28 October 2012 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

వైఎస్సార్ సీపీలోకి చిట్టూరి బాపినీడు

Written By news on Saturday, November 3, 2012 | 11/03/2012

 ప్రముఖ పారిశ్రామికవేత్త, మాజీ ఎమ్మెల్యే చిట్టూరి బాపినీడు తనయుడు చిట్టూరి నరేంద్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు. పార్టీగౌరవ అధ్యక్షురాలు విజయమ్మ సమక్షంలో అభిమానులతో కలిసి చేరతానని శనివారం తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వెల్లడించారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి, తనతండ్రి బాపినీడు చేసిన సేవలు కొనసాగించేందుకు వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు నరేంద్ర వివరించారు. ప్రముఖ పారిశ్రామిక వేత్తగా పేరొందిన నరేంద్ర చేరికతో పార్టీ మరింత బలపడుతుందని పార్టీ అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


http://www.sakshi.com/Main/Breakingstory.aspx?catid=480421&Categoryid=14&subcatid=0

YS Vijayamma's speech at uravakonda in Anantapur

YS Sharmila's speech at Uravakonda in Anantapur

జనసంద్రమయిన ఉరవకొండ

మహానేత వైఎస్ తనయ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర అనంతపురం జిల్లా ఉరవకొండలో సాగుతోంది. యాత్రలో భాగంగా నేత కార్మికుడు కాసుల ఆంజనేయులు ఇంటికి వెళ్లి మగ్గాలను షర్మిల పరిశీలించారు. అనంతరం ఉరవకొండ బస్టాండ్ సెంటర్ కు చేరుకున్న షర్మిలకు అపూర్వ స్వాగతం లభించింది. మహానేత తనయను చూసేందుకు అభిమానులు, కార్యకర్తలు భారీ ఎత్తున తరలివచ్చారు. ఆ ప్రాంతమంతా జనంతో నిండిపోయింది. ఎటుచూసినా జనమే కనిపించారు. 


source:sakshi

హంద్రీనివాను పరిశీలించిన షర్మిల

ఉరవకొండ సమీపంలో హంద్రీనివా కాలువను షర్మిల శనివారం పరిశీలించారు. హంద్రీనివా కాలువ పనులు అయిదు శాతం పూర్తయితే ఫలితాలు రైతులు అందుతాయన్నారు. అయితే ప్రభుత్వం మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆమె ఆరోపించారు. కాగా ఎర్రన్నాయుడు మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని షర్మిల అన్నారు. 

108 సకాలంలో రాకపోవడం వల్లనే ఆయన మృతి చెందారన్నారు. 108 సమయానికి వచ్చిఉంటే ఎర్రన్నాయుడు బతికి ఉండేవారని తెలిపారు. ఎర్రన్నాయుడులాగా ఎంతో మందిని ఈ ప్రభుత్వం పొట్టన పెట్టుకుంటోందని షర్మిల విమర్శించారు. వైఎస్ఆర్‌ ఉన్నప్పుడు 108 ఎంతో మంది ప్రాణాలు నిలబెట్టిందని షర్మిల గుర్తు చేశారు.

source:http://www.sakshi.com/Main/Breakingstory.aspx?catid=480398&Categoryid=14&subcatid=0

సర్‌ఛార్జీల పేరుతో మోత: వైఎస్ఆర్ సీపీ

విద్యుత్ సర్‌ఛార్జీల పేరుతో మూడేళ్ల నుంచి ఈ ప్రభుత్వం సామాన్యుడి నడ్డి విరుస్తోందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జనక్ ప్రసాద్‌ విమర్శించారు. వైఎస్‌ఆర్ తన హయంలో ఏరోజూ ఒక్క రూపాయి కూడా విద్యుత్ చార్జీలు పెంచలేదని గుర్తు చేశారు. వైఎస్‌ఆర్ మరణాంతరం సీఎం పీఠమెక్కిన రోశయ్య, కిరణ్‌ ఛార్జీల మోత మోగిస్తున్నారని ఎద్దేశా చేశారు. సర్దుబాటు ఛార్జీలు పెంచాలన్న నిర్ణయం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఖజానా నింపుకోవడమే లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని ఆరోపించారు. 

ఈ అసమర్థ ప్రభుత్వానికి చంద్రబాబు ఎందుకు మద్దతిస్తున్నారని, అవిశ్వాసం ఎందుకు పెట్టడంలేదని సూటిగా ప్రశ్నించారు. వైఎస్‌ విజయమ్మ, వైఎస్ భారతి ఢిల్లీ వెళ్లినట్లు ఓ దినపత్రిక గాలివార్తలు రాసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవన్నీ తప్పుడు కథనాలేనని జనక్ ప్రసాద్‌ కొట్టిపారేశారు.


source:
http://www.sakshi.com/Main/Breakingstory.aspx?catid=480407&Categoryid=14&subcatid=0

promote our official website

కొవ్వూరు బహిరంగ సభ రద్దు

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదివారం నాడు పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో నిర్వహించ తలపెట్టిన బహిరంగ సభ రద్దయ్యింది. భారీ వర్షాల కారణంగా  చేతికందిన పంట నష్టపోయి రైతు తీరని కష్టంలో ఉన్నాడనీ, అందుకనే సభను రద్దు చేశామనీ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బాలరాజు వెల్లడించారు. ఆ సభలో పార్టీలో చేరాలనుకున్న వారు హైదరాబాద్ వచ్చి పార్టీలో చేరతారని చెప్పారు

continue.........

http://www.ysrcongress.com/news/news_updates/kovvooru_bahiraMga_sabha_raddu.html

పాలకుల ఫ్యామిలీతో పెట్టుకున్నా అంతే సంగతులు

Written By news on Friday, November 2, 2012 | 11/02/2012

Written by Srinu On 11/2/2012 3:25:00 AM
రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అంటారు మన పెద్దోళ్లు. పాలకులు ఉన్న పవర్ అంటువంటి మరి. ప్రభువులు కన్నెర్ర చేస్తే ఎంతటివారి అడ్రస్ అయినా గల్లంతవాల్సిందే. పాలకుల ఫ్యామిలీతో పెట్టుకున్నా అంతే సంగతులు. తమను ప్రశ్నించినా, ఎదరించి నిలబడి వారిని చూస్తే ఏలికలకు చిర్రెత్తుకొస్తుంది. నటనలో ఆస్కార్‌కు ఏమాత్రం తీసిపోని నేతలు ఇలాంటి సమయాల్లోనే తమ ‘చాతుర్యం’ చూపుతారు. తమకు చుట్టంగా సేవలందిస్తున్న చట్టానికి పనిచెబుతారు. తమకు వ్యతిరేకంగా గళం విప్పిన వాడికి చుక్కలు చూపిస్తారు. అప్పుడే కదా పాలకుల ‘విలువ’ సామాన్యులకు తెలిసేది.

సమయం చిక్కాలేకానీ తమకు తెలిసిన ‘విద్య’ను ప్రదర్శించేందుకు ప్రభువులు వెనుకాడరు. కేంద్రంలోని ప్రగతిశీల సర్కారులో విత్త మంత్రిగా కొలువు వెలగబెడుతున్న కాంగ్రెస్ నేత పళనియప్పన్ చిదంబరం తన చాణక్యాన్ని చాటారు. తన సుపుత్రుడు కార్తీ చిదంబరంపై సామాజిక సంబంధాల వెబ్‌సైట్‌లో ఆరోపణలు చేసిన ఓ అనామకుడిపై బ్రహ్మాస్త్రం ప్రయోగించారు. ట్విటర్‌లో తన కుమారుడిపై ఆరోపణలు చేసిన అవినీతి వ్యతిరేక కార్యకర్త, పాండిచ్చేరికి చెందిన చిరువ్యాపారి రవి శ్రీనివాసన్‌ను శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపేలా చక్రం తిప్పారు. అంతేకాదు మూడేళ్లు జైలు శిక్ష పడేలా కేసు నమోదు చేయించారు.

ఇంతకీ శ్రీనివాసన్ చేసిన నేరం ఏమిటంటే ‘‘సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా కంటే కార్తీ చిదంబరం అధిక సంపద పోగేశారు’’ ట్విటర్‌లో పోస్ట్ చేయడమే. విత్తమంత్రి కుమారుడు ఇచ్చిన ఈ-మెయిల్ ఫిర్యాదుతో ఆగమేఘాల కదలిన ఖాకీలు శ్రీనివాసన్‌ను అరెస్ట్ చేశారు. అతడిపై 66-ఏ సెక్షన్ కింద కేసు పెట్టేసి స్వామిభక్తి చాటుకున్నారు. విశేషమేమిటంటే 45 ఏళ్ల శ్రీనివాసన్‌కు ట్విటర్‌లో కేవలం 16 మంది ఫాలోవర్లు మాత్రమే ఉన్నారు. సీబీసీఐడీ అధికారులు తెల్లవారుజామున 5 గంటలకు ఇంటికి వచ్చి నిద్రలేపి మరీ తనను అరెస్ట్ చేశారని నిందితుడు వాపోయాడు. తాను చేసిన తప్పేంటని ప్రశ్నిస్తుడు. పాలకులతో పెట్టుకోడమే అతడు చేసిన తప్పా?

అన్నివైపుల నుంచి దూసుకువస్తున్నఅవినీతి ఆరోపణలతో ‘హస్తం’ పార్టీ నేతలు సతమవుతున్నారు. అన్నా హజారే, అరవింద్ కేజ్రీవాల్ లాంటి ఉద్యమకారులు గుప్పిస్తున్న ఆరోపణాస్త్రాలు ఎదుర్కొలేక ఇరిటేట్ అవుతున్నారు. ఉద్యమ నేతలను ఏమీ చేయలేకపోతున్న ఏలికలు సామాన్యులపై తమ ‘ప్రతాపం’ చూపుతున్నారు. శ్రీనివాసన్ ఉదంతమే ఇందుకు ఉదాహరణ. దినపత్రికల్లో తాను చ దివిన వాటినే ట్విటర్‌లో పోస్ట్ చేశానని, తననే ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారని శ్రీనివాసన్ సంధిస్తున్న ప్రశ్నలకు పోలీసుల నుంచి సమాధానం లేదు.

అతడిపై 66-ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేయడాన్ని బట్టే అర్థమవుతుంది దీనివెనుకున్న చిదంబర రహస్యం. దీనిబట్టి చూస్తే ఇండియా ఎగెనెస్ట్ కరప్షన్(ఐఏసీ) కార్యకర్తలను టార్గెట్ చే శారన్న శంక కలుగుతోంది. కేజ్రీవాల్‌కు దన్నుగా నిలిచిన ఐఏసీ కార్యకర్తల దూకుడుకు కళ్లెం వేసేందుకు పాలకులు పన్నాగం పన్నారన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నాయకుల బెదిరింపులకు తాను భయపడనని, తనకు కావాల్సిందల్లా అవినీతి వ్యతిరేక ఉద్యమకారుల నైతిక మద్దతు మాత్రమేనని శ్రీనివాసన్ అంటున్నాడు. ‘పవర్’కు భయపడని వాడు ఎవరికి తలవంచడని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు!

http://www.sakshi.com/Main/Featuredetails.aspx?Newsid=51830&Categoryid=28&subcatid=0

ఎర్రన్నాయుడు మృతికి విజయమ్మ దిగ్ర్భాంతి

తెలుగుదేశం పార్టీ నాయకుడు, సీనియర్ పార్లమెంటేరియన్ ఎర్రన్నాయుడు మృతి పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఎర్రన్నాయుడు సుదీర్ఘ కాలం రాష్ట్ర, కేంద్ర రాజకీయాల్లో తనదైన పాత్ర నిర్వహించారని ఆమె అన్నారు. ఎర్రన్నాయుడు కుటుంబ సభ్యులకు వైఎస్ విజయమ్మ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

వైఎస్సార్ కాంగ్రెస్‌లోకి లక్ష్మీపార్వతి

 ఎన్టీఆర్ టీడీపీ అధ్యక్షురాలు నందమూరి లక్ష్మీపార్వతి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించారు. ఈ నెల 4న పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో జరిగే బహిరంగ సభలో పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సమక్షంలో ఆమె పార్టీలో చేరనున్నారు. ఆమెతోపాటు తమ్మిశెట్టి నిరంజన్‌కుమార్ ఆధ్వర్యంలో సుమారు 300 మంది ఎన్టీఆర్ అభిమానులు వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరనున్నారు.

‘జన’ తుపాను ముందు ‘నీలం’ తుపాను చిన్నబోయింది


 ‘జన’ తుపాను ముందు ‘నీలం’ తుపాను చిన్నబోయింది. నీలం తుపాను బలహీనపడితే.. జన తుపాను నానాటికీ బలపడుతోంది. షర్మిల వెంట ప్రజలు తండోపతండాలుగా కదం తొక్కుతుండటంతో జన తుపాను బలబడుతూ కాంగ్రెస్, టీడీపీ శిబిరాల్లో ప్రళయం సృష్టిస్తోంది. మహానేత వైఎస్ తనయ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్రకు గురువారం ఉరవకొండ నియోజకవర్గం పరిధిలోని కూడేరు మండలం ముద్దలాపురం, జల్లిపల్లి, ఉదిరిపికొండ, శివరాంపేటల్లో జనం పోటెత్తారు. నీలం తుపాన్ ప్రభావం వల్ల జోరుగా వర్షం కురిసినా జనం చెక్కుచెదరలేదు. సరి కదా సమయం పెరిగే కొద్దీ జనం రెట్టింపై షర్మిల వెంట అడుగులో అడుగేసి కదంతొక్కారు. 

బుధవారం రాత్రి కూడేరుకు నాలుగు కిమీలోమీటర్ల దూరంలో బస చేసిన షర్మిల గురువారం ఉదయం 11 గంటలకు పాదయాత్రకు ఉపక్రమించే సరికి వర్షం కురుస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షంలోనే షర్మిల పాదయాత్రను ప్రారంభించారు. ముద్దలాపురం శివారులో ఇద్దరు మరుగుజ్జు మహిళలను అప్యాయంగా పలకరించిన షర్మిల.. వారి కష్టసుఖాలను తెలుసుకున్నారు. ‘అమ్మా.. అధైర్యపడొద్దు. రాజన్న రాజ్యం వస్తుంది. అప్పుడు నెలకు రూ.వెయ్యి చొప్పున వికలాంగులకు పెన్షన్ వస్తుంది’ అంటూ ధైర్యం చెప్పడంతో వారి కళ్లలో వెలుగులు నిండాయి. ముద్దలాపురం ప్రాథమికోన్నత పాఠశాలలో రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మువ్వన్నెల జెండాను ఆవిష్కరించిన షర్మిల.. విద్యార్థులతో మమేకమయ్యారు. బాగా చదువుకోవాలని సూచించారు.

ఆ తర్వాత ముద్దలాపురం చేరుకున్న ఆమెకు జనం నీరాజనాలు పలికారు. అడుగడుగునా హారతులు పట్టి.. గుమ్మడికాయతో దిష్టితీసి, ఇంటి బిడ్డలా ఆదరించడంతో షర్మిల ఒకింత ఉద్వేగానికి లోనయ్యారు. ఆ తర్వాత గ్రామ ప్రజలతో రచ్చబండ నిర్వహించారు. ‘వేరుశనగకు వాతావరణ బీమా వల్ల ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. వైఎస్ ఉన్నప్పుడు గ్రామం యూనిట్‌గా పంటల బీమా వల్ల పంట పండకపోయినా నష్టపరిహారం వచ్చేది. గ్రామాల్లో జ్వరాలు పెరిగిపోయాయి. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రైతుల లోగిల్లలో పంట దిగుబడులు లేవు.. అప్పులే మిగిలాయి’ అంటూ సమస్యలను ఏకరువు పెట్టారు. ఇందుకు షర్మిల స్పందిస్తూ.. ‘పాలక, ప్రతిపక్షాలు దొందూ దొందే. కొద్ది రోజులు ఓపిక పట్టండి. జగనన్న సీఎం అవుతారు. మీ కష్టాలను కడతేర్చుతారు’ అంటూ భరోసా ఇచ్చారు.
బీమా లేకుండా చేసి నట్టేట ముంచింది..



ముద్దలాపురం గ్రామం నుంచి వైఎస్సార్ వాటర్ ప్రాజెక్టు వద్దకు చేరుకున్న షర్మిల అక్కడే భోజనం చేసి, కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. ఆ తర్వాత ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షంలోనే పాదయాత్రను కొనసాగించారు. జల్లిపల్లి శివారులో గొర్రెల కాపరులతో ముచ్చటించారు. ‘అమ్మా.. వైఎస్ ఉన్నప్పుడు గొర్రెకు రూ.18 చొప్పున కట్టించుకుని బీమా సౌకర్యం కల్పించేవారు. గొర్రె చనిపోతే నష్టపరిహారం ఇచ్చేవారు. గొర్రెలకు మందులు కూడా వేసేవారు. కానీ.. ఇప్పుడు బీమా రద్దు చేశారు. 

మందులు వేయడం లేదు. ఒక్క గొర్రె చనిపోతే ఆరేడు వేల రూపాయల నష్టం వస్తోంది. అదే బీమా ఉంటే మాకు ఆ నష్టం జరిగేది కాదు’ అంటూ సమస్యలను ఏకరువు పెట్టారు. ఇందుకు షర్మిల స్పందిస్తూ.. ‘కులవృత్తులను ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. టీడీపీ కూడా ప్రభుత్వానికే వంతపాడుతోంది. జగనన్న సీఎం అవుతారు.. కులవృత్తులకు పెద్దపీట వేస్తారు. రాజన్న చేపట్టిన పథకాలను మళ్లీ చేపట్టి ఆదుకుంటారు’ అనడంతో గొర్రెల కాపర్ల కళ్లల్లో ఆనందం వెల్లివిరిసింది. 



అక్కడి నుంచి జల్లిపల్లికి చేరుకున్న షర్మిల అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు. ‘జగనన్న రైతుల కోసం, విద్యార్థుల కోసం.. చేనేతల కోసం దీక్షలు చేశారు. పోరాటాలు చేశారు. వైఎస్ తరహాలోనే ప్రజల పక్షాన పోరాడి.. జనం హృదయాలను గెలుచుకున్నారు. దీన్ని చూసి ఓర్వలేక.. కాంగ్రెస్, టీడీపీలకు ఉనికి ఉండదనే భయంతోనే జగనన్నను సీబీఐతో అరెస్టు చేయించాయి. చివరకు బెయిల్ కూడా రాకుండా అడ్డుకుంటున్నాయి. దేవుడనేవాడు ఉన్నాడు. న్యాయం జరుగుతుంది. జగనన్న బయటకు వచ్చి.. రాజన్న రాజ్యాన్ని స్థాపిస్తారు’ అంటూ ప్రజలకు ధైర్యం చెప్పారు. జల్లిపల్లి సభ తర్వాత ఉదిరిపికొండకు చేరుకున్న షర్మిలకు ఆ గ్రామ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఆ గ్రామంలో రచ్చబండ నిర్వహించి.. సమస్యలు తెలుసుకున్నారు. 



ఉదిరిపికొండ రైతులు మాట్లాడుతూ ‘వైఎస్ హయాంలో 99 శాతం పంట నష్టపరిహారం వచ్చింది. దీని వల్ల అప్పులు తీరాయి. కానీ.. ఇప్పుడు వాతావరణ బీమా వల్ల ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. కరెంట్ సక్రమంగా ఇవ్వడం లేదు. రైతులు ఎలా బతకాలి’ అంటూ విలపించారు. ఇందుకు షర్మిల స్పందిస్తూ.. ‘మహానేత వైఎస్ అధికారంలో ఉన్నా లేకున్నా రైతుల కోసం పోరాటం చేశారు. జగనన్న అదే తరహాలో పోరాటం చేస్తున్నారు. కొద్ది రోజులు ఓపిక పట్టండి.. మంచి రోజులు వస్తాయి’ అంటూ భరోసా ఇచ్చి ముందుకు కదిలారు.

జనాదరణ ఓర్వలేకే కుట్రలు..
ఉదిరిపికొండ నుంచి శివరాంపేటకు చేరుకున్న షర్మిలకు ఆ గ్రామ ప్రజలు ఆత్మీయంగా స్వాగతం పలికారు. షర్మిలపై బంతిపూల వర్షం కురిపించారు. అక్కడ గ్రామీణుల సమస్యలను తెలుసుకున్న తర్వాత షర్మిల మాట్లాడుతూ.. ‘జగన్ కాంగ్రెస్‌లో ఉంటే ఇన్ని కష్టాలు పడి ఉండేవారు కాదని గులాంనబీ ఆజాద్ అన్నారు. దీన్ని బట్టి చూస్తే కాంగ్రెస్ కక్ష సాధింపుల్లో భాగంగానే జగనన్నను అరెస్టు చేయించారన్న విషయం అర్థమవుతోంది. 

టీడీపీతో కుమ్మక్కైన కాంగ్రెస్ జగనన్నను ప్రజలకు దూరం చేస్తోంది. జగనన్నకు ఉన్న ప్రజాదరణను చూసి ఓర్వలేక ఈ కుట్రలు చేస్తున్నారు. ఏదో ఒక రోజు జగనన్న బయటకు రాకపోరు.. మీ తరఫున పోరాటం చేయకపోరు.. రాజన్న రాజ్యాన్ని స్థాపించకపోరు.. మీ కష్టాలను కడతేర్చకపోరు.. ఓపికపట్టండి’ అంటూ ధైర్యం చెప్పారు. శివరాంపేట నుంచి భంభంస్వామి గుట్ట వద్దకు రాత్రి 7.30 గంటలకు చేరుకున్న షర్మిల అక్కడే బస చేశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షంలోనూ వేలాది మంది ప్రజలు షర్మిలను అనుసరించడం రాజకీయ పరిశీలకులను సైతం విస్మయానికి గురిచేసింది. ఇది కాంగ్రెస్, టీడీపీ శిబిరాలను మరింత ఆందోళనకు గురిచేసింది. గురువారం పాదయాత్రలో షర్మిల 13 కిలోమీటర్ల దూరం నడిచారు.

బాబూ.. దమ్ముంటే అవిశ్వాసం పెట్టు

చంద్రబాబు పాదయాత్ర పెద్ద డ్రామా అని, ఆయన కోసం చేసుకుంటున్న ప్రచార యాత్ర అని ఎన్టీఆర్ టీడీపీ అధ్యక్షురాలు లక్ష్మీపార్వతి, వైఎస్సార్‌సీపీ ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి ఎద్దేవా చేశారు. జననేత జగన్ సోదరి షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర గురువారం అనంతపురం జిల్లా కూడేరు మండలంలో సాగింది. ఈ యాత్రలో పాల్గొన్న అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. అబద్ధాలు చెప్పడం బాబుకు వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. 

పాదయాత్ర ప్రజల కోసమే చేస్తున్నానంటూ బురిడీ కొట్టిస్తున్నారని దుయ్యబట్టారు. ‘రాష్ట్రంలో అసమర్థ పాలన సాగుతోందని చంద్రబాబు అంటున్నారు. ఈ ప్రభుత్వాన్ని గద్దె దించే బలం, సత్తా ఆయనకున్నా ఎందుకు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారు.. నిజంగా దమ్ముంటే ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టాలి. అప్పుడు ప్రజలు విశ్వసిస్తార’ని అన్నారు. ‘ప్రభుత్వం దిగిపోకుండా బాబు పూర్తి మద్దతు ఇస్తున్నారు. 

ఆయనపై ఎలాంటి కేసులు మోపకుండా ప్రభుత్వం కాపాడుతోంది. బాబు తొమ్మిదే ళ్ల పాలనలాగే కాంగ్రెస్ పాలన కొనసాగుతోంది. ప్రభుత్వానికి ప్రజల గోడు ఏమాత్రం పట్టడం లేదు. బీసీలను ఇన్ని రోజులూ విస్మరించిన చంద్రబాబు ఇప్పుడు 100 సీట్లంటూ మాయాజాలం చేస్తున్నారు. జగన్ బయట ఉంటే తమ మనుగడ ఉండదని భావించే అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా ప్రజలు జననేతకు అండగా నిలుస్తార’ని స్పష్టం చేశారు.

సీఎం కిరణ్ ప్రశ్నకు దీటుగా షర్మిల సమాధానం

సీఎం కిరణ్ ప్రశ్నకు దీటుగా షర్మిల సమాధానం
పేదల గుండెల్లో జగన్ స్థానం సంపాదించుకున్నందుకే కుట్ర చేశారు
అన్న బయట ఉంటే మీకూ, టీడీపీకి ఉనికి ఉండదనే మీ భయం
జగన్ కాంగ్రెస్‌లోనే ఉంటే కష్టాలు ఉండేవి కావని కాంగ్రెస్ నాయకుడు ఆజాదే చెప్పారు
అంటే కావాలనే జైల్లో పెట్టారనే కదా?
జగన్ ఏ తప్పూ చేయలేదని ధైర్యంగా చెప్తున్నాం
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’గురువారం యాత్ర ముగిసేనాటికి.. రోజులు: 15, కిలోమీటర్లు: 201.30

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘న్యూస్‌లైన్’ ప్రత్యేక ప్రతినిధి: ‘జగన్ ఎవరి కోసం జైలుకెళ్లాడు? ప్రజల కోసమా? మహిళల కోసమా? రైతుల కోసమా? అని కిరణ్‌కుమార్‌రెడ్డి అంటున్నారు. ఆయనకు ఇదే నా సమాధానం. అవును.. జగనన్న రైతుల కోసం పోరాడారు. పేద ప్రజల కోసం పోరాడారు. విద్యార్థుల కోసం పోరాడారు. మహిళల కోసం పోరాడారు. చేనేత కార్మికుల కోసం పోరాడారు. అలా పోరాడడం వల్ల ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకుంటున్నాడనే మీరు జైలులో పెట్టారు. అలా పోరాడడం వల్ల మీకు, టీడీపీకి స్థానం ఉండదనే, ఉనికి కోల్పోతారనే మీరు జైలులో పెట్టారు. నీచమైన కుట్రకు పాల్పడ్డారు.

సీబీఐని వాడుకున్నారు. గుండెల మీద చేయి వేసుకుని మీరు నిజం చెప్పలేరు..’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల.. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిపై ధ్వజమెత్తారు. ప్రజా సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వ వైఖరికి, దానితోనే కుమ్మక్కయిన టీడీపీ వైఖరికి నిరసనగా చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ 15వ రోజు గురువారం పాదయాత్రలో భాగంగా ఆమె అనంతపురం జిల్లా జల్లిపల్లిలో జరిగిన సభలో ఈ వ్యాఖ్యలు చేశారు. ‘కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆజాద్ పబ్లిక్ మీటింగ్‌లోనే చెప్పారు. జగన్ కాంగ్రెస్‌లోనే ఉంటే ఇన్ని కష్టాలు ఉండేవి కావని అన్నారు. అంటే దానర్థం ఏమిటి? కావాలనే జైలులో పెట్టారనే కదా? కావాలనే బెయిల్ రాకుండా చేస్తున్నారనే కదా దాని అర్థం. రాజన్న కుటుంబం ఈరోజు ఒక మాట చెబుతోంది. జగనన్న ఏ తప్పూ చేయలేదు. ఈ మాట ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. ఒక రోజు వస్తుంది. ఆరోజు నిజం తెలుస్తుంది. ఆ రోజు జగనన్న తప్పకుండా బయటకు వస్తాడు. సమయం వచ్చినప్పుడు మీరంతా కాంగ్రెస్, టీడీపీలకు గట్టిగా బుద్ధి చెప్పాలి..’ అని షర్మిల ప్రజలకు పిలుపునిచ్చారు.

ఇది చేశానని చంద్రబాబు చెప్పలేరు.. 

‘చంద్రబాబు 9 ఏళ్లు అధికారంలో ఉన్నారు. ఉండి ఏం చేశారు? చేసింది చెప్పుకొనే ధైర్యం లేదు. ప్రజల కోసం ఫలానా మంచి పనిచేశానని చెప్పగలరా? కానీ ఇప్పుడు మళ్లీ అధికారం కావాలట. పాదయాత్రలంటూ కొత్త డ్రామా ఆడుతున్నారు. ప్రజలు అమాయకులేమీ కాదు. చంద్రబాబు అనుకుంటున్నట్టు పిచ్చివాళ్లేం కాదు. చంద్రబాబుకు లేనిది, రాజన్నకు ఉన్నదీ మాట మీద నిలబడే నైజం. చంద్రబాబుకు లేనిదీ, రాజన్న, జగనన్నలకు ఉన్నది విశ్వసనీయత. బాబుకు పాదయాత్ర అవసరం లేదు. ఈ అసమర్థ ప్రభుత్వాన్ని దించేందుకు తగినంత మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ ఆయన అవిశ్వాసం పెట్టరట..’ అని షర్మిల.. చంద్రబాబుపై నిప్పులు చెరిగారు.


బీమా ఇవ్వడం లేదు..

ఉదయం 11.30కు ముద్దలాపురంలో శంకర్ అనే రైతుకు చెందిన వేరుశనగ చేనును షర్మిల పరిశీలించారు. చెట్లు తీశామని, కానీ చెట్టుకు రెండు మూడు కాయలే ఉన్నాయని ఆ రైతు వాపోయారు. ఎకరానికి 2 నుంచి 3 బస్తాలు కూడా వచ్చే పరిస్థితి లేదని వివరించారు. ‘వర్షాధారంగా ఈ పంట పండిస్తున్నాం. ఏటా పెట్టుబడులు నష్టపోతున్నాం. రాజశేఖరరెడ్డి హయాంలో 4 ఏళ్లు పంట పండింది. పంట పండని సమయంలో ఇన్సూరెన్స్ వచ్చింది. కానీ ఇప్పుడు వాతావరణ బీమా పేరుతో మండలం యూనిట్‌గా చేసి ఇన్సూరెన్స్ ఇవ్వడం లేదమ్మా’ అని శంకర్ వాపోయారు.

రోడ్డు వేయించండమ్మా...

మామూలుగా అయితే రోడ్లు వేయించాలని, కుళాయిలు ఇప్పించాలని ప్రజలు ప్రజా ప్రతినిధుల్ని, అధికార పార్టీ నేతల్ని అడుగుతారు. ఐతే ప్రభుత్వం తమను పట్టించుకోవట్లేదన్న ఉద్దేశంతో ఉన్న ప్రజలు.. పాదయాత్రలో తమ ఊరికి వస్తున్న షర్మిలకు తమ సమస్యలు ఏకరువు పెడుతున్నా రు. గురువారం ఉదయం ముద్దలాపురం సమీపంలో గొటుకూరుకు చెందిన వికలాంగుడు హరినాథ్‌రెడ్డి, అదే గ్రామానికి చెందిన ఆరోగ్యశ్రీ లబ్ధిదారుడు గొనంకి లక్ష్మయ్య రోడ్డు పక్కన కూర్చుని షర్మిల రాకకోసం ఎదురుచూస్తూ కనిపించారు. వారి వద్దకు షర్మిల రాగానే ‘నిన్న కలవాలనుకున్నా సాధ్యపడలేదమ్మా.. అందుకే ఇక్కడ కూర్చున్నాం. మా ఊరు వద్ద రోడ్డు గతుకులుగా ఉండడంతో రోడ్డు ప్రమాదం జరిగి నా కాలు పూర్తిగా విరిగిపోయింది. దయచేసి మా ఊరికి రోడ్డు వేయించండమ్మా’ అని హరినాథ్‌రెడ్డి మొరపెట్టుకున్నారు. రాజన్న రాజ్యంలో మీ కోరికలన్నీ నెరవేరతాయని షర్మిల భరోసా ఇచ్చారు. లక్ష్మయ్య మాట్లాడుతూ.. వైఎస్ తనకు చేసిన మేలుకు కృతజ్ఞతలు తెలుపుకోవడానికిఇక్కడిదాకా వచ్చానన్నారు. ‘నాకు గుండె ఆపరేషన్ అయ్యింది. కానీ మళ్లీ చేయాల్సి వచ్చింది. అప్పుడు వైఎస్ తెచ్చిన ఆరోగ్యశ్రీ నాకు వరమైంది. 2 లక్షలతో మళ్లీ ఆపరేషన్ చేయించారు’ అని అన్నారు.

గొర్రె చనిపోతే దిక్కులేదు..

మార్గం మధ్యలో జల్లిపల్లికి చెందిన గొర్రెల కాపరులు ఇటుకలప్ప, పల్లెప్ప గొర్రెలు కాస్తుండగా షర్మిల వారి వద్దకు వెళ్లి వారితో ముచ్చటించారు. వారి మధ్య సంభాషణ సాగిందిలా..
షర్మిల : ఏమన్నా.. బతుకుదెరువు ఎలా ఉంది?
కాపరి: మా బాధలేమని చెప్పేది.. గొర్రెలు చనిపోతే ఇన్సూరెన్స్ కూడా రావడం లేదమ్మా
ఇంతకుముందు వచ్చేదా?

ఇంతకుముందు గొర్రెకు రూ. 18 కడితే.. చనిపోయినప్పుడు రూ.1,000 వచ్చేది. ఇప్పుడు ఇవ్వడం లేదు.
ఎందుకు రావడం లేదు?

ఏమో అమ్మా. అప్పుడంటే రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు మాబోటివాళ్లను పట్టించుకున్నారు. ఇప్పుడెవరు పట్టించుకుంటారు? బస్సు కింద పడి 180 గొర్రెలు చనిపోయాయి. కానీ ఒక్కదానికీ పరిహారం రాలేదు. గొర్రెలకేం తెలుసు. అవి ఒక్కటి పోయి రైలు కిందపడితే.. అన్నీ వెళ్లి పడతాయి.

పశువులకు నీళ్లు, మేత ఉన్నాయా?

కాలువ నీళ్లు రావడం లేదట. అప్పటి నుంచి ఎక్కడా నీళ్లు దొరకడం లేదు. ఈ ప్రాంతంలో కురుమలు ఎక్కువ. గొర్రెలకు నీళ్లు లేవు. అప్పుడప్పుడు పడే చినుకులకు ఈసారి ఇక్కడ మేత దొరుకుతోంది. కానీ మేత దొరకనప్పుడు ఒక్కోసారి వందల కిలోమీటర్ల దూరం అలా మేపుకొంటూ వలస వెళ్లాల్సిందే. చెరువులు నింపితే మాకు కొద్దిగా ప్రయోజనం. ఇప్పటికే తాగునీళ్లు లేక జనం అల్లాడిపోతున్నారు.
జగనన్న సీఎం అయ్యాక మళ్లీ రాజన్న లాగే పీఏబీఆర్‌కు 10 టీఎంసీల నీటిని తెస్తాడు. ధైర్యంగా ఉండండన్నా..

వర్షంలోనే పాదయాత్ర..

గురువారం పాదయాత్ర ఉదయం వర్షం కారణంగా 11 గంటలకు ప్రారంభమైంది. వర్షం ఆగకపోవడంతో అదే వర్షంలో పాదయాత్ర కొనసాగించారు. మధ్యాహ్నం వరకు జల్లులు కురుస్తూనే ఉన్నాయి.. తిరిగి సాయంత్రం కొద్దిసేపు వర్షం కురిసినా.. షర్మిల ఆగకుండా యాత్ర చేశారు. గురువారం మొత్తం షర్మిల 13 కిలోమీటర్ల మేర నడిచి రాత్రి 7.30కు భం భం స్వామి గుట్ట వద్ద టెంట్‌లో బసచేశారు. దీతో ఇప్పటివరకు పాదయాత్ర 201.30 కిలోమీటర్లు పూర్తయింది. గురువారం పాదయాత్రలో ఎమ్మెల్యేలు శోభానాగిరెడ్డి, కాపు రాంచంద్రారెడ్డి, గురునాథరెడ్డి, ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి, వైఎస్సార్ పార్టీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, ఉరవకొండ పార్టీ ఇన్‌చార్జి వై.విశ్వేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప్రసాదరాజు, కొల్లి నిర్మల కుమారి, వాసిరెడ్డి పద్మ, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, కాపు భారతి తదితరులు పాల్గొన్నారు.

షర్మిల నేటి పాదయాత్ర ఇలా...

మహానేత వైఎస్ తనయ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర శుక్రవారం భంభం బాబా గుట్ట నుంచి ప్రారంభమై పెన్నహోబిలం, పీఏబీఆర్ కాలువ, కోనాపురం క్రాస్, కోనాపురం, షెక్షాన్‌పల్లి, లత్తవరం సరిహద్దు వరకు సాగుతుంది. షెక్షాన్‌పల్లి బహిరంగ సభలో పాల్గొన్న అనంతరం లత్తవరం సరిహద్దులో ఏర్పాటు చేసిన గుడారంలో రాత్రి బస చేస్తారు. 12.5 కిలోమీటర్లు నడుస్తారని ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, జిల్లా కన్వీనర్ శంకర్‌నారాయణ, సీఈసీ సభ్యుడు విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. 

రేపు ఉరవకొండలో..

షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర శనివారం లత్తవరం సరిహద్దు నుంచి బయలుదేరి ఉరవకొండ పట్టణంలో సాగుతుంది. షర్మిల ఉరవకొండ పాతబస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని అనంతరం మార్కెట్ యార్డు వద్ద రాత్రి బస చేస్తారు.

TDP Leader Yerrannaidu died in Road accident


శ్రీకాకుళం: టీడీపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కింజరపు ఎర్రన్నాయుడు(55) రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఆయన ప్రయాణిస్తున్న కారు పెట్రోల్ ట్యాంకర్‌ను ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం దండానపేట కూడలి సమీపంలో గురువారం అర్థరాత్రి 1.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆయనను హుటాహుటిన శ్రీకాకుళంలోని కిమ్స్ సాయిశేషాద్రి ఆస్పత్రికి తరలించారు. అరగంట పాటు వెంటిలేటర్ ఉన్న ఆయన చివరకు ప్రాణాలు విడిచారు. 

ఈ ప్రమాదంలో శ్రీకాకుళం జిల్లా టీడీపీ అధ్యక్షుడు చౌదరి బాబ్జీ, మరో ఇద్దరు గాయపడ్డారు. విశాఖపట్టణంలో ఓ వివాహ కార్యక్రమానికి హాజరై శ్రీకాకుళంకు తిరిగొస్తుండగా ఈ దుర్ఘటన సంభవించింది. వీరు ప్రయాణిస్తున్న కారు మలుపుతిరుగుతున్న ఆయిల్ ట్యాంకర్‌ను ఢీకొంది. ఎర్రన్నాయుడు మరణవార్త తెలుసుకుని ఆయన సోదరుడు అచ్చెన్నాయుడు హైదరాబాద్ నుంచి బయలుదేరారు. ఎర్రన్నాయుడు హఠాన్మరణం పట్ల టీడీపీ నేతలు సంతాపం ప్రకటించారు. 

కోటబొమ్మాళి మండలం నిమ్మాడలో 1957, ఫిబ్రవరి 23న వ్యవసాయ కుటుంబంలో ఎర్రన్నాయుడు జన్మించారు. కళావతమ్మ, దాలినాయుడు ఆయన తల్లిదండ్రులు. ఏడుగురు సంతానంలో ఆయన మొదటివారు. గారలో ఉన్నతవిద్య, టెక్కలీ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్ విద్య అభ్యసించారు. విశాఖ వీఎస్ కృష్ణా కళాశాలలో బీఎస్సీ చదివారు. ఆంధ్రా యూనివ ర్సిటీలో ఎల్‌ఎల్‌బీ చేశారు. 1982, మే 28న విజయకుమారిని వివాహమాడారు. ఆయనకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. 

న్యాయవాదిగా కెరీర్ ప్రారంభించిన కేంద్ర మంత్రిగా ఎదిగారు. 1983లో తెలుగుదేశం పార్టీలో చేరారు. 1983లో హరిశ్చంద్రపురం ఎమ్మెల్యేగా పోటీ చేశారు. హరిశ్చంద్రపురం నుంచి వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1983 నుంచి 1996 వరకు ఎమ్మెల్యేగా ఉన్నారు. శాసనసభ్యుడిగా వివిధ హోదాల్లో సేవలందించారు. 1983 నుంచి 1994 వరకు ప్యానల్ ఆఫ్ చైర్మన్ మెంబర్‌గా ఉన్నారు. 1995-96 మధ్య కాలంలో చీఫ్ విప్‌గా సేవలందించారు. 

1996, 98, 99, 2004లో శ్రీకాకుళం నుంచి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. టీడీపీ పార్లమెంటరీ నేతగానూ పనిచేశారు. ఎన్డీఏ ప్రభుత్వంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయమంత్రిగా సేవలందించారు. 1999-2000లో రైల్వే కమిటీ చైర్మన్‌గా వ్యవహరించారు. పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ, ఉక్కు మంత్రిత్వ శాఖ సంప్రతింపుల కమిటీల్లో సభ్యుడిగా పనిచేశారు.


Lakshmi Parvathi Interview@Maro Praja Prasthanam Padayatra

Written By news on Thursday, November 1, 2012 | 11/01/2012

Sharmila speech in Jelli Palli@Maro Prasthanam Padayatra

కాంగ్రెస్, టీడీపీలవి నీచ రాజకీయాలు: షర్మిల

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డకి వ్యతిరేకంగా టీడీపీ, కాంగ్రెస్‌లు నీచరాజకీయాల చేస్తున్నాయని షర్మిల మండిపడ్డారు. మరో ప్రజాప్రస్థానం 15 రోజు పాదయాత్రలో షర్మిల మాట్లాడుతూ.. సీబీఐతో కలిసి జగనన్నను అక్రమంగా అరెస్ట్‌ చేయించాయి అని అన్నారు. రాష్ట్రంలో మూడో పార్టీ ఉండకూడదనే ఈ కుట్రలు పన్నుతున్నారని ఆమె అరోపించారు. 

ఎవరి కోసం జగన్‌ జైలు కెళ్లారని సీఎం కిరణ్‌ అనడాన్ని ఆమె తప్పు పట్టారు. రైతులు, మహిళలు, విద్యార్థులు, చేనేత కార్మికుల పక్షాన నిలిచి జగన్‌ పోరాడి దీక్షలు చేయలేదా అని ప్రశ్నించారు. జగన్‌ చేస్తున్న పోరాటాలు చూసి కాంగ్రెస్, టీడీపీ గుండెల్లో రైళ్లు పరిగెట్టాయని షర్మిల అన్నారు. కాంగ్రెస్‌లో ఉండి ఉంటే జగన్‌కు ఇన్ని కష్టాలు వచ్చేవి కావని ఆజాదే చెప్పిన విషయాన్ని బట్టే కుట్ర బయటపడుతోందని అన్నారు. 

వైఎస్‌ఆర్‌ కుమారుడిగా ప్రజాసమస్యలను.. తన సమస్యలుగా జగన్‌ మలుచుకున్నారని.. జగన్‌ ఏ తప్పూ చేయలేదని తాము ధైర్యంగా చెప్తున్నామని.. త్వరలోనే జగన్‌ బయటకు వస్తారని షర్మిల తెలిపారు. రాజన్న కన్న కలలను జగనన్న నెరవేరుస్తారని ధీమా వ్యక్తం చేశారు. జగనన్న సీఎం అయ్యాక రైతులకు 3 వేల కోట్ల రూపాయలతో ప్రత్యేక బడ్జెట్‌ పెడుతారని ఆమె తెలిపారు. 

వైశ్రాయిలో ఎంతకు కొన్నారు: శోభానాగిరెడ్డి

ఎమ్మెల్యేలను గొర్రెలుగా వ్యాఖ్యానించడంపై వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి తీవ్ర అభ్యంతరం తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి ఎన్ టీఆర్ పదవి నుంచి దింపే సమయంలో వైశ్రాయిలో ఎమ్మెల్యేలను ఎంతకు కొన్నారో చెప్పాలని శోభానాగిరెడ్డి డిమాండ్ చేశారు. జగన్ సీఎం కావాలని సంతకాలు చేసి, యాగాలు చేసిన కిరణ్‌కు జగన్‌ను విమర్శించే హక్కులేదన్నారు. లేపాక్షి హబ్‌కు వైఎస్ఆర్ కేటాయించిన భూములు వెనక్కి తీసుకోవడంలో దేశం, కాంగ్రెస్‌లు కుట్రపన్నాయి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు గుర్నాధరెడ్డి, రామచంద్రారెడ్డి ఆరోపించారు.

టీడీపీ గుర్తింపు రద్దుకు ఈసీకి చిన్నం లేఖ

 తెలుగుదేశం పార్టీ గుర్తింపు రద్దు చేయాలని టిడిపినుంచి సస్పెండైన నూజివీడు ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య ఎలక్షన్‌ కమిషన్‌కు లేఖ రాశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసినందుకు టీడీపీ ఆయనను సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే. ఇలా చేయడం రాజ్యాంగ విరుద్ధమనేది రామకోటయ్య వాదన. టీడీపీ అధినేత చంద్రబాబుకు రాజ్యాంగం మీద విశ్వాసం లేదని అందుకే ఆ పార్టీ గుర్తింపు రద్దు చేయాలని కోరుతున్నట్టు రామకోటయ్య అంటున్నారు. 

పార్టీలో కొనసాగుతున్న పరిణామాలపై గతంలోనే అధ్యక్షుడు దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఇప్పటివరకూ తన ఫిర్యాదులకు ఎలాంటి వివరణా రాకపోవడం బాధాకరమని ఆయన అంటున్నారు. రామకోటయ్యను అనర్హుడిగా ప్రకటించాలని టిడిపి...స్పీకర్‌ను కోరనున్నట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి. వీటినికూడా పరిగణలోకి తీసుకున్న రామకోటయ్య నాకు ఎమ్మెల్యేగా కొనసాగే అవకాశం కల్పించండంటూ ఎలక్షన్‌ కమిషన్‌కు రాసిన లేఖలో అభ్యర్థించారు

15వ రోజు ముగిసిన మరో ప్రజాప్రస్థానం

మరో ప్రజాప్రస్థానం పేరిట వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన పాదయాత్ర పదిహేనో రోజు.. గురువారం సాయంత్రం ముగిసింది. ఈ పదిహేను రోజుల నిరంతరాయ యాత్రలో షర్మిల మొత్తం 201.3 కిలోమీటర్లు నడిచారు. ఇందఉలో ఒక్క గురువారం నాడే 13 కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్వహించారు. ఆమె బంబంస్వామిగుట్ట వద్ద గురువారం రాత్రి షర్మిల బస చేసి, తిరిగి శుక్రవారం ఉదయం మరో ప్రజాప్రస్థానాన్ని కొనసాగించనున్నారు.

Meruga complaint on TDP MLC Rajendra prasad in HRC

YS Sharmila's visits YSR Water Project

జాతీయ జెండా ఆవిష్కరించిన షర్మిల

రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలోని ముద్దలాపురంలో షర్మిల బుధవారం ఉదయం జాతీయ పతాకాన్ని ఎగరేశారు. ఆమె 15వ రోజు పాదయాత్ర కూడేరు శివారు నుంచి ప్రారంభించారు. అనంతరం షర్మిల వైఎస్ఆర్ వాటర్‌ ప్రాజెక్టు సందర్శనకు వెళ్లారు. భోజన విరామం అనంతరం జెల్లిపల్లి బహిరంగ సభలో పాల్గొంటారు. నేడు ఆమె 13 కిలో మీటర్లు నడవనున్నారు.

4న వైఎస్ఆర్ సీపీలోకి ఎమ్మెల్యే వనిత

గోపాలపురం : పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం ఎమ్మెల్యే వనిత ఈనెల 4వ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. కొవ్వూరులో జరిగే భారీ బహిరంగ సభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సమక్షంలో ఆమె పార్టీ సభ్యత్వం తీసుకోనున్నారు.

ఎమ్మెల్యే వనితతో టీడీపీ మాజీ ఎమ్మెల్యే కృష్ణబాబు, చింతలపూడి నియోజకవర్గ టీడీపీ ఇన్ ఛార్జ్ కర్రా రాజారావు, దెందులూరు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ ఛార్జ్ కొటారు రామచంద్రరావు పార్టీలో చేరనున్నారు. కాగా కొవ్వూరులో జరిగే బహిరంగ సభ ఏర్పాట్లను ఎమ్మెల్యే ఆళ్లనాని, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ తదితరులు పరిశీలిస్తున్నారు.

YS Sharmila Inaugurates Flag at Anantapur


4న వైఎస్ఆర్ సీపీలోకి ఎమ్మెల్యే వనిత

గోపాలపురం : పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం ఎమ్మెల్యే వనిత ఈనెల 4వ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. కొవ్వూరులో జరిగే భారీ బహిరంగ సభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సమక్షంలో ఆమె పార్టీ సభ్యత్వం తీసుకోనున్నారు. 

ఎమ్మెల్యే వనితతో టీడీపీ మాజీ ఎమ్మెల్యే కృష్ణబాబు, చింతలపూడి నియోజకవర్గ టీడీపీ ఇన్ ఛార్జ్ కర్రా రాజారావు, దెందులూరు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ ఛార్జ్ కొటారు రామచంద్రరావు పార్టీలో చేరనున్నారు. కాగా కొవ్వూరులో జరిగే బహిరంగ సభ ఏర్పాట్లను ఎమ్మెల్యే ఆళ్లనాని, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ తదితరులు పరిశీలిస్తున్నారు.

'కేంద్ర పదవులు దక్కటం జగన్ పుణ్యమే'

రాష్ట్రానికి పెద్ద ఎత్తున కేంద్ర పదవులు దక్కటం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుణ్యమేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యులు భూమా నాగిరెడ్డి అన్నారు. జగన్ను ప్రభంజనాన్ని అడ్డుకునేందుకే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేతలకు పదవులను కట్టబెట్టిందని ఆయన వ్యాఖ్యానించారు.

భూమా నాగిరెడ్డి బుధవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ ఈనెల 8వ తేదీ నుంచి కర్నూలు జిల్లాలో షర్మిల మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర ప్రారంభం అవుతుందని అన్నారు. తొమ్మిదేళ్ల పరిపాలనలో ప్రజల కష్టాలు చంద్రబాబుకు తెలియవా అని నాగిరెడ్డి ప్రశ్నించారు.

ఎమ్మెల్యే రాజేష్ కు ఘన స్వాగతం

చింతలపూడి ఎమ్మెల్యే మద్దాల రాజేష్ కుమార్ కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు బుధవారం ఘన స్వాగతం పలికారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి తొలిసారిగా చింతలపూడి వచ్చిన ఆయనకు అపూర్వ ఆదరణ లభించింది. రాజేష్ కుమార్ కు మద్దతుగా కార్యకర్తలు వలసపల్లి చెక్ పోస్ట్ నుంచి చింతలపూడి వరకూ 1000 బైక్ లతో ర్యాలీ నిర్వహించారు.

జగన్ పై లక్ష కోట్ల ఆరోపణ చేసే చంద్రబాబు నాయుడు ఇప్పుడు రిలయన్స్ పై లక్షపది వేల కోట్ల ఆరోపణలు వచ్చినా స్పందించరే?

చంద్రబాబుకు కొత్త చిక్కు వచ్చి పడింది. కెజి బేసిన్ లో గ్యాస్ ధర సమస్యపై జైపాల్ బదిలీ వెనుక రిలయన్స్ హస్తం ఉందని విమర్శలు వస్తున్నాయి. రిలయన్స్ కంపెనీకి లక్ష కోట్ల లాభం చేకూరేలా కేంద్రంలో అప్పటి మంత్రి మురళీ దేవర సహకరించారని అవినీతి వ్యతిరేక పోరాట యోధుడు కేజ్రీవాల్ ఆరోపించారు.అలాగే ప్రణబ్ ముఖర్జీ కూడా రిలయన్స్ కు పది వేల కోట్ల లాభం చేశారని కూడా ఆయన విమర్శించారు. దీనిపై దేశవ్యాప్తంగా ఆయా రాజకీయ పక్షాలు పెద్ద ఎత్తున స్పందిచాయి. సాధారణంగా అయితే దేశస్థాయిలో జరిగే పరిణామాలపై చంద్రబాబు ప్రత్యేకంగా మీడియా సమావేశం పెట్టి వ్యాఖ్యానిస్తుంటారు. అలాంటిది రిలయన్స్ పై ఆరోపణలు వస్తే ఇంతవరకు ఆయనగాని, ఆయన పార్టీ నేతలు కాని స్పందించలేదని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. మూడేళ్ల క్రితం వై.ఎస్. హత్య వెనుక ఈ సంస్థ హస్తం ఉందని రష్యాకు చెందిన ఒక వెబ్ సైట్ ఒక కధనాన్ని ఇచ్చింది. దాని ఆధారంగా ఇక్కడ కొన్ని టీవీ చానళ్లు కధనాలు , చర్చలు నడిపాయి.ఆ మీదట కొందరు రిలయన్స్ షాపులపై దాడులు చేశారు. ఆ మరుసటి రోజే చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం ఏర్పాటు చేసి రిలయన్స్ పై దాడిని తీవ్రంగా ఖండించారు. అంతవరకు బాగానే ఉంది.జగన్ పై లక్ష కోట్ల ఆరోపణ చేసే చంద్రబాబు నాయుడు ఇప్పుడు రిలయన్స్ పై లక్షపది వేల కోట్ల ఆరోపణలు వచ్చినా స్పందించరేమిటని కొంతమంది ప్రశ్నించడం ఆరంభించారు.తప్పు ఎక్కడ జరిగినా తప్పే. కాని రాజకీయ నాయకులు తమకు ఉన్న సంబంధాలతో కొంత రిజర్వుడుగా వ్యవహరిస్తుంటారు.అలాంటి ప్రభావం చంద్రబాబుపైన కూడా ఉందనుకోవాలా?అయితే కేజ్రీవాల్ రిలయన్స్ కు కాంగ్రెస్ ,బిజెపిలు రెండూ సన్నిహితమేనని వ్యాఖ్యానించిన విషయం చూస్తే రాజకీయ పార్టీలు, కార్పొరేట్ సంస్థలకు మధ్య పెనవేసుకున్న అనుబంధం అర్ధం కావడం లేదూ?

source:kommineni

జగన్ ను జైల్లో పెట్టి కిరణ్, చంద్రబాబులు యాత్రలు కొనసాగించటం కుట్రలో భాగం కాదా?

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జైలుకు ఎందుకు వెళ్లారో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి తెలియదా అని రాజంపేట ఎమ్మెల్యే అమర్నాధరెడ్డి ప్రశ్నించారు. ఓదార్పుయాత్ర కొనసాగితే కాంగ్రెస్, టీడీపీలకు ప్రజాదరణ కరువు అవుతుందనే కుమ్మక్కై జైలుకు పంపారని ఆయన బుధవారమిక్కడ అన్నారు.

జగన్ ను జైల్లో పెట్టి కిరణ్, చంద్రబాబులు యాత్రలు కొనసాగించటం కుట్రలో భాగం కాదా అని అమర్నాధరెడ్డి సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రంలో విశ్వసనీయత ఉన్నది ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకేనని ఆయన అన్నారు. కేజ్రీవాల్ బయటపట్టిన సీడీపై విచారణ చేయించాలని రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

TDP MLA Vanitha to join YSRCP

Ananta Adhraranalo Maro Prajaprasthanam 1st nov 2012

Sharmila's 15th day Maro Prajaprasthanam Padayatra Schedule

Sakshi Vedika with ysrcp NRI Wing convenor Medapati Venkat

జగన్ పాలన కోసం జనం నిరీక్షణ

 కాంగ్రెస్, టీడీపీ నాయకుల వైఖరితో విసుగు చెందిన రాష్ట్ర ప్రజలు ప్రత్యామ్నాయాన్ని కోరుకుంటున్నారని పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం ఎమ్మెల్యే తానేటి వనిత అన్నారు. జగన్ నాయకత్వంలో రాబోయే వైఎస్ రాజశేఖరరెడ్డి తరహా సుపరిపాలన కోసం జనం ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. బుధవారం రాజమండ్రిలో ఆమె విలేకరులతో మాట్లాడారు. 

టీడీపీ నుంచి తనను సస్పెండ్ చేయడం అన్యాయమని వాపోయారు. ముందస్తు నోటీసులూ ఇవ్వకుండా ఇలా నిర్ణయం తీసుకోవడం అప్రజాస్వామికమన్నారు. తనను సస్పెండ్ చేసినట్టు వచ్చిన వార్తలను టీవీల ద్వారా తెలుసుకున్నానని, ఇంతవరకూ పార్టీ నుంచి ఎలాంటి సమాచారం లేదన్నారు. జగన్‌ను జైలులో కలిశారనే వంకతో తంబళ్లపల్లి ఎమ్మెల్యే ప్రవీణ్ కుమార్‌రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారని, మరి తాను జగన్‌ను గాని, విజయమ్మను గాని ఇంతవరకూ కలవనే లేదని, తననెందుకు సస్పెండ్ చేసినట్టు అని ప్రశ్నించారు. 

కొవ్వూరులో నవంబర్ 4న వైఎస్సార్ కాంగ్రెస్ నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభలో పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ సమక్షంలో తాను ఆ పార్టీలో చేరతానని ప్రకటించారు. తనతోపాటు నియోజకవర్గం నుంచి వందలాది మంది టీడీపీ నాయకులు వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరతారన్నారు.

తెలుగుదేశం పార్టీలో కలవరం..

- రాజకీయ భవిష్యత్తుపై నేతల్లో ఆందోళన
- ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్న ఎమ్మెల్యేలు, నేతలు
- వరుస ఓటములు, వైఫల్యాలు కారణమనే అభిప్రాయం..
- కాంగ్రెస్‌తో మ్యాచ్‌ఫిక్సింగూ కొంపముంచుతోందనే భావన
- చంద్రబాబును ప్రజలు నమ్మడం లేదని అంగీకరిస్తున్న నాయకులు 
- ఇప్పటికే టీడీపీని వీడిన 13 మంది ఎమ్మెల్యేలు, పలువురు ముఖ్య నేతలు 

హైదరాబాద్, న్యూస్‌లైన్: తమ రాజకీయ భవిష్యత్తుపై తెలుగుదేశం పార్టీ నేతల్లో నమ్మకం సడలిపోతోంది. పార్టీలో కొనసాగి ప్రయోజనం లేదని వారు భావిస్తున్నారు. ఒక్కొక్కరుగా టీడీపీని వీడిపోతున్నారు. ఈ పరిణామాలు తెలుగుదేశం అధినాయకత్వాన్ని తీవ్రంగా కలవరపెడుతున్నాయి. ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా అధినేత పాదయాత్ర చేపట్టినా ప్రయోజనం లేకుండా పోతోందని ఆ పార్టీ నేతలే అభిప్రాయపడుతున్నారు.

2004, 2009 సాధారణ ఎన్నికల్లో వరుస పరాజయాల అనంతరం.. పార్టీ ఎలాంటి ఎదుగుదల సాధించకపోవడం, ముఖ్యంగా పార్టీ నాయకత్వంపై ప్రజల్లో విశ్వసనీయత సన్నగిల్లడం నాయకులను ఆందోళనకు గురిచేస్తోంది. 2009 సాధారణ ఎన్నికల తర్వాత గత మూడేళ్ల కాలంలో జరిగిన ఏ ఎన్నికలోనూ టీడీపీ తన ప్రభావాన్ని చూపకపోవడంతో నేతల్లో తీవ్ర నైరాశ్యం నెలకొంది. సమీప భవిష్యత్తులోనూ పార్టీ పరిస్థితి మెరుగుపడే సూచనలు కానరాకపోవడంతో ప్రత్యామ్నాయం తప్పదని టీడీపీ నేతలు భావిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాల అంతర్గత విశ్లేషణ. 2004 సాధారణ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పాలైంది. కేవలం 46 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. 

ఆ తర్వాత 2009 ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని ఆశించినా తీవ్ర నిరాశ ఎదురైంది. 92 స్థానాల వరకు గెలుచుకుని చతికిలపడింది. అనంతరం వరుస పరిణామాల నేపథ్యంలో నాయకత్వంపై నమ్మకం క్షీణించడం, వివిధ అంశాలపై స్పష్టత లేని కారణంగా ఇప్పటివరకు 13 మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడి బయటకువెళ్లారు. గత మూడేళ్ల కాలంలో రాష్ట్రంలో జరిగిన దాదాపు అన్ని ఉప ఎన్నికల్లో ఆ పార్టీ చాలా నియోజకవర్గాల్లో డిపాజిట్లు కోల్పోయింది. వివిధ అంశాలపై స్పష్టత లేకపోవడం, గతంలో సాధ్యం కాదని చెప్పిన వాటినే ఇప్పుడు చేస్తామంటూ హామీలు గుప్పించడం, ఎక్కడాలేని విధంగా అధికార కాంగ్రెస్ పార్టీతో రాజీపడటం, పార్టీ అధినేత చుట్టూ ఏర్పడిన కోటరీ, జిల్లా, రాష్ట్ర స్థాయి నేతల్లో అపరిష్కృతంగా ఉన్న విభేదాలు... వెరసి పార్టీ నాయకత్వం పట్టు కోల్పోయిన కారణంగా నాయకులు వేరే దారులు వెతుక్కుంటున్నారని పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించే ఒక నాయకుడు విశ్లేషించారు. 

26 నియోజకవర్గాల్లో డిపాజిట్లు గల్లంతు 
2009 సాధారణ ఎన్నికల తర్వాత కడ ప, నెల్లూరు లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని 14 నియోజకవర్గాలను కలుపుకొని రాష్ట్రం మొత్తంమీద 54 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో ఉప ఎన్నికలు జరిగాయి. ఒక్క బాన్సువాడ ఉప ఎన్నికల్లో మినహా టీడీపీ మిగిలిన అన్ని చోట్లా పోటీ చేసింది. ఏ ఒక్కచోటా పార్టీ అభ్యర్థులు గెలవకపోగా, మొత్తం 26 నియోజకవర్గాల పరిధిలో పార్టీకి డిపాజిట్ దక్కలేదు. 2010 జూలైలో జరిగిన 12 ఉప ఎన్నికల్లో టీడీపీకి డిపాజిట్ దక్కలేదు. ఎల్లారెడ్డి, సిరిసిల్ల, నిజామాబాద్ అర్బన్, మంచిర్యాల, చెన్నూరు, సిర్పూర్ కాగజ్‌నగర్, సిద్ధిపేట, వరంగల్ పశ్చిమ, ధర్మపురి, వేములవాడ, కోరుట్ల, హుజూరాబాద్ నియోజకవర్గాల్లో డిపాజిట్‌ను కోల్పోయింది. 2011 ఏప్రిల్‌లో జరిగిన కడప పార్లమెంట్ ఉప ఎన్నికల్లో ఆ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాలకు గాను ఆరుచోట్ల డిపాజిట్టు రాలేదు. 

ఈ ఏడాది మార్చిలో తెలంగాణలోని ఆరు చోట్ల, నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో ఉప ఎన్నికలు జరగగా.. కామారెడ్డి, నాగర్‌కర్నూలు, మహబూబ్‌నగర్‌లలో టీడీపీ డిపాజిట్‌ను దక్కించుకోలేక చతికిలపడింది. ఇదే ఏడాది జూన్‌లో నెల్లూరు లోక్‌సభ, 18 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఏ ఒక్క స్థానంలోనూ గెలకవకపోగా, అయిదు చోట్ల డిపాజిట్ కోల్పోయింది. ఆళ్లగడ్డ, రాజంపేట, రైల్వే కోడూరు, నర్సాపురం, రామచంద్రపురం (నెల్లూరు లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆత్మకూరు, కోవూరు, నెల్లూరు పట్టణ, నెల్లూరు గ్రామీణ నియోజకవర్గాల్లో కూడా) డిపాజిట్ కోల్పోయింది. ఈ విధంగా పార్టీ పరిస్థితి దిగజారిపోవడంతో పాటు.. ఇప్పటికిప్పుడు సాధారణ ఎన్నికలు జరిగితే టీడీపీ ప్రభావం ఏమాత్రం ఉండదని ఇటీవలి కాలంలో ఎన్డీటీవీ, ఇండియా టుడే, ఇతర సంస్థలు జరిపిన సర్వేల్లోనూ వెల్లడికావడం పార్టీ నేతల్లో ఆందోళనను మరింత పెంచింది.

ఒక్కొక్కరుగా బయటకు...
ఈ నేపథ్యంలో ఇప్పటికే మండల స్థాయి నుంచి పొలిట్‌బ్యూరో స్థాయి వరకు చాలామంది నేతలు పార్టీని వీడారు. తెలంగాణ అంశంపై పార్టీ వైఖరి స్పష్టం చేయకపోవడానికి నిరసనగా ఎమ్మెల్యేలు నాగం జనార్దనరెడ్డి, కొప్పుల హరీశ్వర్‌రెడ్డి, సముద్రాల వేణుగోపాలాచారి, పోచారం శ్రీనివాసరెడ్డి, గంపా గోవర్ధన్, చెన్నమనేని రమేష్, జోగు రామన్న పార్టీని వీడారు. వీరిలో కొప్పుల, సముద్రాల మినహా మిగిలిన వారందరూ తమ శాసనసభ్యత్వాలకు రాజీనామా చేసి స్వతంత్రంగా, టీఆర్‌ఎస్ అభ్యర్థులుగా పోటీచేసి తిరిగి గెలుపొందారు. అలాగే దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి పేరును సీబీఐ చార్జిషీట్‌లో చేర్చటాన్ని నిరసిస్తూ రాజీనామా చేసిన నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ తర ఫున పోటీచేసి తిరిగి గెలుపొందారు. జగన్‌పై అభిమానంతో కృష్ణా జిల్లా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని), కర్నూలు జిల్లా మంత్రాలయం ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి పార్టీని వీడారు. 

చంద్రబాబు తన సొంత సామాజికవర్గ నేతలను ప్రోత్సహించటాన్ని నిరసిస్తూ కృష్ణా జిల్లా నూజివీడు ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య ఇప్పటికే పార్టీకి దూరమయ్యారు. పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు డాక్టర్ ఎంవీ మైసూరారెడ్డి, ఉప్పులేటి కల్పన, ప్రధాన కార్యదర్శి బెరైడ్డి రాజశేఖరరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ముక్కు కాశిరెడ్డి, గొట్టిపాటి నర్సయ్య, డాక్టర్ బాచిన చెంచు గరటయ్య, చెంగల వెంకట్రావు, సంకినేని వెంకటేశ్వరరావు, ఎస్.రఘురామిరెడ్డి, పీవీ కృష్ణారావు (కృష్ణబాబు), చింతలపూడి, కొల్లాపూర్ నియోజకవర్గ ఇన్‌చార్జిలు డాక్టర్ రాజారావు, సీఆర్ జగదీశ్వరరావు తదితరులు పార్టీని వీడారు.

ప్రవీణ్, వనితల సస్పెన్షన్
చంద్రబాబు వ్యవహార శైలి, మ్యాచ్‌ఫిక్సింగ్ రాజకీయాలపై ఎంతోకాలంగా అసంతృప్తితో ఉన్న చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె ఎమ్మెల్యే ఏవీ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి కొద్ది రోజుల కిందట బాహాటంగానే తన అసంతృప్తి వ్యక్తం చేశారు. నాయకత్వం తీరు మారకపోతే పార్టీని వీడేందుకు సిద్ధమని ప్రకటించారు. మంగళవారం ఆయన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డిని చంచల్‌గూడ జైల్లో కలిసినట్టు టీవీల్లో వార్తలు ప్రసారం కావడంతో.. ఆయన్ను వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లుగా టీడీపీ మీడియా కమిటీ కన్వీనర్ ఎల్వీఎస్సార్కే ప్రసాద్ ప్రకటించారు. చిత్తూరు జిల్లా పలమనేరు ఎమ్మెల్యే ఎన్.అమరనాథరెడ్డి కూడా అధినేత నాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారు. పార్టీ బలోపేతానికి కాకుండా బలహీనపరిచేందుకు అన్నట్లుగా చంద్రబాబు చర్యలున్నాయని ఆయన ఇప్పటికే పలు విమర్శలు చేశారు.

స్థానిక నేత ముళ్లపూడి బాపిరాజు తన నియోజకవర్గంలో జోక్యం చేసుకోవట ం పట్ల నిరసన వ్యక్తం చేసిన పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం ఎమ్మెల్యే తానేటి వనితను కూడా త క్షణమే సస్పెండ్ చేస్తున్నట్లు ప్రసాద్ ప్రకటించారు. కాగా రాష్ట్రపతి ఎన్నికల్లో యూపీఏ బలపరిచిన అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీకి ఓటు వేసిన తనను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు ప్రకటించిన టీడీపీ ఇప్పటివరకూ తనకు అధికారికంగా ఎలాంటి సమాచారం అందించలేదని నూజివీడు ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య తెలిపారు. ఇదే విషయమై ఎన్నికల కమిషన్‌కు లేఖ రాయటంతో పాటు పార్టీ గుర్తింపును రద్దు చేయాల్సిందిగా కోరతానని తెలిపారు. 

పాదయాత్రతోనూ ఫలితం లేదా..!
చంద్రబాబు ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయారని పార్టీ నేతలే అంతర్గత చర్చల్లో అంగీకరిస్తున్నారు. చంద్రబాబు మాత్రం ఇటు పార్టీ నేతలు, అటు ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించే పేరిట అక్టోబర్ రెండో తేదీ నుంచి 117 రోజుల సుదీర్ఘ పాదయాత్రకు ఉపక్రమించారు. తన యాత్ర పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుందని ఆయన ఊహించారు. అందుకు భిన్నంగా ఒకపక్క బాబు యాత్ర కొనసాగుతుంటే మరోపక్క ఆ పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు టీడీపీని వీడిపోతుండటం అధినాయకత్వాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. 

వారిపై అనర్హత పిటిషన్!
తెలుగుదేశం నుంచి సస్పెండైన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాల్సిందిగా స్పీకర్‌ను కోరాలని ఆ పార్టీ నిర్ణయించింది. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న మంత్రాలయం ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డిపై చర్య తీసుకోవాల్సిందిగా టీడీపీ ఇప్పటికే స్పీకర్‌కు పిటిషన్ అందజేసింది. తాజాగా పార్టీ నుంచి సస్పెండైన కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని), చిన్నం రామకోటయ్య, తానేటి వనిత, ఏవీ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, పార్టీకి రాజీనామా చేసినా ఇంకా ఆమోదించని కొప్పుల హరీశ్వర్‌రెడ్డి, డాక్టర్ సముద్రాల వేణుగోపాలాచారిలపై అనర్హత పిటిషన్‌ను త్వరలో స్పీకర్‌కు అందజేస్తామని పార్టీ నేత ఒకరు బుధవారం మీడియాకు తెలిపారు. ఇదిలా ఉంటే పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు దాడి వీరభద్రరావు మీడియాతో మాట్లాడుతూ తమ పార్టీ గుర్తుపై ఎన్నికైన ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి మరో పార్టీలో చేరితే మంచిదని అన్నారు.

వైఎస్ భారతి సవాల్‌కు టీడీపీ సిద్ధమా: జూపూడి

- జగన్‌పై మీ ఆరోపణలు నిజమని మీ బిడ్డల మీద ప్రమాణం చేస్తారా?
- ములాఖత్‌ల విషయంలో కావాలనే అనవసర రాద్ధాంతం చేస్తున్నారు
- బాబు యాత్ర ఉత్తరాంధ్రకు చేరేలోపు పార్టీ ఎమ్మెల్యేలంతా ఉడాయించడం ఖాయం

హైదరాబాద్, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ములాఖత్‌ల విషయంలో తెలుగుదేశం పార్టీ నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ సీజీసీ సభ్యుడు, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్‌రావు మండిపడ్డారు. మొన్నటికి మొన్న జైలులో జగన్ ఫోన్లు మాట్లాడుతున్నాడంటూ అసత్య ఆరోపణలు చేశారని, దానిపై జగన్ సతీమణి భారతి చేసిన సవాలుకు మాత్రం నోరు మెదపలేదని అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ నేతలకు రాజకీయాల్లో విలువలుంటే గోబెల్స్ ప్రచారం మానుకొని.. బిడ్డల మీద ప్రమాణం చేయాలన్న భారతి సవాలును స్వీకరించాలన్నారు. 

పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం జూపూడి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘గోబెల్స్ ప్రచారం చేయడంలో ఆరితేరిన చంద్రబాబు, ఆ పార్టీ నేతలు జగన్ ములాఖత్ విషయాన్ని రాద్ధాంతం చేస్తున్నారు. సాధారణంగా ములాఖత్ ద్వారా కలిసే ప్రతి ఒక్కరి పేరు రికార్డులో నమోదు చేస్తారన్న కనీస ఇంగితజ్ఞానం టీడీపీ నేతలకు లేదా?’’ అని దుయ్యబట్టారు. టీడీపీ నేతలకు జగన్‌పై ఉన్నంత ధ్యాస ప్రజా సమస్యలపై ఉండుంటే రాష్ట్రం ఈ దుస్థితికి వచ్చేది కాదన్నారు.

మీ మాటలకు నవ్వాలో ఏడ్వాలో అర్థంకాని పరిస్థితి..
‘‘రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన రెండు రూపాయల కిలో బియ్యాన్ని ఒక్క రూపాయికి తగ్గించానని, పావలా వడ్డీని రద్దుచేసి ఉచితంగా రుణాలు ఇస్తున్నామని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పుకుంటున్న తీరు చూసి ప్రజలు నవ్వాలో ఏడవాలో అర్థంకాని పరిస్థితి. వైఎస్ లెక్కలేనన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి, ఏ ఒక్కదానిలోనూ ఒక్క అడుగు వెనక్కి వేయకుండా ఐదేళ్లు పాలించారు.

కిరణ్ మాత్రం ప్రజలపై ఇబ్బడిముబ్బడిగా పన్నులు మోపుతూ వారి నడ్డివిరుస్తున్న మాట వాస్తవం కాదా?’’ అని జూపూడి నిలదీశారు. తొమ్మిదేళ్ల పాలనలో రైతులను వీధుల్లో పడేలా చేసింది చంద్రబాబేనని, అలాంటి వ్యక్తి ఇప్పుడు చెప్పే హామీలను ప్రజలు నమ్మడంలేదన్నారు. ఆయన పాదయాత్ర ఉత్తరాంధ్రకు చేరుకునేలోపు పార్టీ ఎమ్మెల్యేలందరూ ఉడాయించడం ఖాయమని జోస్యం చెప్పారు. అందుకే ఆ పార్టీ నేతలు చంద్రబాబు చేత పాదయాత్రను విరమింపజేసేందుకు కాళ్లనొప్పి, నడుంనొప్పి అంటూ సాకులు చెప్తున్నారన్నారు.

అబద్ధాల చంద్రబాబు

షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ 
బుధవారం యాత్ర ముగిసేనాటికి.. రోజులు: 14, కిలోమీటర్లు: 188.30
బాబు హయాంలో గ్యాస్ ధర పెరగలేదట! 
ఫీజుల పథకం, ఆరోగ్యశ్రీ ఆయన ఆలోచనలేనట!
ఈ ప్రభుత్వం అన్ని విధాలుగా విఫలమైంది
దాన్ని నిలదీయాల్సిన చంద్రబాబు.. సర్కారుతోనే కుమ్మక్కయ్యారు
14వ రోజు వర్షంలోనూ ఆగని షర్మిల.. 3 కి.మీ. మేర తడుస్తూనే యాత్ర 

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘న్యూస్‌లైన్’ ప్రత్యేక ప్రతినిధి: అధికార కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కయిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన పాదయాత్రలో అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చెల్లెలు షర్మిల విమర్శించారు. ‘‘ప్రజలకు మేలు చేయడంలో, వారి సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం అన్ని విధాలుగా ఘోరంగా విఫలమైంది. తాగునీరు, సాగునీరు, కరెంటు ఇవ్వడంలోనూ, ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించడంలోనూ, నిరుపేదల ఆరోగ్యం పరిరక్షించడంలోనూ విఫలమైంది. నిలదీయాల్సిన ప్రధాన ప్రతిపక్షం టీడీపీ.. ఆ సర్కారుకే కొమ్ముకాస్తోంది. ఇది చాలదన్నట్లు ఇప్పుడు చంద్రబాబు పాదయాత్రలో కొత్తగా అబద్ధాలు వల్లె వేస్తున్నారు. 

తన హయాంలో గ్యాస్ ధర పెరగలేదట. ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ తన ఆలోచనేనట. నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడుతున్నారాయన’’ అని షర్మిల మండిపడ్డారు. ‘‘కాంగ్రెస్, టీడీపీ కలిసి నీచమైన కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతున్నాయి. ఇంతటి అన్యాయం, ఘోరం, నీచమైన రాజకీయాలు మరెక్కడా లేనేలేవు. ఇంతటి కుట్రలు, కుతంత్రాలు ఇంతకుముందెన్నడూ లేవు. వారంతా పెద్ద మనుషులే. కానీ చిన్న మనసులు..’’ అని విమర్శించారు. ‘మరో ప్రజా ప్రస్థానం’ పాదయాత్ర 14వ రోజు బుధవారం అనంతపురం జిల్లా కూడేరులో జరిగిన భారీ బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజా సమస్యలు పట్టని ప్రభుత్వ వైఖరికి, దానితోనే కుమ్మక్కయిన టీడీపీ వైఖరికి నిరసనగా వైఎస్ జగన్ తరఫున ఈ యాత్ర చేపట్టిన షర్మిల బుధవారం వర్షంలోనూ ఆగకుండా పాదయాత్ర చేశారు.

పెట్టుబడి రూ. 50 వేలు.. పంట రూ. 5 వేలు: ఉదయం 10.30కు కమ్మూరు క్రాస్‌రోడ్డు నుంచి బయలుదేరిన షర్మిల అరవకూరు సమీపంలో ఎండిపోయిన ఓ వేరుశనగ పంటను పరిశీలించారు. అరవకూరుకు చెందిన నారాయణ అనే ఆ రైతు తాను ఐదెకరాల్లో రూ. 50 వేల పెట్టుబడితో వేరుశనగ పంట వేయగా.. చెట్టుకు ఒకటో రెండో కాయలు మాత్రమే కాశాయని, ఇప్పటికే ఆకు ఎండి రాలిపోతోందని వాపోయారు. పంటకు మొత్తం రూ. 5 వేలకు మించి వచ్చే పరిస్థితి లేదని, చేను తెంపేందుకే ఇవి సరిపోవని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ పంట ద్వారా రూ. 45 వేలు నష్టపోయినట్టేనని కన్నీటి పర్యంతమయ్యారు.

నష్టపరిహారం కూడా వచ్చే అవకాశం లేదని తోటి రైతులు అంటున్నారని, వాతావరణ బీమా అంటూ ఎంత ప్రీమియం కడితే అంతే పరిహారం వస్తుందని చెబుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. దీనికి షర్మిల స్పందిస్తూ ‘చంద్రబాబు ప్రభుత్వంలోనూ ఇదే జరిగింది. ఆయన మైండ్‌సెట్‌లోకే ప్రజలు రావాలన్నారుగానీ ఆయన మాత్రం ప్రజల అవసరాలను గుర్తించలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా పరిహారం చెల్లించే ఉద్దేశం లేకనే ఇలా నడచుకుంటోంది. రాజన్న ఉన్నప్పుడు గ్రామం యూనిట్‌గా దాదాపు 95 శాతం వరకు పరిహారం ఇచ్చారు.. పెన్నా రిజర్వాయర్‌కు నీళ్లు తెచ్చి చెరువులు నింపి తద్వారా గ్రామాలకు సాగునీటి కొరతను తీర్చారు..’ అని గుర్తుచేశారు. ఉదయం 11.30కు అరవకూరు చేరుకోగానే మహిళలు షర్మిలకు స్వాగతం పలికి అక్కడే కూర్చుని తమ సమస్యలు విన్నవించారు.

రూ. 20 వేల కరెంటు బిల్లు:
కూడేరు సమీపంలో గాంగ్యా నాయక్ అనే రైతుకు చెందిన చీనీ తోటను పరిశీలించిన షర్మిలతో ఆ రైతు మాట్లాడుతూ.. ఉచిత విద్యుత్తు అంటూనే రూ. 20 వేల కరెంటు బిల్లు కట్టాలని తనను వేధిస్తున్నారని, బుధవారం ఉద యం కూడా అధికారులు తన దగ్గరికి వచ్చారని వివరించారు. చీనీ(బత్తాయి)కి ధర లేదని, గిట్టుబాటు కావడం లేదని వాపోయారు. ‘సర్‌చార్జీలు వేసి ఉండొచ్చు. 

ఈ ప్రభుత్వం రైతులను దెబ్బతీసే చర్యలే తప్ప వారికి ప్రయోజనం కలిగించే చర్యలు చేపట్టడం లేదు. జగనన్న రాగానే పంటల గిట్టుబాటుకు రూ. 3 వేల కోట్ల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తారు’ అని షర్మిల భరోసా ఇచ్చి ముందుకు కదిలారు. సాయంత్రం 5.10కి పాదయాత్ర కూడేరుకు చేరుకునే సరికి అక్కడ బహిరంగ సభకు భారీగా జనం తరలివచ్చారు. 

కిక్కిరిసిపోయిన జనం మధ్య షర్మిల మాట్లాడుతూ అధికార, ప్రతిపక్షాల తీరును దునుమాడారు. బుధవారం నాటి పాదయాత్రలో ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శోభానాగిరెడ్డి, గురునాథరెడ్డి, కాపు రాంచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ నారాయణరెడ్డి, మాజీ శాసన సభ్యుడు ప్రసాదరాజు, పార్టీ సీజీసీ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి, పార్టీ నేతలు వాసిరెడ్డి పద్మ, కొల్లి నిర్మలాకుమారి, కాపు భారతి తదితరులు పాల్గొన్నారు.

బుధవారం యాత్ర 12 కిలోమీటర్ల మేర సాగింది. తుపాను నేపథ్యంలో ఉదయం పూట తుంపర్లతో చిరుజల్లులు కురవగా.. సాయంత్రం 6 నుంచి రాత్రి 7 గంటల వరకు ఈదురుగాలులతో కూడిన ఒక మోస్తరు వర్షం కురిసింది. వర్షంలోనే షర్మిల 3 కిలోమీటర్ల వరకు పాదయాత్ర కొనసాగించి.. రాత్రి 7 గంటలకు ముద్దలాపురం సమీపంలో రోడ్డు పక్కన టెంట్‌లోనే బసచేశారు. బుధవారం నాటికి పాదయాత్ర మొత్తం 188.3 కిలోమీటర్లు పూర్తిచేసుకుంది.

source:sakshi

నేడు షర్మిల పాదయాత్ర సాగే దిలా..

మహానేత వైఎస్ తనయ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర గురువారం ముద్దలాపురం నుంచి ప్రారంభమై వైఎస్సార్ వాటర్ ప్రాజెక్టు, జల్లిపల్లి, ఉదిరిపికొండ, శివరాంపేట మీదుగా భంభంస్వామి గుట్ట వరకు సాగుతుందని వైఎస్సార్ సీపీ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ తలశిల రఘురాం, జిల్లా కన్వీనర్ ఎం.శంకరనారాయణ తెలిపారు. గురువారం భంభంస్వామి గుట్ట వద్దే రాత్రి బస చేయనున్న షర్మిల 13 కిలోమీటర్ల మేర నడవనున్నారు. జల్లిపల్లిలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. 

రేపు షెక్షాన్‌పల్లిలో సభ
షర్మిల ‘మరో ప్రజా ప్రస్థానం’ పాదయాత్ర శుక్రవారం భంభం స్వామి గుట్ట నుంచి ప్రారంభమై పెన్నహోబిలం, పీఏబీఆర్ కాలువ, కోనాపురం క్రాస్, కోనాపురం మీదుగా సాగుతుంది. షెక్షాన్‌పల్లిలో బహిరంగ సభ ఉంటుంది. అనంతరం లత్తవరం సమీపంలో రాత్రి బస చేస్తారు. ఆ రోజు మొత్తం 12.5 కిలోమీటర్లు నడుస్తారని వైఎస్సార్ సీపీ సీఈసీ సభ్యుడు వై. విశ్వేశ్వరరెడ్డి తెలిపారు.

జల్లులు కురుస్తున్నా చెక్కుచెదరని అభిమానo.

 జడివానతో జనం పోటీపడ్డారు. జల్లులు కురుస్తున్నా చెక్కుచెదరని అభిమానానికి రాజన్న తనయ, జననేత జగనన్న సోదరి షర్మిల తడిసిముద్దయ్యారు. ఆత్మీయ పలకరింపులు.. అధైర్య పడొద్దంటూ ఓదార్పు.. భవిష్యత్‌పై భరోసా ఇవ్వడంతో జనాభిమానం ఉప్పొంగింది. అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టి ఘనస్వాగతం పలికారు. మంగళవారం రాత్రి కమ్మూరుకు సమీపంలో అగ్రిగోల్డ్ ఎస్టేట్ వద్ద బస చేసిన షర్మిల బుధవారం ఉదయం 10.30 గంటలకు పాదయాత్రకు ఉపక్రమించారు. 

గుడారం నుంచి షర్మిల అడుగు బయట పెట్టగానే అప్పటిదాకా మేఘావృతమై ఉన్న ఆకాశం నుంచి వర్షపు చినుకులు మొదలయ్యాయి. ఆ చినుకులతో జనం కూడా పోటీపడ్డారు. షర్మిల గుడారం నుంచి బయటకు వచ్చే సరికే ఆ ప్రాంతమంతా జనసంద్రంగా మారింది. జడివానలోనూ జనం చెక్కుచెదరక పోవడంతో షర్మిల కదనోత్సాహంతో అడుగులు ముందుకేశారు. పాదయాత్ర అరవకూరుకు చేరుకోవడానికి ముందు వేరుశనగ పొలంలోకి షర్మిల వెళ్లి.. రైతు నారాయణతో పంట పరిస్థితిపై ఆరా తీశారు. 

‘అన్నా.. ఎన్ని ఎకరాల్లో వేరుశనగ పంట వేశావు.. పంట దిగుబడి ఏ మేరకు వస్తుంది’ అంటూ ఆరా తీశారు. ఇందుకు నారాయణ స్పందిస్తూ.. ‘అమ్మా.. వర్షాల్లేక పంటలు ఎండిపోతున్నాయి. మహానేత వైఎస్ ఉన్నప్పుడు పంటల బీమా పథకం వల్ల పంట నష్టపోతే నష్టపరిహారం అందేది. కానీ.. ఇప్పుడు వాతావారణ బీమా వల్ల ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతోంది. ప్రీమియం కింద రూ.300 మేం చెల్లిస్తుంటే.. బీమా సంస్థ రూ.200ను పరిహారంగా ఇస్తోంది. మేం ఎకరం వేరుశనగ సాగు చేయడానికి రూ.పది వేలు ఖర్చవుతోంది. 



బ్యాంకుల్లో పెళ్లాం మెడలో తాళిబొట్టును కూడా కుదువపెట్టి రుణం తెచ్చి పంటలు సాగు చేసుకుంటున్నాం. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందడం లేదు’ అంటూ వాపోయారు. ‘అన్నా.. ఈ ప్రభుత్వానికి రైతులంటే చులకన.. చంద్రబాబు ప్రభుత్వం మాదిరే ఈ సర్కారు కూడా.. ఆందోళన చెందవద్దు.. రాజన్న రాజ్యం వస్తుంది. మళ్లీ రైతే రాజు అవుతారు’ అంటూ షర్మిల భరోసా ఇచ్చారు. అక్కడి నుంచి అరవకూరుకు చేరుకున్న షర్మిలకు.. ఆ గ్రామ శివారులో మహిళలు హారతులు పట్టి.. దిష్టి తీసి ఘనస్వాగతం పలికారు. అరవకూరులో షర్మిల నడిచినంత దూరం ఆమెపై బంతిపూల వర్షం కురిపించారు.

ఇదెక్కడి చోద్యం..
అరవకూరులో షర్మిల రచ్చబండ నిర్వహించారు. ఆ గ్రామానికి చెందిన చిదంబరమ్మ అనే మహిళ ‘అమ్మా.. పీఏబీఆర్ డ్యాం పక్కనే ఉంది. వైఎస్ హయాంలో మా ఊరి చెరువుకు నీళ్లిచ్చినారు. పంటలు బాగా పండించుకున్నాం. రెండేళ్లుగా చెరువుకు నీళ్లు ఇవ్వడం లేదు. బోర్లు అన్నీ ఎండిపోయినాయి. తాగడానికే గుక్కెడు నీళ్లు లేవు. ఇంక పంటలేం పండించుకుంటాం.. ఏం తిని బతుకుతాం’ అంటూ షర్మిల ముందు విలపించింది. సుశీలమ్మ అనే మరో మహిళ మాట్లాడుతూ ‘సేద్యానికి కరెంట్ రెండు గంటలు కూడా ఇవ్వడం లేదు. వేళాపాళా లేకుండా కరెంట్ సరఫరా చేస్తున్నారు. పంటల కథ దేవుడెరుగు.. కనీసం పశువులకు మేత కూడా లేదు.. ఎలా బతికేది’ అంటూ షర్మిల ముందు వాపోయారు. 

ఇంతలోనే మరో మహిళ మాట్లాడుతూ ‘అమ్మా.. మా గ్రామానికి ఆమ్‌ఆద్మీ బీమా లేదు.. అభయహస్తం పెన్షన్‌లు లేవు.. ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వడం లేదు. పంట నష్టపరిహారం కూడా ఇవ్వలేదు. ఈ ప్రభుత్వంలో అన్నీ సమస్యలే. ఈ ప్రభుత్వం చంద్రబాబు పాలనను తలపిస్తోంది. వైఎస్ ఉన్నప్పుడు మాకు ఎలాంటి కష్టాలు ఉండేవి కాదు’ అంటూ షర్మిలకు వివరించారు. 

జయపురం గ్రామానికి చెందిన ఓ ఎస్సీ విద్యార్థిని మాట్లాడుతూ ‘ఫీజులు కట్టే స్థోమత లేక చదవు మానేశా. వైఎస్ ఉండి ఉంటే ఫీజు కట్టేవారు.. నేను చదువుకుని.. మంచి ఉద్యోగం చేసి, మా అమ్మానాన్నలను బాగా చూసుకునేదాన్ని’ అంటూ విలపించింది. ఇందుకు షర్మిల స్పందిస్తూ.. ‘పీఏబీఆర్‌కు వైఎస్ పది టీఎంసీల నీటిని కేటాయిస్తూ జీవో జారీ చేశారు. వైఎస్ తన హయాంలో ఏటా నీటిని విడుదల చేయించారు. 

అందుకే అప్పుడు తాగు, సాగునీటికి ఇబ్బంది ఉండేది కాదు.. కానీ.. ఇప్పుడు ఈ ప్రభుత్వం పీఏబీఆర్‌కు నీటిని విడుదల చేయించడం లేదు. అందుకే ఈ నీటి కష్టాలు.. వైఎస్ చేపట్టిన ప్రతి పథకాన్ని ఈ ప్రభుత్వం నీరుగార్చుతోంది. చంద్రబాబు పాలనను ఈ ప్రభుత్వం తలపిస్తోంది. కాంగ్రెస్, టీడీపీ రెండూ రెండే.. కొద్ది రోజులు ఓపికపట్టండి.. రాజన్న రాజ్యంలో అందరికీ మేలు చేసే పాలన వస్తుంది’ అంటూ భరోసా ఇచ్చారు.

కుర్చీ కోసమే కాంగ్రెస్, టీడీపీ ఆరాటం..
కూడేరులో వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళులు అర్పించిన అనంతరం షర్మిల మాట్లాడుతూ కాంగ్రెస్, టీడీపీలపై నిప్పులు చెరిగారు. ‘జనం సమస్యలతో తల్లడిల్లుతుంటే పాలక కాంగ్రెస్ పార్టీ కుర్చీలాట ఆడుతోంది. ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దెదింపాల్సిన టీడీపీ అధినేత పాదయాత్ర అంటూ కొత్త డ్రామాలు మొదలుపెట్టారు. చంద్రబాబు హయాంలో నాలుగు వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ పాపం చంద్రబాబు ప్రభుత్వానిదే.. ఇప్పుడు పాదయాత్రలో గ్రామాల్లో ప్రజల కాళ్లు, చేతులు పట్టుకున్నా చంద్రబాబు చేసిన పాపం పోదు.. కుర్చీ కోసమే చంద్రబాబు ఆరాటపడుతున్నారు.. కుమ్మక్కు రాజకీయాలతో ప్రజాకంఠక పాలన సాగిస్తోన్న కాంగ్రెస్‌కూ.. ఆ పార్టీతో కుమ్మక్కైన టీడీపీకి బుద్ధి చెప్పండి.. విశ్వసనీయత, మాట మీద నిలబడే నైజం ఉన్న జగనన్నను ఆశీర్వదించండి. రాజన్న రాజ్యం వస్తుంది. 

వైఎస్ ఇచ్చిన ప్రతి మాటనూ జగనన్న నెరవేర్చుతారు’ అంటూ భరోసా ఇచ్చారు. ఇక్కడే ఓ అబ్బాయికి రాజశేఖర్ అని షర్మిల నామకరణం చేశారు. కూడేరు నుంచి నాలుగు కిలోమీటర్ల దూరం నడిచిన తర్వాత ముద్దలాపురం సమీపంలో రోడ్డు పక్కన వేసిన గుడారాల వద్దకు రాత్రి 7.10 గంటలకు చేరుకున్న షర్మిల పాదయాత్రను ముగించి.. అక్కడే బసచేశారు. బుధవారం 12 కిలోమీటర్ల మేర నడిచారు. 


సేద్యానికి ఉచిత విద్యుత్ ఎక్కడ?
అరవకూరు నుంచి కూడేరుకు చేరుకునే క్రమంలో మార్గమధ్యలో 12.40 గంటలకు భోజనం చేసిన షర్మిల, కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నారు. అనంతరం నాలుగు గంటలకు పాదయాత్రను ప్రారంభించారు. అదే మార్గంలో రోడ్డు పక్కనే ఉన్న చీనీ తోటలోకి వెళ్లారు. రైతు గాంగేనాయక్‌ను పంట పరిస్థితిపై ఆరాతీశారు. ‘అమ్మా.. కరెంట్ కోతల వల్ల చీనీ చెట్లకు సరిగ్గా నీళ్లు పెట్టలేకపోతున్నా. సేద్యానికి ఉచిత విద్యుత్ అంటోన్న ప్రభుత్వం మరో వైపు రూ.20 వేల బిల్లు కట్టాలని నోటీసులు ఇచ్చింది. తక్షణమే రూ.20 వేలు కట్టాలని అధికారులు వేధిస్తున్నారు. ఈ రోజు ఉదయం కూడా అధికారులు వచ్చి నన్ను వేధించారు’ అంటూ వాపోయారు. ఇందుకు షర్మిల స్పందిస్తూ.. ‘ఇదీ ఈ సర్కారు పనితీరు. ఉచిత విద్యుత్ అంటూ ఈ ప్రభుత్వం బిల్లులు వసూలు చేస్తోంది. 

బిల్లులు కడతావా విద్యుత్ తీగలను కత్తిరించాలా అని వేధిస్తుంటే రైతులు ఎలా కట్టగలరు.. చంద్రబాబు హయాంలో ఇలా చేయడం వల్లే రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇప్పుడూ అదే జరుగుతోంది. అన్నా.. అధైర్యపడొద్దు.. మన రాజన్న రాజ్యం వస్తుంది.. సేద్యానికి తొమ్మిది గంటల ఉచిత విద్యుత్‌ను సరఫరా చేస్తుంది’ అంటూ ధైర్యం చెప్పారు. అక్కడి నుంచి కూడేరుకు చేరుకున్న షర్మిలకు ఆ గ్రామ ప్రజలు ఆత్మీయ స్వాగతం పలికారు. గ్రామ శివారు నుంచి మహానేత వైఎస్ సర్కిల్‌కు చేరుకునే వరకూ షర్మిలపై బంతిపూల వర్షం కురిపించి.. అభిమానాన్ని చాటుకున్నారు. లంబాడీ మహిళలు సంప్రదాయ నృత్యం చేసి.. షర్మిలకు ఘన స్వాగతం పలికారు. 


కూడేరు జనమేరు అయినవేళ..
‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్రలో తొమ్మిదో రోజూ షర్మిలకు నీరాజనాలు పలికిన జనం
వర్షంలోనూ షర్మిల అడుగులో అడుగేస్తూ కదం తొక్కిన జనం
వాతావరణ బీమా పేరుతో వేరుశనగ రైతులను ప్రభుత్వం మోసం చేస్తోందంటూ షర్మిలకు 
నివేదించిన రైతులు
పీఏబీఆర్ పక్కనే ఉన్నా చెరువులకు నీళ్లు లేవు.. పశువులకు మేత లేదని.. బతుకు భారమైందని విలపించిన జనం
సేద్యానికి ఉచిత కరెంట్ అంటూనే వేలకు వేలు బిల్లులు కట్టాలంటూ అధికారులు 
వేధిస్తున్నారంటూ ఫిర్యాదు
కొద్ది రోజులు ఓపిక పట్టండి.. రాజన్న రాజ్యం వస్తుంది.. అందరికీ మేలు జరుగుతుందని 
భరోసా ఇచ్చిన షర్మిల

Popular Posts

Topics :