కల్పన

తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ అయిన పార్టీ పొలిట్ బ్యూరో సభ్యురాలు ఉప్పులేటి కల్పన గురువారం ఉదయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని చంచల్ గూడ జైల్లో కలుసుకున్నారు. ఆమెతో పాటు జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత సామినేని ఉదయభాను కూడా జగన్ ను కలిసినవారిలో ఉన్నారు.

'ముఖ్యమంత్రి వ్యాఖ్యలు శుద్ధ తప్పు'

వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై హైకోర్టు విచారిస్తున్న కేసుల్లో ప్రభుత్వం పార్టీగా లేదన్న ముఖ్యమంత్రి వ్యాఖ్యలు శుద్ధ తప్పని సీనియర్ న్యాయవాది సుధాకర్ రెడ్డి అన్నారు. ఆయన గురువారం సాక్షి హెడ్ లైన్ షోలో మాట్లాడుతూ ఈ కేసులో తొలి ప్రతివాది ప్రభుత్వమేనన్నారు. హైకోర్టు ఈ కేసు దర్యాప్తుకు ఆదేశించకముందే ప్రభుత్వం నుంచి వివరణ కోరిందని సుధాకర్ రెడ్డి గుర్తు చేశారు.

సర్కార్ నిర్ణయాలే ఆ జీవోలని ప్రభుత్వం అప్పుడే చెప్పి ఉంటే అసలు దర్యాప్తే ఉండేది కాదన్నారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలు, మంత్రులకు న్యాయ సహాయం అందిస్తున్న నేపథ్యంలో జారీ చేసిన 26జీవోలు సక్రమేనని రుజువు చేసినట్లు అన్నారు. 26 జీవోలు సక్రమమే అయితే అసలు జగన్ పై కేసే లేదని సుధాకర్ రెడ్డి అన్నారు.

Sakshi Vedika with YSRCP Leader kolli Nirmala Kumari

బీసీలను విస్మరించినందునే టీడీపీ ఓటమి : ఆర్.కృష్ణయ్య

 అధికారంలో ఉన్నప్పుడు బీసీలను పూర్తిగా విస్మరించినందునే 2004, 2009 ఎన్నికల్లో ఓటమిపాలు కావాల్సివచ్చిందన్న విషయాన్ని టీడీపీ నేతలు గుర్తు పెట్టుకోవాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య హితవు పలికారు. ఇప్పుడు బీసీలకు ఏదో చేస్తామని చెప్పడంకన్నా.. గతాన్ని పునరావృతం కానివ్వబోమని స్పష్టమైన హామీ ఇవ్వాలని టీడీపీ నేతల్ని ఆయన డిమాండ్ చేశారు. ‘సాక్షి’ టీవీలో జరిగిన చర్చా కార్యక్రమంలో ఆయన బుధవారం మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో బీసీలకు వంద సీట్లు ఇస్తామన్న qటీడీపీ ప్రకటన పట్ల పై విధంగా స్పందించారు.

1996లో బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ల పేరుతో తీర్మానం చేసిన చంద్రబాబు, ఆ తర్వాత కేంద్రంపై ఎలాంటి ఒత్తిడీ చేయలేదన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 2009 ఎన్నికల్లో టీడీపీ తరఫున బీసీలకు వంద సీట్లు ఇస్తామంటూ వరంగల్ సభలో చేసిన డిక్లరేషన్‌ను ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. కరడుగట్టిన బీసీ వ్యతిరేక వైఖరిని అవలంబిస్తోన్న కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచేందుకు ఎందుకు పోరాటాలు చేయలేదని నిలదీశారు. గతంలో ఉన్న ఫీజుల్ని కూడా బీసీ విద్యార్థులకు చంద్రబాబు కొనసాగించలేకపోయారని, జిల్లాకో కళాశాల హాస్టల్ ఏర్పాటు చేస్తానని చెప్పి చేయలేదని ఆరోపించారు. ఇవన్నీ టీడీపీ నేతలను విమర్శించేందుకు కాదని, ఇప్పటికైనా ఆత్మపరిశీలన చేసుకోవాలని చెపుతున్నానని ఆయన చెప్పారు. 


చెప్పడం కాదు.. ఆచరణలో పెట్టండి.. 
ఇదిలా ఉండగా కృష్ణయ్య విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో బీసీలకు వందసీట్లు ఇస్తామని ప్రకటించిన టీడీపీ నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని, అయితే దీన్ని ఆచరణలో పెట్టాలని సూచించారు. టీడీపీ ఇచ్చిన బీసీల డిక్లరేషన్‌లో స్పష్టత లేదన్నారు. జాతీయస్థాయిలో చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, బీసీ సంక్షేమ శాఖకు ప్రత్యేక మంత్రిని నియమించాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ అమలుకోసం అన్నిపార్టీలూ కృషిచేయాలని కోరారు. నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 50 శాతం కోటా ఇవ్వాలని, బీసీ కార్పొరేషన్లకు రూ.10 వేల కోట్లు కేటాయించాలని, ప్రతి బీసీ కుటుంబానికి ఐదు నుంచి 50 లక్షల వరకు రుణాలివ్వాలని కోరారు.

26 జీవోలు సరైనవేనంటున్న సర్కారు


దర్యాప్తుకు ఆదేశించక ముందే సర్కారుకు హైకోర్టు నోటీసులు
అప్పుడు మాత్రం మౌనంగా ఊరుకున్న రాష్ర్ట ప్రభుత్వం
అప్పుడే ఈ సమాధానం చెప్పి ఉంటే ఈ దర్యాప్తే ఉండేది కాదేమో!
అందుకే నాడు ఊరుకుని... నేడు మంత్రుల కోసం ఈ వైఖరి

హైదరాబాద్, సాక్షి ప్రత్యేక ప్రతినిధి: కొందరు పారిశ్రామికవేత్తలకు లబ్ధి చేకూరేలా నాటి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుందని, అందుకు ప్రతిఫలంగానే వారు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారనేది.. సీబీఐ కేసులో ప్రధాన ఆరోపణ. కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్రావు, తెలుగుదేశం పార్టీ నేతలు వేసిన పిటిషన్ ఆధారంగా దీనిపైనే అప్పటి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కక్రూ దర్యాప్తునకు ఆదేశించారు. ఈ మేరకు దర్యాప్తు మొదలుపెట్టిన సీబీఐ.. ప్రభుత్వ నిర్ణయాల జోలికి పోలేదు. సీబీఐ దర్యాప్తు మొత్తం జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన సంస్థలు, వాటిలోని ఇన్వెస్టర్ల చుట్టూనే తిరుగుతుండటంతో నెల్లూరుకు చెందిన పి.సుధాకరరెడ్డి అనే న్యాయవాది దీనికి అభ్యంతరం చెప్తూ కేసు వేశారు. ‘‘ప్రభుత్వం కొందరికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవటంతో వారు జగన్‌మోహన్‌రెడ్డి సంస్థల్లో పెట్టుబడులు పెట్టారనేది ఈ కేసులో ప్రధాన అభియోగం. అంటే ముందు ప్రభుత్వం కొందరికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుందా? లేక అంతా నిబంధనల ప్రకారమే జరిగిందా? అన్నది తేలాలి. ఈ మేరకు ప్రభుత్వం జారీ చేసిన జీవోలు సరైనవో కావో తేల్చాలి. అవేమీ తేల్చకుండా దర్యాప్తు మొత్తం జగన్ చుట్టూనే తిరుగుతుండటం పక్షపాతాన్ని కళ్లకు కడుతోంది. దయచేసి నిష్పాక్షిక దర్యాప్తునకు ఆదేశించండి’’ అంటూ సీబీఐ న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. దీనిని సీబీఐ కోర్టు కొట్టివేయటంతో న్యాయవాది సుధాకరరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. అక్కడా పిటిషన్‌ను తిరస్కరించటంతో చివరికి సుప్రీంకోర్టుకు వెళ్లారు. 

సుప్రీంకోర్టు దీనిపై స్పందించి ఆ జీవోలు జారీ చేసిన ఆరుగురు మంత్రులకు, కొందరు ఐఏఎస్ అధికారులకు నోటీసులు జారీ చేసింది. అలా నోటీసులు అందుకున్న ఆరుగురు మంత్రుల్లో మోపిదేవి వెంకటరమణ మినహా మిగిలిన ఐదుగురు మంత్రులకూ న్యాయ సహాయం అందజేయాలని ప్రభుత్వం ఇటీవలే నిర్ణయం తీసుకుంది. దీన్ని సమర్థించుకుంటూ... ‘‘వారు తప్పు చేశారని నేననుకోవటం లేదు. ఆ జీవోలు ప్రభుత్వం ఇచ్చినవి. అవి ప్రభుత్వ నిర్ణయాలు కాబట్టే సాయం అందిస్తున్నాం. అయితే క్విడ్ ప్రో కోలతో మంత్రులకు సంబంధం ఉందనుకోవటంలేదు’’ అని ముఖ్యమంత్రి బుధవారం వ్యాఖ్యానించారు. నిజానికి ఈ కేసులో దర్యాప్తునకు ఆదేశించకముందు ప్రభుత్వం వైఖరేమిటో చెప్పాలని హైకోర్టు నోటీసులు జారీ చేసింది కూడా. ప్రభుత్వం గనక తమ నిర్ణయాలన్నీ నిబంధనల ప్రకారమే జరిగాయని, తప్పేమీ లేదని చెప్పి ఉంటే.. బహుశా ఈ విచారణ, ఈ దర్యాప్తు ఇవన్నీ ఉండేవి కావేమో! కానీ ప్రభుత్వం అప్పట్లో తన వైఖరిని కోర్టుకు చెప్పలేదు. దీన్ని న్యాయమూర్తి జస్టిస్ కక్రూ తన తీర్పులోని 41వ పేరాలో ప్రస్తావిస్తూ.. అన్ని కేసుల మాదిరిగానే ఈ కేసులోనూ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులిచ్చామని, కానీ ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయకూడదని భావించినట్లుందని వ్యాఖ్యానించారు. రికార్డులు కూడా అందజేయలేదని, అలాంటపుడు తగిన విధంగా అర్థం చేసుకోవటం తప్ప ఈ కోర్టు చేయగలిగిందేమీ లేదని అన్నారు. 

ప్రభుత్వం చేత బలవంతంగా అఫిడవిట్ వేయించలేమని కూడా స్పష్టం చేశారు. ‘‘ప్రభుత్వం కౌంటర్ వేయలేదు కనక, రికార్డులు ఇవ్వలేదు కనక పిటిషనర్ కోరినట్టు దర్యాప్తునకు ఆదేశించలేమని చెప్పలేం. మా ముందున్న మిగిలిన ఆధారాలు, ఇతర అంశాల ఆధారంగా నిర్ణయానికి రావాల్సి ఉంటుంది’’ అని పేర్కొన్నారు. కానీ బుధవారం నాడు సీఎం మాత్రం.. ‘‘ఆ కేసులో ప్రభుత్వం పార్టీ కాదు. అందుకే మేం కోర్టుకు సమాధానం చెప్పలేదు’’ అని వ్యాఖ్యానించటం గమనార్హం. చివరికి కోర్టు తన తీర్పులో సైతం.. ప్రతివాదుల జాబితాలో మొట్టమొదట రాష్ట్ర ప్రభుత్వాన్నే పేర్కొంది. దాని ప్రతినిధిగా పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శిని పేర్కొంది. ప్రభుత్వం మాత్రం తాను భాగస్వామిని కాదని చె ప్పటం గమనార్హం.

సీమ, తెలంగాణ, ఆంధ్ర అన్ని చోట్లా ప్రజలు నిన్ను ఛీకొట్టారు

చంద్రబాబుపై ఎమ్మెల్యే కొడాలి నాని ఫైర్
నియంతలా సంజాయిషీ కూడా అడగకుండా ఎలా సస్పెండ్ చేస్తావ్?
నాపై సస్పెన్షన్ ఎత్తివేసి బహిరంగ క్షమాపణ చెప్పకపోతే కోర్టుకెళతా
నాడు నీ స్వార్థం కోసం ఎన్టీఆర్‌ను గెంటేశావ్
ఇప్పుడు నీ కొడుకు కోసం నాలాంటి ఎన్టీఆర్ అభిమానులను గెంటేస్తున్నావ్
టీడీపీని కాంగ్రెస్‌కు హోల్‌సేల్‌గా అమ్మేసిన నువ్వు అతిపెద్ద అవినీతిపరుడివి
ఢిల్లీ వెళ్లి సోనియాగాంధీని, హోంమంత్రి చిదంబరాన్ని ముసుగేసుకుని కలిశావ్
రూ. 300 కోట్లకు రాజ్యసభ సీట్లు అమ్మేశావ్
గాలి జనార్ధనరెడ్డిపై ఆరోపణలు చేయడానికి రూ.300 కోట్లు తీసుకున్నావ్
చంద్రబాబు ఉంటే తెలుగుదేశం పార్టీకి భవిష్యత్ లేదు

గుడివాడ (కృష్ణా), న్యూస్‌లైన్: ‘‘పార్టీ నీ బాబు సొత్తా.. నీ ఇష్టం వచ్చినట్లు నియంతలా వ్యవహరిస్తున్నావు.. నాడు నీ స్వార్థం కోసం అన్న ఎన్టీఆర్‌ను పార్టీ నుంచి గెంటేశావు.. నేడు నీ కొడుకు రాజకీయ భవిష్యత్ కోసం ఎన్టీఆర్ అభిమానులుగా ఉన్న నాలాంటివారిని పార్టీ నుంచి గెంటేస్తున్నావు.. నేనేం తప్పు చేశానని గెంటేశావు? తెలుగుదేశం పార్టీని కాంగ్రెస్‌కు హోల్‌సేల్‌గా అమ్మేస్తున్న అతిపెద్ద అవినీతిపరుడివి నువ్వు’’ అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) ధ్వజమెత్తారు. కుళ్లు రాజకీయాలు, వెన్నుపోట్లు, కుతంత్రాలు, కుట్రలు, స్వార్థ రాజకీయాలు చంద్రబాబుకు పేటెంటు హక్కు అని, అవి ఇంకెవరికీ చెందవని అన్నారు. పార్టీ నుంచి ఏకపక్షంగా సస్పెండ్ చేసిన 
తనను చంద్రబాబు, ఆయన అనుచరులు బహిరంగ క్షమాపణ చెప్పి పార్టీలో చేర్చుకోవాలని.. లేకుంటే కోర్టుకెళ్లి న్యాయపోరాటం చేస్తానని హెచ్చరించారు. గుడివాడలోని తన కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాని టీడీపీ అధినేత చంద్రబాబుపై నిప్పులు చెరిగారు.

వ్యక్తిగత స్వేచ్ఛలేదా?

‘‘నాకు పార్టీలో వ్యక్తిగత స్వేచ్ఛ లేదా? మీరు కాంగ్రెస్ వాళ్ల ఇంటికి వెళ్లొచ్చా.. అవేమో వ్యక్తిగత సంబంధాలా? నేను వెళితే తప్పా? వ్యక్తిగత సంబంధాల మేరకు నేను వైఎస్ జగన్‌ను పరామర్శించడానికి వెళదామనుకున్నా. అలా వెళితే నువ్వు పిల్ల చచ్చిన కోతిలాఏడుస్తావని ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు విజయమ్మను కలిసి మాట్లాడాను. అలా కలిసి బయటకు వచ్చేటప్పటికే.. రెండు నిమిషాల్లో పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ప్రకటించారు. వ్యక్తులతో మాట్లాడినంత మాత్రాన సస్పెండ్ చేయడమేనా? అధినేత అనేవాడు పిలిచి మాట్లాడాలి. నా సంజాయిషీ కోరాలి.. కనీసం నాకు నోటీసులు కూడా ఇవ్వలేదు. ఎన్టీఆర్ అభిమానులుగా ఉన్న నాలాంటివారిని బయటకు గెంటేయాలనే కుట్రతోనే ఇలా చేశారు. సస్పెండ్ చేసిన వెంటనే హైదరాబాద్ కార్యాలయంలో చంద్రబాబు.. తన భజనపరులుగా ఉన్న జిల్లాకు చెందిన నాయకులతో మీడియా సమావేశం ఏర్పాటు చేసి నన్ను రకరకాలుగా తిట్టించారు. రాజకీయ వ్యభిచారినని.. డబ్బుకు అమ్ముడుపోయానని, పార్టీకి ద్రోహం చేశానని.. రాళ్లతో కొట్టాలని ఊరకుక్కలతో మొరిగించారు. నేనేం తప్పు చేశానని రాళ్లతో కొడతారు? ఎందుకు సస్పెండ్ చేశావు? అయినప్పటికీ చంద్రబాబు తన తప్పు తెలుసుకుని మారతాడనుకుని మీడియావారికి కూడా రెండు రోజులు కనిపించకుండా ఉన్నాను. రెండో రోజు కూడా జిల్లాకు చెందిన బీసీ ఎంపీతో గుడివాడలో సమావేశం ఏర్పాటుచేసి తిట్టించారు. సాయంత్రం చంద్రబాబే నేరుగా దాడికి దిగారు. అందుకే నేడు మాట్లాడాల్సివస్తోంది’’ అని నాని అన్నారు.

ఇంకా అధ్యక్షుడిగా ఉండడానికి సిగ్గులేదా?

‘‘గుడివాడ నియోజకవర్గం ప్రజలు నన్ను రాళ్లు, చెప్పులతో కొట్టాలని చెప్పిన నీకు(చంద్రబాబు) ఏమాత్రం సిగ్గులేదు. నిన్ను చంద్రగిరిలో తరిమేస్తే పారిపోయి కుప్పంలో తలదాచుకున్నవాడివి.. ప్రజాస్వామ్యంలో రాళ్లు, చెప్పులతో కొట్టనవసరం లేదు.. డిపాజిట్లు రాకుండా చేస్తే అదే తిరస్కరించడం. ఇటీవల దాదాపు 60 చోట్ల పోటీచేస్తే.. సీమ, తెలంగాణ, ఆంధ్ర అన్ని చోట్లా ప్రజలు నిన్ను ఛీకొట్టారు. మొన్న జరిగిన 18 నియోజకవర్గాల ఉపఎన్నికల్లో పార్టీకి డిపాజిట్లు కూడా ఇవ్వకుండా ప్రజలు తిరస్కరించారు. అయినా సిగ్గులేకుండా ఇంకా నువ్వు పార్టీకి అధ్యక్షుడిగా కొనసాగుతున్నావ్. నువ్వు దౌర్భాగ్యుడివని తెలిసినా.. అన్న ఎన్టీఆర్ మీద అభిమానంతోనే ఇంకా పార్టీలో కొనసాగుతున్నాం.. కానీ అన్న కుటుంబాన్ని అభిమానించేవారందరినీ నువ్వు బయటకు పంపేస్తున్నావ్’’ అని నాని విమర్శించారు.

జూనియర్ ఎన్టీఆర్ డిమాండ్ చేసి నాకు సీటు ఇప్పించారు

‘‘నేనేమీ నీ దయా దాక్షిణ్యం వల్ల రాజకీయాల్లోకి రాలేదు. హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ నాకు రాజకీయ భవిష్యత్ ఇచ్చారు. ఎన్టీఆర్ కుటుంబం అంటే నాకు ఎనలేని అభిమానం. జూనియర్ ఎన్టీఆర్ డిమాండ్ చేసి నాకు రెండుసార్లు టికెట్ ఇప్పించారు. ఎక్కడా లేని విధంగా పార్టీని మున్సిపాల్టీలో గెలిపించాను. జెడ్పీటీసీలు, ఎంపీపీలు, స్థానిక సంస్థల్లో 80 శాతం గెలిపించాను. కానీ నీవు.. నీ కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పం మండలంలో జెడ్పీటీసీని కూడా గెలిపించుకోలేదు. నీపై పోటీ చేసిన వ్యక్తి జెడ్పీ చైర్మన్ అయ్యాడు. ఇది నిజంకాదా? నీలా కుళ్లు, కుతంత్రాలు నాకు తెలియదు. నీకు రాజకీయ భవిష్యత్ ఇచ్చిన గల్లా అరుణకుమారి తండ్రిని వెన్నుపోటు పొడిచావు. అది మరిచిపోయావు. ప్రజలు రాళ్లు, చెప్పులతో నన్ను కొట్టాలని చెప్పావు.. కానీ నిన్ను రాష్ట్ర ప్రజలు రాళ్లతో కొట్టకుండా చూసుకో.. నువ్వుండగా నీ పార్టీ రాష్ట్రంలో గెలవదు. గుడివాడలో పోటీచేద్దాం.. రా.. నీ పార్టీ గెలుస్తుందో, నేను గెలుస్తానో చూద్దాం...’’ అని నాని సవాలు విసిరారు.

మరణించిన వ్యక్తిపై నిందలు తగదు..

‘‘వైఎస్ రాజశేఖరరెడ్డి చనిపోయాక ఆయనపై నిందలు వేస్తూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడావు. చిన్నకుర్రాడు జగన్‌పై అవినీతి ఆరోపణలు ప్రచారం చేశావు. కానీ జనం నీ మాటలు నమ్మలేదు. నువ్వు దొంగవని నమ్ముతున్నారు. చనిపోయిన వ్యక్తిని తిట్టే సంస్కృతి మనది కాదు. అయినా రాజశేఖరరెడ్డిని అవినీతిపరుడని చనిపోయాక దూషించావు. నాకు జగన్‌తో వ్యక్తిగత పరిచయాలున్నాయి. ఆయన్ను నాలుగైదుసార్లు కలిశాను. వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్నప్పటి నుంచి పరిచయాలున్నాయి. ఎన్టీఆర్ అంటే ఎంతో అభిమానం ఉంది. అలాగే వైఎస్ అంటే ప్రత్యేక గౌరవం ఉంది. వైఎస్‌ను పేదలు దేవుడిగా కొలుస్తున్నారు. గుడివాడలో పేద ప్రజలకు ఇళ్లస్థలాలు కావాలని అడిగితే వైఎస్ 100 ఎకరాలు భూసేకరణ చేశారు..’’ అని నాని చంద్రబాబుకు గుర్తు చేశారు.

సోనియాకు పార్టీని తాకట్టు పెట్టావు..

‘‘అన్న ఎన్టీఆర్ బడుగు, బలహీనవర్గాల వారికోసం పార్టీని పెట్టారు.. నీలాంటి పందికొక్కుల కోసం కాదు. నువ్వేమో టీడీపీని కాంగ్రెస్ పార్టీకి హోల్‌సేల్‌గా అమ్మేశావు.. సోనియా, చిదంబరంలను ముసుగేసుకుని కలుస్తున్నావు. కాంగ్రెస్‌తో కుమ్మక్కయింది వాస్తవం కాదా? ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయలేదు? నేను రూ. 30 కోట్లకు అమ్ముడుపోయానని చెప్పించావు. నీవు రాజ్యసభ సీట్లను రూ. 300 కోట్లకు అమ్మేశావు. గాలి జనార్దనరెడ్డిని అల్లరి చేయటానికి అప్పటి కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప వద్ద రూ.300 కోట్లు తీసుకున్నావు. అవినీతిపరుడివి నువ్వా... నేనా? రూ.100 నుంచి వందల కోట్ల వరకు అవినీతికి పాల్పడేది నువ్వే. నా బిడ్డల మీద ప్రమాణం చేసి చెబుతున్నా.. నేను జగన్‌మోహన్‌రెడ్డి దగ్గర రూపాయి కూడా తీసుకోలేదు. నీ విషపు రాజకీయాలకు నీతో పొత్తు పెట్టుకున్న కమ్యూనిస్టులు, బీజేపీ, టీఆర్‌ఎస్‌లు బలయ్యాయి..’ అంటూ నాని చంద్రబాబుపై మండిపడ్డారు.

బాబుపైనే నా రాజకీయ భవితవ్యం..

తన రాజకీయ భవితవ్యం చంద్రబాబుపైనే ఆధారపడి ఉందని కొడాలి నాని స్పష్టం చేశారు. సస్పెన్షన్ ఎత్తివేసి రాజకీయంగా తనను ముంచుతాడో, సస్పెన్షన్ అలాగే ఉంచి తనకు రాజకీయ భవిష్యత్‌ను ఇస్తాడో తేల్చాలని వ్యంగ్యంగా అన్నారు. తాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరే అంశం నిర్ణయిస్తానని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. జగన్ పార్టీలోకి రమ్మంటే వెళతానన్నారు. అయితే తనపై పార్టీ సస్పెన్షన్ ఎత్తకపోతేనేనని చెప్పారు. జగన్ అవినీతి ఆరోపణలు ఎదుర్కొని జైల్లో ఉంటే, ఆయన్ను పరామర్శించడానికి ఎలా వెళ్లారని విలేకరులు నానిని ప్రశ్నించగా, ‘‘జగన్ చాలా మంచివారు. ఆయనపై లేనిపోని అభియోగాలు మోపి కేసుల్లో ఇరికించారు. అవన్నీ కోర్టులో త్వరలోనే తేలతాయి. నేను పార్టీ మారాలనుకుంటే వైఎస్ ఉన్నప్పుడే వెళ్లేవాడిని’’ అన్నారు. విలేకరుల సమావేశంలో టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి దుక్కిపాటి శశిభూషణ్, టీడీపీ పట్టణ అధ్యక్షుడు యలవర్తి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Popular Posts

Topics :