02 December 2012 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

బాబు ఏం సమాధానం చెబుతారు?: అంబటి

Written By news on Saturday, December 8, 2012 | 12/08/2012

కాంగ్రెస్ పార్టీకి నిమిషం కూడా పరిపాలించే హక్కు లేదంటున్న చంద్రబాబు తమ పార్టీ ఎంపిలు రాజ్యసభలో గైర్హాజరుపై ఏం సమాధానం చెబుతారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ప్రశ్నించారు. చీకట్లో ఎందుకు లాలూచీ పడతారు, టీడీపీని కూడా కాంగ్రెస్‌లో విలీనం చేయమని సలహా ఇచ్చారు. చిరంజీవికి వచ్చినట్లు కేంద్రమంత్రి పదవి వస్తుందన్నారు. చంద్రబాబు కాంగ్రెస్ వ్యతిరేకి అనుకుని టీడీపీ శ్రేణులు భ్రమపడవద్దని జాగ్రత్తలు చెప్పారు.


కాంగ్రెస్,టిడిపి కుమ్మక్కు రాజకీయం రాజ్యసభ ఘటనతో తేలిపోయిందని వైఎస్‌ఆర్ సీపీ దక్షిణ తెలంగాణ ఇన్‌ఛార్జ్ జిట్టా బాలకృష్ణరెడ్డి చెప్పారు. మిర్యాలగూడలో ఈరోజు జిట్టా బాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో 200 మంది కార్యకర్తలు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో నల్గొండ జిల్లాలో షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర కొనసాగుతుందని చెప్పారు.

నార్వేపై ఒత్తిడి తీసుకురండి: విజయమ్మ

కుమారుడుని వేధించారనే ఆరోపణలపై నార్వేలో జైలుశిక్ష అనుభవిస్తున్న వి. చంద్రశేఖర్, అనుపమ దంపతులను త్వరగా విడుదల అయ్యేలా చర్యలు చేపట్టాలని భారత ప్రభుత్వానికి వైఎస్‌ఆర్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ విజ్ఞప్తి చేశారు.ఈ మేరకు ఆమె భారత విదేశీ వ్యవహారాలు, ప్రవాస వ్యవహారాల మంత్రిత్వ శాఖలకు శుక్రవారం లేఖలు రాశారు. వీరి విడుదలకు నార్వే ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని భారత్‌కు ఆ లేఖలో వైఎస్ విజయమ్మ సూచించారు. 

వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించిన షర్మిల

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన ‘మరో ప్రజా ప్రస్థానం’ పాదయాత్ర శనివారం అల్వాల నుంచి ప్రారంభమం అయ్యింది. అల్వాల ప్రజలు ఏర్పాటు చేసిన వైఎస్ విగ్రహాన్ని ఆమె ఆవిష్కరించారు. పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. 

తులవానిగడ్డ, ఎక్లాస్‌ఖాన్‌పేట, సంగెం, కొంగగూడ, కలోని తండా వరకు షర్మిల యాత్ర కొనసాగుతుంది. ఇప్పటికే 724 కిలో మీటర్ల పాదయాత్ర పూర్తి చేసిన ఆమె ఇవాళ మరో 15.5 కిలోమీటర్లు నడవనున్నారు. రాత్రికి కలోని తండాలో షర్మిల బస చేస్తారు.

కేసుల నుంచి తప్పించుకునేందుకే..........

టిడిపి అధ్యక్షుడు చంద్రబాబుపై ఉన్న కేసుల నుంచి తప్పించుకునేందుకే ఎఫ్ డిఐలపై ఓటింగ్ జరిగిన రోజున ఆ పార్టీ సభ్యులు రాజ్యసభకు గైర్హాజరయ్యారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్ర రావు విమర్శించారు. తన మీద కేసులు లేకుండా చేస్తే, ప్రభుత్వాన్ని కాపాడతానని చంద్రబాబు ఒప్పందం చేసుకున్నారని, ఇదే 
నిజమైన క్విడ్ ప్రోకో అని ఆయన అన్నారు. కేసుల నుంచి తప్పించుకోవడానికే ప్రభుత్వానికి మద్దతు పలుకుతున్నారని 
చెప్పారు. సుజనా చౌదరి చంద్రబాబు ఆత్మ అని, ఆయన (ఆత్మ) నాయకుడుకు తెలియకుండా లోక్ సభకు గైర్హాజరవుతారా? అని ఆయన ప్రశ్నించారు. తనని కాంగ్రెస్ వారు మేనేజ్ చేయలేరని దేవేంద్ర గౌడ్ చెబుతున్నారని, అంటే వాళ్ల నేత చెబితేనే గైర్హాజరయినట్లు అర్ధమవుతోందన్నారు.

కాంగ్రెస్ తో బాబు లాలూచీ: అంబటి

ఎఫ్ డీఐ బిల్లు ఓటింగ్ జరుగుతున్నప్పుడు ముగ్గురు రాజ్యసభ సభ్యులు సభకు హాజరు కాకపోవడం చంద్రబాబు కుమ్మక్కు రాజకీయాలకు చక్కని ఉదాహరణ అని అంబటి రాంబాబు అన్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఎదుర్కొలేక, ఆయనను ఇబ్బంది పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీతో బాబు కుమ్మక్కు అయ్యారని అంబటి శనివారమిక్కడ వ్యాఖ్యానించారు. 

అసెంబ్లీలో అవిశ్వాసం పెట్టకుండా కాంగ్రెస్ కు ఎలాంటి నష్టం కలగకుండా చంద్రబాబు జాగ్రత్త పడ్డారని అంబటి అన్నారు. ఉప ఎన్నికల్లో నర్సాపురం, రామచంద్రాపురం నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపుకు టీడీపీ సహకరించిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. జగన్ కాంగ్రెస్ పార్టీని వీడినప్పటి నుంచి బాబు కాంగ్రెస్ తో లాలూచీ పడ్డారని అంబటి అన్నారు.

శాసనసభను సమావేశపరచండి:భూమన

శాసనసభను షెడ్యూలు ప్రకారం వెంటనే సమావేశపరచాలని వైఎస్‌ఆర్ సీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. శాసనసభను ప్రభుత్వం పరిహాస సభగా మార్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. 9 కోట్ల తెలుగు ప్రజల గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతోందన్నారు. అవిశ్వాసం పెడతారన్న భయంతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పారిపోయారని విమర్శించారు. అందుకు చంద్రబాబు సహకరిస్తున్నారన్నారు. సిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చేసిన ప్రకటన కాంగ్రెస్ నేతల మానసిక వైకల్యానికి నిదర్శనం అన్నారు. ప్రభుత్వం ప్రజాద్రోహానికి పాల్పడుతుందన్నారు.

Palamuru basatagaa..8th Dec 2012

YS Sharmila's Conducts Rachabanda at Shadnagar

Bhumana Karunakar Reddy Press Meet on 8th Dec

Gattu Ramachandra Rao addressing Media on 8th Dec

Kodali Nani Attack on Chandra Babu, absence of three party MPs

Sharmila entering into Rangareddy dist on 11th Dec

రాజ్యసభలో ఎఫ్.డి.ఐ ఓటు వివాదానికి హెరిటేజీకి లింకా!

తెలుగుదేశం ఎమ్.పిలు రాజ్యసభలో ఎఫ్.డి.ఐలకు వ్యతిరేకంగా ఓటు వేయకుండా వ్యవహరించిన వైనం టిడిపి అధినేత చంద్రబాబునాయుడుకు చికాకుగా మారుతోంది. ఏకంగా ఆయన పైనే ప్రత్యర్ధులు విమర్శలకు దిగుతున్నారు. ఆయన కంపెనీ హెరిటేజీకి ఈ చర్యకు లింకు పెడుతూ ప్రచారం చే్స్తున్నారు. తంబళ్లపల్లె ఎమ్మెల్యే ప్రవీణ్ కుమార్ రెడ్డి ఎఫ్ డీ ఐలతో లబ్ది పొందే వ్యక్తి రాష్ట్రంలో చంద్రబాబేనని  ఆరోపించారు. హెరిటేజ్ సంస్థల్లోకి భారీగా విదేశీ పెట్టుబడుల కోసమే ఆయన వ్యూహం రచించారన్నారు. తన వ్యాపారాలు బాగుపడాలి, కాంగ్రెస్‌ను కాపాడాలన్నదే బాబు ధ్యేయమని ప్రవీణ్ రెడ్డి విమర్శించారు. రాజకీయ, ఆర్థిక ప్రయోజనాల కోసమే టీడీపీ ఎంపీలను ఓటింగ్‌కు గైర్హాజరయ్యాలా చేశారన్నారు. కాంగ్రెస్‌, టీడీపీ కుమ్మక్కురాజకీయాలకు ఇది పరాకాష్ట .

source:kommineni

జాతీయ స్థాయిలో టిడిపిపై విమర్శలు

తెలుగుదేశం పార్టీలో తీవ్ర దుమారం రేపుతున్న రాజ్యసభ సభ్యుల గైర్ హాజరు వ్యవహారంపై జాతీయ స్థాయి నాయకులు కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.తెలుగుదేశం పార్టీ నాయకులు పలువురు సైతం ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. టిడిపి ఎమ్.పి హరికృష్ణను కొందరు ఇతర రాష్ట్రాల ఎమ్.పిలు కలసి మీ వాళ్లకు ఎన్ని డబ్బులు ముట్టాయని ప్రశ్నించారని టిడిపి నేతలు చెబుతున్నారు. అలాగే సిపిఎం సీనియర్ నేత సీతారాం ఏచూరి అసలు పార్టీ చంద్రబాబు చేతిలో ఉందా అని వ్యాఖ్యానించినట్లు టిడిపి సీనియర్ నేత ఒకరు అన్నారు. జాతీయ మీడియాలో సైతం టిడిపిపై వ్యతిరేక కధనాలు అదికంగా వచ్చాయని టిడిపి నేతలు భాదపడుతన్నారు.

source:kommineni

పాలమూరులో మరో ప్రజాప్రస్థానం 16 రోజులు - 257.1 కిలోమీటర్లు

‘‘ అన్నంపెట్టే అన్నదాత ఏడుస్తుంటే పాలకులకు ఏమాత్రం కనికరం లేకుండా పోయింది.. విత్తనాలు, ఎరువుల రేట్లు పెంచి చోద్యం చూస్తున్నారు. రైతులారా..మా కష్టాలు పట్టించుకొనే వారు ఎవరూ లేరని అధైర్యపడొద్దు..మీకు అండగా మేం నిలుస్తాం..జగనన్నను ఆశీర్వదిస్తే పండించిన పంటను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది.’’ -షర్మిల 

మహబూబ్‌నగర్, న్యూస్‌లైన్ ప్రతినిధి: మరో ప్రజాప్రస్థానంలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల శుక్రవారం కొండేడులో పాదయాత్రను ప్రారంభించి కేశంపేట వరకు కొ నసాగించారు. ఈ సందర్భంగా పెద్ద ఆదిరాల గ్రామంలో ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమంలో పలువురు మహిళలు తమ సమస్యలను షర్మిలకు వివరించారు. ‘‘ వ్యవసాయం చేస్తేనే మో నష్టం వస్తోంది. ఉపాధి పనులకు వెళ్తే రూ. 50కు మించి కూలి రావడం లేదు. ప్రభుత్వం రూపాయికి కిలో బియ్యం ఇచ్చి మిగిలిన సరుకులన్నీ నాలుగు రెట్లు పెంచింది. 

దీంతో కుటుంబం గడవడమే దుర్భరంగా మారింది’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకు షర్మిల స్పందిస్తూ..‘‘ ఎ న్ని ఇబ్బందులొచ్చినా ఏడాది ఆగండి. ఆ తర్వాత జగనన్న ముఖ్యమంత్రి అవుతాడు. అప్పుడు పేదల సమస్యలన్నీ తీరిపోతాయి.’’అని హామీ ఇచ్చారు. రైతుల పరిస్థితి ఏమాత్రం బాగలేదని, విత్తనాలు, మందుల రేట్లు ఎక్కువగా ఉన్నా మద్దతు ధర లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జగనన్నను ఆశీర్వదిస్తే రైతులు పండిం చిన పంటను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు. 

రైతుల పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని, అప్పుల్లో ఉన్నా ఆదుకోవడంలో విఫలమైందని ఆరోపించారు. వైఎస్ హ యాంలో ఏడు గంటల పాటు ఉచిత విద్యుత్ ఇ వ్వడంతోపాటు మద్దతు ధర కూడా వచ్చేదని గుర్తు చేశారు. అన్నంపెట్టే అన్నదాత ఏడుస్తుంటే పాలకులకు ఏమాత్రం కనికరం లేకుండా పో యిందని, ప్రభుత్వానికి పోయే కాలం దగ్గర వచ్చినందుకే అన్ని వర్గాలను విస్మరిస్తోందని ఆరోపించారు. జగనన్న అధికారంలోకి వస్తే అందరికీ పక్కా ఇళ్లతోపాటు రైతులకు, మహిళలకు వడ్డీ లేని రుణాలు అందుతాయన్నారు. అనంతరం మండల కేంద్రమైన కేశంపేటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో షర్మిల మాట్లాడారు. మహబూబ్‌నగర్ జిల్లాలో వలసలను అరికట్టి ఈ ప్రాం తాన్ని సస్యశ్యామలం చేయాలనే ఉద్దేశంతో మ హానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నెట్టెంపాడు, బీమా, కల్వకుర్తి, కోయిల్‌సాగర్ ప్రాజెక్టుల నిర్మాణం కోసం రూ. 7 వేల కోట్లు కేటాయించారన్నారు. 

అప్ప ట్లో 70 శాతం పనులు పూర్తి చేస్తే ఈ ప్రభుత్వం మూడేళ్లయినా మిగిలిన 30 శాతం పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. పా లమూరు ఎత్తిపోతల పథకం ఏర్పాటుకు వైఎస్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. మహబూబర్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలకు ఈ పథకం ద్వారా సాగునీరు, తాగునీరు ఇవ్వాలన్నదే వైఎస్ ఆశయం అన్నారు. ఈ ఆశయానికి ప్రభుత్వం నీ ళ్లొదిలిందన్నారు. 

విద్యార్థులను పాఠశాలకు, కళాశాలలకు వెళ్లనీయకుండా తల్లిదండ్రులు వారిని కూలి పనులకు తీసుకెళ్తున్నారని, ఇది దేశానికే అవమానం అన్నారు. జిల్లాలో ఇంత దారుణం జ రుగుతున్నా.. పార్లమెంటు సభ్యుడిగా చంద్రశేఖర్‌రావు స్పందిం చడం లేదని ఆరోపించారు. ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ఆయన పూర్తిగా విఫలమయ్యారని దుయ్యబట్టారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన పాలనా కాలంలో రైతులపై అక్రమ కేసులు పెట్టి జైల్లో వేయించారన్నారు. విద్యుత్ బిల్లులు చెల్లించని రైతుల ఇళ్లలో సామానులు ఎత్తికెళ్లిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయని గుర్తు చేశారు. 

పాలమూరులో మరో ప్రజాప్రస్థానం
16 రోజులు - 257.1 కిలోమీటర్లు 

తూర్పు గోదావరి జిల్లాలో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ


రాజకీయ పార్టీలకు సెంటిమెంట్ జిల్లాగా పేరొందిన తూర్పు గోదావరి జిల్లాలో కాంగ్రెస్‌కు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా, జిల్లా పరిషత్ చైర్మన్‌గా, కాలుష్య నియంత్రణ మండలి సభ్యుడిగా పనిచేసిన చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. బీసీల్లో బలమైన శెట్టిబలిజ సామాజికవర్గానికి చెందిన వేణు మొదటి నుంచీ వైఎస్ రాజశేఖరరెడ్డికి వీరాభిమాని. రాజకీయ అరంగేట్రం నాటి నుంచి వైఎస్ అడుగుజాడల్లో నడిచారు. 

వేణు గురువారం వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని చంచల్‌గూడ జైలులో ప్రత్యేక ములాఖత్‌లో కలిశారు. ప్రజలకు ఇచ్చిన మాట, నమ్మిన సిద్ధాంతం కోసం ఎన్ని కష్టనష్టాలనైనా ఎదుర్కొనే మనోనిబ్బరం కలిగిన జగన్‌కు మద్దతు తెలపడం నైతిక బాధ్యతగా భావిస్తున్నానని వేణు శుక్రవారం ‘న్యూస్‌లైన్’తో అన్నారు. రాజకీయంగా తాను ఎక్కిన ప్రతి మెట్టుపైనా వైఎస్ ముద్ర ఉందన్నారు. వైఎస్ బడుగు, బలహీన, అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం శ్రమించారని, ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఇక ముందూ కొనసాగాలని కోరుకుంటున్నానని చెప్పారు. వైఎస్ పథకాలు, ఆశయాలు ఆయన తనయుడు జగన్ సారథ్యంలోని వైఎస్సార్ సీపీ మాత్రమే కొనసాగించగలదన్న నమ్మకంతో ఆ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. కష్టాల్లో ఉన్న మహానేత తనయుడికి మద్దతివ్వడం తన విధ్యుక్త ధర్మమన్నారు. జగన్ ఆదేశాలకు అనుగుణంగా పదవులతో నిమిత్తం లేకుండా, పార్టీ అభ్యన్నతి కోసం సామాన్య కార్యకర్తగా తన వంతు పనిచేస్తానన్నారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని అమావాస్య తరువాత పార్టీలో చేరేందుకు మంచి ముహూర్తం నిర్ణయించుకుంటానన్నారు.

బాబు ఆదేశాలతోనే రాజ్యసభకు ముగ్గురు టీడీపీ ఎంపీల గైర్హాజరు:నాగం

చంద్రబాబువి అవకాశవాద రాజకీయాలు
బాబు అండతోనే కిరణ్ ధీమా


 ‘‘కాంగ్రెస్-టీడీపీ మ్యాచ్ ఫిక్సింగ్ శుక్రవారం రాజ్యసభ సాక్షిగా మరోసారి బట్టబయలైందని టీఆర్‌ఎస్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు మండిపడ్డారు. ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో, ఎఫ్‌డీఐలపై రాజ్యసభలో కాంగ్రెస్ ప్రభుత్వాలకు చంద్రబాబు అండగా నిలిచారని, తద్వారా ఆ ప్రభుత్వాలను కాపాడుతున్నారని తూర్పారబట్టారు. శుక్రవారం రాత్రి సిద్దిపేటలో ఆయన విలేకరులతో మాట్లాడారు. బాబు అవకాశవాద రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. సీబీఐ విచారణ నుంచి తప్పించుకోవడానికి, తెలంగాణ రాకుండా అడ్డుకోవడానికి ఆయన కుయుక్తులు పన్నుతున్నారని ఆరోపించారు. ‘‘ఎఫ్‌డీఐలను వ్యతిరేకిస్తూ ఓటు వేస్తామని నవంబర్ 20న సంగారెడ్డి శివార్లలో టీడీపీ పార్లమెంటరీ కమిటీ భేటీ అనంతరం ఆ పార్టీ ఎంపీ నామా నాగేశ్వరరావు ప్రకటించడం నిజం కాదా? అలాంటప్పుడు రాజ్యసభలో ముగ్గురు టీడీపీ ఎంపీలు ఓటింగుకు గైర్హాజరవడానికి కారణమేమిటి? వాళ్లు కూడా ఎఫ్‌డీఐలను వ్యతిరేకిస్తూ ఓటేస్తే పరిస్థితులు వేరేలా ఉండేవి కదా’’ అని హరీష్ నిలదీశారు.


రాజ్యసభలో ఎఫ్‌డీఐలపై ఓటింగ్ సందర్భంగా యూపీఏ ప్రభుత్వాన్ని కాపాడడానికి, కాంగ్రెస్‌ను రక్షించడానికి వీలుగా టీడీపీ ఎంపీలు గైర్హాజరవడంతో.. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల మ్యాచ్‌ఫిక్సింగ్ బయటపడిందని తెలంగాణ నగారా సమితి వ్యవస్థాపకులు నాగం జనార్దన్‌రెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకే ముగ్గురు టీడీపీ ఎంపీలు రాజ్యసభకు గైర్హాజరయ్యారని ఆయన ఆరోపించారు. వారి గైర్హాజరుపై చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నాగం శుక్రవారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ... కాంగ్రెస్‌తో చీకటి ఒప్పందాలు చేసుకోవడానికి టీడీపీకి, చంద్రబాబుకు సిగ్గుండాలని ఆగ్రహం వెలిబుచ్చారు. టీడీపీ ఎంపీల గైర్హాజరులో చంద్రబాబు ఆదేశాలు, ప్రమేయం లేనట్లయితే.. తక్షణం ఆ ఎంపీలను పార్టీ నుంచి తొలగించి, అనర్హులుగా చేయడానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

రాజ్యసభలో ఎఫ్‌డీఐలపై జరిగిన ఓటింగ్‌కు ముగ్గురు టీడీపీ ఎంపీలు గైర్‌హాజరు కావడంపై ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు సమాధానం దాటవేశారు. రాజ్యసభలో ఓటింగ్‌కు దేవేందర్‌గౌడ్, సుజనాచౌదరి, సుధారాణిలు హాజరు కాకుండా అధికార కాంగ్రెస్ మేనేజ్ చేసిందన్న వార్తలపై శుక్రవారం తరోడలో విలేకరులు బాబు వివరణ కోరారు. దీనిపై తర్వాత చె ప్తానంటూ ఆయన జవాబిచ్చారు. తర్వాత భైంసాలో కూడా విలేకరులు ఈ విషయాన్ని ప్రస్తావించారు. అయితే అప్పుడు కూడా చంద్రబాబు ఎలాంటి సమాధానం ఇవ్వలేదు.

సీబీఐ ఇక్కడా పనిచేసింది

కాంగ్రెస్‌తో టీడీపీ కుమ్మక్కుకిది పరాకాష్ట
బాబు అసలు స్వరూపం రాజ్యసభలో వెల్లడైంది
పక్కాప్లాన్ ప్రకారమే టీడీపీ సభ్యుల్ని ఓటింగ్‌లో పాల్గొనకుండా చేశారు
ఐఎంజీ భారత కిచ్చిన భూముల వ్యవహారంలో సీబీఐ దర్యాప్తు ఆపుకోవడానికేనని విమర్శ

హైదరాబాద్, న్యూస్‌లైన్: అధికార కాంగ్రెస్ పార్టీతో ప్రతిపక్ష తెలుగుదేశం లాలూచీ పడినందువల్లే రాజ్యసభలో ఎఫ్‌డీఐపై విపక్షాలు పెట్టిన తీర్మానం వీగిపోయిందని వైఎస్సార్ కాంగ్రెస్ విమర్శించింది. ఓటింగ్ సందర్భంగా ముగ్గురు టీడీపీ సభ్యులు గైర్హాజరవడాన్ని బట్టి చూస్తే వారి కుమ్మక్కు నైజం మరోసారి బయటపడిందని వైఎస్సార్ కాంగ్రెస్ కేంద్ర పాలక మండలి సభ్యులు ఎంవీ మైసూరారెడ్డి దుయ్యబట్టారు. ‘‘ఈ ముగ్గురు టీడీపీ సభ్యుల్లో ఇద్దరు ఎఫ్‌డీఐలపై చర్చ జరిగేటప్పుడు సభవద్దే ఉన్నారు. తీరా ఓటింగ్ సమయానికి పాల్గొనకుండా డుమ్మా కొట్టారు. కాంగ్రెస్, టీడీపీల కుమ్మక్కు రాజకీయాలకు ఇది పరాకాష్ట’’ అని పేర్కొన్నారు. పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావుతో కలిసి శుక్రవారమిక్కడ ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘రిటైల్ రంగంలో 51 శాతం ఎఫ్‌డీఐలకు అనుమతిస్తే చిల్లర వర్తకులకు, రైతులకు మొత్తంగా దేశానికి తీరని నష్టం వాటిల్లుతుందని ప్రతిపక్షపార్టీలన్నీ గగ్గోలు పెడుతున్నాయి. ఈ విషయమై టీడీపీ ఒకడుగు ముందుకేసి ఢిల్లీలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొంది. బంద్‌కూ మద్దతిచ్చింది. 

అంతేకాదు పాదయాత్రలోనూ చంద్రబాబు విమర్శిస్తున్నారు. ఇంత చేస్తున్న చంద్రబాబు అసలు స్వరూపం రాజ్యసభలో వెల్లడైంది. ముగ్గురు టీడీపీ సభ్యులను ఓటింగ్‌లో పాల్గొనకుండా చేసి తీర్మానం ఆమోదం పొందేలా చేశారు’’ అని ఆయన విమర్శించారు. బీఎస్పీ మద్దతుతో తీర్మానం వీగిపోతుందని భావించామని టీడీపీ సభ్యుడు దేవేందర్‌గౌడ్ చెప్పడంలో నిజం లేదన్నారు. ‘‘దేవేందర్‌గౌడ్ చెప్పిన ప్రకారం చూస్తే.. మొత్తం 244 మంది సభ్యులున్న రాజ్యసభలో యూపీఏ బలం 94 మాత్రమే. 15 మంది బీఎస్పీ సభ్యులు మద్దతుగా నిలిచినా సంఖ్యాబలం 109తో బొటాబొటిగానే ఉండేది. ఎస్పీకి చెందిన 9 మంది సభ్యులు ఓటింగ్‌కు గైర్హాజరైన నేపథ్యంలో ముగ్గురు టీడీపీ సభ్యులు పాల్గొని ఉంటే విపక్షాల తీర్మానం వీగిపోయేది కాదు కదా. దీన్నిబట్టి చూస్తే పక్కా ప్లాన్ ప్రకారమే టీడీపీ సభ్యులు గైర్హాజరయ్యారు’’ అని మైసూరా తెలిపారు. టీడీపీ మాదిరిగా మరికొందరు ఇతర పార్టీల సభ్యులు వ్యవహరించినందునే విపక్షాల తీర్మానం వీగిపోయిందన్నారు.

చంద్రబాబు నైజం బయటపడింది

ప్రజలముందు గగ్గోలు పెడుతున్న చంద్రబాబు అసలు నైజం మరోసారి వెల్లడైందని మైసూరారెడ్డి చెప్పారు. తెరవెనుక ఒక రాజకీయం, తెరముందు మరో రాజకీయం నడిపిస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబుకు ఇలాంటి రాజకీయాలు వెన్నతో పెట్టిన విద్యని ధ్వజమెత్తారు. ‘‘ఎఫ్‌డీఐల విషయంలో ఓటింగ్ రెండున్నర గంటలకు జరుపుతామని సభ్యులందరికీ చైర్మన్ సమాచారమందించారు. రెండుగంటలదాకా సభవద్దే ఉన్న టీడీపీ ఇద్దరు సభ్యులు ఓటింగ్‌లో పాల్గొనకపోవడంలోని ఆంతర్యమేంటి? నిన్నటిదాకా సభలో పాల్గొని ఢిల్లీలోనే ఉన్న మరో సభ్యుడు(టి.దేవేందర్‌గౌడ్)... చంద్రబాబు అనుమతితోనే ఆసుపత్రిలో చేరానంటారు. మరోవైపు రాష్ట్రానికే చెందిన ఎన్.జనార్దన్‌రెడ్డి నడవలేకపోయినా వీల్‌చైర్‌లో వచ్చి తీర్మానానికి వ్యతిరేకంగా ఓటువేశారు. కానీ బాధ్యత కలిగిన విపక్ష ఎంపీలు ఓటింగ్‌కు డుమ్మా కొట్టడంలోని ఆంతర్యమేంటీ? ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారమే చోటుచేసుకుంది. చంద్రబాబు ఇద్దరిచేత తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయించి, ముగ్గుర్ని డుమ్మా కొట్టించి స్వామికార్యం, స్వకార్యం రెండూ నెరవేర్చుకున్నారు’’ అని దుయ్యబట్టారు. గతంలో కేంద్ర హోంమంత్రిగా ఉన్నప్పుడు చిదంబరం లోక్‌సభలో టీడీపీ సభ్యులనుద్దేశించి.. మీ అధినేత చాలాసార్లు తనను కలిశారని ముందొకమాట, తర్వాత ఒకమాట మాట్లాడడం మీకే చెల్లుతుందని చెప్పడాన్ని మైసూరా గుర్తుచేశారు.

సీబీఐ ఇక్కడా పనిచేసింది

యూపీఏ ప్రభుత్వం ఎఫ్‌డీఐపై విపక్షాల తీర్మానం విషయంలో సీబీఐని అడ్డుపెట్టుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని మైసూరా ధ్వజమెత్తారు. లోక్‌సభలో ఓటింగ్ సందర్భంగా ఎస్పీ, బీఎస్పీ సభ్యులు గైర్హాజరు కావడం, రాజ్యసభలో తాజాగా టీడీపీకి చెందిన ముగ్గురు సభ్యులు గైర్హాజరవడమూ సీబీఐ ఎఫెక్ట్ అని తెలిపారు. చంద్రబాబు హయాంలో ఐఎంజీ భారత సంస్థకిచ్చిన భూముల వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు చేయకుండా ఉండేందుకే టీడీపీ సభ్యులు ఇలా వ్యవహరించారన్నారు. జగన్ కేసు విషయమై సీబీఐ వ్యవహరించిన తీరు, చంద్రబాబుపై వచ్చిన ఆరోపణలపట్ల ఆ సంస్థ పనిచేసిన తీరును రాష్ట్ర ప్రజలు మరిచిపోలేదన్నారు. ‘‘జగన్‌పై 48 గంటల్లో మూకుమ్మడి దాడిచేసిన సీబీఐ.. చంద్రబాబుపై విచారణ అనేసరికి సిబ్బందిలేరనడం దేనికి సంకేతం! అంతేకాదు, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై నిత్యం దుమ్మెత్తి పోస్తున్న చంద్రబాబు అసెంబ్లీలో అవిశ్వాసం పెట్టమంటే డొంకతిరుగుడు మాటలు మాట్లాడుతారు. దీన్నిబట్టి చూస్తే కాంగ్రెస్, టీడీపీల మిలాఖత్ రోజురోజుకూ పరాకాష్టకు చేరుతోంది. ఇలాంటి దుర్మార్గపు రాజకీయాలు మంచి సంప్రదాయం కాదు’’ అని మైసూరా హితవు పలికారు.

విగ్రహాల్లో కాదు.. జనం గుండెల్లో ఉన్నారు


‘‘గ్రామాల్లో వైఎస్సార్ విగ్రహాలను చంద్రబాబు ఓర్వలేకపోతున్నారు. వైఎస్సార్ విగ్రహాల గురించి చులకనగా మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు తెలుసుకోవాల్సిన విషయం ఒకటుంది. వైఎస్సార్ విగ్రహాలను పల్లెల్లో కాదు.. ప్రజలు తమ గుండెల్లో పెట్టుకున్నారు..’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల అన్నారు. ప్రజా సమస్యలు పట్టని రాష్ట్ర సర్కారు, దానితో అంటకాగుతున్న చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనగా షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 51వ రోజు శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల, షాద్‌నగర్ నియోజకవర్గాల్లో సాగింది. కేశంపేట మండల కేంద్రంలో భారీ ఎత్తున తరలి వచ్చిన ప్రజలను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. ‘‘ప్రజలు వైఎస్సార్ విగ్రహాలను ఎందుకు పెట్టుకుంటున్నారో చంద్రబాబునాయుడుకు ఇంకా తెలిసి రావడం లేదు. చంద్రబాబు తన తొమ్మిదేళ్ల పరిపాలనలో గ్రామాలను శ్మశానాలుగా మారిస్తే.. కొన ఊపిరితో ఉన్న ఆ పల్లెలకు ఊపిరి పోసిన మహానేత వైఎస్సార్. వైఎస్సార్ విగ్రహాన్ని చూసినప్పుడు రైతులకు ఉచిత విద్యుత్తు గుర్తుకు వస్తుంది. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంటు పథకం గుర్తుకు వస్తుంది. మహిళలకు ఆత్మ గౌరవంగా బతకడం కోసం రాజన్న ఇచ్చిన పావలా వడ్డీ పథకం గుర్తుకు వస్తుంది. అవే పల్లెల్లో అక్కడక్కడా ఎన్టీర్ విగ్రహలు కూడా కన్పిస్తాయి. ఎన్టీఆర్ విగ్రహాన్ని చూసినప్పుడు పిల్లనిచ్చిన మామకే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు గుర్తుకు వస్తారు. వైశ్రాయి హోటల్లో ఎమ్మెల్యేలను బంధించి డబ్బు పంచి అధికారం లాక్కున్న విషయం గుర్తొస్తుంది. ఎన్టీఆర్‌పై చెప్పులు వేయించిన చంద్రబాబు సంగతి గుర్తుకు వస్తుంది. సంతోషంగా ఉన్న ఎన్టీఆర్‌ను మానసిక క్షోభకు గురిచేసి ఆయన మరణానికి కారణమైన విషయం గుర్తుకు వస్తుంది..’’ అని మండిపడ్డారు.

కేసీఆర్‌కు ప్రజా సమస్యలు పట్టవు..

‘‘కేసీఆర్‌గారు మహబూబ్‌నగర్ జిల్లాకు ఎంపీ. టీఆర్‌ఎస్ పార్టీకి అధ్యక్షుడు కూడా.. కానీ ఆయనకు ఏనాడు కూడా ప్రజా సమస్యలు పట్టవు. ఇవాళ ఈ జిల్లాలో నీటి సమస్య ఉంది.. కరెంటు సమస్యతో పంటలన్నీ ఎండిపోయాయి. ఈ సమస్యలేవీ ఆయన కంటికి కనిపించవు. కాలేజీకి వెళ్లాల్సిన విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంటు పథకం సరిగా అందక చదువు మానేసి కూలి పనులకు పోతున్నారు. ఇది మీకు, మన రాష్ట్రానికి అవమానంగా అనిపించడం లేదా కేసీఆర్ గారు అని అడుగుతున్నా..’’ అని షర్మిల ప్రశ్నించారు.


మా ఒక్క గ్రామానికే వైఎస్ కోటి ఇచ్చారు

‘‘మా ఒక్క గ్రామానికే వైఎస్సార్ రూ కోటి ఇచ్చారు. బీటీరోడ్లు.. పైపులైన్లు.. మరుగుదొడ్లు.. మురికి కాల్వలు పల్లెకు అవసరం ఉన్న ప్రతి ఒక్కటీ చేయించారు. ఆయన వెళ్లిపోయిన మూడేళ్ల నుంచి ఒక్క లక్ష కూడా రాలేదు. వైఎస్ స్పూర్తితోనే రాజకీయాలకు వచ్చాను. సర్పంచ్‌గా గెలిచాను. ఆయన ఉన్నంత కాలం నా గ్రామాన్ని బాగుచేసుకున్నా. ఇప్పుడు ఏమి పనులు జరగక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు’’ అని కాకునూరు గ్రామానికి చెందిన తాజా మాజీ సర్పంచ్ చంద్రకళ రచ్చబండ కార్యక్రమంలో షర్మిలతో ఇలా తన ఆవేదన వ్యక్తం చేశారు. 51వ రోజు పాదయాత్ర కొండేడు నుంచి ప్రారంభమై పెద్ద ఆదిరాల, ఎక్వాయిపల్లి, తొమ్మిది రేకుల, కాకునూరు గ్రామాల మీదుగా కేశంపేట చేరుకుంది. జనం 3 కిలోమీటర్ల మేర షర్మిలపై పూలు చల్లుతూ ఘనస్వాగతం పలికారు. కేశంపేటలో వైఎస్సార్ విగ్రహాన్ని షర్మిల ఆవిష్కరించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో షర్మిల సమక్షంలో టీఆర్‌ఎస్ నాయకుడు మామిడి శ్యాంసుందర్‌రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. శుక్రవారం రాత్రి 8 గంటలకు కేశంపేట సమీపంలో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి షర్మిల చేరుకున్నారు. గురువారం మొత్తం 19 కి.మీ. దూరం ప్రయాణించారు. ఇప్పటి వరకు మొత్తం 724.30 కి.మీ. యాత్ర పూర్తయ్యింది. పాదయాత్రలో ఎమ్మెల్యేలు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, నాయకులు కె.కె.మహేందర్‌రెడ్డి, వాసిరెడ్డి పద్మ, బాలమణెమ్మ, రాజ్ ఠాకూర్, ఎడ్మ కిష్టారెడ్డి, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, స్వర్ణ సుధాకర్‌రెడ్డి, ప్రసాదరాజు, రావుల రవీంద్రనాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కుమ్మక్కు కుట్రలను ఎదిరించి, వైఎస్ కుటుంబానికి అండగా

సొంత పనులు సైతం వదులుకొని కదం తొక్కుతూ మున్ముందుకు
కుమ్మక్కు కుట్రలను ఎదిరించి, వైఎస్ కుటుంబానికి అండగానిలుస్తామని ఉద్ఘాటన
జగన్‌ను అక్రమంగా జైల్లో పెట్టారంటూ మండిపాటు
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ శుక్రవారం యాత్ర ముగిసేనాటికి.. రోజులు: 51, కిలోమీటర్లు: 724.30

మహబూబ్‌నగర్, న్యూస్‌లైన్ ప్రతినిధి: ఆ మహానేత అంటే గుండెల నిండా నింపుకున్న అభిమానం వారితో అడుగులు వేయిస్తోంది! కుమ్మక్కు రాజకీయాలతో ఆ దివంగత నేత కుటుంబాన్ని వేధిస్తున్న తీరు వారిని కదిలిస్తోంది!! అన్యాయంగా తమ అభిమాన నేతను జైలుపాలు చేయించిన కుట్రలు వారిని తట్టిలేపుతున్నాయి!! అందుకే వైఎస్ కుటుంబానికి అండగా నిలవాలని, నీచ రాజకీయాలకు పాతరేయాలని వారంతా తమ పనులను సైతం వదిలేసి ఎండనక వాననక షర్మిల వెంట అడుగులో అడుగు వేస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెల్లెలు షర్మిల అక్టోబర్ 18న ఇడుపులపాయ నుంచి చేపట్టిన మరో ప్రజాప్రస్థానం వెన్నంటి నడుస్తున్నారు. గురువారం నాటికి పాదయాత్ర 50 రోజులు పూర్తి చేసుకుంది. వైఎస్ కుటుంబంపై అభిమానంతో అన్ని కష్టాలను ఆధిగమిస్తూ షర్మిలతో నడుస్తున్నామని వారు చెబుతున్నారు. యాత్రలో నడిచేవారిలో ఎవరికైనా చేతులు, కాళ్లు నొప్పులు వస్తే విశ్రాంతి తీసుకోవాలని షర్మిల కోరినప్పటికీ.. అందుకు ఎవ్వరూ ఒప్పుకోకుండా ‘మీ వెంటనే నడుస్తాం’ అంటూ ముందుకు కదులుతున్నారు.

వైఎస్ చలవతో సర్పంచ్ అయ్యా..

ఈయన పేరు ఎ.వెంకటయ్య. వికలాంగుడు. మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తి మండలం చందాపూర్ గ్రామ మాజీ సర్పంచ్. కర్ర లేనిదే నడవలేని పరిస్థితుల్లో కూడా 2003లో వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన పాదయాత్రలో పాల్గొన్నారు. 25 ఏళ్లుగా వైఎస్ అంటే ఎంతో అభిమానం. వైఎస్ పేరు చెప్పుకొని ఆరేళ్ల కిందట జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించానని, ఆ ఆ కృతజ్ఞతతోనే రోజుకు 15 నుంచి 18 కిలోమీటర్లు నడవటం కష్టమైనా ఏమాత్రం అలసట లేకుండా 50 రోజులుగా షర్మిలమ్మ వెంట నడుస్తున్నాని చెప్పారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని అన్యాయంగా జైలు పాలు చేశారని, ఆ కుటుంబం నుంచి లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ వారికి అండగా నిలబడాలని కోరారు.

అండగా నిలిచేందుకే...

ఈయన పేరు కసునూరు రఘునాథరెడ్డి. కాంట్రాక్టర్. కడప జిల్లా సింహాద్రిపురం మండలం కసునూరు గ్రామం. మొదట్నుంచీ వైఎస్ కుటుంబం అంటే ఎంతో అభిమానం. కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరినీ ఆదుకునే మనస్తత్వం వైఎస్ కుటుంబానికి మొదట్నుంచీ ఉందని చెప్పారు. మహానేత రెక్కల కష్టంతో అధికారంలోకి వచ్చిన నేతలు, ఇప్పుడు ఆ కుటుంబాన్ని ఇబ్బంది పెడుతూ జగన్‌ను అక్రమంగా జైల్లో పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ కుటుంబానికి అండగా నిలిచేందుకే కాంట్రాక్టు పనులను వదులుకొని షర్మిల వెంట నడుస్తున్నానన్నారు.

ఏమీ కష్టం అనిపించడం లేదు

ఈమె పేరు కాపు భారతి. అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి సతీమణి. పాలక, ప్రతిపక్ష పార్టీలు ప్రజా సమస్యలు గాలికొదిలేయడంతో వారి సమస్యలను, బాధలను నేరుగా వినేందుకు షర్మిల యాత్ర చేపట్టారని ఆమె తెలిపారు. షర్మిల తీసుకున్న గొప్ప నిర్ణయాన్ని ఒక మహిళగా ప్రసంశిస్తూ తాను కూడా షర్మిల అడుగులో అడుగు వేయాలని నిర్ణయించుకొని వెంట నడుస్తున్నట్లు చెప్పారు. 50 రోజులుగా షర్మిల వెంట నడుస్తున్నా తనకేమీ కష్టం అనిపించడం లేదన్నారు.

ఆరోగ్యశ్రీ లేకుంటే ఈ నడకే లేదు..

ఈమె పేరు ఎన్.దయామణి. ప్రకాశం జిల్లా. నాలుగేళ్ల కిందట పులివెందులకు వచ్చి స్థిర పడ్డారు. వెన్నెముక నొప్పి రావడంతో ఆపరేషన్ చేయాలని డాక్టర్లు చెప్పారు. చేతిలో చిల్లి గవ్వలేదు. వైఎస్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ కార్డు వల్ల లక్ష రూపాయల విలువ చేసే అపరేషన్ ఉచితంగా చేయించుకున్నానని తెలిపారు. ఆరోగ్యశ్రీ కార్డు ఇవ్వకపోతే ఈనాడు ఇలా నడిచేదాన్ని కాదన్నారు. పేదలకు వైఎస్ మంచి పనులు చేశారని, ఆయన మరణానంతరం ఆ ఆశయాలు కొనసాగించేందుకు జగన్ ప్రజల్లోకి వెళ్తుంటే అన్యాయంగా జైల్లో పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ ద్వారా లబ్ధి పొందిన మాలాంటి వాళ్లు షర్మిల వెంట నడుస్తున్నామని తెలిపారు.

క్లినిక్‌ను వదులుకొని నడుస్తున్నా..

ఈయన పేరు డాక్టర్ హరికృష్ణ. అనంతపురం జిల్లా పుట్టపర్తి మండలం ఎనుముపల్లి గ్రామం. ఎంతో మంది పేద కుటుంబాలకు చెందిన వారు వైద్యం సక్రమంగా అందక, మృత్యువాతపడ్డారని, ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం సంజీవనిగా నిలిచిందన్నారు. ఎందరికో మేలు చేసిన వైఎస్ కుటుంబాన్ని పాలకులు ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. తన క్లినిక్‌ను వదులుకొని ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు షర్మిల చేపట్టిన యాత్రలో పాల్గొంటున్నానని చెప్పారు.

..కథ నడిపించింది బాబే!

రాజ్యసభలో ఎఫ్‌డీఐ ఓటింగ్‌కు ముగ్గురు టీడీపీ ఎంపీలు దూరంగా ఉండేలా ఢిల్లీ పెద్దలతో కలిసి పక్కా పథకం ప్రకారం చంద్రబాబు కథ నడిపించారు! అత్యంత విశ్వసనీయంగా తెలిసిన సమాచారం ప్రకారం... కేంద్రంలో కీలక శాఖ నిర్వహిస్తున్న ఒక మంత్రి, మరో కీలక నేత.. ‘మీకోసం’ పాదయాత్రలో ఉన్న బాబుతో ఈ విషయమై ముందే సంప్రదింపులు జరిపారు. తర్వాత బాబు ఆదేశాల మేరకే టీడీపీ ఎంపీలు ముగ్గురు ఓటింగ్‌కు గైర్హాజరయ్యారు. తద్వారా మొత్తం సభ్యుల సంఖ్య, దాంతోపాటే మెజారిటీ మార్కు తగ్గి, ఎఫ్‌డీఐల గండం నుంచి రాజ్యసభలో యూపీఏ సులువుగా బయటపడగలిగింది. దీనిపై తర్వాత విమర్శలు రాకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించాలని నిర్ణయించిన బాబు.. ఈ కుమ్మక్కు వ్యవహారం తన వియ్యంకుడు, రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణకు తెలియకుండా జాగ్రత్తపడ్డారు. ముందే చెబితే భవిష్యత్తులో ఆయన దాన్ని బయటపెట్టే ప్రమాదముందని భావించినట్టు తెలుస్తోంది. దాంతో హరికృష్ణ యథావిధిగా రాజ్యసభలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలిచారు. ఇక మరో ఎంపీ సీఎం రమేశ్ కూడా.. టీడీపీ తరఫున తీర్మానాన్ని ప్రవేశపెట్టింది తానే గనుక ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఓటేశారు. తీరా అంతా అయిపోయాక, గైర్హాజరైన ముగ్గురు ఎంపీలపై బాబు ఆగ్రహం వ్యక్తం చేశారంటూ ఎంపిక చేసిన కొన్ని మీడియా సంస్థలకు టీడీపీ తరఫున లీకులిచ్చారు!

జగన్ కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన నాటి నుంచీ..

రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష టీడీపీ సహకరించినట్టుగా మూడు ఏళ్ల కాలంలో అనేక ఉదంతాలు వెలుగు చూశాయి. జగన్‌మోహన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కొద్ది రోజులకే జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో చిత్తూరు, అనంతపురం, వైఎస్‌ఆర్ జిల్లాలో జగన్ మద్దతుదారుల మంటూ స్వతంత్ర అభ్యర్ధులుగాా నిలబడిన వారిని ఓడించేందుకు రెండు పార్టీల పరస్పరం సహకరించుకున్నట్టు అప్పుడు పోలైన ఓటింగ్ సరళే స్పష్టం చేసింది. ఇటీవల రాష్ట్రంలో జరిగిన 18 అసెంబ్లీ, ఒక లోకసభ ఎన్నికల సమయంలో రెండు పార్టీ సహకరించుకోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ గెలిచిన తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం, పశ్చిమగోదావరి జిల్లా నరాసాపురం నియోజకవర్గాలలో టీడీపీకి అతి స్వలంగా ఓట్లు వచ్చి డిపాజిట్లు కోల్పోవడం ఆ అనుమానాలను మరింత ధృవపరిచాయి. రాష్ట్ర ప్రభుత్వానికి వివిధ సమయాల్లో టీడీపీకి అండగా నిలిచిన కారణంగానే చంద్రబాబు సహా పలువురి ఆస్తులపై సీబీఐతో ప్రాధమికంగా విచారణ జరపాలని రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇచ్చిన తరువాత కూడా వెనువెంటనే అది ప్రారంభం కాకుండా టీడీపీ నేతలు కోర్టులలో స్టే తెచ్చుకునే వరకు కేంద్ర ప్రభుత్వ పెద్దలు వారికి వెసులుబాటు కల్పించారన్న ఆరోపణలున్నాయి

మరోసారి కాంగ్రెస్‌కు ‘దేశం’ బాబుల బాసట

ఎఫ్‌డీఐపై ఓటింగ్‌కు ముగ్గురు టీడీపీ ఎంపీల డుమ్మా
యూపీఏకు చంద్రబాబు ‘చే’యూత-చీకటి కుమ్మక్కు బట్టబయలు 
రాజ్యసభలో ఎఫ్‌డీఐపై ఓటింగ్‌కు ముగ్గురు టీడీపీ సభ్యులు గైర్హాజరు 
సుజనా చౌదరి, గుండు సుధారాణి, దేవేందర్ గౌడ్ డుమ్మా
ఢిల్లీలోనే ఉండి కూడా సభకు హాజరవని వైనం.. మీడియాకూ దూరం
కీలక ఓటింగ్‌లో యూపీఏను గట్టెక్కించేందుకు పరోక్ష సహకారం 
బాబు అనుమతి లేకుండా గైర్హాజరు కారంటున్న టీడీపీ సీనియర్లు 
మాయావతి, ములాయం బాటలోనే నడిచిన బాబు
తనపై ఉన్న కేసుల నుంచి తప్పించుకోవడానికే..
‘జగన్ వ్యతిరేక కుమ్మక్కు’కు కొనసాగింపు
మాయావతిపై అపనమ్మకంతోనే ఆయన సాయం కోరిన ‘ఢిల్లీ పెద్దలు’ 
ముందు రోజే ఫోన్‌లో మంతనాలు...ఆ మేరకు పక్కాగా వ్యూహరచన 

న్యూఢిల్లీ, న్యూస్‌లైన్:తెర తొలగింది... చీకటిచాటున జరిగిన కుమ్మక్కు ఒప్పందాలు బట్టబయలయ్యాయి! అవసరానికి అనుగుణంగా ఒకరినొకరు ఆదుకుంటూ రాష్ట్రంలో చేతిలో చెయ్యేసి సాగుతున్న కాంగ్రెస్, టీడీపీ దోస్తీ మూలాలు దేశ రాజధానిలోనే ఉన్నాయని విస్పష్టంగా వెల్లడైంది. ఈ రెండు పార్టీల కుమ్మక్కు తంత్రం పార్లమెంటు సాక్షిగా రట్టయింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో సాగడానికి ‘అన్నివిధాలా’ సహకారం అందిస్తున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు... కేంద్రంలో కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ సర్కారుకు కూడా అదే తరహా అండదండలు అందిస్తున్న సంగతి బట్టబయలైంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఏదోలా అడ్డుకునేందుకు... తనపై కోర్టు కేసులు, సీబీఐ విచారణలను తప్పించుకునే లక్ష్యంతో కాంగ్రెస్‌తో చెట్టపట్టాలుగా ‘ముందుకు’ సాగుతున్న బాబు, అందులో భాగంగా ‘ఢిల్లీ పెద్దలతో’ కలిసి రచించిన తాజా నాటకం.. వారి కుమ్మక్కు రాజకీయాలకు పరాకాష్టగా నిలిచింది! చిల్లర వ్యాపారంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) అనుమతిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించాలంటూ రాజ్యసభలో విపక్షాలు పెట్టిన కీలక తీర్మానంపై ఓటింగ్ సమయంలో టీడీపీ చాకచక్యంగా అధికార పక్షంతో కరచాలనం చేసింది. 

ముందస్తు వ్యూహం ప్రకారం.. ముగ్గురు టీడీపీ ఎంపీలు ఓటింగ్‌కు గైర్హాజరయ్యారు! బీఎస్‌పీ అధినేత్రి మాయావతి బాహాటంగా ఇచ్చిన మద్దతు, ఎస్‌పీ అధినేత ములాయంసింగ్‌యాదవ్ వాకౌట్‌తో చేసిన సాయం.. వారిద్దరి బాటలోనే టీడీపీ ఇచ్చిన తోడ్పాటు ఫలితంగా యూపీఏ కూటమి ఓటింగ్‌లో ‘ఘన విజయం’ సాధించింది. దాంతో కాంగ్రెస్ పెద్దలు స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకున్నారు. అనారోగ్య కారణాల వల్లే సభకు హాజరు కాలేకపోయామని, డాక్టర్ అపాయింట్‌మెంట్లు ఉన్నాయని టీడీపీ ఎంపీలు చెప్పడం కేవలం కుంటిసాకుగానే కనిపిస్తోంది. నిజానికి తీవ్ర అనారోగ్యంతో ఉన్న జనార్దన్ వాఘ్మారే (మహారాష్ట్ర)ను స్ట్రెచర్‌పై, నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి (ఆంధ్రప్రదేశ్)ను వీల్‌చైర్‌పైనే కాంగ్రెస్ పార్టీ పార్లమెంటుకు రప్పించింది. వారితో లాబీలోనే ఓటు వేయించింది. ఇటువంటి ప్రతిష్టాత్మక సమయంలో టీడీపీ ఎంపీలు చెబుతున్న సాకులు హాస్యాస్పదమంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. దేశంలోని చిరు వ్యాపారులు, రైతులందరి పాలిట పెను శాపమైన ఎఫ్‌డీఐని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని పార్లమెంటు సమావేశాలు మొదలైన రోజునుంచీ టీడీపీ గగ్గోలు పెట్టటం, చివరి నిమిషంలో ఆ పార్టీ ఎంపీలు గైర్హాజరు కావటం చూస్తే టీడీపీ ‘వ్యతిరేకత’ పెద్ద నాటకమని రుజువైందనే ప్రచారం విపక్షాల వర్గాల్లో జోరుగా సాగుతోంది. ప్రభుత్వంపై ఓటింగ్‌తో కూడిన చర్చకు అన్నా డీఎంకే నేత మైత్రేయన్ ప్రతిపాదించిన తీర్మానాన్ని బలపరిచిన టీడీపీ.. అందివచ్చిన సువర్ణావకాశాన్ని ఇలా ఆవిరి చేస్తుందని అనుకోలేదంటూ బీజేపీ, వామపక్షాల నేతలు దిగ్భ్రాంతికి లోనవుతున్నారు. ఎఫ్‌డీఐలపై లోక్‌సభలో జరిగిన ఓటింగ్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసింది కూడా కంటితుడుపు చర్యేనని కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని ఆ రెండు పక్షాల ఎంపీలు కొందరు అభిప్రాయపడుతున్నారు.

ముందే హోంవర్క్ చేసుకున్నాం..

రాజ్యసభలో నెగ్గే బలం తమకుందని మొదటినుంచీ చెప్తున్న విషయాన్ని ప్రభుత్వ పెద్దలు పార్లమెంట్ ఆవరణలో ప్రస్తావిస్తూ.. ‘‘ఎలా నెగ్గామో చూశారు కదా! మేం ముందే హోంవర్క్ అంతా బాగా చేసుకున్నాం’’ అని గుంభనంగా వ్యాఖ్యానించారు. రాజ్యసభ మొత్తం బలం 245. ఒక స్థానం ఖాళీగా ఉండటంతో ప్రస్తుత సభా బలం 244. ఇందులో 15 మంది సభ్యులున్న బహుజన్ సమాజ్ పార్టీ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేసింది. 9 మంది సభ్యులున్న సమాజ్‌వాదీ పార్టీ ఓటింగ్‌ను బహిష్కరించింది. లోక్‌సభలో ఎస్‌పీ, బీఎస్‌పీ రెండూ ఓటింగ్‌కు దూరంగా ఉండగా రాజ్యసభలో మాత్రం ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేస్తామని బీఎస్‌పీ అధినేత్రి మాయావతి ముందే ప్రకటించారు. విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిన సమాచారం ప్రకారం.. సమాజ్‌వాదీ పార్టీ వైఖరిపై పూర్తి విశ్వాసమున్న కాంగ్రెస్ పెద్దలు.. బీఎస్‌పీ సారథిని నమ్మడానికి లేదని, చివరి నిమిషంలో చేయిస్తే కొంప కొల్లేరవుతుందన్న ఉద్దేశంతో ముందే చేసుకున్న ఏర్పాట్లను తెరపైకి తీసుకొచ్చారు. 

కనీసం ఒక్క ఓటుతోనైనా గెలిచేలా అంకెల పావులన్నీ కదిపి అన్నీ సిద్ధం చేసి పెట్టారు. 244 మంది సభ్యులున్నప్పటికీ ప్రభుత్వానికి కచ్చితంగా ఓటేసే ఇద్దరు సభ్యులు మురళీ దేవరా (కాంగ్రెస్), సచిన్ టెండూల్కర్ (నామినేటెడ్) సభకు రాలేని పరిస్థితిని కూడా దృష్టిలో పెట్టుకున్న కాంగ్రెస్ పెద్దలు, రాష్ట్ర స్థాయిలో టీడీపీ ఇస్తున్న అండదండలనే ఢిల్లీలోనూ రహస్యంగా అందజేయాలని చంద్రబాబును కోరగా అందుకాయన వెంటనే సంసిద్ధత తెలిపి అంకెల గారడీ చేసినట్టు చెప్తున్నారు. పార్టీ ఎంపీలందరూ సభకు గైర్హాజరైతే కాంగ్రెస్‌తో తాను జట్టుకట్టిన సంగతి బాహాటంగా అందరికీ తెలిసిపోతుందని భావించిన బాబు.. యూపీఏ సర్కారు కనీసం ఒకటి రెండు ఓట్లతో గట్టెక్కేలా ముగ్గురు ఎంపీలను ఓటింగ్ సమయంలో సభకు దూరంగా ఉంచుతానని కాంగ్రెస్ వ్యూహకర్తలకు మాటిచ్చినట్టు తెలియవచ్చింది. బీఎస్‌పీ చివరి నిమిషంలోనైనా మనసు మార్చుకుని బయటకు నడవొచ్చన్న అంచనాతో కాంగ్రెస్ వ్యూహకర్తలు.. ఓటింగ్‌కు అరగంట ముందే టీడీపీ ఎంపీలు సభకు దూరంగా ఉండేలా చూడాలని బాబుకు శుక్రవారం ఉదయం ఫోన్ చేసి మరీ గట్టిగా చెప్పారని, ఆ మేరకు బాబు నుంచి వచ్చిన మౌఖిక ఉత్తర్వులను పాటిస్తూ ముగ్గురు టీడీపీ ఎంపీలు ఓటింగ్‌కు దూరంగా నిలిచారని బోధపడుతోంది.

స్ట్రెచర్లపైనే సభకు వాఘ్మారే, నేదురుమల్లి 

కీలకమైన ఓటింగ్ కావడంతో కాంగ్రెస్ పెద్దలు ఎక్కడా రిస్క్ తీసుకోదల్చుకోలేదు. అస్వస్థతతో బాధపడుతున్న ఎంపీలనే కాదు, విదేశాల్లో ఉన్న విజయ్‌మాల్యానీ రప్పించారు. తీవ్ర అస్వస్థతతో బాధపడుతూ ఇంటి నుంచి, ఆసుపత్రి నుంచి కదల్లేని స్థితిలో ఉన్న పార్టీ ఎంపీలిద్దరికి అన్ని ఏర్పాట్లూ చేసి మరీ ఢిల్లీకి రప్పించారు. మహారాష్ట్రకు చెందిన ఎన్సీపీ ఎంపీ జనార్దన్ వాఘ్మారే, రాష్ట్రానికి చెందిన నేదురుమల్లి జనార్దనరెడ్డి వచ్చి ఓటేసిన తీరు అందరినీ దిగ్భ్రమకు గురిచేసింది. వాఘ్మారేను స్ట్రెచర్‌పై తీసుకురాగా, జనార్దనరెడ్డి వీల్ చైర్‌లో వచ్చారు. వారిద్దరూ రాజ్యసభ లాబీల్లోంచి ఓట్లు వేయడానికి అనుమతించాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్‌నాథ్ స్వయంగా సభాధ్యక్షుడిని కోరగా ఆయన అంగీకరించారు. వారిద్దరూ అలాగే ఓట్లువేశారు. ఇక బ్రిటన్‌లో ఉన్న విజయ్‌మాల్యా ఈ ఓటింగ్‌లో పాల్గొనడం కోసమే ప్రత్యేకంగా విమానంలో ఢిల్లీలో వాలారు. పార్లమెంటుకు వచ్చి ఓటేశాకఆయన మళ్లీ బ్రిటన్ బయల్దేరి వెళ్లారు.

టీడీపీ ‘ఎఫ్‌డీఐ నిబద్ధత’ ఇదీ...

ఎఫ్‌డీఐలపై రాజ్యసభలో తీర్మానాన్ని అన్నాడీఎంకే నేత మైత్రేయన్ ప్రవేశపెట్టగా దాన్ని విపక్ష నేతల్లో అరుణ్ జైట్లీ, సీతారాం ఏచూరి తదితరులతో పాటు టీడీపీ తరఫున సి.ఎం.రమేశ్ బలపరిచారు. ఎఫ్‌డీఐని తమ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని, తీర్మానాన్ని తాము పూర్తిస్థాయిలో బలపరుస్తామని గురువారం సభలో ప్రసంగించిన సమయంలో సి.ఎం.రమేశ్ తీవ్రస్వరంతో ప్రకటించారు. తెల్లారేసరికి ఆయన ప్రకటించిన వ్యతిరేకతలోని డొల్లతనం బట్టబయలైంది. తీర్మానాన్ని బలపరిచిన సి.ఎం.రమేశ్‌తో పాటు మరో ఎంపీ హరికృష్ణ మాత్రమే టీడీపీ తరఫున ఓటింగ్‌లో పాల్గొన్నారు. వీరిద్దరు తీర్మానానికి అనుకూలంగా ఓట్లేశారు. ఇది కూడా బాబు-కాంగ్రెస్ పెద్దల వ్యూహంలోనే భాగంగా జరిగిందని తెలుస్తోంది. ఆరోగ్య పరీక్షల నిమిత్తం వెళ్లిన కారణంగానే ఓటింగ్‌లో పాల్గొనలేకపోయానని, ఈ విషయమై బాబుకు ముందే సమాచారం ఇచ్చానని దేవేందర్‌గౌడ్, బంధువు అస్వస్థతకు గురికావటంతో వెళ్లిన తనకు చివరి నిమిషంలో ఢిల్లీకి రావటానికి విమానం దొరకలేదని గుండు సుధారాణి శుక్రవారం రాత్రి తమ వ్యక్తిగత సహాయకుల ఫోన్ల నుంచి మీడియా ప్రతినిధులకు ఎస్‌ఎంఎస్‌లు పంపించారు. ఇది కూడా చంద్రబాబు సూచనల ప్రకారమే జరిగిందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

ఆ ముగ్గురూ అలా...
చంద్రబాబు నోటి నుంచి మాట రాకుండా ఓటింగ్‌కు గైర్హాజరయ్యేంత సీన్ ఆ ముగ్గురు ఎంపీలకూ లేనే లేదని టీడీపీ వర్గాలే బాహాటంగా చెబుతున్నాయి. పైగా వారు ముగ్గురూ శుక్రవారం ఢిల్లీలోనే ఉండి మరీ సభకు వెళ్లకపోవడం విశేషం! తీర్మానాన్ని బలపరిచిన సి.ఎం.రమేశ్ సభలో ఎలాగూ ఉండాలి కనుక మిగతా నలుగురిలో తన మాట వినే ముగ్గురిని బాబు ఎంచుకున్నారని, ఆయన చెప్పిన మేరకే వారు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. గుండు సుధారాణి, సుజనా చౌదరి, దేవేందర్‌గౌడ్ సంగతి పరిశీలిస్తే.. చౌదరి గురువారం ఢిల్లీలో లేకున్నా శుక్రవారం మాత్రం నగరంలోనే ఉన్నారని టీడీపీ వర్గాలు పేర్కొన్నాయి. సుధారాణి గురువారం సి.ఎం.రమేశ్ రాజ్యసభలో ప్రసంగిస్తున్నంత సేపూ పక్కనే ఉన్నారు. ఆమె రాత్రికి రాత్రే నగరం విడిచివెళ్లటంలో ఆంతర్యం పార్టీ ఎంపీల్లో మిగిలిన వారెవరికీ తెలియదు. నిజానికి శుక్రవారం కూడా ఆమె ఢిల్లీలోనే ఉన్నట్టు చెబుతున్నారు. ఇక దేవేందర్‌గౌడ్ ఢిల్లీలోనే ఉండి కూడా అనారోగ్యంగా ఉందంటూ ఓటింగ్‌కు వెళ్లలేదు. పైగా మామూలు సమయంలో మీడియాకు అందుబాటులో ఉండే ఈ ముగ్గురు నేతలూ శుక్రవారం మాత్రం రాజ్యసభకు గైర్హాజరు నేపథ్యంలో అసలు మీడియా ముందుకే రాకపోవడం గమనార్హం.


సమీకరణల అంచనాలు ఇలా...

రాజ్యసభలో పార్టీల సమీకరణలు చంద్రబాబు, కాంగ్రెస్ వ్యూహకర్తల రహస్య ఒప్పందాన్ని ఎలుగెత్తి చాటుతున్నాయి. 244 మంది సభ్యులున్న సభలో మురళీదేవరా శస్త్రచికిత్స చేయించుకుంటున్నందున ఆయనను పార్లమెంట్‌కు తీసుకొచ్చే అవకాశాలు ఏమాత్రం లేవు. అలాగే, కోల్‌కతాలో టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న క్రికెటర్ సచిన్ టెండూల్కర్ సభకు రాలేని స్థితిలో ఉన్నారు. ఈ ఇద్దరినీ కాంగ్రెస్ పెద్దలు తమ లెక్కల్లో నుంచి తీసేసి మిగతా బలాన్ని సరిచూసుకున్నారు. అది తేడాగా కనిపించడంతోనే టీడీపీ ఎంపీలు రాకుండా చూశారని తెలుస్తోంది.
సభ బలం 244లో మురళీదేవరా, సచిన్‌ని మినహాయిస్తే 242

రాజ్యసభలో ప్రభుత్వానికి మెజారిటీ లేని సంగతి అందరికీ తెలిసిందే. మద్దతిస్తానన్న బీఎస్‌పీ సభ్యులు 15 మందిని, నామినేటెడ్ సభ్యులు 10 మందిని కలుపుకుంటే ప్రభుత్వ బలం 122. కానీ దేవరా, సచిన్‌ను మినహాయిస్తే సర్కార్ సత్తా 120. సభలో విపక్ష బలం సరిగ్గా 108 (టీడీపీకున్న ఐదుగురితో కలుపుకుని).
ఓటింగ్‌ను బహిష్కరించిన ఎస్‌పీ సభ్యులు 9 మందిని 242 లోంచి తీసేస్తే 233. అనివార్య కారణాలతో చివర్లో మరో సభ్యుడు ఎవరైనా రాలేకపోతే సభలో ఉండేది 232.

అలా 232 మంది కచ్చితంగా హాజరైన సమయంలో తీర్మానం వీగిపోవడానికి ప్రభుత్వ పక్షాన 117 మంది నిలవాలి. కానీ బీఎస్‌పీ సభ్యులు 15 మంది కూడా చివరి క్షణంలో బహిష్కరిస్తే.. సభలో ఉండేది 217. అప్పుడు ప్రభుత్వం నెగ్గడానికి కావాల్సింది 109. ఇది విపక్షానికున్న బలం 108కి సరిగ్గా ఒకటి ఎక్కువ. ఈ ఒక్క ఓటు ఎటైనా గల్లంతైతే ప్రభుత్వ ప్రతిష్ట అంతే సంగతులు.

ఈ లెక్కల చిట్టాను ముందే తరచి చూసుకున్న కాంగ్రెస్ వ్యూహకర్తలు.. తెలివిగా టీడీపీతో ఉన్న దోస్తీని ఉపయోగించుకుని ఆ పార్టీకి వ్యూహాన్ని నిర్దేశించారు. ముగ్గురు ఎంపీలను రాకుండా చూస్తే చాలని చంద్రబాబుకు వారు చెప్పటం.. ఆ మేరకు బాబు ఆదేశాలివ్వటం, వాటిని తూచా తప్పకుండా పాటిస్తూ సుజనాచౌదరి, దేవేందర్‌గౌడ్, గుండు సుధారాణి తెరపై కీలక క్షణాల్లో కనిపించకుండా ఉండటం జరిగిందని తెలుస్తోంది.

టీడీపీ ఎంపీలు ముగ్గురూ కూడా రాకపోవడంతో సభకు గైర్హాజరైన మొత్తం ఎంపీలు (సచిన్, దేవరాతో కలిపి) ఐదుగురయ్యారు. బహిష్కరించిన ఎస్‌పీ సభ్యులతో కలిపితే సభకు దూరంగా ఉన్నవారి సంఖ్య 14. మొత్తం సభ్యులు 244లో ఈ సంఖ్యను తీసేస్తే 230. ప్రభుత్వం నెగ్గడానికి కావాల్సిన ఓట్లు 116. బీఎస్‌పీ మద్దతుతో సర్కారుకు దక్కిన మొత్తం ఓట్లు 123.

ఆ ముగ్గురూ ఓటేస్తే...

బీఎస్‌పీ కూడా వాకౌట్ చేసి, ఓటింగ్‌కు దూరంగా ఉన్న ముగ్గురు ఎంపీలతో పాటుగా మొత్తం ఐదుగురు టీడీపీ సభ్యులూ సభకు వచ్చి ఉంటే పరిస్థితి ఇలా ఉండేది: 244 - సచిన్ (1) - మురళీదేవరా (1) - ఎస్‌పీ (9) - బీఎస్‌పీ (15) = 218. ప్రభుత్వం నెగ్గడానికి కావాల్సింది 110. ఈ పరిస్థితుల్లో సర్కారు గెలుపుపై కాంగ్రెస్‌కు అనుమానాలున్నాయి. చివరి నిమిషంలో ఒకరిద్దరు రాకుంటే ప్రభుత్వ ప్రతిష్ట గంగపాలయ్యేది. ఆ పరిస్థితి రాకుండా టీడీపీ సర్కారును భుజాలకెత్తుకున్న వైనం ఆవిష్కతమైంది.

నేడు షర్మిల పాదయాత్ర సాగుతుందిలా..

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన ‘మరో ప్రజా ప్రస్థానం’ పాదయాత్ర శుక్రవారం కొండేడు గ్రామం నుంచి ప్రారంభమవుతుందని పార్టీ ప్రోగ్రామ్స్ కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, జిల్లా కన్వీనర్ ఎడ్మ కిష్టారెడ్డిలు తెలిపారు. ఆ తర్వాత చిన్న ఆదిరాల, పెద్ద ఆదిరాల, ఎక్వాయపల్లి, తొమ్మిది రేకుల, కాకునూరు, సుందరాపూర్ క్రాస్, కేశంపేటకు చేరుకుని, ఆ రాత్రికి కేశంపేట గ్రామ శివారు ప్రాంతంలోఏర్పాటు చేసిన టెంట్‌లో షర్మిల బస చేస్తారని వారు తెలిపారు. శుక్రవారం 19 కి.మీ. యాత్ర కొనసాగిస్తారు.

YS Sharmila's Padayatra Supporting Video

Written By news on Friday, December 7, 2012 | 12/07/2012



టీడీపీ 'ఫిక్సింగ్' బట్టబయలు!

గత కొద్దికాలంగా రాష్ట్రంలో ప్రతిపక్ష, అధికార పక్షాలు కలిసి పనిచేస్తున్నాయనే ఆరోపణలకు బలం చేకూర్చే విధంగా రాజ్యసభ వేదికగా నిలిచింది. తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు కలిసి రాష్ట్రంలో మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడుతున్నారని అనేక సందర్భాల్లో రుజువయ్యాయి. తాజాగా రాజ్యసభ సాక్షిగా టిడిపి గుట్టు రట్టయింది. ఎఫ్‌డీఐ తీర్మానంపై జరిగిన కీలక ఓటింగ్‌లో ముగ్గురు దేశం ఎంపీలు డుమ్మా కొట్టారు. పరోక్షంగా కాంగ్రెస్‌కు కావాల్సిన సాయమందించారు. పైకి శత్రువులమని చెప్పుకుంటూ లోలోన చేతులు కలిపేశారని ఇప్పుడు తెలుగుదేశంపై ఇతర పార్టీలు విరుచుకుపడుతున్నాయి.

కాంగ్రెస్‌ పార్టీయే తమ ప్రధాన ప్రత్యర్థి అంటూ, ఎఫ్ డీఐలకు తాము వ్యతిరేకమంటూ పాదయాత్రలో డైలాగులు చెప్పిన బాబు.. తన పార్టీని మాత్రం రాజ్యసభలో రాంగ్ రూటులో నడిపించారు. రాజ్యసభలో తెలుగుదేశం పార్టీకి అయిదుగురు ఎంపీలున్నారు. శుక్రవారం జరిగిన ఓటింగ్‌లో ప్రభుత్వానికి ఓటమి తప్పకపోవచ్చని అందరూ భావించారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో బద్దశత్రువులు పార్లమెంట్ లో కలిసి పోయి యూపీఏకు దాసోహమన్నారు.

చివరిక్షణం వరకు ఉత్కంఠ రేపిన ఓటింగ్ లో ప్రతి ఎంపీ ఓటు అత్యంత కీలకంగా మారింది. రాజ్యసభలో ఏమి జరగబోతోందనని దేశమంతా ఉత్కంఠగా చూస్తున్న వేళ.. దేశంలోని రైతులు, చిన్నవ్యాపారులకు శాపంగా మారే ఎఫ్ డీ ఐల అడ్డుకునేందుకు ప్రయత్నించక పోగా.. బాధ్యతారహిత్యానికి ఒడిగట్టి తెలుగుదేశానికి చెందిన ముగ్గురు టిడిపి ఎంపీలు సభకు డుమ్మా కొట్టారు.

సభలో సమయానికి ఉండి ఓటు వేయాల్సిన గుండు సుధారాణి, సుజనా చౌదరీ, దేవేందర్‌ గౌడ్‌.. కనిపించకుండా పోవడం అందర్ని విస్మయానికి గురిచేసింది. వీరి ఆచూకి కోసం ప్రయత్నించిన వారికి కనీసం ఫోన్‌లోనూ అందుబాటులోకి రాలేదు. తీరా ఓటింగ్‌ జరిగి విషయం బయటపడడంతో స్కూల్‌ పిల్లలు చెప్పే విధంగా కారణాలు చెప్పి నమ్మించడానికి ప్రయత్నించారు. ముందుగానే అధినేత అనుమతి తీసుకున్నామని, ఓటు వేసినా, వేయకపోయినా ఒకటే కాబట్టి.. వ్యక్తిగత పనుల వల్ల దూరంగా ఉన్నామని చెప్పుకొచ్చారు. తనకు డాక్టర్‌ అపాయింట్‌మెంట్‌ ఉందని, అందుకే సభకు రాలేదని దేవేందర్‌ గౌడ్‌ చెప్పగా, అసలు ఓటింగ్‌ జరిగే సమయమే ఐదింటికని అనుకున్నానని సుజనా చౌదని తెలిపారు. ఇక గుండు సుధారాణి సంగతి దేవుడెరుగు.

రీటైల్‌ రంగంలో 51 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతిస్తూ తీసుకున్న నిర్ణయంపై రాజ్యసభలో జరిగిన ఓటింగ్ ఓటింగ్ లో బీఎస్పీ, ఎస్పీ, టీడీపీలు పాల్గొనకపోవడంతో యూపీఏ ప్రభుత్వం గట్టెక్కింది. దేవేందర్ గౌడ్, సుజానా చౌదరీ, గుండు సుధారాణిలు గైర్హాజరయ్యారు. రాజ్యసభలో జరిగిన ఓటింగ్ లో 123 ఓట్లు ప్రభుత్వానికి అనుకూలంగా, 109 ఓట్లు వ్యతిరేకంగా వచ్చాయి. ఓటింగ్‌ సమయంలో సభలో 232 మంది సభ్యులున్నారు. మ్యాజిక్‌ నెంబర్‌ 117కన్నా ప్రభుత్వానికి ఆరు ఓట్లు ఎక్కువ వచ్చాయి.

రైతుల ప్రయోజనాల్ని దెబ్బ తీసే ఎఫ్ డీ ఐలకు వ్యతిరేకమంటూ ఇన్నాళ్లు చెప్పుకొచ్చిన టిడిపి.. రాజ్యసభలో తాజా చర్యతో విలన్‌గా మారింది. కాంగ్రెస్ పవర్ మేనేజ్ మెంట్ కు ముగ్గురు టిడిపి ఎంపీలు తలవంచి దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ప్రవర్తించడం సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. 


http://www.sakshi.com/Main/Featuredetails.aspx?Newsid=53866&Categoryid=28&subcatid=0

పాలమూరు జిల్లాను పసిడి జిల్లాగా మార్చాలని మహానేత వైఎస్సార్ సంకల్పించారని ..........

పాలమూరు జిల్లాను పసిడి జిల్లాగా మార్చాలని మహానేత వైఎస్సార్ సంకల్పించారని షర్మిల చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన ‘మరో ప్రజా ప్రస్థానం’ పాదయాత్ర శుక్రవారం కొండేడు గ్రామం నుంచి ప్రారంభమైయింది. ఈ సందర్భంగా షర్మిల కేసంపేట సభలో మాట్లాడుతూ మెట్రో వాటర్ ప్రాజెక్ట్ ద్వారా కేసంపేట మండలానికి మంచినీరు ఇవ్వాలని వైఎస్ సంకల్పించారని చెప్పారు. కానీ వైఎస్ఆర్ ఆశయం నీరిగారిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

మహబూబ్‌నగర్ ఎంపీగా కేసీఆర్ జిల్లా ప్రజలకు చేసిందేమీ లేదని షర్మిల విమర్శించారు. ఇంత మంది వలసపోతున్నా, విద్యార్థుల చదువు ఆగిపోతున్నా కేసీఆర్‌కు పట్టదన్నారు. విద్యుత్ చార్జీలు పెంచి ప్రశ్నించిన వారిని కాల్చి చంపిన ఘనత చంద్రబాబుదని షర్మిల దుయ్యబట్టారు. వైఎస్‌ఆర్ విగ్రహాలు చూసి ప్రజలు రాజన్న సేవలు గుర్తుచేసుకుంటున్నారని అన్నారు. ఎన్టీఆర్ విగ్రహాలు చూస్తే చంద్రబాబు వెన్నుపోటు గుర్తుకొస్తుందిని షర్మిల చెప్పారు. 

ముగిసిన షర్మిల 51వ రోజు పాదయాత్ర

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన ‘మరో ప్రజా ప్రస్థానం’ 51వ రోజు పాదయాత్ర శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లాలోని కేశంపేటలో ముగిసింది. ఉదయం కొండేడు గ్రామం నుంచి ప్రారంభమైయిన పాదయాత్ర చిన్న ఆదిరాల, పెద్ద ఆదిరాల, ఎక్వాయపల్లి, తొమ్మిది రేకుల, కాకునూరు, సుందరాపూర్ క్రాస్, కేశంపేట మీదుగా సాగింది. అనంతరం కేశంపేటలో ఏర్పాటుచేసిన సభలో షర్మిల ప్రసంగించారు. ఈ రాత్రికి కేశంపేట గ్రామ శివారు ప్రాంతంలో ఏర్పాటు చేసిన టెంట్‌లో షర్మిల బస చేస్తారు. ఈరోజు షర్మిల 19 కిలోమీటర్ల వరకు నడిచారు. ఇప్పటివరకు షర్మిల 724 కిలోమీటర్లు పాదయాత్ర కొనసాగించారు. 

Sharmila's speech at Kesham Peta

'ఎంపీల రద్దుకు చంద్రబాబు ఫిర్యాదు చేయాలి'

రాజ్యసభలో ఓటింగ్‌కు టీడీపీ గైర్హాజరు కావడం కాంగ్రెస్ పార్టీతో కొనసాగుతున్న మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు నిదర్శనమని నాగం జనార్ధన్ రెడ్డి అన్నారు. ఓటింగ్‌లో పాల్గనవద్దని తమ ఎంపీలకు చంద్రబాబే ఆదేశించారని నాగం ఆరోపించారు. రాజ్యసభ లో జరిగిన ఓటింగ్ కు గైర్హాజరైన తమ ఎంపీల సభ్యత్వాల రద్దుకు చంద్రబాబు ఫిర్యాదు చేయాలని నాగం డిమాండ్ చేశారు.

ఎఫ్ డీ ఐలతో లబ్ది పొందే వ్యక్తి రాష్ట్రంలో చంద్రబాబే

ఎఫ్ డీ ఐలతో లబ్ది పొందే వ్యక్తి రాష్ట్రంలో చంద్రబాబేనని టీడీపీ రెబల్ ఎమ్మెల్యే ప్రవీణ్‌రెడ్డి ఆరోపించారు. హెరిటేజ్ సంస్థల్లోకి భారీగా విదేశీ పెట్టుబడుల కోసమే ఆయన వ్యూహం రచించారన్నారు. తన వ్యాపారాలు బాగుపడాలి, కాంగ్రెస్‌ను కాపాడాలన్నదే బాబు ధ్యేయమని ప్రవీణ్ రెడ్డి విమర్శించారు. రాజకీయ, ఆర్థిక ప్రయోజనాల కోసమే టీడీపీ ఎంపీలను ఓటింగ్‌కు గైర్హాజరయ్యాలా చేశారన్నారు. కాంగ్రెస్‌, టీడీపీ కుమ్మక్కురాజకీయాలకు ఇది పరాకాష్ట అని ఎమ్మెల్యే ప్రవీణ్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

YSRCP Leader M.V.Mysura Reddy press meet in YSRCP office

యూపీఏను గట్టెక్కించిన టీడీపీ

ఎఫ్ డీఐలపై రాజ్యసభలో ఓటింగ్ కు టీడీపీ ఎంపీలు గైర్హాజరవ్వడం పట్ల పలు సందేహాలు రేకెత్తుతున్నాయి. రాజ్యసభలో బీఎస్పీ, ఎస్పీ, సభ్యులతోపాటు టీడీపీ ఎంపీలు కూడా ఓటింగ్ లో పాల్గొనకపోవడంతో కాంగ్రెస్, టీడీపీల కుమ్మక్కు బట్టబయలైందని పలువురు అభిప్రాయపడుతున్నారు. రాజ్యసభలో టీడీపీకి ఐదుగురు సభ్యులున్నారు. దేవేందర్ గౌడ్, సుజానా చౌదరీ, గుండు సుధారాణిలు మాత్రమే హాజరయ్యారు. టీడీపీ ఎంపీలు ఓటింగ్ లో పాల్గొనకపోవడంతో యూపీఏ ప్రభుత్వం గట్టెక్కింది.

Sharmila's Conducts Rachabanda at Pedda Adirala, Palamuru

'బాబు ఎంత ప్యాకేజీ తీసుకున్నారు'

రాష్ట్రంలో ప్యాకేజీ రాజకీయాలకు టీడీపీ పెట్టింది పేరని వైఎస్ఆర్ సీపీ నేత, ఎమ్మెల్యే అమర్ నాథ్ రెడ్డి అన్నారు. ఆయన శుక్రవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ ఎన్టీఆర్ తర్వాత వైఎస్ హయాంలోనే ప్రజా సంక్షేమం జరిగిందన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయితే అలాంటి సుభిక్ష పాలన వస్తుందని అమర్ నాథ్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

కుమ్మక్కు రాజకీయాలతో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శంచటం తగదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటు వేయమని చంద్రబాబే పురమాయించారని, రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయొద్దని చెప్పింది ఆయనేనని అన్నారు. ఇలాంటి కుమ్మక్కు రాజకీయాలకు చంద్రబాబు ఎంత ప్యాకేజీ తీసుకున్నారని అమర్ నాథ్ రెడ్డి ప్రశ్నించారు.

ysrcp meeting

YSRCP Political Affairs Committee Meeting

కొండేడు నుంచి షర్మిల పాదయాత్ర

మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రను షర్మిల శుక్రవారం మహబూబ్ నగర్ జిల్లా కొండేడు నుంచి ప్రారంభించారు. ఆమె చేపట్టిన యాత్ర నేటికి 51వ రోజుకు చేరింది. కొండేడు నుంచి చిన్న ఆదిరాల, పెద్ద ఆదిరాల, ఎక్వాయపల్లి, తొమ్మిది రేకుల, కాకునూరు, సుందరాపూర్‌ క్రాస్‌ రోడ్‌ మీదుగా కేసం పేట వరకు పాదయాత్ర కొనసాగుతుంది. కేసంపేటలో జరిగే బహిరంగ సభలో షర్మిల ప్రసంగిస్తారు. ఇవాళ దాదాపు 19 కిలో మీటర్ల మేర యాత్ర సాగనుంది.

Palamuru basatagaa..7th Dec 2012

వైఎస్ ఆలోచనలను జగన్ ముందుకు తీసుకువెళ్తారు

గుడిసెలు లేని రాష్ట్రం కోసం వైఎస్ తపన పడ్డారు
అన్ని వర్గాలకు సంతృప్తస్థాయిలో పథకాలు అమలు చేశారు
వైఎస్ ఆలోచనలను జగన్ ముందుకు తీసుకువెళ్తారు

హైదరాబాద్, న్యూస్‌లైన్:మహనీయుడు బాబా సాహెబ్ బీఆర్ అంబేద్కర్ ఆలోచనా విధానంతోనే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు చేపట్టారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ చెప్పారు. అంబేద్కర్ 56వ వర్ధంతిని పురస్కరించుకుని గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన చిత్రపటానికి విజయమ్మ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘సమాజంలో మనిషిని మనిషిగా నిలబెట్టేందుకు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఎంతగానో కృషి చేశారు.

ముఖ్యంగా బడుగు, బలహీన వర్గాలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అభివృద్ధి చేయాలని తపన పడ్డారు. ఇదే ఆలోచన విధానంతో పనిచేసిన వైఎస్ రాజశేఖరరెడ్డి కూడా అనేక పథకాల ద్వారా సమాజంలోని అన్ని వర్గాలకు సంతృప్త స్థాయిలో సంక్షేమ ఫలాలను అందించారు. కొద్ది మందికి మాత్రమే రేషన్ ఇచ్చినట్లు కాకుండా పార్టీలకతీతంగా కులం, వర్గమన్న తేడా లేకుండా సమాజంలోని వారందరికీ వర్తించేలా అనేక పథకాలను చేపట్టారు. స్వాతంత్య్రం సిద్ధించిన 65 ఏళ్లలో ఏ ముఖ్యమంత్రి కూడా పేదల కోసం ఇన్ని పథకాలు చేపట్టలేదు. ఆరోగ్యశ్రీని ప్రవేశ పెట్టి పేదలకు, ధనికులతో సమానంగా కార్పొరేట్ వైద్యం అందేందుకు కృషి చేశారు. కేంద్రం 2009లో ప్రాథమిక విద్య అందరికీ నిర్బంధం చేస్తూ నిర్ణయం తీసుకుంది. కానీ అంతకు రెండేళ్ల ముందే వైఎస్ రాష్ట్రంలో పేదలకు ఉన్నత విద్యను అందుబాటులోకి తెచ్చేందుకు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం అమలులోకి తెచ్చారు. దీనివల్ల ఎందరో పేద విద్యార్థులు డాక్టర్, ఇంజనీరింగ్ విద్యతోపాటు పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఎంబీఏ వంటి చదువులు అభ్యసించగలిగారు. కానీ ఈ ప్రభుత్వం ఆ పథకాలను నిర్లక్ష్యం చేస్తోంది’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. దేశం మొత్తమ్మీద ఐదేళ్లలో కేంద్ర ప్రభుత్వం 45 లక్షల ఇళ్లను నిర్మిస్తే మన రాష్ట్రంలో వైఎస్ అదే ఐదేళ్లలో 45 లక్షల ఇళ్లను నిర్మించారని గుర్తించారు. గుడిసె లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలని వైఎస్ ఆలోచించారని పేర్కొన్నారు. 80 లక్షల ఇళ్లను నిర్మిస్తే గుడిసెలు లేకుండా చేయడం సాధ్యమని భావించారని, కానీ ఆయన ప్రజల మధ్య నుంచి వెళ్లి పోయాక ఇప్పుడు ఒక్క కొత్త ఇల్లు కూడా నిర్మించే పరిస్థితి లేదని పేర్కొన్నారు. అంబేద్కర్ ఆలోచనా విధానాన్ని స్ఫూర్తిగా తీసుకుని వైఎస్ ఆలోచించినందువల్లే ఆయన చేపట్టిన సంక్షేమ పథకాల వల్ల పెద్ద సంఖ్యలో దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలకు మేలు జరిగిందన్నారు. 

జగన్‌మోహన్ రెడ్డి కూడా వైఎస్ ఆలోచనలను కొనసాగించేందుకు కృషి చేస్తారని తాను గర్వంగా చెబుతున్నట్లు వివరించారు. అంబేద్కర్ రాజ్యాంగంలో కల్పించిన ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలకు కట్టుబడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పని చేస్తుందని చెప్పారు. పిల్లలను స్కూలుకు పంపితే ఆ తల్లి ఖాతాలో నగదు జమ చేసేలా ‘అమ్మ ఒడి’ పథకంతోపాటు ప్రతి దళిత కుటుంబానికి సాగుకు వీలైన ఒక ఎకరా భూమి ఇస్తామని జగన్ చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. పారిశ్రామికులుగా మారాలనుకున్న ఎస్సీ, ఎస్టీలకు శిక్షణ, రుణ సదుపాయాలను హక్కుగా మారుస్తామని చెప్పారు. దళిత, గిరిజనులకు సంబంధించి వైఎస్ సంక్షేమ పథకాలకు కొనసాగింపుగా ఉపాధి, ఉద్యోగాలను హక్కుగా మారుస్తామన్నారు. అంబేద్కర్ ఆలోచనా విధానానికి అనుగుణంగా పనిచేసిన ప్పుడే ఆయనకు నిజమైన నివాళి అని విజయమ్మ స్పష్టంచేశారు. వర్ధంతి కార్యక్రమంలో పార్టీ ముఖ్య నేతలు ఎంవీ మైసూరారెడ్డి, ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు, ఎస్.రామకృష్ణారెడ్డి, అంబటి రాంబాబు, హెచ్.ఏ.రెహ్మాన్, నల్లా సూర్యప్రకాశరావు, కొల్లి నిర్మల కుమారి, మూలింటి మారెప్ప, కోటింరెడ్డి వినయ్‌రెడ్డి, జిట్టా బాలకృష్ణారెడ్డి, పుత్తా ప్రతాపరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

బాధల్లో ఉన్న ప్రజానీకానికి భరోసా

అందుకే జనం ప్రభంజనంలా వస్తున్నారు 
చరిత్రలో నిలిచిపోయే పాదయాత్ర ఇది

హైదరాబాద్, న్యూస్‌లైన్: ప్రజా సమస్యలను ఏ మాత్రం పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం, వారితో కుమ్మక్కయిన ప్రధాన ప్రతిపక్షాల కుట్ర రాజకీయాలను ఎండగడుతూ, బాధల్లో ఉన్న ప్రజానీకానికి భరోసా కలిగిస్తూ షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర సాగుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. అందుకే ఆమె యాత్రకు జనం అంతగా విరగబడుతున్నారని అభిప్రాయపడ్డారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సోదరి షర్మిల పాదయాత్ర 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా గురువారమిక్కడ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘అధికార, ప్రతిపక్షాలు రెండూ కలిసి కుట్ర పన్ని జగన్‌ను సీబీఐ దన్నుతో జైల్లో పెట్టించాయి. కానీ ఆయన జైల్లో ఉంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేయొచ్చని వారు క న్న కలలు కల్లలయ్యాయి. జగన్ జైల్లో ఉన్నా పార్టీకి ప్రజాదరణ పెరుగుతూనే ఉంది. చంద్రబాబు పాదయాత్ర నానాటికీ నిస్సారంగా మారి పోతూంటే, షర్మిల యాత్రలో జీవకళ ఉట్టిపడుతోంది. 

కొనుగోలు చేసిన మనుషులతో బాబు యాత్ర నత్తనడకన సాగుతూ అవిటి యాత్రలా తయారైంది. షర్మిల యాత్ర మాత్రం లక్షలాది మంది ప్రజల జేజేల నడుమ కొనసాగుతోంది’’ అని ఆయనన్నారు. మహబూబ్‌నగర్‌లో ఎదురైన నిరసనను ప్రస్తావించగా, లక్షలాది మంది దీవిస్తున్నపుడు అక్కడక్కడా కొందరు రాళ్లు కూడా వేస్తూంటారని, వాటికంత ప్రాధాన్యత లేదని భూమన బదులిచ్చారు. షర్మిల పాదయాత్ర వల్ల ప్రజలు వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్‌ను గెలిపించే దిశగా సర్వసన్నద్ధం అవుతున్నారని జోస్యం చెప్పారు. షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర నవ చైనా నిర్మాత మావో జెడాంగ్ జరిపిన లాంగ్ మార్చ్‌తో పోల్చదగినదని కరుణాకర్‌రెడ్డి అన్నారు. ‘నాడు మావో లాంగ్ మార్చ్‌లో లక్షలాది మంది పాల్గొన్నారు. ఇప్పుడు షర్మిల పాదయాత్రలో కూడా లక్షలాది మంది ప్రజలు ఆమె వెంట వస్తున్నారు. అక్టోబర్ 18న ఇడుపులపాయలో తండ్రి వైఎస్ సమాధి నుంచి యాత్ర ప్రారంభించిన ఆమె ఇప్పటికి 700 కిలోమీటర్లు పూర్తి చేశారు. 200 గ్రామాలు, 10 మున్సిపాలిటీలు, రెండు మున్సిపల్ కార్పొరేషన్ల గుండా యాత్ర జరిపారు. ఇప్పటికే 30 లక్షల మందికి పైగా ప్రజలు షర్మిలమ్మ పాదయాత్రలో పాల్గొని ఆశీర్వదించారు. మహిళలెవరూ 300, లేదా 400 కిలోమీటర్ల కంటే ఎక్కువగా పాదయాత్ర చేసిన సందర్భాలు చరిత్రలో లేవు. షర్మిల మాత్రం ఏకబిగిన నిర్విరామంగా 3,000 కిలోమీటర్ల యాత్రకు పూనుకున్నారు. ఇది ప్రపంచంలోనే ప్రప్రథమం’ అని చెప్పారు.

తెలుగు మహాసభలపై నిరసన సబబే!

తిరుపతిలో జరగనున్న ప్రపంచ తెలుగు మహాసభల తీరుపై తాము నిరసన వ్యక్తం చేయడం సబబేనని భూమన అన్నారు. తెలుగు మహా సభల్లో ఆంగ్లానికి తావివ్వరాదని ఓ తెలుగు భాషాభిమానిగా తాను తొలి నుంచీ కోరుతున్నానని చెప్పారు. ‘‘శరవేగంగా అంతరిస్తున్న 16 భాషల్లో తెలుగూ ఒకటని ప్రపంచ జీవధ్భాషాధ్యయన సంస్థ ఇప్పటికే ప్రకటించింది. ఒకప్పుడు లక్షన్నర పదాలతో విరాజిల్లిన తెలుగు ఇప్పుడు 7,000 పదాలకు పరిమితం కావడం విచారకరం. ఇలాంటి తరుణంలో ఏదో ఊరంతా తోరణాలు కట్టి, రంగులేసి జాతరలాగా సభలు నిర్వహించినంత మాత్రాన తెలుగు భాషకు ఒరిగేదేమీ ఉండదు. పాలకులకు చిత్తశుద్ధి ఉండాలని మేం కోరుతున్నాం’’ అని వివరించారు.

వైఎస్సార్‌తోనే..కాలంబోయింది!

వైఎస్ ఉన్నప్పుడు రైతులకు ఢోకా ఉండేది కాదు 
మూడేళ్ల నుంచి పంటలు ఇంటికి రావడం లేదు
కరెంటు రెండు గంటలు వస్తే మూడు గంటలు పోతోంది 
అన్ని ధరలూ పెరిగి అప్పుల పాలయ్యా
జనాన్ని ప్రభుత్వం, విపక్ష నేత గాలికొదిలేశారు: షర్మిల 
బాబు అవిశ్వాసం పెట్టకుండా డ్రామాలాడుతున్నారు
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ గురువారం యాత్ర ముగిసేనాటికి.. రోజులు: 50, కిలోమీటర్లు: 705.30


మరో ప్రజాప్రస్థానం నుంచి న్యూస్‌లైన్ ప్రత్యేక ప్రతినిధి: ‘‘చంద్రబాబు ఉన్నప్పుడు మా ఊర్లె సీతారెడ్డి, శంకరయ్య, వెంకటమ్మ ముగ్గురు పత్తి రైతులు పురుగుల మందు తాగి చనిపోయిండ్రు. వైఎస్ అప్పుడు ప్రతిపక్షంల ఉండె. మా ఊరికి వచ్చి సచ్చిపోయినోళ్ల కుటుంబాలకు సాయం చేసిండు. మళ్లా వైఎస్ ముఖ్యమంత్రి అయిండు. ఆయన ఉన్నన్ని దినాలు రైతుకు ఢోకా లేదు. వైఎస్సార్‌తోనే కాలంబోయింది. మూడేళ్ల నుంచి పంటలు ఇంటికి రాలే. కరెంటు రెండు గంటలొస్తే మూడు గంటలు పోతది. కరెంటు ఆగిఆగి వస్తే మడి తడుస్తదా? ఏసిన పంట ఏసినట్టు ఎండిపోయింది. ఎరువులు, ఇత్తనాలు అన్ని ధరలు పెరిగి అప్పుల పాలైనం. మా పక్క పల్లె రైతు అప్పుల పాలై ఉరేసుకొని సచ్చిపోయిండు. ఎవ్వరు రాలె. ముఖ్యమంత్రి రాలేదు. మంత్రు లు రాలేదు. చంద్రబాబునాయుడన్నా వచ్చి సూడలేదు..’’ 

- మహబూబ్‌నగర్ జిల్లా గంగాపురం గ్రామానికి చెందిన మహిళా రైతులు రాకేలమ్మ, మాధవిల ఆవేదన ఇదీ
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెల్లెలు షర్మిల ముందు గురువారం వీరు తమ గోడు వెళ్లబోసుకున్నారు. వీరే కాదు.. పాలమూరు జిల్లాలో ఏ పల్లెలో ఎవరిని పలకరించినా తమ వెతలు చెప్పుకుంటూ కన్నీటిపర్యంతమవుతున్నారు. అనేక సమస్యలతో సతమతమవుతున్నా ఒక్క నేత కూడా తమవైపు కన్నెత్తి చూడడం లేదని చెబుతున్నారు. ప్రజా సమస్యలు పట్టని ప్రభుత్వం, దానితో అంటకాగుతున్న చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనగా షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర గురువారంతో 50 రోజులు పూర్తి చేసుకుంది. జడ్చర్ల నుంచి ప్రారంభమైన పాదయాత్ర గంగాపూర్, గొప్లాపూర్, లింగంపేట, కోడుగల్ మీదుగా కొండేడు గ్రామానికి చేరింది. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా లింగంపేటలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి షర్మిల నివాళి అర్పించారు. పాదయాత్రలో భాగంగా వెళ్లిన ప్రతిచోటా స్థానికులు తమ సమస్యలను షర్మిలతో చెప్పుకున్నారు.

బియ్యం రేటు తగ్గించి.. అన్నీ పెంచారు!

‘‘రూపాయకు కిలో బియ్యం అన్నరు. 20 కిలోలిచ్చే బియ్యాన్ని 15 కిలోలే ఇస్తున్రు. ఇచ్చే బియ్యమన్నా మంచియా? పురుగు పట్టిన బియ్యం.. ముక్కిన బియ్యం ఇత్తన్నరు. బియ్యంకు తగ్గిచ్చినం అని చెప్పుకుంటనే పామాయిల్ మీద రూ.5 పెంచిరి. మంచినూనె కొనబోతె రూ 100, కందిపప్పుకు రూ.70, ఉప్పు, సింతపండు.. ఇలా అన్ని ధరలు పెంచిరి. మంత్రి శ్రీధర్‌బాబు గారేమో అందరికీ బియ్యం మంచిగ ఇత్తున్నమని టీవీలల్లా చెప్తరు. ఆ సార్ మా ఊరికొచ్చి చూస్తే మా బాధలు తెలుస్తాయి’’ అని జడ్చర్ల మండలంలోని కుర్వగడ్డకు చెందిన మాధవి, రుక్మిణి షర్మిలతో అన్నారు. బీఈడీ విద్యార్థులు తమ కష్టాలను చెప్పుకుంటూ...‘‘ఏడు లక్షల మంది బీఈడీ అభ్యర్థుల భవిష్యత్తును ఈ ప్రభుత్వం రోడ్డున పడేసింది. ఇంతమంది ఉసురు పోసుకున్న వీళ్లు ఊరికే పోరు. విద్యాశాఖ మంత్రికి కోర్టు కేసులు తప్పించుకోవడానికి, మంత్రి పదవి కాపాడు కోవడానికే టైం సరిపోవడం లేదు. ఇంకా మా భవిష్యత్తు గురించి ఆయనే నిర్ణయం తీసుకుంటారు..’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

అంబేద్కర్ ఆలోచనలను వైఎస్ అమలు చేశారు..

లింగంపేటలో అంబేద్కర్ విగ్రహానికి నివాళి అర్పించిన అనంతరం షర్మిల జనాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ‘‘అంబేద్కర్ పేరు వినగానే మనకు భారత రాజ్యాంగం గుర్తుకు వస్తుంది. మనుషుల మధ్య అంతరాలు.. ఆర్థిక అసమానతలు తొలగిపోవాలన్న ఆయన ఆశయం గుర్తుకు వస్తుంది. అంతకుమించి హక్కులు గుర్తుకు వస్తాయి. హక్కులతోపాటు అంబేద్కర్ ఆదేశ సూత్రాలను కూడా ఇచ్చారు. ఆ మహనీయుడి ఆలోచనలను అమలు చేయాలంటే పాలకులకు చిత్తశుద్ధి ఉండాలి. ప్రతి వ్యక్తికి విద్య, వైద్యం, కూడు, గూడు, గుడ్డ అందుబాటులో ఉండాలి. అంబేద్కర్ ఆలోచనలను త్రికరణశుద్ధిగా అమలు చేసిన ముఖ్యమంత్రి వైఎస్సార్ ’’ అని ఆమె అన్నారు. ‘‘నాయకుడంటే ప్రజల్లోంచి పుట్టాలి.. ప్రజల కోసం ఆలోచించాలి. పన్నుల భారం లేకుండా సుపరిపాలన అందించాలి. కానీ ఇప్పటి పాలకులు ప్రజలను.. ప్రజా సమస్యలను గాలికి వదిలేశారు. ప్రజలు ఏమైపోతే మాకేంటి.. అని అనుకుంటున్నారు. ప్రజాసమస్యలను గాలికొదిలేసిన ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టాల్సిన చంద్రబాబు అదే ప్రభుత్వంతో కుమ్మక్కై డ్రామాలాడుతున్నారు’’ అని మండిపడ్డారు.

తనతో నడుస్తున్నవారితో మాటా ముచ్చట..

ప్రజా ప్రస్థానం పాదయాత్ర 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా షర్మిల ఓ పాపతో కేక్ కట్ చేయించారు. గురువారం మొత్తం 18.70 కిలోమీటర్ల దూరం నడిచారు. రాత్రి కొండేడులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి చేరుకున్నారు. ఇడుపులపాయ నుంచి తనతో నడుస్తున్న వారితో కలిసి రాత్రి భోజనం చేశారు. వారికి స్వయంగా భోజనాలు వడ్డించారు. వాళ్ల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకూ మొత్తం 705.30 కి.మీ. పాదయాత్ర పూర్తయింది.

sakshi

Popular Posts

Topics :