14 October 2012 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

షర్మిల అనంత షెడ్యూల్ ఖరారు

Written By news on Saturday, October 20, 2012 | 10/20/2012

అనంతపురం జిల్లాలో షర్మిల పాదయాత్ర షెడ్యూల్ ఖరారైంది. ఈనెల 23వ తేదీ నుంచి షర్మిల మరో ప్రజాప్రస్థానం యాత్ర నిర్వహించనున్నారు. దాడితోట దగ్గర షర్మిల అనంతపురం జిల్లాలో ప్రవేశిస్తారు. 14 రోజుల పాటు ధర్మవరం, రాప్తాడు, అనంతపురం, ఉరవకొండ, గుంతకల్లు నియోజకవర్గాల్లో పాదయాత్ర జరగనుంది. మొత్తం 75 గ్రామాలు, పట్టణాల మీదుగా పాదయాత్ర జరిగేలా రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. qరాజన్న బిడ్డ కోసం జనం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారని.. కనీవినీఎరుగని రీతిలో పాదయాత్ర జరగనుందని వైఎస్‌ఆర్‌ సిపి నేత శంకర నారాయణ చెప్పారు.

source:sakhi

Roja on YS Sharmila's Maro Praja Prasthanam

Free Ambulance service in Maro Praja Prasthanam

Sharmila's padayatra schedule for Anantapur finalised

YS Manohar Reddy on Sharmila's Padayatra

Sharmila's padayatra reaches Besthavaripalli

షర్మిల నేటి పాదయాత్ర షెడ్యూల్

భూమయ్యగారి పల్లె : మరో ప్రజాప్రస్థానంలో భాగంగా నేడు షర్మిల మూడోరోజు పాదయాత్ర వైఎస్‌ఆర్‌ జిల్లాలోని భూమయ్యగారి పల్లె క్రాస్‌ వద్దనుంచి ప్రారంభమై వేల్పులకు చేరుకుంటుంది. అక్కడినుంచి బెస్తవారి పల్లెకు, అక్కడినుంచి పులివెందుల ఆర్టీసి బస్టాండ్‌ సెంటర్‌కు చేరుకుంటుంది. అనంతరం బస్టాండ్‌ సెంటర్‌నుంచి పూల అంగళ్ల సర్కిల్‌ దాకా షర్మిల పాదయాత్ర కొనసాగుతుంది. ఆ తర్వాత రిషీ స్కూల్‌లో షర్మిల రాత్రికి బస చేస్తారు. 

అనంతలో 23నుంచి షర్మిల పాదయాత్ర


అనంతపురం : అనంతపురం జిల్లాలో వైఎస్ షర్మిల పాదయాత్ర షెడ్యూల్ ఖరారైంది. ఈనెల 23వ తేదీ నుంచి ఆమె మరో ప్రజాప్రస్థానం యాత్ర నిర్వహించనున్నారు. పులివెందుల నియోజకవర్గాన్ని పూర్తి చేసుకున్న అనంతరం దాడితోట వద్ద వైఎస్ షర్మిల అనంతలోకి ప్రవేశిస్తారు. 

సుమారు 14 రోజుల పాటు ధర్మవరం, రాప్తాడు, అనంతపురం, ఉరవకొండ, గుంతకల్లు నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించనున్నారు. మొత్తం 75 గ్రామాల.. పట్టణాల మీదుగా షర్మిల పాదయాత్ర జరిగేలా రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. షర్మిల పాదయాత్ర కోసం అనంత జనం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారని.. కనీవినీఎరుగని రీతిలో అనంతపురంలో పాదయాత్ర జరగనుందని వైఎస్‌ఆర్‌ సిపి నేత శంకర నారాయణ చెప్పారు.

source:sakshi

పత్తిపంటను పరిశీలించిన షర్మిల


వేముల : షర్మిల మరో ప్రజాస్థానం పాదయాత్రను మూడోరోజు వైఎస్ఆర్ జిల్లా భూమయ్యగారి పల్లె క్రాస్ నుంచి ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన అభిమానులు ఆమెకు ఘనస్వాగతం పలికారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ కూడా షర్మిల వెంట ఉన్నారు. భూమయ్యగారి పల్లె క్రాస్ ఆమె పత్తిపంటను పరిశీలించారు. ఈ సందర్బంగా రైతుల తమ గోడును చెప్పుకున్నారు.

source:sakshi

జనసంద్రంగా మారిన వేల్పుల


వేల్పుల : మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె షర్మిల రాకతో వేల్పుల జన సంద్రమైంది. మరో ప్రజాప్రస్థానం మూడోరోజు యాత్రలో వేల్పుల వచ్చిన ఆమెకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. దారిపొడవునా పూలవర్షం కురిపించారు. మహిళలు మంగళ హారతులు ఇచ్చారు. ఆత్మీయ స్వాగతం నడుమ వేల్పుల మీదుగా వైఎస్‌ షర్మిల ముందుకు సాగారు. ఆమె వెంట వైఎస్ విజయమ్మ, భారతి కూడా ఉన్నారు.

padhayatra images

అచ్చంగా రాజన్నలా..


హైదరాబాద్, న్యూస్‌లైన్: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు దేప భాస్కర్‌రెడ్డి ఆరు పాటలతో రూపొందించిన సీడీ ప్రజలను ఆకట్టుకుంటోంది. గురువారం రాత్రి వేంపల్లెలో వైఎస్సార్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ, షర్మిల ఈ పాట ల సీడీని ఆవిష్కరించారు. ‘‘అచ్చంగా రాజన్నలా.. ఉన్నడే జగనన్నా..’’ అనే పాట పాదయాత్రలో మార్మోగుతోంది. ‘‘ప్రస్థానం.. ప్రస్థా నం.. ప్రస్థానం... శర్మిలమ్మ చేపట్టిన మరో ప్రస్థానం..’’ పాటకు జనం నుంచి మంచి స్పందన వస్తోంది. కుర్చీ కోసం చంద్రబాబు ‘వస్తున్నా-మీ కోసం’ యాత్ర పేరుతో ప్రజలకు వద్దకు వచ్చి మొసలి కన్నీళ్లు కారుస్తుంటే.. ‘ఇందిరమ్మ బాట’ తో కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రజలను మోసం చేస్తున్నాడంటూ సాగే పాటలకు మంచి ఆదరణ వచ్చింది.

ఏ నోట విన్నా.. జగనే!

జగన్..! ఏ నోట విన్నా.. ఎవరిని కదిపినా ఇదే మాట!! మరో ప్రజాప్రస్థానం జగన్నామస్మరణతో మార్మోగుతోంది. పాదయాత్రలో పాల్గొనేందుకు వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన జనం తమ అభిమాన నేతను తలుచుకుంటున్నారు. కాంగ్రెస్, టీడీపీలు కుట్రపన్ని జైల్లో పెట్టినంత మాత్రాన జగన్‌ను తమ గుండెల్లోంచి తొలగించలేరని చెబుతున్నారు. ఎన్ని కుతంత్రాలు చేసినా చివరికి న్యాయమే గెలుస్తుందని, జగన్ త్వరలోనే తమ ముందుకు వస్తారని ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. ‘‘జగన్‌పై కక్షతోనే జైళ్లో పెట్టారు. వాళ్ల కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నారు. ఎన్ని కష్టాలొచ్చినా మేం మాత్రం వైఎస్ కుటుంబం వెంటే ఉంటాం’’ అని పాదయాత్రలో పాల్గొనేందుకు వచ్చిన తూర్పుగోదావరి జిల్లా అమలాపురానికి చెందిన శెట్టిబద్దుల రాజబాబు అని చెప్పారు. 

కాంగ్రెస్‌కు దమ్ముంటే జగన్‌ను రాజకీయంగా ఎదుర్కోవాలని, ప్రభుత్వం ఎన్నికలకు సిద్ధం కావాలని విశాఖపట్నానికి చెందిన ఝాన్సీ అన్నారు. ‘‘చంద్రబాబు అవిశ్వాసం పెట్టమంటే పెట్టడం లేదు. ఆ రెండు పార్టీలు కుమ్మక్కు అయ్యానడానికి ఇదే నిదర్శనం’’ అని ప్రకాశం జిల్లా నుంచి వచ్చిన సయ్యద్ గౌస్ పేర్కొన్నారు. ‘‘షర్మిలమ్మ పాదయాత్రకు ఎంతమంది జనం వచ్చారో చూశాక అయినా ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఇంతమంది జగన్ వైపు ఉంటే ఆయన తప్పు చేయలేదని ఇంతమంది నమ్ముతుంటే ఇంకెన్నాళ్లు జైల్లో పెడతారు..’’ అని వైఎస్సార్ జిల్లా పోట్లదుర్తికి చెందిన రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు.

గుండె చెబుతోంది.. పదం కలపమని!

‘‘చాలా దూరం.. ఒకటిన్నర రోజు ప్రయాణం.. 6 నెలలు.. 3 వేల కిలోమీటర్లు ఏదోఒక రోజు వెళ్లి పాదయాత్రలో పాల్గొనొచ్చులే అనుకున్నాం. కానీ మా గుండె మాత్రం మాట వినలేదు. షర్మిలమ్మ అడుగులో అడుగు కలపని చెప్పింది. అందుకే ఉండబట్టలేక వచ్చేశా..’ ఇదీ ఇతర జిల్లాల నుంచి పోటెత్తుతున్న జనం మాట!! షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానానికి తెలంగాణ జిల్లాలోని వరంగల్, కరీంనగర్, సిరిసిల్ల, మహబూబ్ నగర్‌తోపాటు చాలా ప్రాంతాల నుంచి ప్రజలు తరలివచ్చారు. కోస్తా నుంచి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, నెల్లూరు, ప్రకాశం, కృష్ణా.. ఇలా అన్ని ప్రాంతాల నుంచి ప్రజావాహిణి తరలివచ్చింది. ఇక రాయలసీమ జిల్లాల నుంచి జనం పెద్ద ఎత్తున పోటెత్తుతున్నారు.
- న్యూస్‌లైన్, కడప

జనంతో మమేకమవుతూ ముందుకు సాగిన వైఎస్ తనయ

కరెంటు ఇచ్చేంత ముందు చూపుకూడా లేదు 
రైతులకు న్యాయం చేయకుండా మొద్దునిద్ర పోతోంది
ఒక్క కొత్త పెన్షన్ కూడా మంజూరు చేయలేదు 
రాజన్న రాజ్యం మళ్లీ రావాలి.. అది జగనన్నతోనే సాధ్యం
కుమ్మక్కు రాజకీయాలకు నిరసన తెలపండి 
పాదయాత్రకు అడుగడుగునా బ్రహ్మరథం పట్టిన ప్రజలు
జనంతో మమేకమవుతూ ముందుకు సాగిన వైఎస్ తనయ

ఈ కన్నీళ్లు అబద్ధం చెబుతాయా?

కత్తులూరు పంచాయతీకి చెందిన మల్లకాని సిద్దయ్య కొడుకు శివ పాములూరు ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. పాదయాత్ర సాగుతుండగా గొర్రెలు కాస్తూ కనిపించాడు. ఆ పిల్లాడితో షర్మిల సంభాషణ ఇదీ..

షర్మిల: ఏం చిన్నా.. గొర్రెలు కాస్తున్నావ్?

శివ (కన్నీళ్లతో): మా నాన్నకు బాగోలేకుంటే నేను కాపలాకు వచ్చా. స్కూలుకు వెళ్లాలని ఉన్నా వెళ్లలేని పరిస్థితి. ఇక్కడ తిండి లేదు. పశువులకు మేత కూడా లేదు. అమ్మకు చెవుడు. పెన్షన్ కూడా రాదు. నాన్నకు బీపీ, షుగర్. పనికి వెళ్లలేడు. అన్న జేసీబీ మీద పనిచేస్తాడు. నాన్న బ్యాంకుకు వెళితే కనీసం లోను కూడా ఇవ్వలేదు.

షర్మిల: చూశారుగా.. ఈ కన్నీళ్లు అబద్ధం చెబుతాయా? చిన్న పిల్లాడు. చదువుకోవాల్సిన వయసు. ఈ ప్రభుత్వం అన్ని విధాలుగా విఫలమైందనడానికి ఇదొక ప్రత్యక్ష ఉదాహరణ. జగనన్న ఇలాంటి పిల్లలు చదువుకోవాలన్న ఉద్దేశంతో ‘అమ్మ ఒడి’ పథకం తెస్తానని చెప్పాడు. పిల్లలను బడికి పంపితే తల్లులకు నెలకు రూ.500 చొప్పున సాయం చేసే పథకం అది. ఏ సాయం చేయని ఈ ప్రభుత్వం మనకు అవసరమా? 

మరో ప్రజాప్రస్థానం నుంచి న్యూస్‌లైన్ ప్రత్యేక ప్రతినిధి: పేదల గోడు పట్టని ప్రభుత్వంపై, ప్రజాసమస్యలను గాలికొదిలేసిన ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశంపై దివంగత మహానేత వైఎస్ తనయ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల నిప్పులు చెరిగారు. ఈ ప్రభుత్వానికి కరెంటు ఇచ్చే ముందుచూపు కూడా లేదని, రైతులు కష్టాల ఊబిలో కూరుకుపోయినా మొద్దు నిద్ర వీడడం లేదని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజల కష్టాలు తీరాలంటే మళ్లీ రాజన్న పాలన రావాలని, అది జగనన్నతోనే సాధ్యమని ఉద్ఘాటించారు. రైతన్నలు, విద్యార్థులు, కార్మికులు, కూలీలు, మహిళలతో మమేకమవుతూ శుక్రవారం వైఎస్సార్ జిల్లాలో షర్మిల రెండోరోజు ‘మరో ప్రజాప్రస్థానం’ కొనసాగించారు. వెళ్లిన ప్రతిచోటా జనం షర్మిలతో తమ గోడు వెళ్లబోసుకున్నారు. కరెంటు కష్టాలు.. పింఛను వెతలు.. ఫీజుల వేదన.. ఇలా అనేక సమస్యలను ఆమెతో పంచుకున్నారు. వైఎస్ ఉన్నప్పుడు, ఇప్పుడు తమ పరిస్థితిని వివరించే ప్రయత్నం చేశారు. ఉదయం 9.50కి వేంపల్లి సమీపంలోని రాజీవ్‌నగర్ వద్ద పాదయాత్ర ప్రారంభమైంది.

యాత్ర ముందుకు సాగుతుండగా.. సయ్యద్ బీబీ అనే మహిళ తన బాధలు వివరించింది. వైఎస్ ఇచ్చిన ఇంట్లోనే ఉంటున్నానని, ఇప్పుడు నిలువ నీడైతే ఉంది గానీ కరెంటు బిల్లులతో, కరెంటు కోతలతో నిద్రే కరువైందని విలపించింది. ఇందుకు జగనన్న తొందర్లోనే మీ ముందుకు వస్తాడని, మళ్లీ రాజన్న రాజ్యం వస్తుందని చెబుతూ షర్మిల ఆమెను ఊరడించారు. అక్కడి నుంచి ముందుకు సాగుతుండగా వృద్ధ మహిళలు చాలామంది ఎదురొచ్చారు. రాజశేఖరరెడ్డి వల్లే తనకు పెన్షన్ వచ్చిందని ఒకరు.. మూడేళ్లుగా పెన్షన్ కోసం దరఖాస్తు పెట్టుకుంటూనే ఉన్నా ఇవ్వడం లేదని మరొకరు చెప్పారు. ‘‘చంద్రబాబు ఉన్నప్పుడు బియ్యం కార్డు ఉంటేనే సంఘంలో చేరనిచ్చేవారు. కానీ వైఎస్ రాజశేఖరరెడ్డి వచ్చాక అందరం చేరాం. పావలా వడ్డీ పథకం అందింది. కానీ ఇప్పుడు మాతో బలవంతంగా వడ్డీ కట్టించుకుంటున్నారు..’’ అని మరికొందరు మహిళలు షర్మిల ముందు ఆవేదన వ్యక్తంచేశారు.

కార్మికులు, వారి కుటుంబాలు ఏం కావాలి?

మార్గమధ్యంలో కత్తులూరు పంచాయతీ మహిళలు షర్మిలకు ఎదురేగి స్వాగతం పలికారు. ‘‘మాకు సాగునీరు లేక పొలాలు ఎండుతున్నాయి. కనీసం తాగునీరు కూడా లేదు. కరెంటైతే అసలే ఉండడం లేదు..’’ అని వాపోయారు. ఈ సందర్భగా షర్మిల మాట్లాడుతూ.. ‘‘కరెంటు ఎందుకు ఉండడం లేదో మీకు తెలుసా? ఈ ప్రభుత్వానికి ముందుచూపు లేదు. ప్రాజెక్టుల్లో నీళ్లు లేవని తెలుసు. కరెంటు సమస్య ఉందనీ తెలుసు. మరి కరెంటు ఎందుకు కొనుగోలు చేయలేదు. 

పొరుగు రాష్ట్రాలు ముందే కొనుక్కుని అక్కడ పరిశ్రమల పరంగా ఎలాంటి నష్టం లేకుండా ముందుకు వెళుతుంటే.. పారిశ్రామికంగా దూసుకుపోతుంటే.. ఇక్కడ మన ముఖ్యమంత్రి పరిశ్రమలను నెలలో సగం రోజులు మూసేసుకోమంటున్నారు. అలా అయితే వాటిలో పనిచేసే కార్మికులు ఏం కావాలి? వారి కుటుంబాలు ఏం కావాలి? మీరే చెప్పండి.. ఏం చేద్దాం? వైఎస్ ఉన్నప్పుడు ముందుచూపుతో విద్యుత్తు ప్రాజెక్టులు నిర్మించాలని తలపెడితే.. ఇప్పుడేమో ఉన్న ప్రాజెక్టులకు గ్యాస్ కూడా తేలేని పరిస్థితిని తెచ్చింది ఈ ప్రభుత్వం.. ఈ పాలకులకు రైతులంటే ఎంత నిర్లక్ష్యమో తెలుస్తోంది.. వాళ్లకు కావాల్సింది సీఎం కుర్చీ. ఢిల్లీకి వెళ్లి రావడం. టీడీపీ, కాంగ్రెస్‌లను నమ్మొద్దు..’’ అని మండిపడ్డారు. వికలాంగుడైన తన మనవడికి పెన్షన్ ఇవ్వడం లేదని ఓ వృద్ధురాలు విలపించగా.. ‘‘జగనన్న సీఎం అయితే కనీసం రూ.600లకు తగ్గకుండా వృద్ధాప్యంలో ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇస్తానన్నాడు.. అధైర్యపడకమ్మా.. మీకు ధైర్యం చెప్పేందుకే జగనన్న నన్ను పంపాడు..’ అని భరోసా ఇస్తూ షర్మిల ముందుకు కదిలారు.

మెస్ చార్జీలు రోజుకు రూ. 40 చొప్పున ఇవ్వాలి..

కత్తులూరు పంచాయతీ పరిధిలోని వేంపల్లి మైనారిటీ గర్ల్స్ ఏపీ రెసిడెన్షియల్ స్కూల్‌లో విద్యార్థులతో షర్మిల మాట్లాడారు. ‘కరెంటు లేదు. చదవుకోలేకపోతున్నాం. మెస్ చార్జీలు సరిపోవడం లేదు..’ అని వారు ఆందోళన వ్యక్తంచేయగా.. ‘‘మెస్ చార్జీలు రోజుకు రూ. 16.50 ఇస్తున్నారట. సబ్బులు, కాస్మొటిక్స్‌కు నెలకు రూ.50 ఇస్తున్నారట. మిగతావన్నీ దేవుడెరుగు. కనీసం తినడానికి రోజుకు రూ.40 చొప్పున మెస్ చార్జీలు చెల్లించాలని వైఎస్సార్‌సీపీ తరపున డిమాండ్ చేస్తున్నాం..’’ అని షర్మిల అన్నారు.

రోడ్డుపై కూర్చొని.. మహిళతో మాట్లాడి..

నందిపల్లి సమీపంలో భారీ సంఖ్యలో మహిళలు ఎదురేగి రోడ్డుపై కూర్చోవడంతో షర్మిల అక్కడే కూర్చుని వారితో ముచ్చటించారు. వృద్దురాలు లేచి ‘‘నాకు మోకాళ్ల నొప్పులు ఉన్నాయి. ఆపరేషన్ చేయాలని డాక్టర్లు చెబుతున్నారు. కానీ ఆరోగ్యశ్రీ కిందికి రాదట’’ అని చెప్పింది. ‘ఈ ప్రభుత్వానికి ప్రాణాలంటేనే లెక్కలేదు. 108నే ఆపేశారు. జగనన్న రాగానే ప్రతి పేదవాడి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకునే బాధ్యత తీసుకుంటాడు’’ అంటూ షర్మిల ఆమెకు భరోసానిచ్చారు. నందిపల్లి సమీపంలో పులివెందుల జేఎన్టీయూ కళాశాల విద్యార్థులు మాట్లాడుతూ.. ‘‘ఒక్క ప్లేస్‌మెంట్ కూడా దొరకని పరిస్థితి. ఈ కళాశాల వైఎస్ మానస పుత్రికగా పేరుగాంచింది. అలాంటిది అభివృద్ధికి నోచుకోకుండా పోయింది..’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘మీ తరపున పోరాడుతాం. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఎండగడతాం’’ అని షర్మిల వారికి హామీనిచ్చారు. తాళ్లపల్లి సమీపంలోని వేరుశనగ రైతుల వద్దకు వెళ్లిన షర్మిల వారి గోడు విని చలించిపోయారు. ‘‘కౌలు రైతులకు రుణాలు రావు. పంట నష్టపోతే పరిహారం అందదు. కనీసం ఎంత నష్టం వచ్చిందో కనుక్కునేందుకు అధికారులు రారు.. ఇలాంటి ప్రభుత్వం మనకు వద్దు. వైఎస్ ఉంటే ఈ నష్టాన్ని భర్తీ చేసేవారు’’ అని అన్నారు.

వైఎస్ వల్లే బతికిబట్టకట్టా..

దుగ్గన్నగారిపల్లి వద్ద నర్సింహారెడ్డి అనే విద్యార్థి షర్మిలతో మాట్లాడుతూ.. ‘‘నేను ఏరోనాటికల్ ఇంజనీరింగ్ పూర్తిచేశా. ఫస్టియర్ చదువుతున్నప్పుడు నాకు యాక్సిడెంట్ జరిగింది. ప్రాణాలు పోయే పరిస్థితి. కానీ 108 వల్ల సకాలంలో ఆసుపత్రికి చేరుకున్నా. చాలా ఖర్చయింది. సీఎం రిలీఫ్‌ఫండ్ కింద ఆ ఖర్చులన్నీ వైఎస్ భరించారు. వైఎస్ వల్లే బతికిబట్టకట్టా’’ అని చెప్పారు. 

రైతులపై కేసులు పెట్టిన ఘనత బాబుది..

పాదయాత్ర రాత్రికి వేములకు చేరుకుంది. అక్కడ భారీ జన సమూహాన్ని ఉద్దేశించి షర్మిల ప్రసంగించారు. తాను చూసిన వేరుశనగ రైతుల కష్టాలపై ఆవేదన చె ందానని, ఈ ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా, జగనన్నపై కుమ్మక్కు రాజకీయాలకు నిరసనగా నల్లబ్యాడ్జీలు ధరించి తనతోపాటు కదం తొక్కాలని పిలుపునిచ్చారు. ‘‘చంద్రబాబు సీఎం అయితే ఇక ఆత్మహత్యలే శరణ్యమని రైతులు భయపడుతున్నారు. కరెంటు చార్జీలు పెంచొద్దంటే రైతులను కాల్చిచంపిన ఘనత బాబుది. రైతు కుటుంబాలను పరామర్శించకుండా పోలీసులను పరామర్శించిన ఘనత ఆయనది. కరెంటు చార్జీల వసూళ్ల పేరుతో కేసులు పెట్టి రైతులను జైలులో పెట్టిన చంద్రబాబు ప్రభుత్వాన్ని గద్దె దింపినట్టుగానే.. ఇప్పుడు క రెంటు కూడా ఇవ్వకుండా చార్జీలు భారీగా పెంచిన ఈ ప్రభుత్వాన్ని కూడా గద్దె దింపాలి..’’ అని పిలుపునిచ్చారు. వేముల సమీపంలో ఏర్పాటు చేసిన బస స్థలానికి రాత్రి 7.50కి షర్మిల చేరుకున్నారు. రెండోరోజు మొత్తం 15 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగింది.

షర్మిలతో పాటు నడచిన విజయమ్మ..

వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ రెండోరోజు కూడా పాదయాత్రలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రతిఒక్కరికి అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. మధ్యాహ్న విరామ సమయానికి కొద్దిగా ముందు పాదయాత్ర నుంచి పక్కకు వచ్చిన విజయమ్మ.. తిరిగి మధ్యాహ్నం నుంచి సాయంత్రం 6.30 వరకు పాదయాత్రలో నడిచారు. ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి, పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి తదితరులు ఆరోగ్యం దెబ్బతింటుందని, కారులో రావాలని సూచించగా వేముల వరకు కారులో వచ్చారు. వేముల బహిరంగ సభలో విజయమ్మ కూడా పాల్గొన్నారు.

'కాలినొప్పి తగ్గేందుకే బాబు ఉపవాసం'

తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబునాయుడు చేనేత కార్మికుల కోసం ఒకపూట ఉపవాస దీక్ష చేస్తాననడాన్ని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఎద్దేవా చేశారు. చంద్రబాబు తన ఆరోగ్యం బాగోలేక వైద్యుల సలహామేరకు ఉపవాసం చేస్తున్నారేతప్ప చేనేత కార్మికులకోసం కాదన్నారు. ఆయన శుక్రవారం గాంధీభవన్లో మీడియాతో మాట్లాడుతూ... తొమ్మిదేళ్లు సీఎంగా, తొమ్మిదేళ్లు ప్రతిపక్షనేతగా ఉన్నన్నాళ్లూ గుర్తుకురాని చేనేత కార్మికులు బాబుకు ఇపుడు గుర్తుకొచ్చారా? అని ప్రశ్నించారు. బాబుకు కాలినొప్పి ఎక్కువైనట్లు పత్రికల్లో చూశానని, ఆ నొప్పితగ్గడానికి వైద్యులు చేసిన సూచనల్లో భాగంగానే ఉపవాసం చేస్తున్నట్లుగా ఉందని చెప్పారు. వైఎస్ రాజశేఖరరెడ్డి పేరును ఎఫ్‌ఐఆర్‌లో కాంగ్రెస్ చేర్పించదనడం సరికాదని చెప్పారు.
:sakshi

రాజన్నది రామరాజ్యం

వేంపల్లె, న్యూస్‌లైన్ : దివంగత నేత వైఎస్ తనయ షర్మిల చేపట్టిన పాదయాత్ర రెండవ రోజు శుక్రవారం వేంపల్లె రాజీవ్‌నగర్ కాలనీ సమీపం నుంచి ప్రారంభమైంది. రాజీవ్‌కాలనీ వద్దకు రాగానే పెద్ద ఎత్తున మహిళలు ఆమెకు ఘన స్వాగతం పలికారు. రాజన్న పాలనలో రామరాజ్యాన్ని తలపించిందని.. ప్రస్తుతం కిరణ్ పాలన రావణ రాజ్యాన్ని తలపిస్తోందని షర్మిల ఎదుట మహిళలు కన్నీటి పర్యంతమయ్యారు. ప్రస్తుతం తాము పడుతున్న ఇబ్బందులను ఆమెకు ఏకరువు పెట్టారు.

వైఎస్ పుణ్యమా అని ఇళ్లు కట్టించారని.. అయితే ప్రస్తుతం కరెంటు, నీరు సరిగా రావడంలేదన్నారు. పింఛన్లు, రేషన్‌కార్డులు సరిగా ఇవ్వలేదని మొరపెట్టుకున్నారు. అక్కడి నుంచి ఉర్దూ గురుకుల పాఠశాలకు షర్మిల చేరుకుని విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాగునీరు, కరెంటు సరిగా రావడంలేదని.. మెస్, కాస్మొటిక్ ఛార్జీలు పెంచాలని ఆమె దృష్టికి తెచ్చారు. అక్కడ నుంచి కత్తలూరు క్రాస్‌కు పాదయాత్ర చేరింది. ఇక్కడ స్థానిక మహిళలతో షర్మిల మాట్లాడారు.

నందిపల్లెకు పాదయాత్ర చేరుకోవడంతో వైఎస్‌ఆర్ సీపీ నాయకులు ఆర్‌ఎల్‌వీ ప్రసాద్‌రెడ్డి, కిషోర్, చిన్న, రామకృష్ణారెడ్డి, బయపురెడ్డి, చంద్ర ఓబుళరెడ్డి తదితరులు స్వాగతం పలికారు. ఇక్కడ మహిళా రైతు లక్ష్మిదేవి అరటి తోటను పరిశీలించారు. ఈ ప్రభుత్వం ఉన్నా.. లేకున్నా ఒకటేనని.. పంటలు సాగు చేయాలంటే భయమేస్తోందని ఆ రైతు తెలిపారు. ప్రభుత్వం పెడుతున్న కష్టాలను చూస్తే పురుగుల మందు తాగి చచ్చిపోవాలనిపిస్తోందని అలిరెడ్డిపల్లెకు చెందిన ఇందిరమ్మ, ఓబుళమ్మ, గంగమ్మ, శివరత్నమ్మ, తులశమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాలు లేక, కరెంట్ కోతలతో వేరుశనగ, పత్తి పంటలను తొలగిస్తున్నామని అమ్మగారిపల్లెకు చెందిన రామతులసి, ఆదర్శ రైతు రమణారెడ్డి, రామసుబ్బమ్మ, అయ్యవారిపల్లెకు చెందిన కోనమ్మ, గంగులమ్మ ఆమె దృష్టికి తెచ్చారు.

ప్రాణం ఎంతో విలువైందని.. జగనన్న పాలనలో మళ్లీ రామరాజ్యం తప్పక వస్తుందని.. అంతవరకు ఓపిగ్గా కష్టాలను ఎదుర్కొని నిలబడాలని షర్మిల భరోసా ఇచ్చారు. తర్వాత పులివెందుల జేఎన్‌టీయూ విద్యార్థులు తమ సమస్యలను ఆమె దృష్టికి తెచ్చారు. ఈ సమస్యలను జగనన్న దృష్టికి తీసుకెళతానని ఆమె తెలిపారు. ఆ తర్వాత నందిపల్లెలో రైతులు వైఎస్ హయాంలో 90శాతం వరకు పంటల బీమా రాగా.. ప్రస్తుతం వాతావరణ బీమాను ప్రవేశపెట్టడంతో వేంపల్లె మండలానికి 0.5శాతం వచ్చిందని వాపోయారు. పాదయాత్ర తాళ్లపల్లెకు రాగానే స్థానికులు షర్మిలపై పూల వర్షం కురిపించారు. తర్వాత ముసల్‌రెడ్డిగారిపల్లె మీదుగా అమ్మయ్యగారిపల్లె ప్రాంతంలో బస చేసే ప్రాంతానికి వెళ్లి సేద తీరారు. మళ్లీ 5గంటలకు పాదయాత్ర ప్రారంభమై చాగలేరు క్రాస్, వి.కొత్తపల్లె, వేముల వరకు కొనసాగింది.
పాదయాత్రతో బాబుకు ఒళ్లు నొప్పులే
- ఎమ్మెల్యే గొల్ల బాబురావు

పాదయాత్రతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు తలనొప్పి, ఒళ్లు నొప్పులు, దురద, కీళ్లు నొప్పులు తప్పా ఎలాంటి ప్రయోజనం ఉండదని వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ ఎమ్మెల్యే గొల్ల బాబురావు అన్నారు. షర్మిల పాదయాత్రలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. కాంగ్రెస్, టీడీపీలను ప్రజలు విశ్వసించడంలేదని.. త్వరలోనే ఎన్నికలు రావడం తథ్యమని జోస్యం చెప్పారు.
ప్రజల కష్టాలను తెలుసుకునేందుకే పాదయాత్ర
- ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి

షర్మిల ప్రజల కష్టాలను తెలుసుకునేందుకు పాదయాత్ర చేస్తోందని ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి పేర్కొన్నారు. నందిపల్లె వద్ద ఆయన ‘న్యూస్‌లైన్’తో మాట్లాడారు. ఎన్‌టీఆర్ హయాంలో మద్యాన్ని నిషేధిస్తే.. చంద్రబాబు మళ్లీ మద్యం షాపులను కొనసాగించాడన్నారు.
వెన్నుపోటు చరిత్ర బాబుది
- ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి

మామను వెన్నుపోటు పొడిచిన చరిత్ర చంద్రబాబుదని కొవ్వూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి అన్నారు. పాదయాత్రలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ షర్మిల పాదయాత్ర చరిత్రలోనే సువర్ణధ్యాయంగా నిలిచిపోతుందన్నారు.
జగన్‌తోనే రాజన్న రాజ్యం
- మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్

రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఎక్కడ చూసినా వైఎస్‌ఆర్‌సీపీ గాలి వీస్తోందని.. జగనన్నతోనే రాజన్న రాజ్యం సాధ్యమని వైఎస్‌ఆర్ సీపీ కేంద్ర పాలక మండలి సభ్యులు, మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. పాదయాత్రలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. చంద్రబాబు ప్రజలు విశ్వాసం ఎప్పుడో కోల్పోయారని పేర్కొన్నారు.
కాంగ్రెస్, టీడీపీలను ప్రజలు నమ్మరు
మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి
కాంగ్రెస్, టీడీపీలను ప్రజలు నమ్మరని.. ప్రజల ఆదరణ చూస్తే వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీకి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి పేర్కొన్నారు. మాట్లాడుతూ చంద్రబాబు చేసే పాదయాత్రను ప్రజలు విశ్వసించడంలేదని పేర్కొన్నారు.
ప్రజా విశ్వాసం కోల్పోయారు
- బాజిరెడ్డి గోవర్ధన్

సీఎం కిరణ్, టీడీపీ నేత చంద్రబాబు ప్రజా విశ్వాసం కోల్పోయారని వైఎస్‌ఆర్ సీపీ కేంద్ర పాలక సభ్యుడు బాజిరెడ్డి గోవర్ధన్ దుయ్యబట్టారు. రెండు రోజులుగా షర్మిల పాదయాత్రలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. ప్రజా సమస్యలను గాలికి వదిలేసి చంద్రబాబు సీఎం పదవి కోసం వెంపర్లాడుతుంటే.. కిరణ్ తన పదవిని నిలుపుకొనేందుకు ఆగచాట్లు పడుతున్నారన్నారు.
జగన్ సీఎం కావడం తథ్యం
- మాజీ మేయర్ రవీంద్రనాథరెడ్డి

ఎప్పుడు ఎన్నికలొచ్చినా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో విజయ ఢంకా మోగించి జగన్ సీఎం కావడం తథ్యమని కడప మాజీ మేయర్ రవీంద్రనాథరెడ్డి అన్నారు. పాదయాత్రలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ పాదయాత్రకు వచ్చిన జనాన్ని చూసిన ఇతర పార్టీల్లో గుబులు ప్రారంభమైందని అన్నారు.
పాదయాత్రకు నీరాజనాలు
- వైఎస్ అవినాష్‌రెడ్డి

షర్మిల పాదయాత్రకు గ్రామ గ్రామాన నీరాజనాలు పలుకుతున్నారని వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా యూత్ అధ్యక్షుడు వైఎస్ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పాదయాత్ర విజయవంతంగా సాగిపోతోందన్నారు.
కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కు
ప్రొద్దుటూరు ఇన్‌ఛార్జి రాచమల్లు ప్రసాద్‌రెడ్డి
కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై ప్రజల సమస్యలను పెడచెవిన పెట్టాయని వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడు రాచమల్లు ప్రసాద్‌రెడ్డి తెలిపారు. ఆయన మాట్లాడుతూ జగన్ ముఖ్యమంత్రి కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నట్లు ఆయన వివరించారు.
- న్యూస్‌లైన్, పులివెందుల/వేముల

అదే జోరు..జనహోరు.. జనంతో మమేకం


అదే జోరు..జనహోరు.. జనంతో మమేకం అవుతూ మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ షర్మిల శుక్రవారం రెండోరోజు ‘మరో ప్రజా ప్రస్థానం’ పాదయాత్రను ప్రారంభించారు. చిరునవ్వులతో చిన్నారులను పలకరించారు. విద్యార్థినులకు, వికలాంగులకు ధైర్యం చెప్పారు. మహిళలపై ఆప్యాయత చూపారు. వృద్ధులకు భరోసా కల్పించారు. 

అన్నదాతల అగచాట్లను కళ్లారా చూశారు. కాయలు లేని వేరుశనగ కట్టెను పరిశీలించారు. వారి కష్టాలను విని చలించిపోయారు. పాలకుల దమన నీతిని ఎండగట్టారు. పాలక, ప్రతిపక్షాలు కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. త్వరలో రాజన్న రాజ్యం వస్తుందని, కష్టాలన్నీ తీరుతాయని భుజం తట్టారు. 

కడప, న్యూస్‌లైన్ ప్రతినిధి: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్రకు రెండో రోజు శుక్రవారం నాడు అపూర్వ ఆదరణ లభించింది. 15 కిలోమీటర్లు సాగినయాత్రలో సమస్యలను చెప్పుకునేందుకు పల్లెజనం పోటీపడ్డారు. 

వేంపల్లె సమీపం నుంచి మొదలైన పాదయాత్ర మండల కేంద్రమైన వేములకు చేరుకుని ముగిసింది. వైఎస్‌ఆర్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, కేంద్రపాలకమండలి సభ్యులు వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్‌రెడ్డి, ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, శ్రీనివాసులు, ప్రసన్నకుమార్‌రెడ్డి, గొర్ల బాబూరావు, శోభా నాగిరెడ్డి, మాజీ మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్యే పిల్లిసుభాష్‌చంద్రబోస్, ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, ఎమ్మెల్సీ శేషుబాబు, నాయకులు బాజిరెడ్డి గోవర్దన్, అంబటి రాంబాబు, ప్రసాదరాజు, రఘురామిరెడ్డి తదితరులు వెంటరాగా ఉదయం 10 గంటలకు పాదయాత్ర ప్రారంభమైంది. 

15 నిమిషాల్లోపు రాజీవ్‌కాలనీకి చేరుకున్నారు. కాలనీవాసులంతా ఒక్కసారిగా వారి గోడును వెళ్లబోసుకున్నారు. రాజన్న లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వివరించారు. దీంతో షర్మిల వారికి ధైర్యం చెప్పారు. అనంతరం ఏపీ బాలికల గురుకుల పాఠశాలకు 10.45 గంటలకు చేరుకున్నారు. ఈ సందర్భంగా అక్కడి విద్యార్థులు తమ ఇబ్బందులను మొరపెట్టుకున్నారు. స్పందించిన షర్మిల జగనన్న నాయకత్వంలో రాజన్నరాజ్యం వస్తుందని, అప్పటిదాకా ధైర్యంగా ఉండాలని కోరారు. అక్కడి నుంచి కత్తులూరు క్రాస్‌కు చేరుకున్నారు. 

సమస్యలు వినలేని స్థితిలో ప్రభుత్వం.. గుర్తించలేని స్థితిలో ప్రతిపక్షం
కత్తులూరు క్రాస్‌కు చేరుకున్న షర్మిల మాట్లాడుతూ సమస్యలు వినలేని స్థితిలో ప్రభుత్వం ఉందని, గుర్తించలేని స్థితిలో ప్రతిపక్షం ఉందని విమర్శించారు.

రాజన్న రాజ్యం వస్తుందని, జగనన్న త్వరలో మీ ముందుకు వస్తాడని వారిలో ధైర్యం నింపారు. అక్కడి నుంచి 12.50కు నందిపల్లెకు చేరుకుని వేరుశనగ పంటను పరిశీలించారు. ఆ గ్రామస్తులు షర్మిలకు చక్కభజనతో స్వాగతం పలికారు. వారితో చర్చించిన ఆమె 1.20 గంటలకు తాళ్లపల్లె గ్రామం చేరుకున్నారు. ఆ గ్రామస్తులు చెండుమల్లె పూల బాట వేసి షర్మిలను నడిపించారు. అనంతరం ఆమె 1.40 గంటలకు ముసల్‌రెడ్డిపల్లెకు చేరుకున్నారు. 

అలాగే 1.45 గంటలకు సుద్దన్నగారిపల్లె క్రాస్, 2.00 గంటలకు అమ్మయ్యగారిపల్లె సమీపంలో ఏర్పాటు చేసిన మధ్యాహ్న భోజన విడిదికి చేరుకున్నారు. అలాగే సాయంత్రం 4.45 గంటలకు తిరిగి ప్రారంభమైన పాదయాత్ర 5.00 గంటలకు అమ్మయ్యగారిపల్లె, 5.20 గంటలకు చాగలేరు క్రాస్, 5.30 గంటలకు వి.కొత్తపల్లెకుచేరుకుని 5.50 గంటలకు సమీపంలోని వేరుశనగ పంటను పరిశీలించారు. 6.30 గంటలకు గొందిపల్లె క్రాస్, 7.10 గంటలకు వేముల బహిరంగసభలో మాట్లాడి 7.45 గంటలకు వేముల సమీపంలో బస చేసే ప్రాంతానికి చేరుకున్నారు.

దుష్టశక్తులుండాయి జాగ్రత్త తల్లీ!
‘సువర్ణ పాలన అందించే మహానేత అర్ధంతరంగా చనిపోయారు.. జనంకోసం పరితపించే జగనన్న జైలుపాలయ్యారు... దుష్టశక్తులు తిరుగుతున్నాయి..జాగ్రత్త తల్లీ! ధైర్యంగా ఎదుర్కొలేరు, దొంగ దెబ్బ తీస్తారు.’ అంటూ పులివెందుల ఆడబిడ్డ షర్మిలకు పల్లె ప్రజలు హెచ్చరించారు. ‘తండ్రిని ఎదుర్కోలేని దుష్టులు అర్ధంతర మృతికి కారకులయ్యారు.. జనం మెప్పు పొందిన జగన్‌మోహన్‌రెడ్డిని జైలుపాలు చేశారు..’ మిమ్మల్ని కూడా దెబ్బతీస్తారమ్మా.. జాగ్రత్తలు తీసుకోండి’ అంటూ సూచనలు చేశారు. అందుకు షర్మిల స్పందిస్తూ మీ అండ ఉన్నంతకాలం, రాజన్నను అభిమానించే హృదయం ఉన్నంతకాలం మమ్మల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరని అన్నారు. 

పూలబాటలతో స్వాగతం
రాజన్న బిడ్డ పల్లెల వెంబడి వస్తున్నట్లు తెలుసుకున్న జనం ఎర్రనీళ్ల దిష్టి తీస్తూ, హారతులిస్తూ ఆమె నడిచి వెళ్లే దారిలో పూలను పర్చి పూలబాట ఏర్పాటు చేశారు. ఆ బాటకు ఇరువైపులా గ్రామీణులు నిల్చున్నారు. వారి అభిమానానికి షర్మిల ముగ్దులై అభివాదం చేస్తూ ముందుకు సాగారు. రెండోరోజు పాదయాత్రలో మహిళా విభాగం అధ్యక్షురాలు కొల్లి నిర్మలాకుమారి, రైతు విభాగం అధ్యక్షుడు నాగిరెడ్డి, ఐటీ విభాగం అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, డాక్టర్స్ విభాగం అద్యక్షుడు శివభారత్‌రెడ్డి, కడప మాజీమేయర్ రవీంద్రనాథ్‌రెడ్డి, దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు వైఎస్ అవినాష్‌రెడ్డి, అంజాద్‌బాష, జమ్మలమడుగు మాజీ మున్సిపల్ చైర్మన్ తాతిరెడ్డి సూర్యనారాయణరెడ్డితోపాటు జిల్లా ముఖ్య నేతలు పాల్గొన్నారు.

అన్ని పంటలు నాశనమయ్యాయి
పత్తి పంట పూర్తిగా ఎండిపోయింది. ఖరీఫ్‌లో అన్ని పంటలు నాశనమయ్యాయి. ఇన్స్యూరెన్స్ వస్తాదనుకుంటే వాతావరణ ఆధారిత బీమా పెట్టి మా కొంప ముంచారు. ఎకరాకు రూ.450 వస్తాంది. రాజశేఖరరెడ్డి హయాంలో మూడు సంవత్సరాలు వరుసగా 90 శాతానికి పైగా ఇన్స్యూరెన్స్ ఇచ్చారు. 
- రమణారెడ్డి, ఆదర్శరైతు

పనులు లేక అల్లాడుతున్నాం
అమ్మా! మాకు రాజశేఖరరెడ్డి ఇల్లు కట్టించారు.. ఆయన పుణ్యాన నీడపాటున నిద్రపోతున్నాం... మంచినీళ్లు లేవంటే జగనన్న రూ.15 లక్షలతో పైపులైను ఏర్పాటు చేయించారు. వ్యవసాయ కూలీలకు పోయేవాళ్లం. పనుల్లేక అల్లాడుతున్నాం.
- రేవతి రమాదేవి, పులివెందుల

మెస్ ఛార్జీలు చాలడం లేదు 
అక్కా! తాగేందుకు నీళ్లు లేవు. ఎటూ చాలకుండా మెస్ ఛార్జీలు ఇస్తాండారు. చదువుకునేందుకు పెద్దాయన మంచి భవనాలు కట్టించాడు. ఎం లాభం ఇప్పుడేమో కరెంటు ఉండడం లేదు.
- ఉర్దూ బాలికల పాఠశాల విద్యార్థినులు

తిండిగింజలు కూడా పండటం లేదు 
తల్లీ! పంటలు పోయినాయి. బోర్లలో నీళ్లు లేవు. అక్కడక్కడ నీళ్లొస్తాంటే తిండి గింజలకోసం సాగు చేసుకున్నాం. ఆ పంటలు కూడా అందే పరిస్థితి లేదు. ఇప్పుడేం చేయాల్నో దిక్కు తెల్లా! మీ నాయన కాలంలో అందరం బాగున్నాం. మూడేళ్లుగా నెత్తీనోరు కొట్టుకుంటున్నాం.
- లోడమ ఇందిరమ్మ, కొవ్వూరు 

ఓబులమ్మ, కత్తులూరు
ఆత్మహత్యలే శరణ్యం 
రూ.2.50 లక్షలు పెట్టుబడి పెట్టాం తల్లీ! వేరుశనగ పంటంతా ఎండిపోయింది. పశువుల మేతకుగానీ పనికి రాదు. అప్పుడేమో రామరాజ్యం చూసినాం. ఇప్పుడు రావణరాజ్యం చూస్తున్నాం. పురుగుల మందు తాగి చచ్చిపోవాలని ఉంది.
- రామతులసి, కత్తులూరు

Special edition on Maro Praja Prasthanam Padayatra

Written By news on Friday, October 19, 2012 | 10/19/2012

Sharmila speech @Maro Prajaprasthanam at Vemula

Maro Praja Prasthanam Padayatra in Duggannagari palli at YSR dist

Anantapur MLA Gurunath Reddy comments on TDP and Congress

YSRCP Leader Konathala Ramakrishna press meet at YSRCP Office

'పాదయాత్ర తర్వాత పెనుమార్పులు'

అనంతపురం : షర్మిల పాదయాత్ర తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు ఖాయమని అనంతపురం ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి అన్నారు. ఆమె పాదయాత్రకు వస్తున్న స్పందన చూసి ఇప్పటికే తెలుగుదేశం-కాంగ్రెస్ పార్టీలు ఆత్మరక్షణలో పడ్డాయని ఆయన శుక్రవారమిక్కడ వ్యాఖ్యానించారు. 

బాబు పాదయాత్రకు డబ్బులిచ్చినా జనం రావటం లేదని గుర్నాథరెడ్డి విమర్శించారు. బాబు పాదయాత్రకు....షర్మిల పాదయాత్రకు నక్కకూ....నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు. బాబు చేసేది రాజకీయ యాత్ర అయితే... షర్మిల ప్రజల సమస్యల కోసం పాదయాత్ర చేస్తున్నారన్నారు.

http://www.sakshi.com/Main/Breakingstory.aspx?catid=471878&Categoryid=14&subcatid=0

Sharmila's Maro Prajaprasthanam reach Tallepalle

Konda Surekha comments on Maro Praja prasthanam

Sharmila with Vempalle People in Maro Praja Prasthanam

Sharmila's maro prajaprasthanam reach Nandhi palle

షర్మిల పాదయాత్ర రాజకీయాలలో ఒక సంచలనం


షర్మిల పాదయాత్ర రాష్ట్ర రాజకీయాలలో ఒక సంచలనం కానుందని వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. ఇది ఒక చరిత్రాత్మక పాదయాత్ర అని ఆయన శుక్రవారం ఉదయం 'సాక్షి' టీవీలో జరిగిన ఒక చర్చాకార్యక్రమంలో వ్యాఖ్యానించారు.
''ఆనాడు చేవెళ్లలో వైయస్‌ చేసిన ప్రజాప్రస్థానం చూశాం. అప్పటి కన్నా కూడా షర్మిల పాదయాత్రకు ప్రజాదరణ ఎక్కువగా కనిపిస్తోంది. ఇడుపుల పాయలో నిన్న హాజరైన జనసంఖ్యను అంచనా వేయడం కూడా సాధ్యం కాదు. ఇంతగా ప్రజాదరణ రావడానికి కారణం కాంగ్రెస్‌, టిడిపిల కుమ్మక్కు రాజకీయాలు" అని రాంబాబు అన్నారు. ఆనాడు చంద్రబాబు పాలన తీరుతెన్నులకు విసిగి ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులకు భరోసా ఇవ్వడానికి వైయస్ పాదయాత్ర చేశారు. కాగా చంద్రబాబు రాష్ట్ర రాజకీయాలను తనవైపుకు మళ్లించుకోవడానికి ఇప్పుడు పాదయాత్ర తలపెట్టారు." అని ఆయన విశ్లేషించారు.
"విజయమ్మ ప్రసంగిస్తూ, రాజశేఖర్‌ రెడ్డి బిడ్డల్లో ఒకరు జైలులో ఉంటే, ఒకరు రోడ్డుపై ఉన్నారనీ వారిని ఆదరించండి అన్నారు. ఇవి మానవీయ స్పర్శ ఉన్నవారందర్నీ కదిలించే మాటలు" అని ఆయన వ్యాఖ్యానించారు. షర్మిల రాజకీయాల కోసం రావడం లేదనీ తాను కొన్ని ప్రత్యేకపరిస్థితుల వల్ల పాదయాత్ర చేస్తున్నానీ వివరించారన్నారు. నిజానికి ఈ యాత్ర జగన్మోహన్‌ రెడ్డి చేయాల్సిందనీ, తాను జగనన్న వదిలిన బాణాన్ని అని షర్మిల చెప్పడంలో ఉద్దేశ్యం ఇదేననీ రాంబాబు వివరించారు. ఎంతగా జగన్‌ను అణచడానికి యత్నిస్తిస్తే అంతగా ఎగసి పైకి లేస్తారన్నది  షర్మిల పాదయాత్రకు వచ్చిన జన ప్రభంజనంతో మరోసారి రుజువైందని ఆయన అన్నారు. షర్మిల ఏ హోదాలో పాదయాత్ర చేస్తున్నారన్న విమర్శకు బదులిస్తూ జనం దగ్గరకు వెళ్లడానికి హోదా ఎందుకండీ అని కొట్టిపారేశారు. "ఇదేమీ చంద్రబాబు యాత్రకు పోటీ కాదు, దీని పేరే మరో ప్రజాప్రస్థానం. రాజశేఖర్ రెడ్డి గారే పాదయాత్రతో రాజకీయాలను మలుపుతిప్పారు. షర్మిల పాదయాత్ర కూడా రాజకీయాలలో సంచలనం కాబోతుంది. తండ్రి పాదయాత్ర రికార్డును బద్దలు కొడుతుంది. కాంగ్రెస్, టిడిపిల కుట్రలను ఛేదించే దిశగా సాగుతుంది. ఆశీర్వదించండని తెలుగుప్రజలందర్నీ కోరుతున్నా" అని రాంబాబు విజ్ఞప్తి చేశారు.

నిద్ర నటిస్తున్న ఈ ప్రభుత్వాన్ని లేపుదాం: షర్మిల
రైతన్న కోసం నాన్న ఎప్పుడూ తపించేవారు.


వానలు వస్తున్నా విద్యుత్‌ లేదు. నిద్ర లేదు. రోడ్లు లేవు. ప్రజల జీవితం దుర్భరంగా మారిపోయింది. ప్రజల సమస్యలు పట్టించుకోకుండా ఈ ప్రభుత్వం నిద్ర నటిస్తోంది. నిద్రపోతున్నవారినన్నా లేపవచ్చు, కానీ నిద్ర నటిస్తున్నవారిని లేపలేం. మరో ప్రజాప్రస్థానం రెండవరోజు శుక్రవారం పాదయాత్ర ప్రారంభిస్తూ యాత్రలో పాల్గొన్న, యాత్రను చూసేందుకు వేలాదిగా తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి షర్మిల మాట్లాడారు. వైయస్‌ఆర్ జిల్లా వేంపల్లె శివారులోని రాజీవ్‌నగర్ కాలనీ నుంచి ప్రారంభించారు. షర్మిల పాదయాత్రకు స్వాగతం పలికేందుకు ప్రజలు, అభిమానులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.

‌దివంగత మహానేత, తన తండ్రి డాక్లర్ వైయస్ రాజశేఖరరెడ్డి అధికారంలో ఉన్నా, లేకున్నా ‌నిరంతరమూ రైతుల సంక్షేమం కోసమే ఆలోచించేవారని షర్మిల పేర్కొన్నారు. ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవటం వల్లే రాష్ట్రంలో విద్యుత్ కొరత సమస్య ముప్పుగా పరిణమించిందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల్లో అస్సలు విద్యుత్తే ఉండని పరిస్థితి నెలకొన్నదని ఆమె విచారం వ్యక్తం చేశారు. విద్యుత్‌ సమస్య కారణంగా ప్రజలు కనీసం కంటినిండా నిద్రపోయే పరిస్థితి లేదన్నారు. కాంగ్రెస్, ‌టిడిపిలను నమ్ముకుంటే మనల్ని నట్టేట ముంచుతాయని షర్మిల హెచ్చరించారు. మన కష్టాలు తీర్చి, కన్నీళ్ళు తుడిచే రాజన్న రాజ్యం వస్తేనే విరుగుడు లభిస్తుందని తెలిపారు. జగనన్న సారథ్యంలో రాజన్న రాజ్యం తప్పకుండా వస్తుందని భరోసా ఇచ్చారు. రాజన్న రాజ్యం కావాలంటే జగనన్నను ఆశీర్వదించండి. అందరూ కుట్ర పన్ని జగనన్నను జైలు పాలు చేశారు. సమయం వచ్చినప్పుడు వారికి బుద్ధిచెప్పండి అని షర్మిల పిలుపునిచ్చారు.
నందిపల్లెలో విద్యార్థులను కలిసిన ఆమె వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అంతకు ముందు షర్మిల బస చేసిన ప్రాంతం జనంతో కళకళలాడింది.

http://www.ysrcongress.com/news/news_updates/sharmila_padayatra_rajakeeyalalo_oka_sanchalanam.html

రెండవ రోజు పాదయాత్ర 19 కిలోమీటర్లు

హైదరాబాద్‌, 19 అక్టోబర్ 2012 : షర్మిల శుక్రవారం వైయస్‌ఆర్‌ జిల్లాలోని పలు గ్రామాల మీదుగా పాదయాత్ర చేయనున్నారు. ఉదయం 9.30 గంటల ప్రాంతంలో వేంపల్లె శివారులోని రాజీవ్ నగర్ కాలనీ నుండి ప్రారంభమయ్యే రెండవ రోజు పాదయాత్ర  మొదచ నందిపల్లె (3.5 కి.మీలు) చేరుకుంటుంది. అక్కడి నుండి 1.8 కిలోమీటర్ల దూరంలోని తాళ్లపల్లె మీదుగా సాగుతుంది. ఆ తర్వాత ముసల్‌రెడ్డిగారిపల్లె నుండి 1.2 కి.మీల దూరాన ఉన్న దుగ్గన్నగారిపల్లె దిశగా సాగుతుంది. దుగ్గన్నపల్లె నుండి 1.5 కి.మీ సాగి అమ్మయ్యగారిపల్లె చేరుకుంటుంది. అక్కడి నుండి 0.6 కి.మీ నడతి వి.కొత్తపల్లె మీదుగా 3 కిలోమీటర్ల దూరాన ఉన్న గొందిపల్లె క్రాస్ వైపునకు సాగుతుంది. అక్కడి నుండి  మరో 1.5 కిలోమీటర్లు నడచి షర్మిల వేముల చేరుకుంటారు. వేముల నుండి 4.7 కిలోమీటర్లు సాగి భూమయ్యగారి పల్లె క్రాస్ వద్దకు నడుస్తారు. అక్కడే రెండో రోజు విశ్రాంతి.  రెండో రోజు షర్మిల మొత్తం 19 కి.మీలు పాదయాత్ర చేస్తారు. షర్మిల యాత్రకు సంఘీభావం తెలపాలని వైఎస్‌ఆర్ సీపీ సమీపగ్రామాల ప్రజలకు విజ్ఞప్తి చేసింది.

http://www.ysrcongress.com/news/news_updates/rendavaroju_padayatra_19_kilometarlu.html

Sharmila speech @Maro Prajaprasthanam at Rejivnagar colony

Kadapa Gadapalo Maro Prajaprasthanam

Sharmila seconday Maro Prajaprasthanam starts

మీ వెనుకే మేముంటామంటూ...


మీ వెనుకే మేముంటామంటూ లక్షలాది గొంతుకల ధ్వనులు ఇడుపులపాయలో ప్రతిధ్వనించాయి. మహానేత వైఎస్ కుమార్తె షర్మిల చేపట్టిన ‘మరోప్రజాప్రస్థానం’కు ముక్తకంఠంతో జేజేలు పలికారు. దారిపొడవునా మహిళలు, వృద్ధులు, వికలాంగులు అభివాదం చేస్తూ .. నాన్నను మరిపిస్తూ షర్మిల ముందుకు సాగారు. ‘జగనన్న వదిలిన బాణాన్ని నేను’ అంటూ పాలక, ప్రతిపక్ష నేతలకు కలవరం పుట్టించారు. నా బిడ్డలను మీకే అప్పగిస్తున్నానని విజయమ్మ చేసిన ఉద్వేగ ప్రసంగం కంటతడిపెట్టించింది. తొలిరోజు 15 కిలోమీటర్ల మేర షర్మిల పాదయాత్ర కొనసాగింది.

కడప, న్యూస్‌లైన్ ప్రతినిధి : జనాలతో ఇడుపులపాయ పోటెత్తింది. దారులన్నీ ఇడుపులపాయవైపే మళ్లాయి. లక్షలాది మంది ఇడుపులపాయకు చేరుకున్నారు. మండుటెండలో లక్షలాది పాదాలు ఏకమై షర్మిల పాదయాత్రలో అడుగు వేశాయి. ఉదయం 10.30 గంటలకు ఇడుపులపాయ వైఎస్‌ఆర్ ఘాట్‌కు చేరుకున్న వైఎస్ విజయమ్మ, తనయ షర్మిలమ్మ, కోడలు భారతి, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి మహానేత వైఎస్ ఘాట్ వద్ద ప్రార్థనలుచేశారు. అనంతరం హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మత పెద్దల ఆశీస్సులను షర్మిల అందుకున్నారు. అక్కడే ఉన్న వైఎస్‌ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం వేదిక మీదకు చేరుకున్న వైఎస్ విజయమ్మ ఉద్వేగంగా ప్రసంగించారు.

తన కుమారుడు, కడప ఎంపీ వైఎస్ జగన్‌ను తలచుకుని కన్నీటిపర్యంతమయ్యారు. అనంతరం షర్మిల మాట్లాడారు. ‘నేను జగన్ ఎక్కుపెట్టిన బాణాన్ని’ అనగానే అశేష జనం హర్షధ్వానాలు ప్రకటించారు. ప్రభుత్వం, ప్రతిపక్షం కుఠిల రాజకీయాలను ఎండగడుతూ ప్రజాపక్షాన పోరాటం చేసేందుకు సామాన్య కార్యకర్తగా, జగనన్న చెల్లెలిగా, రాజన్న బిడ్డగా మీ ముందుకొస్తున్న నన్ను ఆశీర్వదించండని కోరారు. సభ అనంతరం పాదయాత్రగా ట్రిపుల్‌ఐటీకి చేరుకున్నారు. అక్కడ విద్యార్థులతో మాటామంతీ నిర్వహించారు. ట్రిపుల్ ఐటీ విద్యార్థుల అవస్థలను చూసి చలించిపోయారు.

తల్లడిల్లిన మాతృమూర్తి
‘ప్రజల మనిషి, జన హితుడు నా భర్త మృతి చెందారు. ఇద్దరు బిడ్డలుంటే ఒక బిడ్డను జైలుపాలు చేశారు. చాలా బాధగా ఉంది. జగన్ చేయాల్సిన యాత్ర ఇది. ఇంకోబిడ్డ రోడ్డుమీదికి రావాల్సి వచ్చింది’ అని గద్గద స్వరంతో వైఎస్ విజయమ్మ అనగానే సభా ప్రాంగణం మూగబోయింది. మీరంతా మా పక్షం ఉన్నారనే ధైర్యంతో నా బిడ్డను మీకప్పగిస్తున్నా. జగన్‌బాబు లాగే నా బిడ్డను మీరు ఆశీర్వదించాలని కోరడం విజయమ్మ తల్లి మనస్సుకు అద్దం పట్టింది.

చిన్నబుచ్చుకున్న సూర్యుడు
సూర్యభగవానుడు ప్రకోపించి ప్రకాశిస్తున్నాడు. అయినప్పటికీ ఇడుపులపాయకు జనం లక్షలాదిగా బారులు తీరారు. ట్రాఫిక్ స్తంభించినా నడక మార్గంలో ఇడుపులపాయకు చేరుకున్నారు. జనపోటును చూసిన సూర్యుడు చిన్నబుచ్చుకున్నాడు. అభిమానుల ముందు తలవంచుకున్నాడు. మధ్యాహ్నం 2.30 గంటల తర్వాత సాయంత్రపు వరకూ ప్రకాశిస్తున్న సూర్యుడు మేఘాల చాటుకు వెళ్లిపోయాడు. వాతావరణం మేఘావృతమైంది.

లక్షలాది పాదాలు కలిసిన వేళ...
ఇడుపులపాయలో ప్రారంభమైన పాదయాత్ర లక్షలాది పాదాల సవ్వడిలతో 13 కిలోమీటర్ల మేర సుదీర్ఘంగా వేంపల్లె నాలుగు రోడ్ల కూడలి వరకు సాగింది. వీరన్నగట్టుపల్లె, కుమ్మరాంపల్లె, వేంపల్లె వాసులు షర్మిలను చూసేందుకు ఆరాటపడ్డారు. పూల జల్లులు కురిపిస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. పాదయాత్రకు రాష్ట్రం నలుమూలల నుంచి అభిమానులు తరలించారు.

స్తంభించిన ట్రాఫిక్
ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన మరో ప్రజాప్రస్థానం కార్యక్రమానికి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అభిమానులు భారీగా తరలివచ్చారు. రాష్ట్ర నలుమూలల నుంచి చేరుకోవడంతో వాహనాల రద్దీతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. పోలీసు యంత్రాంగం పక్కా ప్రణాళిక చేపట్టకపోవడంతో పది కిలోమీటర్ల మేర ఆరు గంటలపాటు ట్రాఫిక్ జాం అయింది. ఒక డీఎస్పీ, ఆరుగురు సీఐలు, 16 మంది ఎస్‌ఐలు, 300 మంది పోలీసులు బందోబస్తు చేపట్టినా ట్రాఫిక్‌ను కంట్రోల్ చేయలేకపోయారు.


Sharmila with people in Maro Prajaprasthanam

వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లోకి చింతలపూడి ఎమ్మెల్యే!

వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లోకి మళ్లీ వసలలు ఆరంభం అయ్యేలా ఉంది. తాజాగా పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి కాంగ్రెస్ శాసనసభ్యుడు ఎమ్.రాజేష్ కుమార్ కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లో కి రావడానికి రంగం సిద్దం చేసుకున్నారు. చింతలపూడిలో కాంగ్రెస్ క్యాడర్ అంతా వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ వైపు వెళ్లడంతో తనకు ఆ పార్టీలోకి వెళ్లక తప్పదని ఆయన బావిస్తున్నారు. అదీకాక ఆ ప్రాంతంలో నాయకుడుగా ఉన్న కరాటం బాబూరావు ఇప్పటికే వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లోకి రావడంతో రాజేశ్ కూడా దీనిపై నిర్ణయానికి వచ్చారని అంటున్నారు. కాగా గతంలోనే ఈయన ఈ పార్టీలోకి రావాలని భావించినా, కొన్ని కారణాల వల్ల ఆగిపోయారు.రాజేశ్ ను వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఎప్పుడు రాజీనామా ప్రకటన చేయమంటే అప్పుడు ప్రకటన చేయవచ్చు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్.పి ఇంద్ర కిరణ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్పలు కూడా కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పారు. ఇక జగన్ పార్టీలో చేరడమే తరువాయి.

http://kommineni.info/articles/dailyarticles/content_20121019_4.php

2 senior Congress leaders to join YSRC


As Sharmila started her padayatra at Idupulapaya, the Congress suffered a jolt as two of its senior leaders including District Central Cooperative Bank chairman Karatam Rambabu and Chinthalapudi MLA Maddala Rajesh hinted at joining the YSR Congress in West Godavari on Thursday.
The two leaders, along with their supporters, held a meeting at Vegavaram village of Jangareddygudem mandal, during which they expressed their intention to join the YSR Congress.
Rambabu was unhappy when he failed to get the nomination of his choice to contest in the Polavaram bypolls.

http://www.deccanchronicle.com/channels/nation/south/2-senior-congress-leaders-join-ysrc-529

I beseech you to march alongside Sharmila! : YS Bharathi

Special edition on "Jagananna Vadilina Bananni"

అడుగడుగునా ఘన స్వాగతం

Written by Rajababu On 10/19/2012 2:50:00 AM
మీ వెనుకే మేముంటామంటూ లక్షలాది గొంతుకల ధ్వనులు ఇడుపులపాయలో ప్రతిధ్వనించాయి. మహానేత వైఎస్ కుమార్తె షర్మిల చేపట్టిన ‘మరోప్రజాప్రస్థానం’కు ముక్తకంఠంతో జేజేలు పలికారు. దారిపొడవునా మహిళలు, వృద్ధులు, వికలాంగులకు అభివాదం చేస్తూ .. నాన్నను మరిపిస్తూ షర్మిల ముందుకు సాగారు. మండుటెండలో లక్షలాది పాదాలు ఏకమై షర్మిల పాదయాత్రలో అడుగు వేశాయి. ఉదయం 10.30 గంటలకు ఇడుపులపాయ వైఎస్‌ఆర్ ఘాట్‌కు చేరుకున్న వైఎస్ విజయమ్మ, తనయ షర్మిలమ్మ, కోడలు భారతి, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి మహానేత వైఎస్ ఘాట్ వద్ద ప్రార్థనలుచేశారు. అనంతరం హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మత పెద్దల ఆశీస్సులను షర్మిల అందుకున్నారు. అక్కడే ఉన్న వైఎస్‌ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.

అనంతరం వేదిక మీదకు చేరుకున్న వైఎస్ విజయమ్మ ఉద్వేగంగా ప్రసంగిస్తూ... ‘ప్రజల మనిషి, జన హితుడు నా భర్త మృతి చెందారు. ఇద్దరు బిడ్డలుంటే ఒక బిడ్డను జైలుపాలు చేశారు. చాలా బాధగా ఉంది. జగన్ చేయాల్సిన యాత్ర ఇది. ఇంకోబిడ్డ రోడ్డుమీదికి రావాల్సి వచ్చింది’ అని గద్గద స్వరంతో వైఎస్ విజయమ్మ అనగానే సభా ప్రాంగణం మూగబోయింది. మీరంతా మా పక్షం ఉన్నారనే ధైర్యంతో నా బిడ్డను మీకప్పగిస్తున్నా. జగన్‌బాబు లాగే నా బిడ్డను మీరు ఆశీర్వదించాలని కోరడం విజయమ్మ తల్లి మనస్సుకు అద్దం పట్టింది అని అన్నారు.

అనంతరం షర్మిల మాట్లాడారు. ‘జగనన్న వదిలిన బాణాన్ని నేను’ అంటూ పాలక, ప్రతిపక్ష నేతలకు కలవరం పుట్టించారు. గురువారం వైఎస్ తనయ షర్మిల చేపట్టిన పాదయాత్రకు అడుగడుగునా ఘన స్వాగతం లభించింది. ఇడుపులపాయ నుంచి ట్రిపుల్ ఐటీ, మారుతినగర్, వీరన్నగట్టుపల్లె, కుమ్మరాంపల్లె వరకు విజయమ్మ పాదయాత్రలో ముందుకు సాగారు. ముందుగా షర్మిల ట్రిపుల్ ఐటీ విద్యార్థుల కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. అక్కడ అపూర్వ స్వాగతం లభించింది. డప్పు వాయిద్యాలు, బాణ సంచా నడుమ వారికి పూల వర్షం కురిపించారు. వేంపల్లె బైపాస్, నాలుగు రోడ్ల కూడలి మీదుగా పాదయాత్ర కొనసాగింది. పాదయాత్ర మధ్యాహ్న భోజన విరామ సమయానికి కుమ్మరాంపల్లెకు చేరుకుంది. అక్కడ నుంచి పాదయాత్ర ప్రారంభించగానే.. కుమ్మరాంపల్లె, వేంపల్లె వద్ద వరుణదేవుడు చిరుజల్లులు కురిపించి షర్మిల పాదయాత్రను ఆశీర్వదించారు.

షర్మిలతోపాటు పాదయాత్రలో పాల్గొన్న వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సతీమణి వైఎస్ భారతిరెడ్డికి ఇడుపులపాయలో అభిమానులు, పార్టీ కార్యకర్తలు హారతులు పట్టారు. ఆమెతో కరచాలనం చేసేందుకు ఎగబడ్డారు. ఆమె కూడా అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగారు. వీరన్నగట్టుపల్లె వరకు ఆమె పాదయాత్రలో పాల్గొని వెళ్లిపోయారు. ఇ.సి.గంగిరెడ్డి, వైఎస్ అవినాష్‌రెడ్డి, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి, దివంగత వైఎస్ జార్జిరెడ్డి సతీమణి వైఎస్ భారతమ్మ పాదయాత్రలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు షర్మిలతో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు.

ఇడుపులపాయలో మిట్టమధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైన మరో ప్రజా ప్రస్థానం ఆర్‌కే వ్యాలీ, వీరన్నగట్టుపల్లె, కుమ్మరాంపల్లె, రాజారెడ్డినగర్, చింతలమడుగుపల్లె మీదుగా వేంపల్లె నాలుగు రోడ్ల కూడలి నుంచి రాజీవ్ కాలనీ వద్ద ఏర్పాటు చేసిన గూడారాల దగ్గరికి చేరడంతో తొలిరోజు యాత్ర ముగిసింది. తొలి రోజున సుమారు 15 కిలోమీటర్ల యాత్ర షెడ్యూల్ మేరకు కొనసాగింది.

లక్షలాది పాదాలు స్వచ్ఛందంగా ఒక్క చోట

ఓ మహాద్భుత ఘట్టం..
లక్షలాది పాదాలు స్వచ్ఛందంగా ఒక్క చోట
చేరిన సందర్భం..
జాతరా?.. తిరునాళ్లా?.. లేక ఒక
మహోత్సవమా ఇది?- అని వేన వేల కళ్లు
ఆశ్చర్యపోయిన సందర్భం..
ఎవ్వరూ పేరు పెట్టి పిలవకున్నా..
బీదాబిక్కీ, పేదా పెద్దా.. కూలీ, హమాలీ.. ప్రతి వర్గం
కదం తొక్కుతూ కదిలొచ్చాయి..
ఈ పాదయాత్ర మాది అనుకుంటూ లక్షలాది
పాదాలూ ఒక్కటై ముందుకు కదిలాయి..
యాత్ర సాగిన 15 కిలోమీటర్ల మేర చేయీ చేయీ కలిసి
అపురూప దృశ్యాన్ని ఆవిష్కరించాయి..
పాదయాత్రకొచ్చేవారి కోసం ఏర్పాట్లేవీ లేకున్నా..
నీళ్లు దొరకకున్నా.. తిండి తినకున్నా..
ఎన్ని గంటలైనా.. ఎంత ఎండైనా..
ఒక్క మనిషీ వెనుతిరగలేదు..
మా కోసమే కదా.. మా పాదయాత్రే కదా అన్న మాటే
ప్రతి నోటా! 


మరో ప్రజాప్రస్థానం నుంచి న్యూస్‌లైన్ ప్రత్యేక ప్రతినిధి: ప్రజల్ని పీల్చి పిప్పి చేస్తోన్న ప్రభుత్వ వైఖరికి, దానితో కుమ్మక్కయిన తెలుగుదేశం పార్టీ కుట్ర రాజకీయాలకు నిరసనగా వైఎస్సార్ కుమార్తె షర్మిల చేపట్టిన ‘మరో ప్రజా ప్రస్థానం’ పాదయాత్ర గురువారం మహా జాతరలా ప్రారంభమైంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తరఫున ఆయన సోదరి చేస్తున్న ఈ యాత్రకు అభిమానసందోహం స్వచ్ఛందంగా, ఉప్పెనలా తరలివచ్చింది. లక్షలాది మంది ఆత్మీయ నేస్తాల నడుమ షర్మిల ఇడుపులపాయలో తండ్రి పాదాల చెంత పాదయాత్ర ప్రారంభించారు.

జగనన్న నాయకత్వంలో రాజన్న రాజ్యం మళ్లీసాధ్యమంటూ నినదించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడమే ఈ ‘మరో ప్రజా ప్రస్థానం’ ధ్యేయమన్నారు. చేతగాని ప్రభుత్వాన్ని ఎందుకు దించడం లేదంటూ ప్రతిపక్ష పార్టీని నిలదీయడమే లక్ష్యమన్నారు. ప్రజాపక్షాన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిలుస్తుందని మాట ఇచ్చారు. ప్రజా క్షేమాన్ని పాలకులు గాలికి వదిలేసినప్పుడు మహానేత అడుగులతో ‘ప్రజా ప్రస్థానం’ పుడితే.. ప్రజాసంక్షేమ స్వప్నాలు కళ్ల ముందే కూలుతుంటే ఈ ‘మరో ప్రజా ప్రస్థానం’ పుట్టిందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

మహానేతకు నివాళులర్పించి..
3 వేల కిలోమీటర్ల మేర సాగే ఈ సుదీర్ఘ పాదయాత్రను గురువారం వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలో ఉదయం 11.45కి వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ జెండా ఊపి ప్రారంభించారు. అంతకుముందు ఉదయం 10.25కు విజయమ్మ, వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సతీమణి వై.ఎస్.భారతితో కలిసి రాజశేఖరరెడ్డి సమాధి వద్ద ఆయనకు నివాళులర్పించారు. సర్వమత ప్రార్థనలు జరిపారు. అనంతరం అక్కడే ఉన్న వేదికపైకి 10.58కి చేరుకున్నారు. 

యాత్రకు స్వచ్ఛందంగా తరలివచ్చిన లక్షలాది మంది అభిమానుల చప్పట్ల హోరు మధ్య విజయమ్మ ‘మరో ప్రజా ప్రస్థానం’లో తొలి ప్రసంగం చేశారు. నాడు చంద్రబాబు హయాంలో ప్రభుత్వ ఘోర వైఫల్యం కారణంగా వైఎస్ ప్రజాప్రస్థానం చేపడితే.. నేడు కిరణ్ సర్కారు వైఫల్యాన్ని ఎండగట్టేందుకు మరో ప్రజాప్రస్థానం చేపట్టాల్సి వచ్చిందని వివరించారు. తన హయాంలో ఏమీ చేయలేని చంద్రబాబు ఇప్పుడు మోసపు మాటలు చెబుతున్నారని, అధికార కాంగ్రెస్‌ను నిలబెట్టేందుకు ఆ పార్టీతో కుమ్మక్కయ్యారని విశదీకరించారు. అనంతరం షర్మిల మాట్లాడుతూ తాను జగనన్న వదిలిన బాణాన్ని అని ఉద్వేగంగా పేర్కొన్నారు.

విద్యార్థులతో ముచ్చటించి..
సరిగ్గా 11.45కు షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’లో అడుగు ముందుకేశారు. తల్లి విజయమ్మ, వదిన భారతి, పార్టీ నేతలు కొండా సురేఖ, శోభానాగిరెడ్డి, రోజా, వాసిరెడ్డి పద్మ, కొల్లి నిర్మలాకుమారి తదితరులు కదం కలపగా ప్రజాప్రస్థానంలో ముందుకు కదిలారు. తొలుత ట్రిపుల్ ఐటీకి వెళ్లారు. అక్కడ విద్యార్థులతో ముచ్చటించారు. అక్కడి విద్యార్థులు షర్మిలకు తమ బాధలు విన్నవించారు. ‘మాకు బోధన సిబ్బంది లేరు. అభివృద్ధి అసలే లేదు. వైఎస్ చనిపోయాక మమ్మల్ని పట్టించుకున్నవారే లేరు’ అని ఒక విద్యార్థి ఆవేదన వ్యక్తంచేశారు. ‘బోధన సిబ్బందికి అనుభవం లేదు. బీటెక్, ఎంటెక్‌లతో ఇక్కడ బోధన చేయిస్తున్నారు..’ అని మరో విద్యార్థిని వివరించారు. 

‘ల్యాబ్, ఫ్యాకల్టీ లేకుండా వట్టి సర్టిఫికెట్లతో మేం రేపు సమాజానికి ఏం ఒరగబెడతాం?’ అంటూ మరో విద్యార్థి ఆవేదన వెళ్లగక్కారు. ‘1:30 ఫ్యాకల్టీ ఉండాలి.. కానీ ఇక్కడ అలా లేదు. వైఎస్ ఉన్నప్పుడు నెలకోసారి ఇక్కడికి వచ్చేవారు. మేం పేదోళ్లమని ఇప్పుడు ఎవరూ పట్టించుకోవడం లేదు. గ్రామీణ ప్రాంతాల నుంచి ఎంపికైన మమ్మల్ని ఇలా నిర్లక్ష్యంగా వదిలేస్తే ఎలా’ అంటూ ప్రశ్నించారు. దీనికి షర్మిల స్పందిస్తూ ‘వీళ్లు గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వారనేనా ఇంత నిర్లక్ష్యం? నగర విద్యార్థులతో సమానంగా నెగ్గుకురావాలనే సదుద్దేశంతో ట్రిపుల్ ఐటీలు పెట్టారు. గొప్ప ఇంజనీర్లుగా తీర్చిదిద్దాలన్న ఆశయంతో పెట్టారు. రాజశేఖరరెడ్డి తరచూ వచ్చేవారని విద్యార్థులు చెబుతున్నారు. 

ఇప్పుడు ఎందుకు ఇంత చిన్నచూపు చూస్తున్నారు? వీరంతా బీదవారేననా? గ్రామీణులనేనా? మనకు రాజన్న రాజ్యం మళ్లీ రావాలి. జగనన్నతోనే రాజన్న రాజ్యం సాధ్యం. వైఎస్సార్‌సీపీకి మీ మద్దతు కావాలి. మీ మేలు కోరుతూ సెలవు తీసుకుంటున్నా..’ అంటూ అక్కడి నుంచి బయలుదేరారు. ఎండ వేడిలోనూ వడివడిగా అడుగులు వేశారు. ఇడుపులపాయ నుంచి వేంపల్లి మెయిన్‌రోడ్డు ఎక్కేసరికి ఆ రోడ్డుపై ఇరువైపులా బారులు తీరిన లక్షలాది జనం స్వాగతాలు పలికారు. కేరింతలు కొట్టారు. బంతిపూల వర్షం కురిపించారు. విజయమ్మ, షర్మిల, వైఎస్ భారతిని చూసేందుకు పోటీలు పడుతూ పరుగులుపెట్టారు.

10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్..
ఇడుపులపాయ నుంచి వేంపల్లి వైపు సాగుతున్న పాదయాత్రలో లక్షలాది మంది జనం భాగస్వాములవడంతో ట్రాఫిక్ జామైంది. ఇడుపులపాయ నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న వీరన్నగట్టుపల్లి వద్ద వంతెన ఉండడం, అక్కడ ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు సిబ్బంది లేకపోవడం, వేలాది వాహనాలు రావడంతో ట్రాఫిక్ జామైంది. మరోవైపు ఇడుపులపాయ నుంచి మధ్యాహ్న భోజన స్థల వేదిక అయిన కుమ్మరాంపల్లి వరకు 7 కిలోమీటర్ల పొడవునా జనం సాగుతూనే ఉన్నారు. కుమ్మరాంపల్లికి అవతల 3 కిలోమీటర్ల వరకు జన ఉప్పెన పోటెత్తుతూనే ఉంది. మధ్యాహ్నం 2.20కి కుమ్మరాంపల్లి చేరుకున్న షర్మిల భోజనానికి ఉపక్రమించారు. తిరిగి సాయంత్రం 4.30 గంటలకు మళ్లీ పాదయాత్ర ప్రారంభించారు. కుమ్మరాంపల్లి దాటాక మదర్‌థెరిస్సా ట్రస్టుకు చెందిన వృద్ధులతో ముచ్చటించారు. వరిసాగు రైతులతో మాట్లాడి కష్టసుఖాలు తెలుసుకున్నారు. తమలపాకు తోట రైతులతో మాట్లాడారు.

ప్రస్తుతం పంటల పరిస్థితులను రైతులకు వివరించారు. ఎరువుల ధరలు, కరెంటు కోత, భూగర్భజలాలు ఎండిపోవడం వంటి సమస్యలను ఏకరువు పెట్టారు. గిట్టుబాటు ధర లేదని తమలపాకు రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. ఆకు తోటలను నిలువునా కొట్టివేస్తున్నామని కన్నీటిపర్యంతమయ్యారు. తరువాత వేంపల్లి దిశగా ముందుకు సాగారు. మార్గం మధ్యలో మహిళలు, వృద్ధులతో మాట్లాడుతూ సాయంత్రం 6.30కు వేంపల్లి నాలుగు రోడ్ల కూడలికి చేరుకున్నారు. ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అక్కడి నుంచి రాజీవ్‌కాలనీ సమీపంలో ఉన్న రాత్రి బసకు 8.20 గంటలకు చేరుకున్నారు. షర్మిల ఇడుపులపాయ నుంచి కుమ్మరాంపల్లి వరకు 7 కిలోమీటర్లు, అక్కడి నుంచి వేంపల్లెలో బస స్థలం వరకు 8 కిలోమీటర్లు తొలిరోజు మొత్తం 15 కిలోమీటర్లు నడిచారు.

నేటి పాదయాత్ర షెడ్యూల్ ఇదీ..

వేంపల్లె(వైఎస్‌ఆర్ జిల్లా), న్యూస్‌లైన్: దివంగత నేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి తనయ, వై.ఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల శుక్రవారం జిల్లాలోని పలు గ్రామాల మీదుగా పాదయాత్ర చేయనున్నారు. ఉదయం 9.30 గంటల ప్రాంతంలో వేంపల్లె శివారులోని రాజీవ్ నగర్ కాలనీ నుండి రెండవ రోజు పాదయాత్ర ప్రారంభిస్తారు. రాజీవ్‌నగర్ కాలనీ, నందిపల్లె, తాళ్లపల్లె,ముసల్‌రెడ్డిగారిపల్లె, దుగ్గన్నగారిపల్లె, అమ్మయ్యగారిపల్లె, వి.కొత్తపల్లె మీదుగా వేముల వరకు పాదయాత్ర కొనసాగించనున్నారు. ఆయా గ్రామాల నుంచి నాయకులు, మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చి సంఘీభావం తెలపాలని వైఎస్‌ఆర్ సీపీ విజ్ఞప్తి చేసింది.

పాఠకులకు విన్నపం (sakshi)

మీ అందరి దీవెనలతో నాలుగున్నరేళ్ల క్రితం ఆవిర్భవించిన నాటినుంచీ ‘సాక్షి’ నిఖార్సయిన వార్తలకు, నిష్పాక్షికమైన వ్యాఖ్యలకు పెట్టింది పేరయింది. మీ కుటుంబ ఆత్మీయ నేస్తమయింది. సమాజ శ్రేయస్సుకు, తెలుగు కుటుంబాల సౌభాగ్యానికీ, మనో వికాసానికి ఊపిరులూదింది. ప్రభుత్వపరంగా ఎన్ని సవాళ్లు ఎదురవుతున్నా, అధికారంలో ఉన్నవారు ఎంతగా ఇబ్బందులు పెడుతున్నా మీ అందరి సహకారంతో, మీ అందరి అండదండలతో వాటన్నిటినీ తట్టుకుంటూ... నమ్మిన విలువల విషయంలో రాజీపడకుండా ఆరంభమైన రోజునుంచీ అనునిత్యం దేవుని దయతో, మీ అందరి దీవెనలతో పురోగమిస్తూనే ఉంది. 

ఇటీవలికాలంలో కేంద్ర ప్రభుత్వ విధానాల కారణంగా అయితేనేమి, అంతర్జాతీయ పరిస్థితుల వల్ల అయితేనేమి.. ద్రవ్యోల్బణం అన్ని రంగాలనూ కుంగదీస్తోంది. అన్నింటి ధరలూ చుక్కలనంటాయి. ఎంతగానంటే... హైదరాబాద్‌లో కప్పు టీ ధర రూ.10కి చేరుకుంది. ద్రవ్యోల్బణమూ, నిలకడగా లేని రూపాయి.. న్యూస్‌ప్రింట్ ధరలో ఎగుడు దిగుళ్లను సృష్టిస్తున్నాయి. రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న కరెంటుకోత డీజిల్ వాడక తప్పని పరిస్థితులు కల్పిస్తే... దాని ధర సైతం ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇతరత్రా ఖర్చులపై కూడా దాని ప్రభావం పడింది. ఫలితంగా నిర్వహణా వ్యయం సైతం అమితంగా పెరిగింది. పత్రికా నిర్వహణ మోయలేని భారంగా మారింది.

పత్రికా సంస్థల ప్రతినిధులంతా వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని వార్తాపత్రికల ధరను పెంచడం తప్ప మరో మార్గం లేదని అన్నప్పుడు అందరితో పాటు మనం కూడా గళం కలపవలసి వస్తుండటం నాకు చాలా బాధ కలిగించింది. కష్టం అనిపించింది. ఎందుకంటే.. జగన్ పూర్తిగా ప్రజలతో మమేకమై వ్యాపారాల కోసం సమయం కేటాయించలేని పరిస్థితుల్లో, దాదాపు రెండేళ్ల క్రితం నేను ఈ పత్రికను నడిపే బాధ్యతను స్వీకరించాను. అప్పటికే జగన్ కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టడంతో ఆ వెంటనే కక్ష సాధింపు చర్యలు మొదలయ్యాయి. ఆదాయ పన్ను నోటీసులు ఇచ్చారు. కోర్టు కేసులు వేశారు. సీబీఐని రంగంలోకి దింపారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) చేత కూడా విచారణ కొనసాగించారు. కనీవినీ ఎరుగని విధంగా...బహుశా దేశంలోనే మొదటిసారి షేర్లపై వచ్చిన ప్రీమియంపై పన్ను కట్టాల్సిందిగా ఆదాయ పన్ను అధికారులు ‘సాక్షి’కి నోటీసులు ఇచ్చారు. 

ఇవాళ చంద్రబాబు మొదలుకొని రామోజీరావు వరకూ...జీఎంఆర్ నుంచి జీవీకే, అంబానీ వంటి దిగ్గజాల వరకూ ఎవరైనా వారి వారి కంపెనీల షేర్లను ప్రీమియంకు అమ్మినప్పుడు వాటిని ఆదాయ పన్ను విభాగం మూలధన వసూళ్లు (కేపిటల్ రిసీట్స్)గానే పరిగణించి ఆయా సంస్థలకు గతంలో ఎప్పుడూ నోటీసులు కూడా ఇవ్వలేదు. కానీ, ‘సాక్షి’తో మాత్రం అధికారులు చెలగాటం ఆడుతూ ఇప్పటికే మాచేత బలవంతంగా రూ.40 కోట్ల మేరకు కట్టించారు. దీనిపై ఇన్‌కమ్ ట్యాక్స్ ట్రిబ్యునల్‌లో పోరాటం చేస్తున్నాం. మరోవైపు ఈడీని ఎగదోస్తూ ‘సాక్షి’ ఆస్తులను జప్తు చేయిస్తున్న సంగతీ తెలిసిందే. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ‘ఈనాడు’ రూ.100 విలువైన షేర్లను ఒక్కొక్కటి రూ.5,28,630 చొప్పున ప్రీమియంకు అమ్మితే, ‘సాక్షి’ రూ.10 విలువగల షేర్లను ఒక్కొక్కటి రూ.350 చొప్పున ప్రీమియంకు అమ్మింది. ఆ షేర్లను కూడా ఒక్కొక్కరికి ఒక్కో ధరకు కాకుండా అందరికీ ఒకే ధరకు అమ్మడం జరిగింది. 

‘సాక్షి’ ఖాతాలను సీబీఐ స్తంభింపజేసినప్పుడు పత్రిక నడపడానికి, సిబ్బంది జీతాలకు ఇబ్బంది వస్తుందని కోర్టుల వరకూ వెళ్లి పోరాడవలసి వచ్చింది. ‘సాక్షి’లో పెట్టుబడులు పెట్టదల్చుకున్నవారిని సీబీఐ భయభ్రాంతులను చేస్తోంది. బ్యాంకులు సైతం రుణాలిచ్చేందుకు వెనకడుగువేస్తున్నాయి. ఇటు రాష్ట్ర ప్రభుత్వమేమో ‘సాక్షి’కి వాణిజ్య ప్రకటనలు ఇవ్వొద్దంటూ ఏకంగా జీవోలే జారీ చేస్తోంది. ఆ జీవోలపై కోర్టుకు వెళ్లి పోరాటం చేస్తున్నాము. ఇన్ని పోరాటాల మధ్య, ఇంతటి వ్యతిరేక పరిస్థితుల మధ్య... వీటికి తోడు అమాంతం పెరిగిపోయిన నిర్వహణా వ్యయం వల్ల గత్యంతరంలేని పరిస్థితుల్లో మేము కూడా మిగిలినవారితో గళం కలపక తప్పలేదు. ఇక్కడ మీ అందరికీ కొన్ని విషయాలు విన్నవించాలి. ‘సాక్షి’లో ఏనాడూ జగన్‌కానీ, నేనుగానీ కనీసం ఒక్క రూపాయి జీతం కూడా తీసుకోలేదు. షేర్లు అమ్మిన విలువ కూడా ‘సాక్షి’ సంస్థలోనే ఉంది. ఏజెంట్ల నుంచి పత్రికను ఇంటింటికీ చేర్చే పేపర్ బాయ్ వరకూ, విలేకరుల నుంచి సబ్ ఎడిటర్‌ల వరకూ, ఆ పత్రికను బయటకు తీసే చిన్న కార్మికుడి వరకూ.. ‘సాక్షి’పై ఆధారపడే కుటుంబాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 30,000 పైనే.

సాధారణ పరిస్థితుల్లోనే వార్తా పత్రిక ప్రచురణకయ్యే ఖర్చు దాని అమ్మకం విలువకంటే చాలా ఎక్కువ. వార్తాపత్రికలను పాఠకులకు అందించేది సబ్సిడీపైనే. సమాచారాన్ని సాధ్యమైనంత తక్కువ ధరలో, అందరికీ అందుబాటులో ఉండేలా అందించాలన్న మా సంకల్పానికి... ప్రత్యేకించి మమ్మల్ని లక్ష్యంగా చేసుకుని సాగుతున్న వేధింపులతో పాటు ఇతర పరిణామాలు అవరోధంగా నిలిచాయి. ఇక విధిలేని పరిస్థితుల్లో.. ఈ అనూహ్య భారంలో కొంత మొత్తాన్ని మిగిలిన దినపత్రికలతో పాటు మేము కూడా పాఠక సోదరులకు పంచక తప్పడం లేదు. ఈ నిర్ణయానికి దారితీసిన పరిస్థితుల్ని సహృదయంతో, పెద్ద మనసుతో మీరు అర్థం చేసుకుంటారని, ‘సాక్షి’ని ఎప్పటిలా మీ కుటుంబ భాగస్వామిగా, మీ బిడ్డగా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, దేవుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను.

మీ....
వై.ఎస్. భారతి,
చైర్‌పర్సన్, ‘సాక్షి’ 

ఇకపై రోజూ సాక్షి పత్రిక ధర నాలుగు రూపాయలు ఉంటుంది.
శనివారం నుంచి ఈ ధర అమలులోకి వస్తుంది. ప్రత్యేక అనుబంధం
వచ్చే ఆదివారం సంచిక వెల మాత్రం ఐదు రూపాయలు.

పాఠక మహాశయులు గమనించగలరు.0

రాజన్న కూతురిగా, జగనన్న చెల్లెలిగా, పార్టీ సైనికురాలిగా....


‘‘నేను జగనన్న వదిలిన బాణాన్ని... వైఎస్ కూతురిగా, జగన్ చెల్లెలిగా, వైఎస్సార్ సీపీ సైనికురాలిగా ఈ ప్రస్థానాన్ని మొదలుపెడుతున్నా. ఈ యాత్ర జగనన్న చేయాల్సింది. జగనన్న రాలేని కారణంగా నన్ను పంపాడు. వైఎస్‌ను అభిమానించే ప్రతి గుండె, జగనన్న నాయకత్వంలో రాజన్న రాజ్యం మళ్లీ సాధ్యమని నమ్మే ప్రతి ఒక్కరూ నన్ను ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నా’’
- పాదయాత్ర ప్రారంభోపన్యాసంలో షర్మిల 

* రాజన్న కూతురిగా, జగనన్న చెల్లెలిగా, పార్టీ సైనికురాలిగా ఈ ప్రస్థానాన్ని మొదలు పెడుతున్నా
* జగనన్న నాయకత్వంలో రాజన్న రాజ్యం మళ్లీ సాధ్యమని నమ్మే ప్రతి ఒక్కరూ నన్ను ఆశీర్వదించండి
* రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను అన్నివిధాలా క్షోభ పెడుతోంది
*రైతులను వేధిస్తోంది.. రాష్ట్రంలో ఘోరమైన విద్యా సంక్షోభం నెలకొంది
* ఈ ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన ప్రతిపక్షం మూడేళ్లుగా చోద్యం చూస్తోంది
* ఈ అసమర్థ ప్రభుత్వాన్ని ఎండగట్టడం, దాన్ని దించేయని టీడీపీని నిలదీయడమే ఈ పాదయాత్ర ప్రధాన ఉద్దేశం
*జగనన్నను జైలుకు పంపడానికి అధికార, ప్రతిపక్షాలు కుమ్మక్కయ్యాయి.
*ఈ కుమ్మక్కుకు నిరసనగా పాదయాత్రలో అందరూ నల్ల బ్యాడ్జీలు ధరించాలి

మరో ప్రజాప్రస్థానం నుంచి న్యూస్‌లైన్ ప్రత్యేక ప్రతినిధి: ‘‘ఈ యాత్ర జగనన్న చేయాల్సింది. ఆయన మన మధ్య ఉంటే ఎంతో కొంత సంతోషంగా ఉండేవాళ్లం. జగనన్న రాలేని కారణంగా నన్ను పంపాడు. నేను జగనన్న వదిలిన బాణాన్ని. వైఎస్ కూతురిగా, జగన్ చెల్లెలిగా, వైఎస్సార్ సీపీ సామాన్య కార్యకర్తగా, పార్టీ సైనికురాలిగా ఈ ప్రస్థానాన్ని మొదలుపెడుతున్నా’’ అని దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డి కుమార్తె, వైఎస్ జగన్ సోదరి షర్మిల ఉద్ఘాటించారు. గురువారం ఇడుపులపాయలో ‘మరో ప్రజా ప్రస్థా నం’ పాదయాత్ర ప్రారంభానికి ఉవ్వెత్తున తరలివచ్చిన జనాన్ని ఉద్దేశించి ఆమె ఉద్వేగంగా ప్రసంగించారు. వైఎస్‌ను అభిమానించే ప్రతి గుండె, జగన్ నాయకత్వంలో రాజన్న రాజ్యం మళ్లీ సాధ్యమని నమ్మే ప్రతి ఒక్కరూ తనను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. తర్వాత రాత్రి వేంపల్లెలో అడుగడుగునా నీరాజనం పలుకుతున్న అభిమానులనుద్దేశించి మరోసారి మాట్లాడారు. ప్రజా సమస్యలను పట్టించుకోని ప్రభుత్వాన్ని, అలాంటి ప్రభుత్వాన్ని అవిశ్వాసంతో కూల్చేయకుండా దానితోనే కుమ్మక్కైన తెలుగుదేశం పార్టీ వైఖరిని ఆమె ఎండగట్టారు. ప్రసంగాల సారాంశం ఆమె మాటల్లోనే..

ప్రజలకు అన్ని విధాలా క్షోభే..
నేను మీ రాజన్న కూతురుని. నేను మీ జగనన్న చెల్లెల్ని. మీ షర్మిలను. ఈ రోజు ఒక దృఢ సంకల్పంతో మీ ముందుకు వచ్చా. రాజశేఖరరెడ్డి రెక్కల కష్టంతో అధికారంలోకి వచ్చింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. రాష్ట్ర ప్రజలను అన్ని విధాలా క్షోభకు గురి చేస్తోంది ఈ ప్రభుత్వం. రైతులను వేధిస్తోంది. విద్యార్థులకు మొండిచేయి చూపింది. ఘోరమైన విద్యాసంక్షోభం ఏర్పడింది. ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను నిలదీయాల్సిన ప్రధాన ప్రతిపక్షం మూడేళ్లుగా చోద్యం చూస్తోంది. పూర్తిగా బాధ్యతను విస్మరించింది. సొంత మామను వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ఆ పార్టీని అధికారంలోకి తెచ్చిన రెండు హామీలను తుంగలో తొక్కారు. అవి రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం ఒకటైతే.. సంపూర్ణ మద్యపాన నిషేధం మరొకటి. ఆరోజు మాట నిలబెట్టుకుని ఉంటే ఈ రోజు ఆయన పాదయాత్ర చేయాల్సి వచ్చేది కాదు. వ్యవసాయం దండగన్నారు.

తొమ్మిదేళ్లలో ఎనిమిది సార్లు విద్యుత్తు చార్జీలు పెంచారు. రైతులను కట్టమన్నారు. కట్టకపోతే కేసులు పెట్టారు. అరెస్టు చేసి జైల్లో పెట్టారు. ఇళ్లలో సామాను ఎత్తుకెళ్లారు. ఇంత అవమానం భరించలేక, బకాయిలు చె ల్లించలేక రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కొన్ని వందల మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. కానీ ఈరోజు చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారు. ప్రజలపై ప్రేమ ఒలకబోస్తున్నారు. మొసలి కన్నీరు కారుస్తున్నారు. టీడీపీకి గానీ, చంద్రబాబుకుగానీ చిత్తశుద్ధి ఉంటే.. ఈ చేతగాని ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ఎందుకు పెట్టడం లేదు?

రెండు ఉద్దేశాలు..
ఈ ‘మరో ప్రజా ప్రస్థానా’నికి ముఖ్య ఉద్దేశాలు రెండే. ఒకటి ఈ అసమర్థ ప్రభుత్వ వైఫల్యాలు ఎండగట్టడం. రెండోది ఈ అసమర్థ ప్రభుత్వాన్ని అవిశ్వాసం పెట్టి దించేయకుండా ఎందుకు నిలబెడుతున్నారని ప్రధాన ప్రతిపక్షాన్ని నిలదీయడం. కేసులు పెట్టి విచారణ పేరుతో జగనన్నను జైలులోపెట్టారు. కానీ చంద్రబాబు నాయుడు విషయంలో కేసులు లేవు. ఎందుకంటే ఆయన చీకట్లో చిదంబరంను కలిసి కేసులు లేకుండా మేనేజ్ చేస్తారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో లాలూచీ పడ్డారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందనుకున్న చోట తెలుగుదేశం, తెలుగుదేశం గెలుస్తుందనుకున్న చోట కాంగ్రెస్ ఆ పార్టీలకు ఓట్లు వేసుకున్నాయి. మొన్నటికి మొన్న జగనన్నకు బెయిల్ వస్తుందనేసరికి ఎంపీలను చిదంబరం దగ్గరికి పంపారు. ప్రజాసమస్యలపై కాదు. ఎందుకు పంపారో తెలుసా? జడ్జిమెంట్‌ను ప్రభావితం చేయడానికి, ఈడీ(ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్)తో ‘సాక్షి’ని జప్తు చేయించడానికి. ప్రజా సమస్యలపై అంత త్వరగా స్పందించని కేంద్రం.. కొద్ది గంటల్లోనే ఈడీని ఉసిగొల్పి జప్తు చేయించింది. ప్రతిపక్షం, కాంగ్రెస్ కలిసి చేస్తున్న ఈ కుమ్మక్కు రాజకీయాలను నిర్వీర్యం చేయడానికి పాదయాత్రలో పాల్గొనే ప్రతి కార్యకర్త నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలపాలి. జగనన్న బయటకు వచ్చే వరకు ఈ నల్ల బ్యాడ్జీలు కనిపించాలి.’

జగనన్న చేయాల్సిన యాత్ర..
ఈ యాత్ర జగనన్న చేయాల్సింది. జగనన్న రాలేని కారణంగా నన్ను పంపాడు. నాతో పాటు మీరంతా కదం తొక్కాలని నా ప్రార్థన. దేవుడి దీవెనలు తీసుకుని, నాన్నకు నమస్కరించి, జగనన్న ఆశీస్సులతో, మీ ప్రేమను అందుకుని ఈ ప్రస్థానాన్ని మొదలుపెడుతున్నా. ప్రతిక్షణం నాన్నను, జగనన్నను, ఈ రాష్ట్ర ప్రజల కష్టాలను తలచుకుంటానని మాట ఇస్తున్నా. గుండెల నిండా నాన్నపై, జగనన్నపై ప్రేమతో ఇక్కడికి వచ్చిన వారందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా.

30 ఏళ్ల సేవకు అవినీతి ఆరోపణలే బహుమతా?
ఒకటి కాదు..రెండు కాదు...పది కాదు...30 ఏళ్లు కాంగ్రెస్ పార్టీకి నాన్న సేవ చేశాడు. ఆయన ప్రవేశపెట్టిన ప్రతీ పథకానికి ఇందిర, రాజీవ్ పేర్లే పెట్టారు. ఆ కుటుంబంపై అంతటి విశ్వాసం చూపిన నాన్నకు వాళ్లిచ్చిన గౌరవం సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో నాన్న పేరు, అవినీతి ఆరోపణల బహుమతి. అంతటితో ఆగకుండా ఆయనపై, కుటుంబంపై కక్షపూరిత చేష్టలు, జగన్‌ను జైలుకు పంపడం. ఇంత కంటే దారుణం ఇంకేమైనా ఉందా? ఏ ఆధారాలూ లేకుండానే జగనన్నను జైల్లో పెట్టారు. వైఎస్ మరణం తట్టుకోలేక దాదాపు 600 మంది మృతి చెందారు. వారంతా కాంగ్రెస్‌పార్టీ కార్యకర్తలే! వారి గురించి ఇప్పటి వరకూ కాంగ్రెస్ పట్టించుకోలేదు. చనిపోయిన వారి కుటుంబాల బాగోగులు వారికి పట్టవు. జగన్ వారి గురించి పట్టించుకుని ఓదార్చి, చేతనైన సాయం చేస్తుంటే దాన్ని ఓర్వలేకపోయారు.

ఆఖరుకు పార్టీ నుంచి వెలేసినంత పనిచేశారు. పైగా వైఎస్‌పై అభాండాలు వేశారు. వైఎస్ మరణం తర్వాత పాలకులు ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పాటు అన్ని పథకాలూ నిర్వీర్యం చేస్తున్నారు. అన్ని రాష్ట్రాలు అభివృద్ధిలో పయనిస్తుంటే, మన రాష్ట్రం వెనుకబడి ఉంది. ఈ పాపం కాంగ్రెస్‌ది కాదా? ఇలాంటి పరిస్థితుల్లో అధికారపక్షాన్ని నిలదీయాల్సిన టీడీపీ చోద్యం చూస్తోంది. అయితే జగనన్న మాత్రం జైల్లో ఉండి కూడా రాష్ట్ర ప్రజల బాగు గురించే ఆలోచిస్తున్నారు. రాజన్న లాంటి పెద్దమనసు జగన్‌కు ఉంది.

source:sakshi

Popular Posts

Topics :