23 September 2012 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Naidu padayatra: 'Oh Babu Repu Raa!'

Written By news on Saturday, September 29, 2012 | 9/29/2012


There is a superstition in certain rural areas of Andhra Pradesh to drive away ghosts and evil forces. Whenever there is a rumour about a ghost knocking the doors of houses during the night time, the villagers write on the front door saying: “Oh Stree Repu Raa” (Oh woman, come tomorrow); so that whenever the ghost comes to the house to knock the door, it reads the sentence and goes back. Since the writing remains on the doors permanently, the ghost will never get an opportunity to enter their houses.
YSR Congress party leaders are comparing Telugu Desam Party president N Chandrababu Naidu to such a ghost, while criticising his proposed Padayatra from October 2.
“If he tries to enter the villages, the people will be compelled to write on the walls saying – Oh Babu, Repu Raa; so that he would never be allowed to come to their villages. For nine years, the people of Andhra Pradesh had to face the sufferings in the form of Naidu ghost,” YSR Congress party leader G Srikanth Reddy said.
He said even the TDP leaders do not have faith on Naidu coming back to power, as he had lost his credibility. “The people would never believe him and they would never receive him during the padayatra,” he asserted.

source :http://www.greatandhra.com/viewnews.php?id=40941&cat=15&scat=16

YSRCP MLA Srikanth reddy Press conference on 29th Sep 2012

వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణను సాగతీసేందుకు సీబీఐ అధికారులు రోజుకో ఎత్తుగడ


*ఆ సాకుతో వాయిదా కోరిన సీబీఐ న్యాయవాది
*తాను వాదనలు వినిపించే అవకాశం ఉన్నా మౌనం
*కొత్త న్యాయవాది మరో కేసులో బిజీగా ఉన్నారని నివేదన
*సీబీఐ తీరుపై జగన్ తరఫు న్యాయవాది అభ్యంతరం
*ప్రతిసారీ ఇదే తంతు కొనసాగిస్తోందని నివేదన
*సోమవారం విచారించాలని సుప్రీంకోర్టుకు అభ్యర్థన
*5వ తేదీన విచారిస్తామన్న ధర్మాసనం

న్యూఢిల్లీ, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణను సాగతీసేందుకు సీబీఐ అధికారులు రోజుకో ఎత్తుగడ అనుసరిస్తున్నారు. సుప్రీంకోర్టులో జగన్‌మోహన్‌రెడ్డి బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసిన నాటి నుంచి, నోటీసులు అందుకోవడం.. కౌంటర్ దాఖలు చేయడం.. తరువాత వాదనలు వినిపించటం.. ఇలా ప్రతి విషయంలోనూ జాప్యం చేస్తూ వస్తున్న సీబీఐ అధికారులు ఈ కేసును తేల్చే అవకాశం సుప్రీంకోర్టుకు ఏ మాత్రం ఇవ్వటం లేదు. కేసు విచారణకు వచ్చిన ప్రతిసారీ ఏదో ఒక కారణంతో వాయిదా కోరుతూనే ఉన్నారు. తాజాగా శుక్రవారం కూడా సీబీఐ యథావిధిగా వాయిదా కోరారు.

అసలు సీబీఐ ఉద్దేశపూర్వకంగానే ఇలా చేస్తోందా..? శుక్రవారం కూడా అందులో భాగంగానే కేసు విచారణ వాయిదా కోరిందా..? సుప్రీంకోర్టు విచారణ చేపడితే జగన్‌కు ఎక్కడ బెయిల్ వస్తుందో అన్న ఆందోళనతో ఉన్న సీబీఐ అధికారులు.. ఎలాగైనా దానిని అడ్డుకోవాలనే ఉద్దేశంతో కేసును వాయిదా వేయాలని కోరారా..? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. శుక్రవారం సుప్రీంకోర్టులో జరిగిన పరిణామాలను గమనించిన న్యాయ నిపుణులు ఇదే కారణమని స్పష్టం చేస్తున్నారు. సీబీఐ అధికారులకు, ఆ సంస్థను వెనుక నుంచి నడిపిస్తున్న పెద్దలకు జగన్ బెయిల్‌పై బయటకు రావటం ఎంత మాత్రం ఇష్టమున్నట్లు కనిపించటం లేదని, అందుకే ప్రతిసారీ ఏదో ఒక కారణం చూపుతూ కేసును విచారణకు రాకుండా సీబీఐ ద్వారా అడ్డుకుంటున్నారని, ఇదంతా సుప్రీంకోర్టు గమనిస్తూనే ఉందని వారు చెప్తున్నారు. సీబీఐ ఉద్దేశపూర్వకంగా వాయిదాలు కోరుతోందనేందుకు వారు కొన్ని ఉదాహరణలను కూడా చూపుతున్నారు.

కౌంటర్ దాఖలు మొదలు ఇదే తంతు..!

జగన్‌మోహన్‌రెడ్డి జూలై 27న సుప్రీంకోర్టులో రెండోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. సీబీఐ రిజిస్ట్రీలో సృష్టించిన అడ్డంకులను దాటుకుని అది రెండు వారాల తరువాత సుప్రీంకోర్టు ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది. ఆగస్టు 10న బెయిల్ పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం, సీబీఐకి నోటీసులు జారీ చేసి, కౌంటర్ దాఖలుకు ఆదేశాలు జారీ చేసింది. సీబీఐ ఏకంగా దాదాపు నెల రోజుల తరువాత అంటే ఈ నెల 7న తన కౌంటర్‌ను దాఖలు చేసిన విషయాన్ని న్యాయనిపుణులు గుర్తు చేస్తున్నారు. వాస్తవానికి సీబీఐ నెల రోజులకన్నా ముందే కౌంటర్ దాఖలు చేసి ఉండొచ్చునని, ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి ప్రతి విషయాన్నీ ఇప్పటికే పలుమార్లు పలు కోర్టుల్లో కౌంటర్ల రూపంలో సీబీఐ ఉంచిందని, అందువల్ల కౌంటర్ దాఖలుకు అంత సుదీర్ఘ సమయం అవసరం లేదని వారు చెప్తున్నారు. అయినప్పటికీ నెల రోజుల గడువు కోరిందంటే, ఈ కేసులో మున్ముందు తాము ఎన్ని ఎత్తుగడలను అనుసరించబోతున్నామో అన్న విషయాన్ని సీబీఐ ఆనాడే స్పష్టం చేసిందని అంటున్నారు.

ఒక వ్యక్తి బెయిల్ కోసం సుప్రీంకోర్టు వరకు వచ్చాడంటే, అందులో అత్యవసరం ఉందని భావించాలని, బెయిల్ పొందటమనేది నిందితునికి రాజ్యాంగం ప్రసాదించిన హక్కని, ఉద్దేశపూర్వంగా విచారణను వాయిదా వేయించటం ద్వారా సీబీఐ ఆ హక్కును హరిస్తోందని వారు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ మధ్యలో సీబీఐ తన న్యాయవాదిని మార్చింది. దీనిపై ఓ వర్గం మీడియా చేతికొచ్చిన కథనాలను అల్లేసింది. ఇప్పటి వరకు జగన్ కేసులను వాదిస్తూ వచ్చిన అశోక్‌భాన్ వంటి సీనియర్ న్యాయవాదులను కాదని, కొత్త న్యాయవాదిని నియమించటం వెనుక ఏదో మతలబు ఉందంటూ కథనాలను వండి వార్చింది. అయితే తాజాగా కూడా సీబీఐ మళ్లీ న్యాయవాదిని మార్చింది. మోహన్‌జైన్ స్థానంలో అదనపు సొలిసిటర్ జనరల్ మోహన్ పరాశరన్‌కు కేసు బాధ్యతలు అప్పగించింది. వాస్తవానికి శుక్రవారం నాడు జరిగిన విచారణకు సీబీఐ తరఫున అశోక్‌భాన్ హాజరయ్యారు.

ఆయనే స్వయంగా ధర్మాసనాన్ని వాయిదా కోరారు. న్యాయవాదిని మార్చామని, మోహన్ పరాశరన్ వాదనలు వినిపిస్తారని స్వయంగా చెప్పారు. న్యాయవాది మార్పు వెనుక మతలబు ఉందనుకుంటే.. అశోక్‌భాన్ ఎందుకు శుక్రవారం వాదనలు వినిపించలేదు..? కోర్టులో ఉన్న సీబీఐ జేడీ వాదనలు వినిపించాలని అశోక్‌భాన్‌ను ఎందుకు కోరలేదు..? సుప్రీంకోర్టులోనే ఉన్న మోహన్ పరాశరన్ ఎందుకు వాదనలు వినిపించేందుకు రాలేదు..? మళ్లీ న్యాయవాదిని మార్చామని, ఆయనే వచ్చి వాదనలు వినిపిస్తారని అశోక్‌భాన్ స్వయంగా ఎందుకు చెప్పారు..? అనేవి న్యాయ నిపుణుల సందేహాలు. ఈ సందేహాలకు సమాధానం ఇవ్వాల్సింది సీబీఐ, దాని వెనకుండి కథనడిపిస్తున్న ఢిల్లీపెద్దలే.

విచారణ అక్టోబర్ 5కు వాయిదా...

తన కంపెనీల్లో పెట్టుబడుల కేసులో తనకు బెయిల్ నిరాకరిస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ జగన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌ను ఇప్పటికే పలుమార్లు విచారించిన న్యాయమూర్తులు జస్టిస్ అఫ్తాబ్ ఆలం, జస్టిస్ రంజనాప్రకాశ్ దేశాయ్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారించింది. కేసు విచారణకు రాగానే సీబీఐ తరఫున ఇప్పటికే పలుమార్లు నాంపల్లి కోర్టులో వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది అశోక్‌భాన్ లేచి నిలబడ్డారు. ఈ కేసులో సీబీఐ తరఫున వాదనలు వినిపించే న్యాయవాదిని మార్చామని, అదనపు సొలిసిటర్ జనరల్ మోహన్ పరాశరన్ ఇకపై ఈ కేసు బాధ్యతలను చూసుకుంటారని ధర్మాసనానికి అశోక్‌భాన్ వివరించారు. మోహన్ పరాశరన్ సుప్రీంకోర్టులోని మరో కోర్టులో వాదనలు వినిపిస్తూ బిజీగా ఉన్నారని, అందువల్ల ఈ కేసును వాయిదా వేయాలని ధర్మాసనాన్ని కోరారు. వాస్తవానికి సీనియర్ న్యాయవాది అయిన అశోక్‌భాన్ వాదనలు వినిపించి ఉండొచ్చు. జగన్ కేసులో అశోక్ భాన్ అనేక సందర్భాల్లో పూర్తిస్థాయి వాదనలు వినిపించారు.

అయితే సీబీఐ ప్రధాన ఉద్దేశం కేసును వాయిదా వేయించటం కాబట్టి, ఆయన వాదనలు వినిపించకుండా మిన్నకుండిపోవటమే కాకుండా, కేసును వాయిదా వేయాలని కోరినట్లు పరిశీలకులు భావిస్తున్నారు. కేసు వాయిదాకు జగన్ తరఫు సీనియర్ న్యాయవాది గోపాల సుబ్రమణియం అభ్యంతరం వ్యక్తం చేశారు. సీబీఐ ప్రతిసారీ ఇదే విధంగా ఏదో ఒక కారణంతో వాయిదా కోరుతోందని, ఇది ఎంత మాత్రం సరికాదని గట్టిగా చెప్పారు. ఈ కేసును సోమవారం విచారించాలని ధర్మాసనాన్ని కోరారు. సోమవారం తమకు వ్యక్తిగత ఇబ్బందులు ఉన్నాయని.. అందువల్ల ఈ కేసును శుక్రవారం విచారిస్తామని ధర్మాసనం పేర్కొంది. విచారణను వచ్చే నెల 5వ తేదీకి వాయిదా వేసింది. 



source:sakshi

వీళ్లు నిజమైన బందీలు! జగన్ కోసం - 12

నిన్నటి దినాన బెయిల్ వస్తుందని ఎంతో ఎదురుచూశాము. కానీ సీబీఐ మళ్ళీ వంకరబుద్ధి చూపించింది. సీబీఐ తరపున రావలసిన లాయర్ రాలేదు. అందుకని ఒక వారం వాయిదా పడింది. మొదట మేమందరం నిరుత్సాహపడినా తరువాత నాకు మా మామగారు ఎప్పుడూ చెప్పే మాటలు గుర్తుకువచ్చాయి... ‘ధైర్యంగా వుండాలి - దేనినైనా మనం ఎదుర్కోవడానికి వెనకాడకూడదు, భయపడకూడదు’. ఆయన జగన్‌కు చెప్పేవారు - ‘‘స్థితప్రజ్ఞత ఉండాలి జగన్. మంచి జరిగితే మరీ పొంగిపోవడం, అనుకున్నట్టు జరగకపోతే మరీ కృంగిపోవడం ఉండకూడదు’’ అని! జగన్ వాళ్ళ నాన్న మాటలు వినీ వినీ స్థితప్రజ్ఞత ఒంట బట్టించుకున్నాడు. దేనికీ అదరడూ బెదరడు. నాకు ఈ సీబీఐ, కాంగ్రెస్, టీడీపి వాళ్ళని చూస్తే కోపం కాదు, జాలి వేస్తుంది. జైల్‌లో పెట్టినా కూడా కోపం, ద్వేషం, దిగులు, భయం 

ఎరగని స్వేచ్ఛాజీవి జగన్. కానీ బయటవున్న వీళ్లు కుళ్లు, కుతంత్రాలకు, పగ, ద్వేషం, ఈర్ష్యలకు బందీలు. నిజంగా జగన్‌కాదు జైల్‌లో ఉండేది... జగన్ ఊహను కూడా చూసి భయపడే ఈ సీబీఐ, కాంగ్రెస్, టీడీపీ, ఎల్లో గ్యాంగ్ నిజమైన ఖైదీలు.



- వైఎస్ భారతి
w/oవైఎస్ జగన్


అప్పుడేమి చేస్తున్నారు వీళ్లంతా....?
పాఠకుల స్పందన

నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా ఫ్యామిలీ మొత్తం కాంగ్రెస్ అభిమానులే. కాని రాజశేఖర్‌రెడ్డి చనిపోయి జగన్‌కు ఆ పార్టీ భవిష్యత్తు లేకుండా చెయ్యాలనుకొంటున్నదని తెలిసేంతవరకు కాంగ్రెస్ వేరని, రాజశేఖరరెడ్డి వేరని తెలియలేదు. రాజశేఖర్‌రెడ్డి చనిపోయిన తరువాత జగన్‌ను ముఖ్యమంత్రిని చెయ్యాలని మీడియాలో వస్తుంటే మా ఆశలన్నీ మళ్ళీ చిగురించాయి. 

అదే సమయంలో యాధృచ్ఛికంగా జగన్‌ను కడపలో ఓ షాప్ ఓపెనింగ్‌లో కలవడం జరిగింది. తనను ఓసారి చూడాలని నిలబడి వుంటే, తనే మా దగ్గరికి వచ్చి ‘ఏమ్మా బాగున్నారా... ఏదైనా అవసరం వుండి వచ్చారా? ఎవరూ బాధపడొద్దు. దేవుడున్నాడు. అంతా మంచే జరుగుతుంది’ అని చెప్తుంటే... ఆయన్ని మేము ఓదార్చాల్సిన సమయంలో మమ్మల్ని ఓదారుస్తుంటే మాటలు రాక నిలబడ్డాను. అప్పుడే తెలిసింది ఓ లీడర్‌కు కావలసిన లక్షణాలన్నీ తనలో ఉన్నాయని, జగన్ ముఖ్యమంత్రి అయితే మన రాష్ట్రం ఖచ్చితంగా బాగుంటుందని. తర్వాత జగనన్న ఓదార్పు యాత్ర ప్రారంభించడం, అది అధిష్టానానికి ఇష్టం లేకపోవడం... ఎన్నో సమస్యలు సృష్టించడం తెలిసిందే. తర్వాత అధిష్టానాన్ని ఒప్పించడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేసి చివరికి ఆ పార్టీలో ఇమడలేక తనే బయటికి వచ్చెయ్యడం జరిగింది. 

అప్పటి నుంచి సిబిఐ ఈడీ ఎంక్వైరీలు మొదలయ్యాయి. ఒక మాట అడగాలనుకుంటున్నాను. నిజంగా రాజశేఖర్‌రెడ్డి అంత అవినీతికి పాల్పడివుంటే, జగన్ దానివల్ల అంత లబ్ధి పొంది వుంటే, అది ఒక్కరోజులో, ఒకరి వల్ల జరిగుండదు కదా. అప్పుడు ఏమి చేస్తున్నారు వీళ్ళంతా. ఇప్పుడు మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకులకు వీళ్లని ఆడిస్తున్న ఢిల్లీ పెద్దలకు వైయస్సార్ బతికి ఉన్నప్పుడు ఆయన పాలనలోని అవినీతి కనబడలేదా? ఇప్పుడు ఆయన ప్రాణాలతో లేరని, మాట్లాడలేరని తెలిసి జగన్‌ను ఏమి చెయ్యాలనుకుంటున్నారు? ఒక్కమాట మాత్రం చెప్పగలను. జగన్ తప్పు చేయలేదన్నది స్పష్టం. జగన్ తప్పు చేయాలనుకుంటే చంద్రబాబులా బినామీల పేరుతో సంస్థలు స్థాపించేవారు. ముందు ఆ 26 జీవోలు సక్రమమో, అక్రమమో తేల్చండి. ఒకవేళ అవకతవకలు జరిగి ఉంటే రద్దు చేయండి. అంతేకాని ద్వేషంతో జగన్‌ను అణగదొక్కాలని ప్రయత్నిస్తే ప్రజలే వారికి బుద్ధి చెబుతారు. 

రాష్ట్రంలో తొంభై శాతం జనం జగన్ సిఎం కావాలని కోరుకుంటున్నారు. ఎంతోమంది తల్లులు తన బిడ్డే అనుకుని నిండు మనసుతో ఆశీర్వదిస్తున్నారు. ఆ భగవంతుడి ఆశీస్సులతో, ఎంతో మంది తల్లుల ఆశీర్వాదంతో జగన్ నిర్దోషిగా బయటికి వస్తాడు. ఎప్పటికైనా న్యాయం గెలుస్తుంది. వచ్చే ఎన్నికల్లో ప్రజల తీర్పుతో జగన్ ఖచ్చితంగా సిఎం అవుతారు. మనస్ఫూర్తిగా ప్రజలు ఇచ్చిన ఆ తీర్పుకి కుళ్ళు, కుతంత్రాలు కొట్టుకునిపోతాయి. అంతిమ విజయం జగనన్నదే అవుతుంది. 

- రక్కాసి శ్రీవాణి
జిఎంసి బ్యాక్‌సైడ్, రాజంపేట

చిచ్చు రేపుతున్న బాబు

హైదరాబాద్, న్యూస్‌లైన్: రాష్ట్రంలో అన్ని విధాలా రాజకీయ పలుకుబడి కోల్పోయి అప్రతిష్ట పాలైన టీడీపీ అధినేత చంద్రబాబు దిక్కు తోచని స్థితిలో ఉన్నారని, అందుకే ఆయన కులాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు రేపే విధంగా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు, పార్టీ రాష్ట్ర ఎస్సీ విభాగం కన్వీనర్ నల్లా సూర్యప్రకాశరావు విమర్శించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం వారు విలేకరులతో మాట్లాడుతూ... తన తొమ్మిదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన చంద్రబాబు... మళ్లీ బీసీ డిక్లరేషన్, ఎస్సీ డిక్లరేషన్ అని ప్రజలను మరోసారి మోసం చేసేందుకు వస్తున్నారని విమర్శించారు. 

‘వస్తున్నా...మీ కోసం’ అని పేరు పెట్టుకుని అసలు యాత్ర ఎక్కడి నుంచి ప్రారంభించాలో డైలమాలో పడ్డారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై అన్యాయంగా జగన్‌మోహన్‌రెడ్డిని జైల్లో పెట్టించారని... చివరకు న్యాయస్థానాలను కూడా తప్పుదోవ పట్టించే విధంగా సీబీఐ వ్యవహరిస్తోందన్నారు. తానే పెద్ద మాదిగ అనే విధంగా వ్యవహరిస్తున్న చంద్రబాబును మాదిగలు ఎంత మాత్రం నమ్మరని నల్లా సూర్యప్రకాష్ చెప్పారు. తొమ్మిదేళ్లలో మాదిగలకు ఆయన ఏం ఒరగబెట్టారో చెప్పాలన్నారు. నమ్మకానికి వైఎస్ మారుపేరని... నమ్మక ద్రోహానికి బాబు పెట్టింది పేరని ప్రజలు భావిస్తున్నారని తెలిపారు.

source: sakshi

క్విడ్‌ప్రోకో అయితే లాభాలు ఎందుకు పంచుతారు?

క్విడ్‌ప్రోకో అయితే లాభాలు ఎందుకు పంచుతారు?
భారతిలో పెట్టుబడులకు రూ. 617 కోట్ల లాభాలు వచ్చాయి.. సాక్షిలో పెట్టుబడుల విలువ 
రూ. 600 కోట్లకుపైగానే ఉంటుంది
రాక్‌కు నోటీసులిచ్చినట్లు చార్జిషీట్‌లో చెప్పలేదు 
నిమ్మగడ్డ ప్రసాద్ బెయిల్ పిటిషన్‌పై వాదనలు పూర్తి.. వచ్చేనెల 8న తీర్పు

హైదరాబాద్, న్యూస్‌లైన్: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి చెందిన కంపెనీల్లో నిమ్మగడ్డ ప్రసాద్ పెట్టిన పెట్టుబడులకు క్విడ్‌ప్రోకోతో సంబంధమే లేదని నిమ్మగడ్డ తరపు న్యాయవాది రాజశేఖర్‌రావు హైకోర్టుకు నివేదించారు. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత కూడా జగన్ కంపెనీల్లో ప్రసాద్ 50 శాతం పెట్టుబడులు పెట్టారని వివరించారు. బెయిల్ కోరుతూ నిమ్మగడ్డ దాఖలు చేసుకున్న పిటిషన్‌ను జస్టిస్ సముద్రాల గోవిందరాజులు శుక్రవారం మరోసారి విచారించారు. 

లాభాల కోసమే 2006 నుంచి 2010 వరకు జగన్ కంపెనీల్లో నిమ్మగడ్డ ప్రసాద్ పెట్టుబడులు పెట్టారని రాజశేఖర్‌రావు చెప్పారు. మొత్తం రూ.854 కోట్లు పెట్టుబడులు పెట్టారని, భారతీ సిమెంట్‌లో వాటాలను విక్రయించగా వచ్చిన లాభాల్లో రూ.617 కోట్లు నిమ్మగడ్డకు తిరిగి ఇచ్చేశారని తెలిపారు. సీబీఐ ఆరోపిస్తున్నట్లుగా ‘క్విడ్‌ప్రోకో’ జరిగి ఉంటే లాభాలను ఎందుకు ఇస్తారని ప్రశ్నించారు. ప్రస్తుతం సాక్షిలో రూ.230 కోట్లు పెట్టుబడిగా ఉన్నాయని, దేశంలోనే అత్యధిక సర్క్యులేషన్ కలిగిన దినపత్రికల్లో సాక్షి ఏడో స్థానంలో ఉందని చెప్పారు. సాక్షిలో నిమ్మగడ్డకు రూ.600 కోట్లకుపైగా విలువ చేసే 20 శాతం వాటా ఉందని వివరించారు. లాభాల కోసం పెట్టిన పెట్టుబడులను కూడా సీబీఐ లంచం కింద చూపుతూ వాస్తవ విరుద్ధమైన, పొంతన లేని వాదనలను వినిపిస్తూ న్యాయస్థానాలను తప్పుదోవ పట్టిస్తోందని తెలిపారు.

అపోహతోనే అరెస్టు చేసింది

రాక్ ప్రతినిధులుగా సీఈవో ఖతర్ మసూద్, జగన్నాథంలు వారికి వారే ప్రకటించుకున్నారని సీబీఐ ఆరోపిస్తోందని, అయితే వాన్‌పిక్ ప్రాజెక్టుకు సంబంధించి క్రౌన్ యువరాజు వైఎస్ రాజశేఖరరెడ్డికి స్వయంగా లేఖ రాసిన విషయాన్ని మాత్రం సీబీఐ దాచి పెట్టిందని తెలిపారు. ఈ విషయాన్ని చార్జిషీట్‌లో కూడా ప్రస్తావించకపోవడాన్ని తప్పుపట్టారు. జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన వారిలో మిగిలిన వారంతా బయటే ఉన్నారని, నిమ్మగడ్డను మాత్రం అరెస్టు చేశారన్నారు. కేసు నమోదు చేసినప్పటినుంచి దర్యాప్తును అడ్డుకున్నట్లుగానీ, ఆధారాలను మాయం చేసేందుకు ప్రయత్నించారనేందుకు చిన్న ఫిర్యాదు, ఆధారం కూడా సీబీఐ చూపలేదని, కేవలం అపోహతోనే అరెస్టు చేసిందని చెప్పారు. రాక్‌కు, రాష్ట్ర ప్రభుత్వానికి అసలు ఒప్పందం జరిగిందా లేదా అన్నది నిర్ధారించుకోవాల్సి ఉందని.., దీనిపై దర్యాప్తు చేస్తున్నామని సీబీఐ చెప్పడం హాస్యాస్పదమన్నారు. 

రైతులకు పరిహారం పంపిణీ విషయంలో సీబీఐ పొంతనలేని వాదన చేస్తోందన్నారు. మార్కెట్ ధర ప్రకారం జిల్లా కలెక్టర్లు నిర్ణయించిన మేరకే వాన్‌పిక్ యాజమాన్యం రైతులకు పరిహారాన్ని పంపిణీ చేసిందన్నారు. వాన్‌పిక్‌పై సీబీఐ ఇటీవల కోర్టుకు సమర్పించిన చార్జిషీట్‌లో దర్యాప్తు కొనసాగుతోందని చెప్పలేదని, రాక్‌కు నోటీసులు జారీచేసిన విషయాన్ని ప్రస్తావించలేదని తెలిపారు. తుది విచారణలో నిమ్మగడ్డ నిజమైన పెట్టుబడిదారుడని తేలితే ఇన్ని రోజులు జైల్లో ఉన్నందుకు ఆయనకు జరిగే నష్టాన్ని ఎవరు పూడ్చగలరని ప్రశ్నించారు. నిమ్మగడ్డను అరెస్టు చేసి ఇప్పటికే 140 రోజులు దాటిందని, దర్యాప్తు పూర్తిచేసి చార్జిషీట్ దాఖలు చేసినందున బెయిల్ మంజూరు చేయాలని కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును వచ్చేనెల 8కి వాయిదా వేశారు.

source: sakshi

కాంగ్రెస్, టీడీపీల చేతిలో సీబీఐ పావు


కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కలిసి చేస్తున్న నీచమైన రాజకీయాల్లో సీబీఐ పావుగా మారి తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని వేధింపులకు గురిచేస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. 26 జీవోలకు సంబంధించిన కేసులో సీబీఐ వ్యవహరిస్తున్న తీరు రాష్ట్ర ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తోందన్నారు. కీలక పదవుల్లో ఉన్న మంత్రి, ఐఏఎస్‌ల కన్నా.. ఏ అధికార హోదా లేకుండా ప్రతిపక్షంలో ఉన్న జగన్ ఏవిధంగా కేసును ప్రభావితం చేస్తారో సీబీఐ ప్రజలకు చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. ఈ కేసులో మంత్రులు, అధికారులకు ఒక న్యాయం, ప్రతిపక్షంలో ఉన్న జగన్‌కు మరో న్యాయమా.. అని నిలదీశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సీబీఐ తీరును ఎండగట్టారు. ‘‘ప్రభుత్వంలో కీలక పదవులు నిర్వర్తిస్తున్న ధర్మాన ప్రసాదరావు, 25 మంది అధికారులు సాక్షుల్ని ప్రభావితం చేయరట! ప్రతిపక్షంలో ఉండి నిరంతరం రోజుకు 16 గంటలు జనం మధ్య తిరిగే వ్యక్తి ప్రభావితం చేస్తారట! అది కూడా చార్జ్జిషీట్ ఫైల్ చేసి 280 రోజులైన తర్వాత. అన్యాయంగా, అక్రమంగా జైల్లో బంధించి ఇప్పటికి 123 రోజులు పూర్తయినా సీబీఐ ఇలాంటి అర్థంపర్థంలేని విషపూరిత వాదనలు ఇంకా చేస్తోంది’ అని దుయ్యబట్టారు. ‘ఒకే కేసులో నిందితులుగా పేర్కొన్న వారిలో సీబీఐ కొందరిని అరెస్టు చేసి మిగతావారిని ఎందుకు చేయడం లేదు? కేవలం జగన్‌ను అరెస్టు చేయడానికే మోపిదేవిని అరెస్టు చేశారా?’ అని ప్రశ్నించారు. 

‘భారత చట్టాల ప్రకారం ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్న తర్వాత మామూలుగానైతే 60 రోజులకు, లేదా 90 రోజులకు కచ్చితంగా బెయిల్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్న సీబీఐ తన వంకరవాదనను కొనసాగిస్తోంది’ అని మండిపడ్డారు. వాన్‌పిక్ కేసులో సీబీఐ నాటకం బయటపడిందని, భూకేటాయింపుల్లో జగన్ ప్రమేయం లేదంటూ తప్పని పరిస్థితుల్లో హైకోర్టులో సీబీఐ న్యాయవాది అంగీకరించారని చెప్పారు. జగన్‌మోహన్‌రెడ్డి కడిగిన ముత్యంలా బయటకొస్తారని అన్నారు. పార్టీ శ్రేణులు నిరుత్సాహానికి గురికావాల్సిన అవసరంలేదని రాష్ట్ర ప్రజల దీవెనలు, అభిమానం, దేవుని ఆశీస్సులతో అక్టోబర్ 5న జగన్ తప్పక బయటకొస్తారని అంబటి పేర్కొన్నారు.

source:sakshi

జగన్ కోసం ఇష్టదైవాలకు ప్రార్థన


చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక నేత కోసం రాష్ట్ర వ్యాప్తంగా హోమాలు, ప్రార్ధనలు, ప్రత్యేక పూజలు, పాదయాత్రలు జరుగుతున్నాయంటే ఆ నాయకునికి ప్రజాదరణ ఏ మేరకు ఉందో అర్ధం చేసుకోవచ్చు. కక్ష, ఈర్ష్య, కుతంత్రాలతో అన్యాయంగా అరెస్ట్ చేసి 123 రోజుల నుంచి జైలులో ఉంచిన నేత విడుదల కావాలని కోరుతూ అన్ని మతాల, వర్గాల ప్రజలు తమతమ ఇష్టదైవాలాను ప్రార్థిస్తున్నారు. అంతటి ప్రజాభిమానం పొందిన నేత ఎవరో ఇప్పటికే మీకు అర్ధమైపోయి ఉంటుంది. ఆయనే యువనేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి. తన తండ్రి దుర్మరణం చెందిన తరువాత నల్లకాలువ వద్ద ఇచ్చిన మాట నిలుపుకునేందుకు ఆయన కాంగ్రెస్ పార్టీని నుంచి బయటకు వచ్చారు. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి హఠాన్మరణ వార్త విని తట్టుకోలేక ఆయన ప్రవేశపెట్టిన పథకాల ద్వారా లబ్దిపొందిన వారు, ఆయనంటే అత్యంత అభిమానం గల పలువురు ప్రాణాలు విడిచారు. వారి కుటుంబాలను పరామర్శిస్తానని ఆ మహానేత తనయుడు జగన్ మాట ఇచ్చారు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే లక్షణం ఆ రక్తంలోనే ఉంది. తన తండ్రి నుంచి ఆయనకు సంక్రమించింది. ఆయన ఓదార్పు యాత్రకు అద్వితీయమైన ప్రజాస్పందన వచ్చింది. ఎక్కడకు వెళ్లినా జనం వేల సంఖ్యలో తరలి వచ్చారు. ఆయన ప్రయాణించే రోడ్డు వెంట బారులు తీరారు. ఆయనను చూసేందుకు, కరచాలనం చేసేందుకు పోటీపడ్డారు. పలుచోట్ల ఆయన పాల్గొన్న సభలకు నేల ఈనిందా అన్నట్లు జనం తరలి వచ్చారు. జనం జగన్ లో ఆ మహానేతను చూసుకున్నారు. వెల్లువెత్తిన ప్రజాభిమానానికి కాంగ్రెస్ నేతలే ఖంగుతిన్నారు. వారి కుయుక్తులన్నీ ఉపయోగించి, అధిష్టాన వర్గానికి ఉన్నవీ లేనివీ చెప్పి జగన్ ను పార్టీ నుంచి బయటకు పంపేవరకు నిద్రపోలేదు. సొంత పార్టీలోనే పరిస్థితి ఇలా ఉంటే, ఇక ప్రతిపక్షం వారు ఎంత వణికిపోయి ఉంటారో ఊహించుకోవచ్చు. 

మాట నిలబెట్టుకునేందుకు, ఓదార్పు యాత్ర కొనసాగించేందుకు ఆయన ధైర్యంగా కాంగ్రెస్ పార్టీని వీడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రకటించారు. ఓదార్పు యాత్ర కొనసాగిస్తూనే, ప్రజా సమస్యలపై పోరాటం మొదలు పెట్టారు. రైతుల కోసం, విద్యార్థుల కోసం దీక్షలు చేపట్టారు. చేనేత కార్మికుల దీక్షలకు మద్దతు పలికారు. అతి కొద్ది కాలంలోనే తిరుగులేని నాయకుడుగా జగన్ ఎదిగిపోయారు. ఈ నేపధ్యంలోనే ఆ మహానేత ప్రవేశపెట్టిన పథకాలను ఒక్కొక్కటి ఎత్తివేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు మొదలు పెట్టింది. దాంతో ప్రజలకు ఆ మహానేత సువర్ణ యుగాన్ని జగన్ మాత్రమే తీసుకురాగలరన్న నమ్మకం ఏర్పడింది. వెళ్లిన ప్రతిచోట జగన్ పట్ల జనం ప్రేమాభిమానాలను చూపసాగారు. ఉప ఎన్నికలు జరిగిన ప్రతిసారి ఆ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించారు. జగన్ ముఖ్యమంత్రి కావాలని నినదించారు. కాబోయే ముఖ్యమంత్రి జగన్ అన్నది జనాభిప్రాయంగా స్థిరపడిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లభించే ప్రజా మద్దతును చూసి కాంగ్రెస్, టిడిపి ఓర్వలేకపోయాయి. రెండు పార్టీలు కుమ్మక్కయ్యాయి. కుట్రలు పన్నాయి. సీబిఐని తోడు చేసుకున్నాయి. సిగ్గులేకుండా బరితెగించాయి. మంత్రి మండలి అక్రమంగా జీఓలు జారీ చేసిందని, ప్రభుత్వంతో సంబంధంలేని, సచివాలయం మొఖం చూడని జగన్ ను అన్యాయంగా అరెస్ట్ చేయించారు. జగన్ బెదరలేదు. చిరునవ్వు చెక్కు చెదరకుండా ధైర్యంగా ఉన్నారు. 

ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ప్రభుత్వం, ప్రతిపక్షం కలిసి ఆడుతున్న నాటకాన్ని అర్ధం చేసుకున్నారు. చంద్రబాబు ఆస్తుల విషయంలో, జగన్ విషయంలో సీబిఐ ఎలా వ్యవహరించిందో చూశారు. అసలు జీఓలు జారీ చేసిన మంత్రులు పట్ల, జగన్ పట్ల ఎలా వ్యవహరిస్తుందో కూడా చూస్తూనే ఉన్నారు. జగన్ ను అన్యాయంగా అరెస్ట్ చేశారని, ఆయన త్వరలోనే విడుదలవుతారని వారు నమ్ముతున్నారు. న్యాయవ్యవస్థ పట్ల అచంచలమైన విశ్వాసంతో వారు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపధ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆయన అభిమానులు దేవాలయాలు, మసీదులు, చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు, పూజలు చేస్తున్నారు. కొందరు కాలినడకన ఏడుకొండలెక్కారు. మరికొందరు మోకాళ్లతో తిరుమల కొండెక్కారు. ఇంకొందరు పాదయాత్రలు చేశారు. హైదరాబాద్‌లో గురువారం ఐదు రకాల హోమాలు చేశారు. నానక్‌రాంగూడలోని శ్రీ శివమహంకాళీ హనుమంతగిరి క్షేత్రంలో 18 మంది వేద పండితులు శ్రీ లక్ష్మీగణపతి మూలమంత్ర హోమం, రుద్ర హోమం, నవగ్రహ హోమం, సుదర్శన పారాయణ హోమం, శ్రీ చండీ పారాయణ హోమం చేశారు. జగన్ క్షేమంగా బెయిల్ పై బయటకు రావాలని కోరుతూ గుంటూరులో 20 మంది వేద పండితులతో చతురావృత గణపతి హోమాన్ని నిర్వహించారు. మేరుగ నాగార్జున, ఆళ్ల రామకృష్ణారెడ్డిలు గుంటూరు జిల్లా వేమూరు నుంచి విజయవాడ మేరీమాత ఆలయానికి నడిచి వెళ్లారు. 

తమకు విద్యుత్ కష్టాలు తీరేది, గిట్టుబాటు ధరలు లభించేది జగన్ పాలనలోనేనని రైతులు ఎదురు చూస్తున్నారు. తమ చదువులు కొనసాగేది ఆ యువనేత పాలనలోనని పేద విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. తమ బాధలు తీర్చే నేత జగనేనని చేనేత కార్మికులు ఎదురు చూస్తున్నారు. తమకు ఉపాధి లభించేది యువనేత తెచ్చే ఆ మహానేత స్వర్ణయుగంలోనేనని యువత ఎదురు చూస్తోంది. అర్హులందరికీ ఫించన్ అందించే మాటతప్పని నేత జగన్ అని వికలాంగులు, వృద్ధులు, వితంతువులు ఎదురు చూస్తున్నారు. ఇంత మంది ఎదురు చూసే జగన్ త్వరలోనే బయటకు వస్తారని ఆశిద్ధాం.

source:sakshi

బాబును మైనార్టీలు నమ్మరు: రెహ్మాన్

Written By news on Friday, September 28, 2012 | 9/28/2012

హైదరాబాద్‌: 2014లో టీడీపీకి 10 సీట్లు కూడా రావని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్‌ రాష్ట్ర కన్వీనర్‌ రెహ్మాన్‌ అన్నారు. చంద్రబాబు మాటలను మైనార్టీలు నమ్మరని చెప్పారు. బీజేపీతో కలిసి పనిచేసిన చంద్రబాబుపై ముస్లింలకు నమ్మకం లేదన్నారు. మైనార్టీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదని రెహ్మాన్‌ అన్నారు. 

గురువారం హైదరాబాద్‌లోని టీడీపీ పార్టీ కార్యాలయంలో జరిగిన ముస్లిం సదస్సు సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాలన్న తమ ఆలోచనను వైఎస్ రాజశేఖరరెడ్డి కాపీ కొట్టారని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే రూ. 2500 కోట్లతో ముస్లింలకు ఉప ప్రణాళిక ఏర్పాటు చేస్తామని చంద్రబాబు ప్రకటించారు.

source: sakshi

Minorities Not Trust Babu: Rehman

Ambati Rambabu Press Meet at YSRCP office

YS Jagan followers devout prayers

చంద్రబాబు సీమ ద్రోహి: బాలనాగిరెడ్డి

మంత్రాలయం(కర్నూలు): టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాయలసీమ ద్రోహి అని మంత్రాలయం టీడీపీ ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి ధ్వజమెత్తారు. ఎమ్మిగనూరులోని తన స్వగృహంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నమ్మి చేరదీసిన మామ ఎన్టీఆర్‌కే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు.. తాజాగా సీమకూ ద్రోహం చేశారన్నారు. ప్రధానికి ఆయన రాసిన లేఖను పరిశీలిస్తే.. సీమలో పుట్టి, ఇక్కడి గాలి పీల్చి తెలంగాణకు మద్దతు పలకడం చూస్తే తల్లి పాలు తాగి రొమ్ము గుద్దడమేనని మండిపడ్డారు. ఎన్టీఆర్ వారసుల్ని దూరం పెట్టి తన కుమారుడు లోకేష్‌కు రాజకీయపట్టం కట్టేందుకే పాదయాత్రకు చంద్రబాబు శ్రీకారం చుడుతున్నారని ఆయన ఆరోపించారు.

source:  sakshi

State wide prayers for YS Jagan release

YS Jagan Mohan Reddy Bail Plea adjourned to OCT 5th

జగన్ బెయిల్ పై విచారణ వాయిదా

న్యూఢిల్లీ : వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు మరోసారి వాయిదా వేసింది. వచ్చే శుక్రవారం దీనిపై తదుపరి విచారణ ఉంటుందని న్యాయస్థానం తెలిపింది. తమ తరపు న్యాయవాది మారారని... విచారణను వాయిదా వేయాలని సీబీఐ న్యాయవాది మోహన్ పరాశరన్ విజ్ఞప్తిని అత్యున్నత న్యాయస్థానం మన్నించింది.

సీబీఐ తరపున అడిషనల్ సోలిసిటర్ జనరల్ మోహన్ పరాశరన్, సీనియర్ న్యాయవాది అశోక్ బాన్, జగన్ తరపున గోపాల్ సుబ్రహ్మణ్యం, విశ్వనాథన్ ధర్మాసనం ఎదుట హాజరయ్యారు. జస్టిస్ అఫ్తాబ్ ఆలం, జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్ తో కూడిన ధర్మాసనం ముందుకు ఈకేసు విచారణకు వచ్చింది. వాస్తవానికి బెయిల్ పిటిషన్ సెప్టెంబర్ 14ననే ధర్మాసనం ముందుకు వచ్చినా... సీబీఐ కౌంటర్ పిటిషన్ పరిశీలించాల్సి ఉందని న్యాయమూర్తులు విచారణను నేటికి వాయిదా వేశారు. కాగా బెయిల్ పిటిషన్ పై విచారణ తిరిగి అక్టోబర్ 5న జరగనుంది.

SUPREME COURT ADJOURNS JAGAN'S BAIL PETITION

SUPREME COURT ADJOURNS JAGAN'S BAIL PETITION

   to next Friday



I want justice to be served : YS Bharathi

న్యాయం వర్థిల్లాలని కోరుకుంటున్నా... జగన్ కోసం - 11


జగన్ విషయంలో సీబీఐ నిటారుగా నిలబడి దాని పని అది చేసుకుపోవడం లేదు. అది కాంగ్రెస్ హైకమాండ్ ముందు వంగి కాళ్ళకు దణ్ణం పెడుతోంది. ఇది దేశంలో ప్రధాన పత్రికలు తమకు తాముగా చెప్పిన మాట. నిజానికి ఈ కేసు జగన్ ఆస్తుల కేసు కాదు. ఇది 2004-2009 మధ్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన 26 జీవోలు సక్రమమా లేక అక్రమమా తేల్చాలన్న కేసు...

ఈరోజు జగన్ బెయిల్ సుప్రింకోర్టులో విచారణకు రానున్నది. కచ్చితంగా నాలుగు నెలల క్రితం 27వ తేదీ సాయంత్రం 7.30 గంటల ప్రాంతంలో అరెస్టు సంగతి మాకు చెప్పారు. కొన్ని నెలలుగా వినబడుతున్న వార్తే అయినా - నేను, మా అత్తగారు ఆ మాట వినలేకపోయాం. దానిని వినడానికి సైతం మా మనసు ఒప్పుకోవడం లేదు. ఈరోజుకి అన్యాయంగా అరెస్టు చేసి 123 రోజులు. ఎలాంటి తీర్పు వస్తుందోనని మా కుటుంబంతోపాటు జగన్‌ను తమ ఇంటి బిడ్డగా భావించే కోట్లమంది ఎదురు చూస్తున్నారు. మన రాజ్యాంగం ప్రకారం, మన దేశ చట్టాల ప్రకారం జగన్‌కు బెయిల్ వస్తుందని, అలా రావాలని ఎంతోమంది తమ తమ పద్ధతుల్లో పార్థనలు చేస్తున్నారు. జగన్ పట్ల ప్రజలకు ఉండే ప్రేమనే ఈ పెద్దపెద్ద నాయకులు సహించలేకుండా ఉన్నారనుకంటా. అందుకే జగన్‌ను ఎలాగైనా తొక్కేయాలని పార్టీలకు అతీతంగా చేతులు కలుపుతూ, ఎలాగైనా సరే జగన్‌కు బెయిల్ రాకుండా చెయ్యాలని కష్టపడుతున్నారు. కాని వీళ్లు జగన్‌ను ఎంతగా తొక్కేయాలనుకుంటే దేవుడు, ప్రజలు అంతగా జగన్‌ను పైకి ఎత్తి పట్టుకుంటున్నారు.

ఒక్క జగన్‌కు వ్యతిరేకంగా ఈ మూడు సంవత్సరాలలో చేసిన కుట్రలు, కుతంత్రాలు, జగన్‌ను ఇబ్బంది పెట్టడానికి వారు చేసిన పనులు బహుశా మన దేశంలోనే కాదు... ప్రజాస్వామ్య చరిత్రలో ఎక్కడా జరగలేదనుకుంటా. ఒక అధికార, ప్రతిపక్ష పార్టీలు కలిసి ఒక్క మనిషిని (జగన్‌ను వీళ్లు టార్గెట్‌గా చేసుకున్నప్పుడు మొదట్లో జగన్‌కు వేరే పార్టీ కూడా లేదు) వేధించడం ఎక్కడా కనీవినీ ఎరుగలేదు. కాంగ్రెస్ మరియు టిడిపి ఏ ప్రజా సమస్యనో, ఏ అన్యాయానికి ప్రతిగానో చేసిన పోరాటం కాదిది. ప్రజల మనసులలో చెరగని వైయస్‌ఆర్ గారి ముద్రను తుడిచేయడానికి చేసిన ప్రయత్నం ఇది. ఒక చనిపోయిన మనిషిని గురించి ఎవ్వరు చెడుగా మాట్లాడరు. అది కనీస మానవత్వం. కానీ ప్రజల కోసం ప్రాణాలు పెట్టి తన జీవితం చివరి నిమిషం వరకు ప్రజలకోసం తపించిన మనిషిని ఎంత అన్యాయంగా మాట్లాడారు. ఆయన మీద వున్న ప్రేమను ప్రజలు జగన్‌పై చూపడం ఓర్చుకోలేకపోయారు. అందుకే ఆయనను ప్రజల మనసుల నుంచి తీసివేయాలని, జగన్‌ను ప్రజల ప్రేమకు దూరం చేయాలని ఇంతవరకు కథ నడిపించారు. ప్రజల పక్షాన నిలబడి తమను ఎన్నుకున్న ప్రజలకోసం పనిచేయవలసిన బాధ్యతను విస్మరించి, సినిమా విలన్ల కంటె అన్యాయంగా, వికృతంగా ప్రవర్తించారు. అందుకే ప్రజలు వారిని ఛీదరించుకుంటున్నారు. జగన్‌కు మేమున్నామంటూ వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నారు.

వైయస్సార్‌గారి మరణవార్త విని చనిపోయిన వారిని పరామర్శిస్తానని జగన్ వాళ్ల నాన్న మరణించిన స్థలంలో మాట ఇచ్చిన రోజున ఏ రాజకీయాలు లేవు. కల్మషం లేని మనసుతో వాళ్ల నాన్నకోసం ఇచ్చిన మాట ఇది. కానీ ఓదార్పు యాత్ర ప్రారంభిస్తానంటే సోనియాగాంధి గారు వద్దన్నారు. కాని ఆరోజు నేను జగన్‌తో ‘ఏమి చేద్దామనుకుంటున్నావు జగన్. ఇంత పెద్దవాళ్లు నిన్ను ఆపాలని వున్నారు’ అన్నాను. అందుకు జగన్ నాతో అన్న మాటలు నేను ఎప్పటికీ మరచిపోను. ‘నేను ఈరోజు నాన్నకు ఇచ్చిన మాట మీద నిలవకపోతే నాన్నకు ఏమని నేను సమాధానం చెప్పాలి’ అన్నాడు. ఇంక ఇంట్లో మేమెవరం అడ్డుచెప్పలేదు. అలా మొదలై, కొన్ని విధిలేని పరిస్థితులలో 2010 నవంబర్‌లో జగన్, అత్తమ్మగారు ఇద్దరూ కాంగ్రెస్ పార్టీకి తమ ఎంపి, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేశారు. అలా కాంగ్రెస్ నుండి జగన్ బయటికి రావడం మొదలు సిబిఐ విచారణ పేరుతో కాంగ్రెస్, టిడిపి, ఎల్లో మీడియా కలిపి జగన్‌ను వేధించటం, పథకం ప్రకారం ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టారు.

అలా మొదలైన కేసుకు ఎల్లో మీడియా, కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ, సిబిఐ కలిసి జగన్ అక్రమ ఆస్తుల కేసు అని ప్రచారంలోకి తీసుకువచ్చాయి. నిజానికి ఈ కేసు జగన్ ఆస్తుల కేసు కాదు. ఇది 2004-2009 మధ్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన 26 జీవోలు సక్రమమా లేక అక్రమమా తేల్చాలన్న కేసు. ప్రభుత్వ నియమ నిబంధనలను, ఇదివరకటి ప్రభుత్వాలు అనుసరించిన విధానాలను కాదని జీవోలు ఇచ్చి తద్వారా ఎవరికైనా అనుచిత లబ్ది చేకూర్చారా... అలా ఎవరైనా లాభం పొంది జగన్‌కు సంబంధించిన కంపెనీల్లో పెట్టుబడి పెట్టారా అన్నది కేసు. సిబిఐ దర్యాప్తు చేయాల్సినది అసలు ఈ జీవోలో ఎలాంటి తప్పు అయినా జరిగిందా, లేదా అన్నది. నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చినవా లేదా అని. కానీ సీబీఐ మొదటిరోజు నుంచి అలాంటి దర్యాప్తు చేయటానికి ఇష్టపడడం లేదు. అసలు జీవోల సంగతి పక్కనపెట్టి, మా ఇంటి మీద, ఆఫీసుల మీద పడ్డారు. కానీ, ఎవరు తప్పు చేశారో, ఎవరు తప్పు చేయలేదో నిర్ధారించడానికి ప్రయత్నించలేదు. కనపడిన ప్రతి పారిశ్రామికవేత్తనీ జగన్ పేరు చెప్పు.. 164 స్టేట్‌మెంటు ఇవ్వండి, మీకు ఏ ఇబ్బందీ ఉండదు - అంటూ బెదిరించింది. దీన్ని దర్యాప్తు అంటారా? సీబీఐ అలా దర్యాప్తు చేయవచ్చు అని ఏ చట్టం చెప్పింది? చివరికి నియంతృత్వ దేశాల్లో, నిరంకుశ దేశాల్లో కూడా ఇలా అధికారాన్ని ఒక మనిషికి వ్యతిరేకంగా ఇంత బాహాటంగా ఉపయోగించరేమో!

జగన్ కంపెనీల మీద జరిగిన అసత్య ప్రచారాలకు లెక్కే లేదు. కార్పొరేట్ సెక్టర్ గురించి అవగాహన ఉన్నవారికి, కంపెనీలు-పెట్టుబడుల గురించి, వాటాల అమ్మకం, ప్రీమియం నిర్ణయం గురించి తెలిసిన వారికి జగన్ చేసింది తప్పుకాదని తెలుసు. కానీ, ఆ వ్యవహారాలను వక్రీకరించారు. మీ కంపెనీకి ఇంత ప్రీమియం ఎలా నిర్ణయించారంటూ ప్రచారాలు ప్రారంభించారు. ఇందులో అందరూ గమనించాల్సిన అంశం ఏమిటంటే, జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన వారంతా ఒకే ప్రీమియం చెల్లించారు. అలాంటప్పుడు కొందరు పారిశ్రామికవేత్తలు షేర్ల కొనుగోలు చేయటాన్ని క్విడ్ ప్రో కో అనే పదం పరిధిలో ఎలా చేర్చారు? ఈ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినవారి షేర్ల సర్టిఫికెట్లు వారివద్దనే ఉన్నాయి. అదీకాక, లంచంగా తీసుకోదలచుకున్న వ్యక్తులు ఎవరైనా ఉత్తుత్తి కంపెనీలు సృష్టిస్తారుగానీ, నిజంగా భారీఎత్తున ఉత్పత్తి ప్రారంభించి మార్కెట్‌లో నిరూపించుకునే ప్రయత్నం చేస్తారా? జగన్ పెట్టిన సంస్థలేవీ ఉత్తుత్తి కంపెనీలు కావే! భారతి సిమెంటు కానివ్వండి, సాక్షి పత్రిక కానివ్వండి, టీవీ ఛానల్ కానివ్వండి... ఇవి దేశం మొత్తంమీద ఆదరణ పొందినవి, సాక్షి అయితే దేశంలోనే 8వ స్థానంలో ఉంది. భారతి సిమెంట్ యొక్క నాణ్యత దేశంలో అగ్రస్థానం.

ఇక ప్రీమియం విషయానికి వస్తే, ఈనాడుకు పోటాపోటీగా సర్క్యులేషన్ ఉన్న సాక్షిలో ప్రీమియంను ప్రశ్నిస్తున్నవారు మరికొన్ని అంశాలను ఉద్దేశపూర్వకంగా చూడకుండా కళ్లు మూసుకున్నారు? ఈనాడు మాతృ సంస్థ అయిన ఉషోదయా పబ్లికేషన్స్ తన 26 శాతం వాటాను జెఎం ఫైనాన్షియల్స్‌కు అమ్ముతున్నప్పుడు సాక్షి కంటే డబుల్ వాల్యుయేషన్ చేసి 100 రూపాయల షేర్‌ను 5,28,000కు వెలకట్టి అమ్మడం జరిగింది. రామోజీ హెచ్‌యుఎఫ్ పేరిట అప్పటికి రూ.1800 కోట్ల మేరకు నష్టాలు పేరుకుని ఉన్నా, అంత ప్రీమియం ఎలా పలికింది? తప్పే అయితే ఎందుకు ఈ విషయం మీద దర్యాప్తు జరగడం లేదు?

అలాగే, భారతి సిమెంట్‌లో వాటాలు కొనుగోలు చేసిన నిమ్మగడ్డ ప్రసాద్‌గారు, ఇండియా సిమెంట్స్, దాల్మియా సిమెంట్స్ క్విడ్ ప్రో కోగా పెట్టుబడులు పెట్టారు కాబట్టే జగన్ నిర్ణయించిన ఎక్కువ ప్రీమియంకు వారు షేర్లు కొన్నారని మొదట్లో ప్రచారం చేశారు. తరువాత, భారతి సిమెంట్‌లో 51 శాతం వాటాను అంతకంటె భారీ ధరకు ఫ్రెంచి సిమెంట్ జెయింట్ వికాకు అమ్మినప్పుడు, ఈ పెట్టుబడిదార్లందరికీ దాదాపుగా రెట్టింపు లాభాలు వచ్చాయి. ఎక్కడో ఫ్రాన్స్ నుంచి వచ్చిన వికా చెల్లించిన ప్రీమియం కూడా క్విడ్ ప్రో కోనే అంటారా?

ఏదైనా జీవో జారీ చేయాలంటే దానికి ఒక పద్ధతి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన బిజినెస్ రూల్స్ ప్రకారంగానే జీవోలు జారీ అవుతాయి. అలా బిజినెస్ రూల్స్ ప్రకారం మంత్రి ఆమోదంతో, సంబంధిత శాఖ కార్యదర్శి జీవోలు జారీ చేస్తారు. ప్రభుత్వ నిబంధనలు ఇంత స్పష్టంగా ఉన్నాగానీ, జీవోలు జారీ చేసే అధికారం లేని డాక్టర్ వైఎస్ గారి పేరును సీబీఐ వారు నేరపూరితమైన కుట్రకు పాల్పడిన వ్యక్తిగా, అదీ ఆయన మరణానంతరం ఎందుకు చేర్చారు? రూ.1.75లక్షల కోట్ల టెలికాం కుంభకోణంలో కేంద్రంలో సంబంధిత మంత్రిగా ఉన్న రాజా, సంబంధిత శాఖ కార్యదర్శి మాత్రమే నిందితులు. ప్రధాని పేరును ఆ దర్యాప్తులో చేర్చలేదే? అలాగే, 1.85 లక్షల కోట్ల రూపాయల బొగ్గు కుంభకోణం సమయంలో ప్రధాని సంబంధిత శాఖను నిర్వహించినా, ఆయనకు సంబంధం లేదని కాగ్ నివేదిక చెప్పలేదా? దేశం పరువును అంతర్జాతీయ స్థాయిలో దిగజార్చిన కామన్‌వెల్త్ స్కామ్‌లో ప్రధానిని విచారించారా? లేదే? ఎందుకని? ఎందుకంటే, సీబీఐ నేరుగా ప్రధాని అదుపాజ్ఞల్లో పని చేస్తుంది కాబట్టి. దివంగత నేత పేరును చేర్చడానికీ కారణం అదే.

ఈ కేసులో మంత్రుల్ని గానీ, సెక్రెటరీలను గానీ విచారించారా? అని సుప్రీంకోర్టు ఈ ఏడాది మార్చి 30న దాఖలైన పిటిషన్ సందర్భంగా అడిగింది. వారి పేర్లు ఎందుకు చేర్చలేదో చెప్పండని ప్రశ్నించింది. ఆరు నెలలు గడిచినా వీరి నుంచి ఎలాంటి సమాధానమూ లేదు. జీవోలు తప్పా ఒప్పా అన్న ఊసే లేకుండా సీబీఐ 28 టీములు పెట్టి, భారతదేశ చరిత్రలో ఏనాడూ లేని విధంగా మా ఇంటిమీద, ప్రత్యేకించి కొందరు ఇన్వెస్టర్ల ఇళ్ళూ ఆఫీసుల మీద దాడి చేసింది. మా ఇంటిని అంగుళం అంగుళం కొలతలు తీసుకుంది. జీవోలు జారీ చేసిన మంత్రులు, సెక్రెటరీల ఇళ్ళమీద ఏనాడూ దాడి చేయలేదే! బోఫోర్స్‌కు మించిన కుంభకోణం ఈ దేశ చరిత్రలో మరేదీ లేదే. అయినా ఏనాడూ పకడ్బందీ సాక్ష్యాధారాల కోసం సోనియాగాంధీ ఇంటిమీద దాడి చేయలేదే? ఆదర్శ్ కుంభకోణానికి సంబంధించి అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి, కేంద్ర క్యాబినెట్‌లో పెద్దల హస్తం కూడా కనిపిస్తున్నా సీబీఐ వారి ఇళ్ళలో ఏ ఒక్కదాని మీదా ఈ రోజుకూ దాడి చేయలేదే? ఇదేం న్యాయం - ఒకరికి ఒక రూలు ఇంకొకరికి మరో రూలు - ప్రజాస్వామ్యంలో ఇదెలా సాధ్యం?

మన రాష్ట్రాన్నే చూడండి. రోశయ్యకు వ్యతిరేకంగా పెట్టిన ఏసీబీ కేసుకు ఏ గతి పట్టింది? సోనియా ముందు వంగి విధేయత ప్రదర్శించిన కాంగ్రెస్ వాది కాబట్టి ఆయన ఇంటిమీద ఎలాంటి సోదాలూ లేవు. ఆయన మీద కేసూ పోయింది. పైగా గవర్నరు గిరీ దక్కింది. ఇలాంటి ఎన్నెన్నో ఉదాహరణలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఈ దేశంలో న్యాయం సమంగా అందరికీ వర్తిస్తుందని చెప్పేవేనా? సీబీఐ ఈ కేసును కేవలం తన రాజకీయ యజమానుల్ని ఒప్పించడానికి ఉపయోగించినట్టయితే, జగన్‌తో కలిసి కుట్ర పన్నారంటూ నాలుగు చార్జిషీట్లలో నిందితుల జాబితాలో తానే పేర్కొన్న దాదాపు అందరికీ న్యాయస్థానం బెయిల్ ఇస్తున్నప్పుడు ఎందుకు అభ్యంతరం చెప్పలేదు? వారంతా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా పలుకుబడి ఉన్న వ్యక్తులు కారా? వీరిలో ఉన్న మంత్రులకు గణనీయమైన అధికారం లేదా?

జగన్‌కు బెయిల్ ఇవ్వటానికి వీల్లేదంటూ అందుకు సీబీఐ చూపుతున్న కారణాలే అర్థంపర్థం లేనివి. జగన్ ఎంపీగా ఉన్నాడు కాబట్టి ఆయన సాక్షుల్ని, సాక్ష్యాన్ని ప్రభావితం చేయగలడట! కేసులో ఎఫ్‌ఐఆర్ నమోదు అయిన 280 రోజుల వరకు సాక్షుల్ని ఎలాంటి ప్రభావానికి గురి చేయకుండా ప్రజల్లో తిరిగిన నాయకుడు, అధికారంలో లేకపోవడమే కాకుండా అధికార పక్షం నేరుగా టార్గెట్ చేస్తున్న వ్యక్తి ఏ సాక్షుల్ని అయినా ఎలా ప్రభావితం చేయగలుగుతాడు? సీబీఐ దర్యాప్తు ప్రారంభం అయ్యి 13 నెలలు గడిచింది. సీబీఐ 1, 2, 3 ఛార్జిషీట్లంటూ వేసింది. ఆ ఛార్జిషీట్లు వేస్తున్న సమయంలో జగన్ నిర్బంధంలో లేడు. తరవాత కూడా జగన్ తప్పు చేశాడని సీబీఐకి ఎలాంటి ఆధారమూ లభించలేదు.

జగన్‌మోహన్‌రెడ్డి విషయంలో సీబీఐ నిటారుగా నిలబడి దాని పని అది చేసుకుపోవడం లేదు. అది కాంగ్రెస్ హై కమాండ్ ముందు వంగి కాళ్ళకు దణ్ణం పెడుతోంది. ఇది దేశంలో ప్రధాన పత్రికలు ద హిందూ,ఇండియా టుడే, టైమ్స్ ఆఫ్ ఇండియా తమకు తాముగా చెప్పిన మాట. ఇన్ని జరుగుతున్నా ఈ దేశంలో న్యాయస్థానాల మీద, న్యాయ వ్యవస్థ మీద మాకు విశ్వాసం పోలేదు. వాటిని కాదని మేం చేయగలిగినదీ లేదు. న్యాయం వర్థిల్లాలని మాత్రమే కోరుకుంటున్నా.



- వైఎస్ భారతి
w/oవైఎ
స్ జగన్






source:sakshi

ఖైరతాబాద్ గణపతికి విజయమ్మ పూజలు


రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఖైరతాబాద్ మహాగణపతికి పూజలు చేశానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ చెప్పారు. గురువారం విజయమ్మ వినాయకుడ్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా భక్తులనుద్దేశించి ఆమె మాట్లాడుతూ ఖైరతాబాద్ వినాయకుడ్ని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని, రాష్ట్ర ప్రజలకు అన్ని విఘ్నాలు తొలగి సుఖశాంతులతో ఉండాలని ప్రార్థించానన్నారు. పార్టీ ముఖ్య నాయకురాలు విజయారెడ్డి మాట్లాడుతూ, అన్ని ఆటంకాలు తొలగిపోవాలని గణనాథుడిని పూజించానని తెలిపారు. జగనన్న నాయకత్వంలో ముందుకు వెళ్తామన్నారు. గురువారం సాయంత్రం 6.30 గంటలకు రాజ్‌దూత్ చౌరస్తా వద్దకు చేరుకున్న విజయమ్మకు స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు. 

అక్కడినుంచి వినాయకుడి వద్దకు బయల్దేరిన విజయమ్మ వెంట అభిమానులు కదులుతూ ‘వైఎస్‌ఆర్ అమర్హ్రే.... జగన్ నాయకత్వం వర్ధిల్లాలి’ అంటూ నినదించారు. ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సింగరి సుదర్శన్ విజయమ్మను శాలువాతో సత్కరించి, వినాయకుని చిత్రపటాన్ని బహూకరించారు. అనంతరం విజయారెడ్డి, జేఏసీ నాయకుడు చందు శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు పుత్తా ప్రతాపరెడ్డి, ఆదం విజయకుమార్, శివకుమార్, వాసిరెడ్డి పద్మ, పెరిక సురేష్, స్థానిక నాయకుడు కమ్మరి వినయ్, కమ్మరి వెంకటేష్, శ్రీనివాస్‌యాదవ్, సత్యనారాయణ, బండిరాజు పాల్గొన్నారు.

టీడీపీలో చిచ్చు

పార్టీకి, పదవికి బెరైడ్డి రాజశేఖరరెడ్డి రాజీనామా
బాబు పాదయాత్రను ప్రజలే అడ్డుకుంటారని హెచ్చరిక
బాబువి అస్తవ్యస్త నిర్ణయాలు: ప్రవీణ్‌కుమార్‌రెడ్డి
ఆయన పాదయాత్రకు సహకరించబోనన్న ఎమ్మెల్యే
అవసరమైతే టీడీపీనే వీడతానని హెచ్చరిక
బాబు వల్లే పార్టీ భ్రష్టుపడుతోంది: ఎమ్మెల్యే అమర్‌నాథ్‌రెడ్డి
వారిద్దరినీ సస్పెండ్ చేసే యోచనలో పార్టీ

హైదరాబాద్, న్యూస్‌లైన్:చంద్రబాబు నిర్ణయాలను నిరసిస్తూ టీడీపీలో ముసలం పుట్టింది. ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు బాబు లేఖ రాయడం, ఇతర ఏకపక్ష నిర్ణయాలపై పార్టీలోని అన్ని ప్రాంతాల నేతలూ భగ్గుమంటున్నారు. బాబు వ్యవహార శైలిపై టీడీపీ ఎమ్మెల్యేలు ఏవీ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి (తంబళ్లపల్లి), ఎన్.అమరనాథరెడ్డి (పలమనేరు) గురువారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. టీడీపీ ప్రధాన కార్యదర్శి బెరైడ్డి రాజశేఖరరెడ్డి ఏకంగా పార్టీకి, తన పదవికి రాజీనామా చేశారు! ‘వస్తున్నా మీకోసం’ పేరుతో అక్టోబర్ 2న నుంచి రాయలసీమలోని హిందూపూర్ నుంచి బాబు పాదయాత్ర ప్రారంభించనున్న తరుణంలో టీడీపీలో ఇలా చిచ్చు రగిలింది. పార్టీలో బాబు అస్తవ్యస్త విధానాలు అమలు చేస్తున్నారంటూ ప్రవీణ్ దుయ్యబట్టారు.

బాబు వైఖరికి నిరసనగా ఆయన పాదయాత్రకు సహకరించబోమని ప్రకటించారు. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తూ పార్టీ నుంచి బయటికి వెళ్లేందుకు సైతం వెనకాడబోనని హెచ్చరించారు. అమరనాథరెడ్డి కూడా బాబు నిర్ణయాలు పార్టీని భ్రష్టుపట్టిస్తున్నాయంటూ ధ్వజమెత్తారు. ఇక బెరైడ్డి అయితే బాబు చుట్టూ చక్కెర వ్యాధిగ్రస్తులు, ముసలీముతకా జమయ్యారంటూ విరుచుకుపడ్డారు. అలాంటి వారి సలహాల ప్రకారం న డుచుకుంటున్న బాబు ఏ దశలో ఉన్నారో అయన్నే అడిగి తెలుసుకోవాలని విలేకరులకు సూచించారు.

వ్యక్తిగత ప్రయోజనాల కోసమే బాబు నిర్ణయాలు: ప్రవీణ్

బాబు తన వ్యక్తిగత ప్రయోజనాల కోసమే నిర్ణయాలు తీసుకుంటున్నారని ప్రవీణ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. ప్రధానికి లేఖ కూడా అందుకే రాశారని ఆరోపించారు. దాన్ని తక్షణం వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. టీడీఎల్పీ కార్యాలయ ఆవరణలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘బాబు తన వ్యక్తిగత అహాన్ని తృప్తి పరచుకునేందుకే ప్రాధాన్యతనిచ్చారు. పార్టీని అధోగతి పాలు చేశారు. వైఎస్ మరణానంతరం ఆయనపై వ్యక్తిగతంగా తీవ్ర విమర్శలకే ప్రాధాన్యమిచ్చారు. బాబు వ్యూహాత్మక తప్పిదం వల్లే టీడీపీ హీన స్థితికి చేరుకుంది. క్షేత్ర స్థాయిలో పార్టీ నిర్మాణాన్ని బాబు నిర్వీర్యం చేశారు. అంతా తానై పార్టీని భ్రష్టు పట్టించారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రప్రయోజనాలే ముఖ్యం తప్ప వ్యక్తిగత, పార్టీ ప్రయోజనాలు ముఖ్యం కాదు. ఇలాంటి నిర్ణయాలు తీసుకునే ముందు ఇతర ప్రాంతాల నేతల అభిప్రాయాలు కూడా తీసుకోవాలి. మేం బాబు కన్నా ముందు నుంచే పార్టీలో ఉన్నాం. పార్టీ కంటే కూడా మా గ్రూపు, స్థానిక నేతలు, అనుచరుల వల్లే గెలిచాం. టికెటివ్వకపోతే స్వతంత్రంగా పోటీచేసిన చరిత్ర మాకుంది. 2009లో తెలంగాణకు అనుకూలంగా కేంద్రం ప్రకటన చేయగానే మమ్మల్ని బస్సుయాత్ర చేయాలంటూ ప్రోత్సహించిన బాబు ఇప్పుడు కేంద్రానికి లేఖ ఎలా ఇస్తారు? బాబు లేఖ అటు తెలంగాణ నేతలనూ సంతృప్తి పరచలేదు. 

ఇది పడుకున్న గాడిదను లేపి తన్నించుకున్నట్టుగా ఉంది. రాష్ట్ర ప్రజలు తాము దైవాంశసంభూతునిగా భావించిన ఎన్టీఆర్, మంచి పథకాలతో పాలించాడనుకున్న వైఎస్సార్‌ల కంటే ఎక్కువకాలం పాలించే అవకాశాన్ని బాబు కు కల్పించారు. అలాంటి వ్యక్తి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవటం సరికాదు. పార్టీ విధానాల్ని ఎవరు ప్రశ్నించినా.. వేరే పార్టీలోకి వెళ్లేం దుకే అలా చేస్తున్నారంటూ విమర్శించడం పరిపాటైంది’’ అంటూ తూర్పారబట్టారు. బాబు పాదయాత్రకు తాను సహకరించబోనన్నారు. ప్రజల్లో పూర్తిగా విశ్వాసం కోల్పోయిన దశలో పాదయాత్ర చేసినా, ఇంకోటి చేసినా బాబును వారు నమ్మే పరిస్థితి లేదన్నారు.

పార్టీ వీడేందుకూ సిద్ధం: అమర్‌నాథరెడ్డి

సమైక్యాంధ్రకే తాను కట్టుబడి ఉన్నానని అమరనాథ్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయంలో ఏ త్యాగాలకైనా సిద్ధమేనని, అవసరమైతే పార్టీని వీడేందుకూ వెనుకాడబోనని ప్రకటించారు. గురువారం ఆయన పలమనేరులోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ‘‘2009 డిసెంబర్ 9న తెలంగాణపై చిదంబరం ప్రకటన తర్వాత రాష్ట్ర ప్రజలు ప్రాంతాలవారీగా విడిపోవాల్సి వచ్చింది. అనంతర పరిణామాల్లో రాజీనామాలు చేసి బయటికొచ్చిన ఎమ్మెల్యేల్లో నేను మొదటి వాడిని. తెలంగాణ విషయంలో 2009 నుంచీ బాబు అనుసరిస్తూ వచ్చిన వైఖరి వల్ల సీమాంధ్రల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. దాంతో అప్పటి నుంచి ప్రతి ఎన్నికల్లోనూ ఆ ప్రభావం కనిపిస్తూ వస్తోంది. 

ఆ పర్యవసానంగానే తాజా ఉప ఎన్నికల్లో టీడీపీ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఈ ప్రాంత ఎమ్మెల్యేలుగా మేం కూడా తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడనుంది’’ అన్నారు. ఎవరూ అడగకుండానే లేఖ ఇవ్వాల్సిన అవసరమేమొచ్చిందని బాబును అమర్‌నాథ్ సూటిగా ప్రశ్నించారు. ఆయన నిర్ణయాలు పార్టీకి తీవ్రనష్టాన్ని చేకూరుస్తున్నాయన్నారు. తెలంగాణ ఇవ్వాల్సిందీ, తేవాల్సిందీ కాంగ్రెసే అయినప్పుడు బాబు లేఖతో పనేముందని ప్రశ్నించారు. దాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చివరికి రాష్ట్రపతి ఎన్నికల్లో తమకు రాజ్యాంగపరంగా సంక్రమించిన ఓటేసే హక్కును కూడా కాలరాసేలా బాబు వ్యవహరించారంటూ దుయ్యబట్టారు. ‘నా భవిష్యత్తును ప్రజలే నిర్ణయిస్తారు. ప్రజాభీష్టానికి అనుగుణంగా నడచుకుంటా’నని పేర్కొన్నారు.

ఇప్పుడే క్రమశిక్షణ చర్యలొద్దంటున్న బాబు

పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించి విమర్శలు గుప్పించిన నేతలపై ఇప్పటికిప్పుడు ఎలాంటి చర్యలూ తీసుకోవద్దని టీడీపీ నేతలకు బాబు సూచించారు. పాదయాత్రను సీమలో ప్రారంభిస్తున్న తరుణంలో అక్కడి నేతలపై చర్యలు తీసుకుంటే ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని, కాబట్టి రెండుమూడు రోజులు వేచిచూద్దామని పార్టీ ముఖ్యులకు చెప్పినట్టు సమాచారం. షోకాజ్ ఇచ్చి, ఏమని బదులిస్తారో చూడా లని యోచిస్తున్నట్టు కూడా చెబుతున్నారు. తెలంగాణ టీడీపీ నేతలు గురువారం టీడీఎల్పీలో సమావేశమై, బాబు లేఖను స్వాగతించారు.

‘చెయ్యెత్తి జైకొట్టు తెలంగాణోడా’ అన్నట్టుంది: బెరైడ్డి

చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా అని టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ అంటే, ఇప్పుడు మాత్రం పార్టీ పరిస్థితి ‘చెయ్యెత్తి జై కొట్టు తెలంగాణోడా’ అన్నట్టుగా ఉందని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బెరైడ్డి రాజశేఖరరెడ్డి అన్నారు. సమితి ముఖ్య సమన్వయకర్త తమ్మడపల్లి విజయ్‌రాజ్‌తో కలిసి హైదరాబాద్‌లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రధానికి రాసిన లేఖలో రాయలసీమ గురించి బాబు ప్రస్తావించకపోవటాన్ని తప్పుబట్టారు. ‘‘ఒకవేళ తెలంగాణకు అనుకూలంగా కేంద్రానికి లేఖ రాస్తే సీమ గురించి కూడా అందులో ప్రస్తావించాలని నేను బాబుకు రాసిన లేఖలో కోరాను. నా లేఖను బుట్టదాఖలు చేశారు. సీమంటే అంత చులకనెందుకు? మా ప్రాంతమంటే లెక్కలేనితనం కనబడుతోంది’’ అంటూ దుయ్యబట్టారు. ప్రధానికి బాబు లేఖ రాయడానికి నిరసనగానే టీడీపీతో 19 ఏళ్ల బంధాన్ని తెంచుకుంటున్నానని చెప్పారు. 

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతామని కేంద్రం ఒకవేళ చెప్పినా తాము మాత్రం ప్రత్యేక రాయలసీమ రాష్ర్టం కోసం రాజకీయాలకు అతీతంగా పోరాడతామన్నారు. రాయలసీమకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి వారిని చైతన్యపరిచేందుకు అక్టోబర్ 2 నుంచి నవంబర్ 10 దాకా వెయ్యి కిలోమీటర్ల పొడవున రాయలసీమ పరిరక్షణ పాదయాత్ర నిర్వహిస్తామని బెరైడ్డి చెప్పారు. ‘‘యాత్ర కర్నూలు జిల్లా కేతవరంలో మొదలై అనంతపురం ఆర్ట్స్ కాలేజీలో బహిరంగ సభతో ముగుస్తుంది’’ అని వెల్లడించారు. తాను యాత్రను ప్రకటించాకే బాబు కూడా యాత్రకు శ్రీకారం చుట్టారన్నారు. ‘‘సీమకు అన్యాయం చేసేలా వ్యవహరించిన బాబు యాత్రను మేం అడ్డుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలే అడ్డుకుంటారు’’ అన్నారు.

http://www.sakshi.com/main/FullStory.aspx?catid=458764&Categoryid=1&subcatid=33

జగన్ ఆస్తుల కేసు కాదిది .వాన్‌పిక్‌ది వేరే కేసు

*హైకోర్టులో సీబీఐ న్యాయవాది అంగీకారం
*జడ్జిని సంతృప్తిపరచలేని రీతిలో సమాధానాలు
*నవయుగ చేరితే ప్రభుత్వానికి వచ్చిన నష్టమేమిటి?
*శరపరంపరంగా ప్రశ్నలు సంధించిన న్యాయమూర్తి
*బదులివ్వలేక ఆద్యంతం తడబడ్డసీబీఐ న్యాయవాది
*నిమ్మగడ్డ బెయిల్‌పై నేడూ కొనసాగనున్న విచారణ

హైదరాబాద్, న్యూస్‌లైన్: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కంపెనీల్లో పెట్టుబడుల కేసుకు సంబంధించి సీబీఐ దర్యాప్తులో డొల్లతనం మరోసారి బయటపడింది. వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ బెయిల్ పిటిషన్‌పై గురువారం కొనసాగిన వాదనలు అందుకు వేదికయ్యాయి. వాన్‌పిక్ కేసుతో జగన్‌కు సంబంధం లేదని బుధవారం వాదనల సందర్భంగా సీబీఐ న్యాయవాది కేశవరావు హైకోర్టుకు వెల్లడించడం తెలిసిందే. గురువారం నాటి విచారణలోనూ ఇలాంటి పరిణామాలే చోటుచేసుకున్నాయి. వాన్‌పిక్ ప్రాజెక్ట్స్‌కు సంబంధించి ప్రసాద్‌పై దాఖలు చేసిన కేసు జగన్ ఆస్తుల కేసులో భాగమేనా అని న్యాయమూర్తి జస్టిస్ సముద్రాల గోవిందరాజులు ప్రశ్నించగా, ‘కాదు, ఇది వేరే కేసు’ అని సీబీఐ న్యాయవాది చెప్పారు! కేసుకు సంబంధించిన వాదనలు కూడా ఆసక్తికరంగా కొనసాగాయి. 

సీబీఐ విచారణ తీరుపై న్యాయమూర్తి శరపరంపరగా సంధించిన ప్రశ్నలకు కేశవరావు సరైన సమాధానాలివ్వలేకపోయారు. దాంతో, ‘కోర్టుకున్న సందేహాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఉంటుంది. అడిగిన ప్రతి ప్రశ్నకూ బదులివ్వాలి’ అంటూ సీబీఐ న్యాయవాదిపై న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. వాన్‌పిక్ ఒప్పందాలకు సంబంధించి చెప్పిన విషయాలనే మళ్లీ మళ్లీ చెప్పేందుకు ఆయన ప్రయత్నించడంతో, కోర్టు సమయాన్ని వృథా చేయరాదని స్పష్టంగా చెప్పారు. సీబీఐ వాదనలపై నిమ్మగడ్డ తరఫు న్యాయవాదులు వివరణ ఇచ్చేందుకు వీలుగా తదుపరి వాదనల నిమిత్తం విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు. గురువారం నాటి వాదనల ముఖ్యాంశాలివీ...

ప్రభుత్వానికి నష్టమేంటి ?

వాన్‌పిక్ ప్రాజెక్టులోకి కొత్త భాగస్వామిగా నవయుగ కంపెనీ చేరడం ద్వారా ప్రభుత్వాదాయానికి వచ్చిన నష్టమేంటని సీబీఐ న్యాయవాది కేశవరావును న్యాయమూర్తి ప్రశ్నించారు. రెండు ప్రభుత్వాల మధ్య కుదిరిన ప్రధాన ఒప్పందానికి లోబడే ఏ భాగస్వామ్య ఒప్పందాలైనా జరుగుతాయి తప్ప దాన్ని ఉల్లంఘించలేవు కదా అని అభిప్రాయపడ్డారు. దానికి కేశవరావు సరైన వివరణ ఇవ్వలేకపోయారు. ‘‘రాక్ సీఈవోకు నోటీసులిచ్చామని చెప్పారు. ఎప్పుడిచ్చారు ? వారి నుంచి వచ్చిన స్పందనేమిటి?’’ అని న్యాయమూర్తి ప్రశ్నించారు. నిమ్మగడ్డ బెయిల్ పిటిషన్‌ను సీబీఐ కోర్టు కొట్టేశాక ఇటీవలే కొన్ని వారాల కింద నోటీసులిచ్చామని కేశవరావు బదులిచ్చారు. వారి నుంచి ఎలాంటి సమాధానమూ రాలేదని తెలిపారు. వాన్‌పిక్ కేసులో ఎక్కువ మంది సాక్షులు వాన్‌పిక్ ఉద్యోగులేనని, నిమ్మగడ్డకు బెయిలిస్తే వారిని ప్రభావితం చేసే ఆస్కారముందని పేర్కొన్నారు. దాంతో, సాక్షుల్లో వాన్‌పిక్ ఉద్యోగులు ఎందరున్నారని న్యాయమూర్తి ప్రశ్నించగా, తన దగ్గర సమాచారం లేదంటూ దాటవేశారు. నిమ్మగడ్డ ప్రసాద్ గతంలో ఆర్థిక నేరాలకు పాల్పడ్డట్టు ఆధారాలున్నాయా అని ప్రశ్నించగా అలాంటిదేమీ లేదని స్పష్టం చేశారు. వాన్‌పిక్‌పై ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని కేశవరావు నివేదించగా, దేనిపై దర్యాప్తు కొనసాగుతోందో స్పష్టం చేయాలని న్యాయమూర్తి సూచించారు. ఇందూ ప్రాజెక్టుతో పాటు అనంతపురంలో లేపాక్షి నాలెడ్జ్ సెంటర్‌కు భూ కేటాయింపుల వ్యవహారంపై కొనసాగుతోందని కేశవరావు వివరణ ఇచ్చారు. ‘వాన్‌పిక్ అంటే ఓడరేవులకు సంబంధించిన వ్యవహారం కదా! అనంతపురం జిల్లాలో భూముల వ్యవహారంతో ఈ కేసుకేం సంబంధం?’ అని న్యాయమూర్తి ప్రశ్నించారు. మైటాస్ కంపెనీకి వైఎస్సార్ కడప జిల్లాలో రూ.120 కోట్ల రోడ్డు పనులను నామినేషన్ పద్ధతిన ఇచ్చారని, దానిపైనా దర్యాప్తు చేయాల్సి ఉందని కేశవరావు చెప్పగా, ‘మైటాస్ పాత్ర చిన్నదే కదా’ అని అన్నారు.

సాక్షులు 10 మందే: నిమ్మగడ్డ న్యాయవాది

వాన్‌పిక్‌కు చెందిన ఉద్యోగులు 10 మందే సాక్షులుగా ఉన్నారని నిమ్మగడ్డ తరఫు న్యాయవాది రాజశేఖర్ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. వారి వాంగ్మూలాలను గత మార్చిలోనే సీబీఐ నమోదు చేయించిందన్నారు. ‘‘సాక్షుల్లో ప్రభుత్వోద్యోగులే ఎక్కువ మంది ఉన్నారు. ఒప్పందాలకు సంబంధించిన అన్ని రికార్డులను సీబీఐ ఇప్పటికే చార్జిషీట్‌తోపాటు కోర్టుకు సమర్పించిన నేపథ్యంలో ఆధారాలను మాయం చేసే ప్రశ్నే ఉత్పన్నం కాదు. సాక్షులను ప్రభావితం చేస్తారనేందుకు సీబీఐ చిన్న ఆధారాన్ని కూడా చూపలేకపోతోంది. కేవలం యాంత్రికంగా మాత్రమే అభ్యంతరం తెలుపుతోంది. వాన్‌పిక్ ప్రాజెక్టులో ప్రభుత్వానికి పైసా పెట్టుబడి లేదు. రాయితీ ఒప్పందంపైనా రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికీ అభ్యంతరం లేదు. రూ.17 వేల కోట్ల పెట్టుబడితో చేపట్టిన ఈ ప్రాజెక్టులో వాన్‌పిక్ ఇప్పటికే కోట్లాది రూపాయలు పెట్టుబడిగా పెట్టింది. సీబీఐ కేసుతో ప్రాజెక్టు అభివృద్ధి ఆగిపోయింది. లీజుకిచ్చిన ప్రాంతంలో విద్యుత్ కంపెనీలు ప్రారంభమై ఉంటే రాష్ట్రంలో విద్యుత్ కొరత ఉండేది కాదు. ప్రస్తుతం రూ.11కు కొనుగోలు చేస్తున్న కరెంటు రూ.3కే వచ్చేది’’ అని ఆయన నివేదించారు.


http://www.sakshi.com/main/FullStory.aspx?catid=458681&Categoryid=1&subcatid=33

జగన్ బెయిల్ పిటిషన్‌పై నేడు విచారణ

న్యూఢిల్లీ, న్యూస్‌లైన్: ఆస్తుల కేసులో బెయిల్ కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, కడప ఎంపీ వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి దాఖలుచేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం విచారించనుంది. జస్టిస్ అఫ్తాబ్ ఆలం, జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్‌తో కూడిన ధర్మాసనం ఈ నెల 14వ తేదీన జగన్ బెయిల్ పిటిషన్‌పై తొలివిడత విచారణ జరిపి ఇరుపక్షాల వాదనలు విన్న సంగతి తెలిసిందే. ఆస్తుల కేసులో సాక్షులను జగన్ ప్రభావితం చేస్తున్నారన్న సీబీఐ వాదనకు ఆధారమైన ‘సూరీడు వాంగ్మూల నిరాకరణ’ వ్యవహారంలో సీఆర్‌పీసీ సెక్షన్ 164 కింద కీలక సాక్షి సూరీడుకు సమన్లు పంపాలని లోగడ ప్రత్యేక కోర్టులో సీబీఐ పెట్టుకున్న దరఖాస్తును, సదరు దరఖాస్తుపై సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జారీచేసిన సమన్ల ఉత్తర్వును తదుపరి విచారణలోగా కోర్టుకు సమర్పించాలని గత విచారణ సమయంలో ధర్మాసనం సీబీఐని ఆదేశించింది. కాగా విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు కోసం సీబీఐ దాఖలుచేసిన పిటిషన్‌పై కూడా ధర్మాసనం శుక్రవారం విచారణ జరపనుంది.

http://www.sakshi.com/main/FullStory.aspx?CatId=458672&Categoryid=1&subCatId=32

Today YS Jagan's bail petition hearing

how to console when children outburst ?

Written By news on Thursday, September 27, 2012 | 9/27/2012

YS JAGAN HAD NO ROLE IN VANPIC CASE: CBI TO HC(sakshi post)


Justice Samudrala Govindarajulu of AP High Court posed some pertinent questions to the CBI lawyer, Kesava Rao during the course of industrialist Nimmagadda Prasad's petition for bail on Wednesday. All along the CBI had been maintaining that Jagan was involved in allocation of lands in the Vanpic  case.
However, when questioned by the judge the CBI counsel came out with the facts of the case. The CBI lawyer clarified that YS Jagan Mohan Reddy was in no way connected to the Vanpic case.
Significantly, the judge expressed his displeasure over the with CBI arguments and instructed the premier investigation agency to present arguments which are judicially sound. Further, the Court instructed the CBI not to present arguments to please its superior officers.
  • After having levelled allegations all along that YSRC Party president and Kadapa MP YS Jagan Mohan Reddy was involved in allocation of lands in the Vanpic project and influencing industrialist Nimmagadda Prasad to invest in Jagati Publications and Bharathi cements, the CBI was compelled to come out with the truth.
  • The CBI admitted before the High Court on Wednesday that Jagan Mohan Reddy had no role to play in the allocation of lands to the vanpic corridor, granting concessions and related matters.
  • However, this disclosure was not made voluntarily by the CBI. It was forced to do so when the CBI counsel had to place details with regard to the Vanpic agreement. At this point, the CBI lawyer elaborated on the facts with regard to Jagan's role and Nimmagadda Prasad's investments in Jagati Publications.
  • The CBI was compelled to admit the truth of Jagan's non-involvement following the High Court intervention. The court questioned the CBI sharply about the involvement of Jagan in the said case.
  • It's worth recalling that Nimmagadda Prasad had filed a bail petition in the High Court after the CBI court had rejected his bail plea in the case against him for investing in Jagan's companies.
  • The petition came up before justice Samudrala Govindarajulu who had heard it before. 
  • CBI counsel Kesava Rao continued his arguments after last week's inconclusive hearing was adjourned. 
  • Once again, the judge expressed his displeasure over the arguments presented by the CBI counsel. 
  • The judge said: "Do you want to present arguments as it pleases you or as the court wishes to hear them? The court will not entertain the reading of irrelevant documents." "Please speak only on documents related to the bail petition," the judge said in no uncertain terms.
  • The CBI counsel, however, replied that he would only read out one or two paragraphs related to the bail petition and that he would not waste the court's time. He then referred to the Government to Government agreement reached between RAK and the AP government on the vanpic project. 
  • The CBI counsel told the court that the project was alloted 4,000 acres under the Boot (build, own, operate and transfer) scheme. 
  • He also argued that there was no clarity on any cabinet decision in this respect (allocation of 4,000 acres of land).
  • The judge cut him off by repeating that he wanted to hear only points relevant to the bail petition and nothing else. The judge further added that he only wanted to know the role of the petitioner in the case. 
  • Kesava Rao stated that Nimmagadda Prasad's massive investments in Jagan's companies were quid pro quo in nature.
  • He also alleged that Nimmagadda Prasad stood to gain from the concessional agreement in the Vanpic project and thus invested in Jagan's companies. He added that the details of the investments were mentioned in the chargesheet.
  • The judge bluntly retorted to this by saying, "Do not argue here as you do in the lower court and save these arguments for the lower court. Just state as to who else has a role in the quid pro quo agreement. Is Jagan, the accused No.1 in the vanpic case in any way connected to this. If yes, please spell out clearly in what way?" This question rattled not only the CBI counsel Kesava Rao, but also all the other officials present in the courtroom.
  • After the judge raised this crucial question, the CBI had no option but to reveal the truth. The CBI counsel stated that Jagan is in no way involved in the Vanpic corridor case. However, Kesava Rao parroted the same arghument that Nimmaggada Prasad invested in Jagati Publications and Bharathi Cements to which the judge responded by saying, "I have my own doubts. I cannot conclude based on what's stated in the chargesheet or your arguments. I have my own ways of arriving at the truth. Only after thorough research will I reach a conclusive decision."
  • "Please give a straightforward reply to each query of mine. Present your arguments in a way that satisfies the court. Just because someone's convinced with your arguments means nothing to me — I am helpless,"  the judge reprimanded Kesava Rao.
- sakshipost



source:   http://sakshipost.com/index.php/news/state/3833-ys-jagan-had-no-role-in-vanpic-case-cbi-to-hc

బాబు సీమ ద్రోహి...

Written by Parvathi On 9/27/2012 3:51:00 PM
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుకు సొంత జిల్లా నుంచి తిరుగుబాటు బావుట ఎదురైంది. ప్రధానమంత్రికి చంద్రబాబు తెలంగాణపై లేఖ రాయడంపై చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి టీడీపీ ఎమ్మెల్యే ప్రవీణ్ కుమార్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. సీమాంధ్ర ప్రాంత నేతలతో సంప్రదించకుండా బాబు ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారంటూ ప్రవీణ్ కుమార్ రెడ్డి గళమెత్తారు. చంద్రబాబు సొంత గడ్డకు ద్రోహం చేశారని బాహాటంగానే మండిపడ్డారు. తెలంగాణకు అనుకూలంగా ఒక అడుగు ముందుకు వేస్తూ ప్రధానికి లేఖ రాసి ఇరవై నాలుగు గంటలు ముగియక ముందే బాబు వైఖరిపై పార్టీ నేతలే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

చంద్రబాబు రాసిన తెలంగాణ లేఖను తక్షణమే ఉపసంహరించుకోవాలని ప్రవీణ్ రెడ్డి గురువారం డిమాండ్ చేశారు. తెలుగుదేశంపార్టీ ఇప్పటికే అస్తవ్యస్తమైందని.. పార్టీనే కాకుండా రాష్ట్రాన్ని కూడా నాశనం చేస్తారా అని ఆయన మండిపడ్డారు. లేఖను ఉప సంహరించుకోకుండా సమైంక్యాంధ్రే టీడీపీ విధానమని చెప్పకపోతే టీడీపీని వీడడం ఖాయమని ప్రవీణ్‌ కుండబద్ధలు కొట్టారు.

పార్టీ కన్నా, సొంత ప్రయోజనాల కన్నా తనకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమన్నారు. చంద్రబాబు తన లేఖను వెనక్కి తీసుకోవాలని, లేకుంటే పార్టీని వీడటానికి కూడా వెనుకాడనని ఆయన స్పష్టం చేశారు. బాబు పాదయాత్రకు సహకరించేది లేదని స్పష్టం చేశారు. పైగా పాదయాత్రకు చిత్తూరు జిల్లా వస్తే నిరసన తెలుపుతామని కూడా ప్రవీణ్ హెచ్చరిస్తున్నారు.

చంద్రబాబు రాయలసీమకు ద్రోహం చేశారని, ఆ ప్రాంతం వ్యక్తి అయి ఉండి, తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడంతో పార్టీ తీవ్రంగా నష్ట పోతుందని ఆయన అన్నారు. చంద్రబాబు రెండువేల తొమ్మిది నుంచి తప్పులే చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ మార్చ్ పేరుతో సీమాంద్రులపై దాడికి తెలంగాణవాదులు ప్రయత్నిస్తుంటే, దానికి తెలుగుదేశం తెలంగాణ ఎమ్మెల్యేలు కూడా మద్దతు ఇవ్వడం దారుణమని ఆయన విమర్శించారు.

రాష్ట్రంలో ఆంధ్రా, తెలంగాణ ప్రాంతాలే కాదని, రాయలసీమ ప్రాంతం కూడా ఉందని ప్రవీణ్ కుమార్ రెడ్డి గుర్తు చేశారు. ఒకవేళ రాష్ట్రం విడిపోతే సీమ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. పార్టీలో తెలుగు అనే పదం పెట్టుకునే అర్హత టీడీపీకి లేదని, తెలంగాణ దేశం అని పెట్టుకుంటే సరిపోతుందని ఆయన సూచించారు.

బాబు తెలంగాణ లేఖ ఇవ్వడాన్ని ప్రవీణ్ కుమార్ రెడ్డి గతంలో తీవ్రంగా వ్యతిరేకించారు. ఒకవేళ లేఖ ఇస్తే పార్టీకి, పదవికి గుడ్ బై చెప్పే అవకాశం ఉందని ప్రచారం జరిగిన నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడు కొద్ది రోజుల క్రితం ప్రవీణ్ తో ఈ విషయాన్ని చర్చించినట్లు సమాచారం. ఈ సందర్భంగా తెలంగాణ లేఖ ఇస్తే పార్టీకి రాయలసీమలో ఎదురయ్యే పరిణామాలను ఎమ్మెల్యే వివరించినట్లు తెలిసింది. అయితే పార్టీ వీడే యోచనలో ఉన్న ప్రవీణ్ కుమార్ రెడ్డి తెలంగాణ లేఖను రాద్ధాంతం చేస్తున్నారని ఆపార్టీకి చెందిన తెలంగాణ నేతలు విమర్శిస్తున్నారు.

ఇప్పటికే చంద్రబాబుకు వ్యతిరేకంగా తెలంగాణ తెలుగు తమ్ముళ్లు పార్టీకి రాజీనామా చేసి తెరాస గూటికి చేరి మళ్లీ ఎమ్మెల్యేలుగా గెలుపొందగా, మరికొందరు తిరుగుబాటు జెండా ఎగురవేశారు. తాజాగా తెలంగాణ లేఖతో ఇప్పుడు సీమాంధ్ర నుంచి కూడా బాబుకు నిరసనలు ఎదురవుతున్నాయి. మరోవైపు ప్రత్యేక రాయలసీమ అంటూ టీడీపీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి తన ప్రయత్నాలు తాను చేస్తున్న విషయం తెలిసిందే.

పార్టీలో తాజా పరిణామాల నేపథ్యంలో ఇప్పటికైనా చంద్రబాబు ఒంటికన్ను విధానంపై నిలబడతారా...లేక రెండుకళ్ల సిద్ధాంతాన్ని కొనసాగిస్తారా అనేది తేలాల్సి ఉంది. కాగా తెలంగాణపై చంద్రబాబు లేఖ చాలా స్పష్టంగా ఉందని తెలంగాణ తెలుగు తమ్ముళ్లు చెప్పటం విశేషం.

source: sakshi

టీడీపీకి బైరెడ్డి రాజశేఖరరెడ్డి రాజీనామా!

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీకి సీనియర్ నాయకుడు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి రాజీనామా చేశారు. చంద్రబాబు వ్యవహారశైలి నచ్చకపోవడం వల్లే పార్టీకి రాజీనామా చేస్తున్నానని ఆయన అన్నారు. తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇస్తే అభ్యంతరం లేదని ఆయన అన్నారు. కానీ రాయలసీమ అంటే ఎందుకు చంద్రబాబుకు లెక్కలేనితనం ఉందోనని బైరెడ్డి మండిపడ్డారు. బాబుకు సలహాలు ఇస్తున్నవారు పార్టీని ముంచడానికే తప్ప, పెంచడానికి కాదని టీడీపీ నేతలను విమర్శించారు. 

source: kommineni

టిడిపిలో మరో ఎమ్మెల్యే తిరుగుబాటు

తెలుగుదేశం పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే తిరుగుబాటు చేశారు. ఆయన కూడా చిత్తూరు జిల్లావాడే కావడం విశేషం. అది కూడా చంద్రబాబునాయుడు పక్క నియోజకవర్గానికి ప్రాతినిద్యం వహిస్తున్న ఎన్.అమరనాధ రెడ్డి కావడం ప్రత్యేకతగా తీసుకోవాలి.ఇప్పటికే తంబళ్లపల్లి ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి తిరుగుబాటు బావుటా ఎగురవేసి చంద్రబాబుపై విమర్శల వర్షం కురిపించి, తాను సమైక్యవాదానికే కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు.అదే బాట అమరనాధ్ రెడ్డి కూడా తాను సమైక్య రాష్ట్రం కోసం ఉద్యమం చేస్తానని హెచ్చరించారు. చంద్రబాబు నిర్ణయాల వల్ల పార్టీ దెబ్బతింటోందని అన్నారు.అమరనాధ్ రెడ్డి గతంలో పుంగనూరుకు, ఆ తర్వాత పలమనేరుకు ప్రాతినిద్యం వహిస్తున్నారు. ఈయన తండ్రి కూడా రామకృష్ణారెడ్డి కూడా టిడిపి పక్షాన ఎమ్మెల్యే, ఎమ్.పిగా బాధ్యతలు నిర్వహించి దివంగతులయ్యారు. ప్రవీణ్ కాని, అమరనాద్ రెడ్డి కాని రాజకీయ కుటుంబాలకు చెందినవారే కావడం విశేషం. వీరే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా ఇంకెవరైనా తిరుగుబాటు చేస్తారా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా ఉంది.

source: kommineni

YS Vijayamma visits Khairathabad's 58 feets Lord Ganesha

'బాబుది పాదయాత్ర కాదు శవయాత్ర'

నెల్లూరు: చంద్రబాబు చేయబోయేది పాదయాత్ర కాదు శవయాత్ర అని కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి అన్నారు. అధికార పీఠం కోసమే పాదయాత్ర పేరుతో కొత్త రాజకీయం చేస్తున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు ఎన్ని జిమ్మిక్కులు చేసినా జనం నమ్మే పరిస్థితి లేదని ప్రసన్న కుమార్ అన్నారు. అధికారంలో ఉన్నంత సేపు బిల్‌క్లింటన్‌, బిల్‌గేట్స్ అంటూ హైలెవల్లో ఆలోచించారే తప్ప పేదల కోసం ఎప్పుడు ఆలోచించలేదని ఆయన మండిపడ్డారు. జగన్‌ కడిగిన ముత్యంలా బయటకు వస్తారని కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

జగన్ కోసం చెవిరెడ్డి హోమం

హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్‌.జగన్‌కు భగవంతుని ఆశీస్సులు సంపూర్ణంగా అందాలని ఆశిస్తూ వైఎస్‌ఆర్ సీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హైదరాబాద్‌లో భారీ హోమం ప్రారంభించారు. నానక్‌రాంగూడ మహంకాళీ ఆలయంలో ఈరోజు ఉదయం నుంచి రాత్రి వరకు ఈ యాగం కొనసాగనుంది. లక్ష్మీగణపతి హోమంతో ప్రారంభమై, రుద్రహోమం, నవగ్రహ శాంతి, సుదర్శనయాగం, చండీపారాయణ హోమంతో యాగం ముగుస్తుంది. రాబోయే రోజుల్లో జననేత జగన్‌కు శుభం కలగాలని.. అన్ని దోషాలు పోయి అజయుడై ఈ రాష్ట్రాన్ని పాలించాలని ఈ హోమం తలపెట్టినట్లు చెవిరెడ్డి తెలిపారు.


source: sakshi

మహాగణపతిని దర్శించుకున్న విజయమ్మ!

హైదరాబాద్: ఖైరతాబాద్‌ గణేష్‌ను వై.ఎస్‌.ఆర్‌. కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వై.ఎస్‌.విజయమ్మ దర్శించుకున్నారు. వినాయకుడికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ మంచి జరగాలని దేవుడ్ని కోరుకున్నానని చెప్పారు. వై.ఎస్‌.విజయమ్మ రాకతో ఖైరతాబాద్‌లో సందడి నెలకొంది. ఈ కార్యక్రమంలో వై.ఎస్‌.ఆర్‌. కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలు, వాసిరెడ్డిపద్మ, విజయారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

source:sakshi

జగన్ కేసు- సిబిఐ వాదనలో బలహీనత

వాన్ పిక్ భూముల కేటాయింపుతో జగన్ కు సంబంధం లేదని సిబిఐ న్యాయవాది హైకోర్టు వేసిన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పడం సంచలనంగా మారింది.ప్రధాన నిందితుడుగా ఉన్న జగన్ కు భూ కేటాయింపులతో సంబందం లేనప్పుడు ఆయన కంపెనీలలో పెట్టుబడులలో తప్పేమిటన్న సందేహం సహజంగానే వస్తుంది.దీనిపై హైకోర్టు న్యాయమూర్తి కూడా తనకు కూడా కొన్ని సందేహాలు వస్తున్నట్లు వ్యాఖ్యానించడం విశేషంగా కనిపిస్తుంది.ఇంతవరకు వాన్ పిక్ భూముల కేటాయింపునకు, జగన్ కంపెనీలలో పెట్టుబడులకు సంబందం ఉందని సిబిఐ వాదిస్తూ వచ్చింది. అయితే సిబిఐ వాదన ప్రకారం జగన్ పేరు ఇందులో ప్రస్తావన తెచ్చినా, అసలు అభియోగం దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డిపై మోపాలన్నది వారి అభిప్రాయం కావచ్చు. ఆయన ఎటూ లేరు కనుక ఇప్పుడు ఆయన కుమారుడు జగన్ ను ప్రధాన నిందితుడిగా చేశారు. అయితే తండ్రి చేసిన తప్పులకు కొడుకు బాధ్యత ఎలా వహిస్తారన్న ప్రశ్న వస్తుంది. అంతేకాక అసలు వాన్ పిక్ ప్రాజెక్టు సంబందించి ఏడెనిమిది వందల కోట్లు ఖర్చు పెట్టి కొనుగోలు చేయడం పెద్ద తప్పన్నట్లుగా సిబిఐ వాదిస్తోంది.ఒకపక్క మంత్రి దర్మాన ప్రసాదరావు అన్నిటికి క్యాబినెట్ ఆమోదం ఉందని చెబుతోంటే, సిబిఐ అందుకు భిన్నంగా వాదిస్తోంది. అలాంటప్పుడు ధర్మానను అరెస్టు చేయడానికి సిబిఐ ఎందుకు ప్రయత్నం చేయలేదో అర్దం కాదు.ముందుగా రాష్ట్ర ప్రభుత్వ వాదన వినడానికి సిబిఐ కూడా ఎందుకు ప్రయత్నం చేయలేదో తెలియదు. రాజకీయ కేసుగా మారిన ఈ వ్యవహారంలో సిబిఐ అప్రతిష్టను తెచ్చుకునేలా ఉంది.దీనివల్ల రాష్ట్రానికి కూడా నష్టం జరగవచ్చు.పెట్టుబడులు పెట్టేవారు వెనుకంజ వేయవచ్చు. ఒకవేళ నిజంగానే నిబందనలకు విరుద్దంగా భూ కేటాయింపులు జరిగితే, దానిని రద్దు చేసి భూమిని తీసుకోవచ్చు కదా. అప్పుడు నష్టపోయేది పెట్టుబడిదారుడే కదా. దానిని వదలిపెట్టి ప్రముఖ పారిశ్రామిక వేత్త నిమ్మగడ్డ ప్రసాద్ ను అరెస్టు చేయడం, బెయిల్ ను అడ్డుకోవడానికి ప్రయత్నించడం.. ఎంతకాలం సిబిఐ ఈ రకంగా చేస్తుందో తెలియదు. 

source: kommineni

సొంత జిల్లా నుంచే చంద్రబాబుకు ఎదురు దెబ్బ

తెలుగుదేశం అదినేత చంద్రబాబు నాయుడుకు సొంత జిల్లా నుంచి ఎదురు దెబ్బ తగిలింది. తెలంగాణకు అనుకూలంగా ఒక అడుగు ముందుకు వేస్తే ప్రధానికి లేఖ రాసిన ఇరవై గంటలకే చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె యువ ఎమ్మెల్యే ప్రవీణ్ కుమార్ రెడ్డి తిరుగుబాటు జెండా ఎగురవేశారు.పార్టీ కన్నా రాష్ట్రం, రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమని స్పష్టం చేశారు. చంద్రబాబు రాయలసీమకు ద్రోహం చేశారని, ఆ ప్రాంతం వ్యక్తి అయి ఉండి, తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడంతో పార్టీ తీవ్రంగా నష్ట పోతుందని ఆయన అన్నారు.చంద్రబాబు తన లేఖను వెనక్కి తీసుకోవాలని, లేకుంటే పార్టీని వీడటానికి కూడా వెనుకాడనని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబు రెండువేల తొమ్మిది నుంచి తప్పులే చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ మార్చ్ పేరుతో సీమాంద్రులపై దాడికి తెలంగాణవాదులు ప్రయత్నిస్తుంటే, దానికి తెలుగుదేశం తెలంగాణ ఎమ్మెల్యేలు కూడా మద్దతు ఇవ్వడం దారుణమని ఆయన విమర్శించారు.ఇంతకాలం చంద్రబాబుకు వ్యతిరేకంగా తెలంగాణ ఎమ్మెల్యేలు నాగం జనార్దనరెడ్డి,జోగు రామన్న,పోచారం శ్రీనివాసరెడ్డి, గంపా గోవర్ధన్ లు పార్టీకి రాజీనామా చేసి తిరిగి ఎన్నికలలో పోటీచేయగా, హరీశ్వర్ రెడ్డి, వేణుగోపాలాచారి వంటివారు తిరుగుబాటు జెండా ఎగురవేశారు. ఇప్పుడు సీమాంధ్ర నుంచి ఈ సమస్య వస్తోంది. పైగా పాదయాత్రకు చిత్తూరు జిల్లా వస్తే నిరసన తెలుపుతామని కూడా ప్రవీణ్ హెచ్చరిస్తున్నారు.

source: kommineni

Mekapati comments in Padayatra for YS Jagan

'జగన్ కి న్యాయం జరిగి తీరుతుంది'

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి తప్పకుండా న్యాయం జరుగుతుందని ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారని నెల్లూరు ఎంపి మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. జగన్‌కు మంచి జరగాలని ఆకాంక్షిస్తూ ఆయన గురువారం తన స్వగ్రామం నుంచి వేదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం వరకు పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా మేకపాటి మాట్లాడుతూ జగన్ ను రాజకీయంగా ఎదుర్కోలేక అధికార, విపక్షాలు కుట్ర చేస్తున్నాయని మండిపడ్డారు. 

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేకే అన్యాయంగా నిర్బంధించారని మేకపాటి అన్నారు. అధికార, విపక్షాలు కుమ్మక్కై..పబ్బం గడుపుకోవాలని చూస్తున్నాయని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలు ఎవరినీ నమ్మరనీ... జగన్‌ నాయకత్వాన్ని మాత్రమే కోరుకుంటున్నారని మేకపాటి స్పష్టం చేశారు.

Popular Posts

Topics :