చంచల్గూడ జైలులో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే తెలుగుదేశం, కాంగ్రెస్, తెలంగాణ రాష్ట్ర సమితి పునాదులు గల్లంతు కావడం ఖాయమేనా? అనే అంశంపై ఇపుడు రాష్ట్రంలో సర్వత్రా చర్చ సాగుతోంది. రాష్ట్రంలో ఎపుడు ఎన్నికలు జరిగినా ఇటీవల వెల్లడైన ఉప ఎన్నికల నాటి ఫలితాలే పునరావృత్తం కావడం ఖాయమనే సంకేతాలు వస్తున్నాయి.
దివంగత మహానేత వైఎస్ఆర్కు వారసుడుగానే కాకుండా నిజమైన రాజకీయ వారసుడిగా జగన్నే రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు. అందుకే.. అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు ఎన్ని విధాలుగా ప్రజలను మభ్యపెట్టేందుకు కృషి చేస్తున్నప్పటికీ.. ప్రజలు మాత్రం పాలకులను నమ్మడం లేదు. దీంతో 2014 అసెంబ్లీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్కు కష్టాలు తప్పవన్న సంకేతాలు వెలువడుతున్నాయి.
మరోవైపు... తెలంగాణ అంశంలో రెండు కళ్ల సిద్ధాంతాన్ని అనుసరించడంతో పాటు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పాత్రను విస్మరించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ప్రభుత్వం చేస్తున్న తప్పులకు కొమ్ముకాస్తున్నారన్న అపవాదు లేకపోలేదు. దీంతో చంద్రబాబుపై ప్రజలకు విశ్వాసం పూర్తిగా సన్నగిల్లి పోయింది. దీనికి నిదర్శనమే.. గత ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు డిపాజిట్లను కోల్పోయారు. పైపెచ్చు.. వచ్చే 2014 ఎన్నికల్లో టీడీపీ గెలిచే ప్రసక్తే లేదని సాక్షాత్ టీడీపీ సీనియర్ నేతలే అభిప్రాయపడుతున్నారు. దీంతో ఆ పార్టీ కార్యకర్తల్లో అభద్రతాభావం నెలకొంది. ఫలితంగా జగన్ వైపు పరుగు లంఘించేందుకు సిద్ధంగా ఉన్నారు.
ఇకపోతే.. తెలంగాణ రాష్ట్ర సమితి. వైఎస్ఆర్ సీపీ లేదా జగన్ పెరెత్తినా టీఆర్ఎస్ నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. దీనికి నిదర్శనం ఇటీవల జరిగిన పరకాల ఉప ఎన్నికే. ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి కొండా సురేఖ గెలిచి ఓడారు. టీఆర్ఎస్ నేతల్లో ముచ్చెమటలు పోయించారు. తెలంగాణ ఉద్యమాన్ని ఊపిరిగా చేసుకున్న ప్రయాణం సాగిస్తున్న టీఆర్ఎస్.. పరకాల ఉప ఎన్నికల్లో సెంటిమెంట్కు పట్టం కట్టినంత పని చేశారు. ఇది తెరాస నేతలు ఏమాత్రం జీర్ణించుకోలేక పోతున్నారు.
మున్ముందు వైఎస్ఆర్ సీపీ బలం తెలంగాణలో బలం పుంజుకుంటే తమ పీఠాలు కూలిపోతాయన్న భయం వారిని వెంటాడుతోంది. అందుకే జగన్ లేదా విజమయ్య పర్యటనలంటే వారికి కంటిమీదకునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ పర్యటనలు అడ్డుకునేందుకు సర్వశక్తులు ఒడ్డి పోరాడుతున్నాయి. అవసరమైతే శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు సైతం ఏమాత్రం వెనుకంజ వేయడం లేదు. గతంలో మానుకోట నిన్న సిరిసిల్ల ఘటనలతో ఇది రుజువైంది.
ఈ పరిణామాలన్నీ బేరీజు వేస్తే జగన్ బయటకొచ్చి మరోమారు రాష్ట్రంలో వైఎస్ఆర్ తరహాలో పాదయాత్ర లేదా మరో పేరుతోనే శ్రీకారం చుడితే ఈ రెండు పర్యటనలు చేపట్టిన పక్షంలో ఈ మూడు పార్టీల పునాదులు కావడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
దివంగత మహానేత వైఎస్ఆర్కు వారసుడుగానే కాకుండా నిజమైన రాజకీయ వారసుడిగా జగన్నే రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు. అందుకే.. అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు ఎన్ని విధాలుగా ప్రజలను మభ్యపెట్టేందుకు కృషి చేస్తున్నప్పటికీ.. ప్రజలు మాత్రం పాలకులను నమ్మడం లేదు. దీంతో 2014 అసెంబ్లీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్కు కష్టాలు తప్పవన్న సంకేతాలు వెలువడుతున్నాయి.
మరోవైపు... తెలంగాణ అంశంలో రెండు కళ్ల సిద్ధాంతాన్ని అనుసరించడంతో పాటు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పాత్రను విస్మరించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ప్రభుత్వం చేస్తున్న తప్పులకు కొమ్ముకాస్తున్నారన్న అపవాదు లేకపోలేదు. దీంతో చంద్రబాబుపై ప్రజలకు విశ్వాసం పూర్తిగా సన్నగిల్లి పోయింది. దీనికి నిదర్శనమే.. గత ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు డిపాజిట్లను కోల్పోయారు. పైపెచ్చు.. వచ్చే 2014 ఎన్నికల్లో టీడీపీ గెలిచే ప్రసక్తే లేదని సాక్షాత్ టీడీపీ సీనియర్ నేతలే అభిప్రాయపడుతున్నారు. దీంతో ఆ పార్టీ కార్యకర్తల్లో అభద్రతాభావం నెలకొంది. ఫలితంగా జగన్ వైపు పరుగు లంఘించేందుకు సిద్ధంగా ఉన్నారు.
ఇకపోతే.. తెలంగాణ రాష్ట్ర సమితి. వైఎస్ఆర్ సీపీ లేదా జగన్ పెరెత్తినా టీఆర్ఎస్ నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. దీనికి నిదర్శనం ఇటీవల జరిగిన పరకాల ఉప ఎన్నికే. ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి కొండా సురేఖ గెలిచి ఓడారు. టీఆర్ఎస్ నేతల్లో ముచ్చెమటలు పోయించారు. తెలంగాణ ఉద్యమాన్ని ఊపిరిగా చేసుకున్న ప్రయాణం సాగిస్తున్న టీఆర్ఎస్.. పరకాల ఉప ఎన్నికల్లో సెంటిమెంట్కు పట్టం కట్టినంత పని చేశారు. ఇది తెరాస నేతలు ఏమాత్రం జీర్ణించుకోలేక పోతున్నారు.
మున్ముందు వైఎస్ఆర్ సీపీ బలం తెలంగాణలో బలం పుంజుకుంటే తమ పీఠాలు కూలిపోతాయన్న భయం వారిని వెంటాడుతోంది. అందుకే జగన్ లేదా విజమయ్య పర్యటనలంటే వారికి కంటిమీదకునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ పర్యటనలు అడ్డుకునేందుకు సర్వశక్తులు ఒడ్డి పోరాడుతున్నాయి. అవసరమైతే శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు సైతం ఏమాత్రం వెనుకంజ వేయడం లేదు. గతంలో మానుకోట నిన్న సిరిసిల్ల ఘటనలతో ఇది రుజువైంది.
ఈ పరిణామాలన్నీ బేరీజు వేస్తే జగన్ బయటకొచ్చి మరోమారు రాష్ట్రంలో వైఎస్ఆర్ తరహాలో పాదయాత్ర లేదా మరో పేరుతోనే శ్రీకారం చుడితే ఈ రెండు పర్యటనలు చేపట్టిన పక్షంలో ఈ మూడు పార్టీల పునాదులు కావడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


‘నోరెట్టుకు బతకవే ఊరగంగానమ్మా!’ అన్న చందంగా అరుపులూ కేకలూ అల్లరీ హడావుడీ బతుకుతెరువుగా బండి లాగిస్తున్న రాజకీయుల్లో ముందుగా చెప్పుకోవలసిన పేరు వుత్పల హనుమంతరావు అనే వీహెచ్ది. అలాంటి నేత ఇప్పుడు గాంధీ భవన్లో ‘మౌనవ్రతం’చేపట్టడం చూసి జనం నోళ్లు నొక్కుకుంటున్నారు. అంతకు మించి, కే.కేశరావు, డీ.ఎల్. రవీంద్రారెడ్డిలాంటి గగ్గోలురాయుళ్లు వీహెచ్ మౌన దీక్షా శిబిరాన్ని సందర్శించి ఆయనకు సానుభూతి ప్రకటించడం మరింత విడ్డూరంగా ఉంది. ఈ నేతల సెన్సాఫ్ హ్యూమర్ను అభినందించాలి!

ఈ నేపథ్యంలో ‘‘వచ్చే ఐదేళ్లలో రూ.1.45 లక్షల కోట్ల పెట్టుబడులతో 660 భారీ పరిశ్రమలు, మరో 60,400 చిన్నతరహా పరిశ్రమలు ఏర్పాటై, మొత్తం 10.62 లక్షల మందికి ఉద్యోగాలు లభిస్తాయి’’ అని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కేంద్ర ప్రణాళికా సంఘానికి సమర్పించిన నివేది కలో పేర్కొన్నది. 12వ పంచవర్ష ప్రణాళిక ప్రగతి లక్ష్యా లలో ఒకటిగా ప్రకటించింది. ప్రభుత్వ భావదారిద్య్రానికి, నిర్లక్ష్యానికి ఇదొక నిదర్శనం.

27-7-12-47421.jpg)

తెలుగు చలన చిత్ర సీమలో మెగాస్టార్ స్థాయికి ఎదిగినా కాంగ్రెస్ రాజకీయాల్లో స్టార్ హోదాను కూడా దక్కించుకోలేకపోతున్న చిరంజీవి మనసంతా కేంద్ర ప్రభుత్వ మంత్రి వర్గ విస్తరణ మీదే ఉంది. సామాజిక న్యాయం నినాదంతో మార్పు లక్ష్యంగా.. సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన చిరంజీవికి ఆద్యంతము అనుకోని సంఘటనలే ఎదురవుతున్నాయి. ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రజారాజ్యం పార్టీ గత ఎన్నికల్లో అట్టర్ ఫ్లాప్ కావడంతో కొద్ది రోజులు దిక్కు తోచని స్థితిలో ఉన్నారు. అలాంటి పరిస్థితిలో రాజకీయ నడిసముద్రంలో ఓ చెక్క ముక్కపై మునగడమా, తేలడమా తెలియని స్థితిలో ఓ ఆసరా కోసం ఎదురు చూస్తున్న ఆయనకు కాంగ్రెస్ ఆఫర్ 'భాగ్యలక్ష్మి బంపర్ డ్రా' తగిలినంత పనైంది.
హైదరాబాద్, న్యూస్లైన్: టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్రావు తెలంగాణకు ప్రథమ శత్రువు అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎంఏ రహమాన్ ఆరోపించారు. హైదరాబాద్లోని బషీర్బాగ్ చౌరస్తాలో బుధవారం మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా రహమాన్ మాట్లాడుతూ, తెలంగాణ సెంటిమెంట్ను ఎలక్షన్-కలెక్షన్గా మార్చారని ధ్వజమెత్తారు. తమపార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ సిరిసిల్లకు వెళితే కిరాయిమూకలతో అల్లర్లు సృష్టించారని ఆరోపించారు. దాడులు, వాహనాలు ధ్వంసం చేసి తెలంగాణ సంస్కృతిని మంటగలిపారని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు.








