16 December 2012 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

చెట్లమట్లలో వైఎస్సార్ విగ్రహావిష్కరణ

Written By news on Saturday, December 22, 2012 | 12/22/2012

చెట్లమట్లలో వైఎస్సార్ విగ్రహాన్ని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ ఆవిష్కరించారు. రాజంపల్లెలో వేంచేసియున్న తిరుమలనాథ స్వామి ఆలయంలో శనివారం బాలినేని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చెట్లమట్ల గ్రామానికి చేరుకున్న ఆయన అభిమానుల సమక్షంలో వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులు అర్పించారు. ఇదిలా ఉండగా తిరుమలనాథ ఆలయ చైర్మన్ కోటిరెడ్డి ఆధ్వర్యంలో నాలుగు గ్రామాల ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

Paintings of YS Jagan attracts many eyes

Mysura Reddy Press Meet 22nd Dec 2012

కాంగ్రెస్ నిర్ణయం చెప్పాలి: మైసూరారెడ్డి

తెలంగాణపై తొలుత కాంగ్రెస్ పార్టీ నిర్ణయం చెప్పవలసి ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు ఎం.వి. మైసూరా రెడ్డి అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన ఈరోజు విలేకరులతో మాట్లాడారు. కేంద్ర హొం మంత్రి మారినప్పుడల్లా అభిప్రాయాలు తెలుసుకోవడానికి సమావేశాలు నిర్వహించడం సరికాదన్నారు. తెలంగాణ అంశంపై గతంలో అఖిలపక్ష సమావేశాలు రెండు సార్లు నిర్వహించారు. కమిషన్ వేశారు. కమిషన్ నివేదిక ఇచ్చింది. వాటి ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాలని ఆయన చెప్పారు. కాంగ్రెస్ అభిప్రాయం చెప్పకుండా ఇతరులను అభిప్రాయం చెప్పమనడం సరికాదన్నారు. తాము పార్టీలో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

తెలంగాణ జేఏసీ ప్రతినిధుల వినతిపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్రపాలక మండలి సభ్యుడు మైసూరారెడ్డి తెలిపారు. అఖిలపక్ష సమావేశంలో తెలంగాణపై స్పష్టమైన వైఖరి చెప్పాలంటూ జేఏసీ కన్వీనర్ కోదండరామ్ శనివారం వైఎస్ విజయమ్మను కలిశారు. 

భేటీ అనంతరం కోదండరామ్ మాట్లాడుతూ పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని విజయమ్మ చెప్పారన్నారు. 28న పార్టీలు చెప్పే అభిప్రాయాలను బట్టి భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని కోదండరామ్ తెలిపారు. విజయమ్మను కలిసినవారిలో జేఏసీ ప్రతినిధులు శ్రీనివాస్ గౌడ్, దేవీప్రసాద్ తదితరులు ఉన్నారు.

sakshi

‘వైఎస్సార్ విద్యుత్ ఉద్యోగ’ సదస్సు ఫిబ్రవరిలో..

వైఎస్సార్ విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్(హెచ్-128) రాష్ట్ర స్థాయి సదస్సును వచ్చే ఏడాది ఫిబ్రవరి రెండో వారంలో నిర్వహించాలని నిర్ణయించారు. వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు బీ జనక్‌ప్రసాద్ అధ్యక్షతన పార్టీ కేంద్ర కార్యాలయంలో యూనియన్ ముఖ్యనేతల సమావేశం శుక్రవారం తొలిసారిగా జరిగింది. పలు జిల్లాల నుంచి విద్యుత్ ఉద్యోగుల నేతలు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఆచరణ సాధ్యమైన డిమాండ్లనే యాజమాన్యాల ముందు పెట్టాలని సమావేశం అభిప్రాయపడింది. 

సీబీఐ, ప్రభుత్వ తీరుపై అనుమానాలు

ప్రహసనంలా ధర్మాన ‘ప్రాసిక్యూషన్’

జగన్ బెయిల్ పిటిషన్‌పై తీర్పులు వచ్చే ప్రతిసారీ ‘వ్యూహాత్మక’ చర్యలు
గతంలో ప్రభుత్వ అనుమతి కోరిన సీబీఐ.. అక్కర్లేదంటూ ఇప్పుడు పిటిషన్
ప్రాసిక్యూషన్ తిరస్కరణ ఫైలును తాజాగా తిప్పి పంపిన గవర్నర్! - 2లో

సాక్షి, హైదరాబాద్: మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ అనుమతిని కోరిన సీబీఐ, ఇంతకాలం కిమ్మనకుండా ఉండి, అలాంటి అనుమతి తమకేమీ అక్కర్లేదని నాలుగు నెలల తర్వాత తాపీగా ఇప్పుడు చెప్పడం అనుమానాలకు తావిస్తోంది. సీబీఐ వైఖరి అనుమానాస్పదంగా మారిన నేపథ్యంలోనే.. ధర్మాన ప్రాసిక్యూషన్‌ను తిరస్కరిస్తూ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో మంత్రిమండలి తీర్మానం చేసి పంపిన ఫైలును పలు సందేహాలు వ్యక్తం చేస్తూ గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ తిప్పిపంపడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఫైలుపై గవర్నర్ ఎలాంటి అనుమానాలను లేవనెత్తారు? ఏ అంశాలపై న్యాయ సలహాలు సూచించారు? ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారు? మంత్రుల ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ అనుమతి అవసరం లేదంటూ కోర్టులో సీబీఐ మెమో దాఖలు చేసిన తరుణంలోనే సంబంధిత ఫైలును గవర్నర్ వెనక్కి పంపిన విషయం బయటికి రావడంలోని ఆంతర్యమేమిటి? ..ఇలాంటి అనేక ప్రశ్నలు కాంగ్రెస్ నేతల్లోనే పెను చర్చకు దారి తీశాయి. 

ధర్మాన ప్రాసిక్యూషన్‌కు గత ఆగస్టు 10న రాష్ట్ర ప్రభుత్వాన్ని సీబీఐ అనుమతి కోరింది. న్యాయ సలహా తీసుకున్నాక నిర్ణయిస్తామంటూ నాలుగు నెలలకు పైగా దాన్ని కిరణ్ పక్కన పెట్టారు. అడ్వొకేట్ జనరల్ నుంచి వివరణ వచ్చాక.. ధర్మాన ప్రాసిక్యూషన్‌కు అనుమతి తిరస్కరిస్తూ మంత్రిమండలి తీర్మానం చేసింది. ఆ మేరకు ఫైలును గవర్నర్‌కు పంపారు. అయితే, మంత్రి ధర్మాన, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ అనుమతి అవసరం లేదంటూ డిసెంబర్ 13న న్యాయస్థానం ముందు సీబీఐ అత్యంత గోప్యంగా మెమో దాఖలు చేసింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు కొనసాగుతున్న సమయంలోనే ఉన్నట్టుండి సీబీఐ దాఖలు చేసిన ఈ మెమో వ్యవహారం బయటికి లీకైంది! పైగా మంత్రిమండలి సిఫార్సు చేసిన ఫైలును పలు సందేహాలు వ్యక్తం చేస్తూ గవర్నర్ తిప్పిపంపిన విషయం సైతం సరిగ్గా ఈ సమయంలోనే బయటికి రావడం గమనార్హం. చూస్తుంటే ఇదంతా పక్కా పథకం ప్రకారం జరుగుతున్న వ్యవహారంలాగే కనబడుతోందని కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు అభిప్రాయపడ్డారు. 

మంత్రుల ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ అనుమతి అవసరం లేనప్పుడు, మొదట దానికోసం సీబీఐ ఎందుకు కోరినట్టంటూ పలువురు మంత్రులు విస్మయం వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని 4 నెలల కిందట కోర్టుకు ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. ధర్మాన ప్రాసిక్యూషన్‌కు అనుమతివ్వొద్దని మంత్రిమండలి తీర్మానం చేసినప్పుడు విపక్షంతో పాటు స్వపక్షం నుంచి కూడా పలు విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చిందని వారు గుర్తు చేస్తున్నారు. ఎక్సైజ్ మంత్రిగా ఉన్న మోపిదేవిని విచారణ కోసం దిల్‌కుశ అథితి గృహానికి పిలిచిన సీబీఐ, రెండో రోజు, అంటే మే 24న విచారణ అనంతరం ఉన్నపళంగా ఆయనను అరెస్టు చేస్తున్నట్టు ప్రకటించింది. సరిగ్గా జగన్ సీబీఐ విచారణకు హాజరు కావడానికి ఒక రోజు ముందు ఇది జరిగింది! జగన్‌ను అరెస్టు చేయాలని కచ్చితమైన నిర్ణయానికి వచ్చినందునే, మంత్రులను ఎందుకు విస్మరించారన్న విమర్శలను తప్పించుకునేందుకు పథకం ప్రకారమే మోపిదేవిని అరెస్టు చేశారని అప్పట్లోనే విమర్శలు బలంగా విన్పించాయి. మే 25 నుంచి వరుసగా మూడు రోజుల పాటు జగన్‌ను సుదీర్ఘంగా విచారించిన సీబీఐ, ఆయనను అరెస్టు చేస్తున్నట్టు 27 రాత్రి 7.20కి తెలియజేసింది. మోపిదేవిని అరెస్టు చేసేటప్పటికి ఆయన మంత్రిగా కొనసాగుతున్నారు. 

కిరణ్ అగమేఘాలపై మోపిదేవి నుంచి రాజీనామా లేఖ తెప్పించుకుని, తక్షణం దానికి ఆమోదం తెలిపారు. పైగా మోపిదేవి ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ అనుమతి గానీ, న్యాయ సలహాలు గానీ తీసుకోలేదు. ధర్మాన విషయంలో మాత్రం ప్రభుత్వ అనుమతి కోరుతూ గత ఆగస్టు 10న సీబీఐ లేఖ రాసింది. అది బయటికి తెలిశాక ఆగస్టు 14న ధర్మాన మంత్రి పదవికి రాజీనామా చేస్తూ కిరణ్‌కు లేఖ పంపారు. 4 నెలలు దాటుతున్నా దానిపై సీఎం నిర్ణయం తీసుకోలేదు. ఇంతలోనే ఉన్నట్టుండి, మంత్రుల ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ అనుమతి అవసరం లేదని సీబీఐ కొత్త వాదనను తెరపైకి తేవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ‘ధర్మాన 2009కి ముందు రెవెన్యూ మంత్రిగా ఉండగా తీసుకున్న నిర్ణయాలపై కేసు నడుస్తోంది.ఆయన పదవీకాలం 2009తో పూర్తయింది గనుక ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ అనుమతి అక్కర్లేదు’ అని సీబీఐ కోర్టు ముందుంచిన మెమోలో పేర్కొన్నట్టు తెలుస్తోంది. 4 నెలల క్రితం ధర్మాన ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వాన్ని అనుమతి కోరినప్పుడు కూడా ఈ విషయం సీబీఐకి తెలుసని, అయినా దాన్ని ఈ సమయంలోనే తెరపైకి తేవడంలో ఆంతర్యమేమిటని ఒక ఉన్నతాధికారి ప్రశ్నించారు. జగన్ బెయిల్ పిటిషన్లు కోర్టు ముందుకొచ్చే ప్రతిసారీ సీబీఐ ఇలా చేయడం పరిపాటి అయిందని కాంగ్రెస్ నేతల్లోనే వినిపిస్తోంది. 

హైకోర్టులో ప్రస్తుతం జగన్ దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌పై వాదనలు పూర్తయి, ఈ నెల 24న తీర్పు రానుండటం తెలిసిందే. సరిగ్గా దానికి మూడు రోజుల ముందు సీబీఐ మెమో ఉదంతం, ధర్మాన ఫైలును గవర్నర్ తిప్పి పంపిన వార్త ఒకేసారి బయటికి వచ్చాయి! దీన్ని యాదృచ్ఛికంగా ఎంతమాత్రమూ చూడలేమని కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు. గత జూలైలో జగన్ జగన్ బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించగా, అందుకు తిరస్కరిస్తూ అక్టోబర్ 5న తీర్పు వచ్చింది. సరిగ్గా దానికి ఒక్క రోజు ముందు జగతి పబ్లికేషన్స్, జననీ ఇన్‌ఫ్రాల రూ.51 కోట్ల విలువైన స్థిర, చరాస్తులను అటాచ్ చేస్తున్నట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ ఢిల్లీలో నోట్ విడుదల చేసింది. పైగా, టీడీపీ ఎంపీలు కేంద్ర ఆర్థిక మంత్రిని కలిసి ‘విజ్ఞప్తి’ చేసీ చేయగానే ఈడీ నుంచి అటాచ్‌మెంట్ ఆదేశాలు వెల్లడయ్యాయి. ఇలాంటి సందర్భాలను లోతుగా విశ్లేషిస్తే పై ఆదేశాల మేరకే పథకం ప్రకారం సాగుతోందన్న అనుమానాలున్నాయని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి.

అంతా గందరగోళమే...: శుక్రవారం నాటి ఉదంతాలతో రాష్ట్ర కాంగ్రెస్ నేతల్లో గందరగోళం నెలకొంది. ధర్మాన ప్రాసిక్యూషన్‌కు కేబినెట్ అనుమతి నిరాకరణతో అంతా సాఫీగా జరుగుతుందని భావిస్తున్న తరుణంలో.. ప్రాసిక్యూషన్‌కు అసలు ప్రభుత్వ అనుమతే అక్కర్లేదంటూ సీబీఐ కోర్టుకెక్కడం, సంబంధిత ఫైలును అదే సమయంలో గవర్నర్ తిప్పి పంపడం చూస్తుంటే అసలేం జరుగుతోందో తమకేమీ అంతుబట్టడం లేదని ఒక మంత్రి వాపోయారు. 

గతంలో సుప్రీంకోర్టు నుంచి నోటీసులందుకుని, వాటికి సమాధానాలు పంపి ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్న మంత్రులను కూడా తాజా పరిణామాలు ఆందోళనలో పడేశాయి. మున్ముందు చిక్కులు తలెత్తకుండా ధర్మాన ఫైలును మరోసారి జాగ్రత్తగా ఏజీ ద్వారా పరిశీలన చేయించి పంపాలని మాత్రమే గవర్నర్ కోరారని కొందరంటున్నారు. కానీ ఏజీ పూర్తిస్థాయి పరిశీలన తర్వాత ఇప్పుడిలా తిప్పి పంపడంపై మరో మంత్రి ఆశ్చర్యం వెలిబుచ్చారు. మరోవైపు శుక్రవారమే గవర్నర్ ఢిల్లీకి వెళ్లారు! తాజా పరిణామాల నేపథ్యంలో ధర్మాన రాజీనామా వ్యవహారం ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. గవర్నర్ చర్య నేపథ్యంలో బొత్స సత్యనారాయణ, సబిత సహా పలువురు మంత్రులు కిరణ్‌తో భేటీ అయ్యారు.

జగనే లక్ష్యంగా జగన్నాటకాలు?

ఏం జరిగింది?
గత మే 27న వైఎస్ జగన్‌ను సీబీఐ అరెస్టు చేసింది
గత అక్టోబర్ 5న జగన్‌కు సుప్రీం కోర్టు బెయిల్ నిరాకరించింది

డిసెంబర్ 24న జగన్ బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు తీర్పు వెలువరించనుంది

దానికి ముందేం జరిగింది?
మే 24న, సరిగ్గా మూడు రోజుల ముందు అప్పటి ఎక్సైజ్ మంత్రి మోపిదేవిని సీబీఐ అరెస్టు చేసింది
అక్టోబర్ 4న, అంటే ఒక్క రోజు ముందు రూ.51 కోట్ల విలువైన జగతి, జనని ఆస్తులను అటాచ్ చేస్తూ ఈడీ నోట్ విడుదల చేసింది

డిసెంబర్ 21న, సరిగ్గా మూడు రోజుల ముందు, ధర్మాన ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ అనుమతి లేదంటూ కోర్టులో సీబీఐ మెమో దాఖలు చేసిన విషయం ‘బయటికి’ వచ్చింది. ప్రాసిక్యూషన్‌కు మంత్రివర్గం నిరాకరించిన ఫైలును గవర్నర్ తిప్పి పంపారు.

అన్న దానాలు.. వైద్య శిబిరాలు

దేవాలయాలు, చర్చి, మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కుట్రలను నిరసిస్తూ నిరసనలు
జైలులో జగన్‌ను కలసిన కుటుంబసభ్యులు

సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని అభిమానులు, పార్టీ నేతలు, కార్యకర్తలు శుక్రవారం అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఉచిత మెగా వైద్యశిబిరాలు, రక్తదానం, పేదలకు దుస్తులు, వికలాంగులకు వీల్‌చైర్స్, వృద్ధులకు చేతికర్రలు అందజేయడం, ఆసుపత్రులలో పండ్లు, విద్యార్థులకు నోట్‌పుస్తకాలు, పెన్నులు పంపిణీతో పాటు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కై జగన్‌ను అక్రమంగా అరెస్టు చేయించడానికి నిరసనగా పార్టీ శ్రేణులు నల్లబ్యాడ్జీలతో ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించాయి. చంచల్‌గూడ జైల్లో ఉన్న జగన్‌మోహన్‌రెడ్డిని కుటుంబసభ్యులు ప్రత్యేక ములాఖత్ ద్వారా కలుసుకొని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 

జగన్‌ను కలిసిన వారిలో తల్లి విజయమ్మ, భార్య భారతి, కూతుళ్లు హర్ష, వర్ష, షర్మిల కుమారుడు రాజారెడ్డి, కూతురు అంజలి ఉన్నారు. అనంతరం వారు తిరిగి వెళ్లే ముందు జైలు బయట పార్టీనేతల కోరిక మేరకు వారు తీసుకొచ్చిన కేక్‌ను విజయమ్మ కట్‌చేశారు. అంతకుముందు వైఎస్సార్ కాంగ్రెస్ మైనారిటీ విభాగం కన్వీనర్ హెచ్.ఎ.రెహమాన్ జైలు వద్ద కేక్ కట్ చేసి, పావురాలను గాల్లోకి ఎగురవేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన జగన్ జన్మదిన కార్యక్రమాల్లో పార్టీ నేతలు ఎంవీ మైసూరారెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, నల్లా సూర్యప్రకాష్, జనక్‌ప్రసాద్, గట్టు రామచంద్రరావు, ఎంవీఎస్ నాగిరెడ్డి, పుత్తా ప్రతాప్‌రెడ్డి, పీఎన్వీ ప్రసాద్, చల్లా మధుసూదన్‌రెడ్డిలతో పెద్ద ఎత్తున అభిమానులు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. రాజధానిలోని పలు ప్రాంతాల్లో పార్టీనేతలు నిరసన, సేవా కార్యక్రమాలు నిర్వహించారు. 

రాష్ట్రవ్యాప్తంగా: జగన్ అక్రమ అరెస్టును నిరసిస్తూ చిత్తూరు జిల్లాలో 100 మంది మహిళలు మదనపల్లె నుంచి తిరుమలకు పాదయాత్ర ప్రారంభించారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఆయన పేరుపై ప్రత్యేక పూజలు చేయించారు. సీబీఐ తీరును నిరసిస్తూ కడపలోని వైఎస్‌ఆర్ సర్కిల్ నుంచి కలెక్టరేట్ ఏడురోడ్ల కూడలి మీదుగా అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. జగన్ అక్రమ అరెస్టును నిరసిస్తూ అనంతపురంలో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. గుంటూరుజిల్లా నరసరావుపేటలో రెండుచోట్ల 40 కేజీల భారీ కేక్‌లను కట్‌చేసి రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ప్రకాశంజిల్లా ఒంగోలులోని బధిరుల పాఠశాలలో అన్నదానం నిర్వహించారు. నెల్లూరులో నిర్వహించిన భారీ ర్యాలీలో సుమారు 300 మీటర్ల పొడవైన పార్టీ జెండా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జగన్ నిర్దోషి అని, ఆయనను విడుదల చేయాలంటూ రాష్ట్రపతికి పంపేందుకు బుజబుజనెల్లూరులో రక్తంతో సంతకాల సేకరణ చేశారు. 

కృష్ణాజిల్లా నందివాడ మండలం జనార్ధనపురంలో వైఎస్సార్ గ్రామ సమైక్య సంఘ సభ్యులు వరి పొలంలో కట్టేత పనులు చేసి రూ. ఏడువేలు సంపాదించారు. ఆ మొత్తాన్ని గ్రామంలో మంచినీటి చెరువుల అభివృద్ధికి వినియోగించనున్నట్లు చెప్పారు. విజయవాడలోని సింగ్‌నగర్‌లో అంధుల పాటల కచేరీ నిర్వహించారు. నల్లగొండజిల్లా సూర్యాపేటలో భారీ కేక్‌ను కట్‌చేసి, వికలాంగునికి వీల్‌చైర్‌ను అందించారు. జగన్ విడుదల కాకుండా ప్రభుత్వం కుట్రపన్నడాన్ని నిరసిస్తూ ఖమ్మంలో పార్టీ కార్యకర్తలు రోడ్డు ఊడ్చారు. కరీంనగర్‌జిల్లా కోరుట్ల నియోజకవర్గంలోని అయ్యప్ప ఆలయానికి ఒక గదిని విరాళంగా ప్రకటించారు.

జగన్ సీఎం కావాల్సిందే
శతాధిక వృద్ధురాలి ఆకాంక్ష

‘‘పేదల కోసం పనిచేసిన మహానుభావుడు వైఎస్ రాజశేఖరరెడ్డి. తిరిగి ఆయన పాలన రావాలంటే జగన్ ముఖ్యమంత్రి కావాలి. రాజన్న కొడుక్కి ఓటేసేందుకే నేను బతికున్నాను’’ అని తూర్పుగోదావరి జిల్లా రాజానగరానికి చెందిన శతాధిక వృద్ధురాలు పేకల చెల్లమ్మ చెప్పారు. జగన్‌కు జన్మదినం పేదలకు పండుగరోజులాంటిదన్నారు. పశ్చిమగోదావరి జిల్లా కాళ్ల మండలం వేంపాడు గ్రామానికి చెందిన వరదానమ్మ తన ఇంటివద్ద జగన్ జన్మదిన వేడుకలను నిర్వహించారు. కేక్ కట్‌చేసి చుట్టుపక్కల ఇళ్లవారికి, స్కూల్ విద్యార్థులకు పంపిణీ చేశారు. ‘‘నీ తండ్రి మరణాన్ని తట్టుకోలేక నా భర్త మరణిస్తే నన్ను, నా కుటుంబ సభ్యుల్ని మా ఇంటికి వచ్చి ఓదార్చావు.. మమ్మల్ని ఆపదలో ఆదుకున్నావు. నీవు నిండు నూరేళ్లు వర్ధిల్లు... కుట్రలు, కుతంత్రాలు అశాశ్వతం. విశ్వసనీయత, ఆదరణ, ఆత్మీయత ఎప్పటికీ నిలిచి ఉంటారుు. త్వరలోనే జనం మధ్యకి వస్తావు.. నీకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు’’ అంటూ ఆశీర్వదించారు.

కోటి సంతకాలతో రాష్ట్రపతికి వినతిపత్రం

కోటి సంతకాలతో రాష్ట్రపతికి వినతిపత్రం
సీబీఐ తీరుపై మండిపడ్డ నేతలు
సీబీఐ దర్యాప్తు సంస్థలా కాకుండా కక్షపూరితంగా వ్యవహరిస్తోంది
కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినందుకే అరెస్టు, వేధింపులు..

సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై సీబీఐ చేస్తున్న కుట్రలను ఆ పార్టీ ముఖ్య నేతలు తీవ్రంగా ఖండించారు. శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ముఖ్య నేతల అత్యవసర సమావేశంలో సీబీఐ తీరుపై మండిపడ్డారు. పార్టీ సీజీసీ సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి, డి.రవీంద్రనాయక్, పీఏసీ సభ్యులు డీఏ సోమయాజులు, బాజిరెడ్డి గోవర్ధన్, పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావుతో సహా పలువురు నేతలు ఈ భేటీకి హాజరయ్యారు. సీబీఐ ఒక దర్యాప్తు సంస్థ మాదిరిగా కాకుండా జగన్‌పై కక్ష సాధింపుతో వ్యవహరిస్తోందని నేతలు అభిప్రాయపడ్డారు. దేశంలో ఏ కేసు విషయంలోనూ సీబీఐ ఇలా వ్యవహరించలేద న్న అంశం ప్రధానంగా చర్చకు వచ్చింది. 

జగన్‌పై జరుగుతున్న కుట్రలు, కుతంత్రాలు, సీబీఐ వ్యవహరిస్తున్న తీరును అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉన్న రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఇందుకు ‘‘జగన్ కోసం-జనం సంతకం’’ పేరుతో ఆయనకు కోటి సంతకాలతో వినతి పత్రాన్ని సమర్పించే కార్యక్రమాన్ని చేపట్టారు. జగన్ జన్మదినం సందర్భంగా పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రారంభమైన ఈ సంతకాల సేకరణకు.. కార్యకర్తలు, ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. పార్టీ నేత డి.రవీంద్రనాయక్ తొలి సంతకం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించగా... ఎంవీ మైసూరారెడ్డి సంతకాల సేకరణ లక్ష్యాన్ని వివరించారు. ఎలాగైనా సరే జగన్‌ను దోషిగా చిత్రీకరించాలని అదే పనిగా సీబీఐ చేస్తున్న ప్రయత్నాలను రాష్ట్రపతికి తెలియజేసేందుకే ఈ సంతకాల సేకరణ చేపట్టామని వెల్లడించారు. 

ఒక్కొక్కరికి ఒక్కో న్యాయమా: పార్టీ నేత బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ.. దేశంలో ఒక్కొక్కరికి ఒక్కో రకమైన న్యాయం జరుగుతోందన్నారు. ఉత్తరప్రదేశ్‌లో సీబీఐ కేసులు ఎదుర్కొంటున్న ములాయం సింగ్ యాదవ్, మాయావతికి ఒక న్యాయం, జగన్‌కు ఒక న్యాయమా అని నిలదీశారు. జగన్‌మోహన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి సొంతంగా పార్టీ పెట్టుకున్నారన్న కక్షతోనే ఆయన్ను వేధిస్తున్నారని జూపూడి ప్రభాకరరావు అన్నారు. సంతకాలు చేసిన నేతల్లో డీఏ సోమయాజులు, వాసిరెడ్డి పద్మ, జనక్‌ప్రసాద్, నల్లా సూర్యప్రకాశరావు, హెచ్‌ఏ రెహ్మాన్, గట్టు రామచంద్రరావు, కె.శివకుమార్, రాజ్ ఠాకూర్, మేడపాటి వెంకట్, బి.జనార్దన్‌రెడ్డి, చల్లా మధుసూదనరెడ్డి, విజయారెడ్డి, నాగదేశి రవికుమార్ ఉన్నారు. విద్యుత్ ఉద్యోగుల సంఘం(హెచ్-128 యూనియన్)కు చెందిన ఉద్యోగులు కూడా పెద్ద సంఖ్యలో జగన్‌కు మద్దతుగా సంతకాలను చేశారు.

‘జగన్ కోసం-జనం సంతకం’లో రాష్ట్రపతికి విజ్ఞప్తి ఇదీ

వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు, లోక్‌సభ సభ్యుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మీద రాజకీయపరంగా బనాయించిన కేసును తీవ్రంగా గర్హిస్తున్నాం. నిజాలను నిర్ధారించాల్సిన సీబీఐ జగన్‌ను దోషిగా చిత్రీకరించడానికి అహర్నిశలు చేస్తున్న ప్రయత్నాలను, అధికార దుర్వినియోగానికి పరాకాష్టగా భావిస్తున్నాం. రాజకీయ ఒత్తిళ్లకు లొంగి, పక్షపాతంతో సీబీఐ చేస్తున్న దర్యాప్తు భారతదేశంలో అధికార వ్యవస్థల దుర్వినియోగానికి నిలువెత్తు నిదర్శనమని మేమంతా భావిస్తున్నాం. ఒక రాజకీయ పార్టీ పెట్టుకున్నందుకు, అధికార పార్టీతో విభేదించి బయటకు వచ్చినందుకు జగన్‌ను 200 రోజులకు పైగా అక్రమంగా నిర్బంధంలో ఉంచడాన్ని మేమంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇప్పటికైనా ఈ కక్ష సాధింపులు ఆపాలని, ప్రభుత్వ వ్యవస్థల ఔన్నత్యాన్ని పెంచాలని కోరుతున్నాం.

త్వరలో వైఎస్సార్‌సీపీ బీసీ గర్జన: కాసాని

 ‘వైఎస్సార్ కాంగ్రెస్ బీసీ గర్జన’ పేరిట త్వరలో హైదరాబాద్ నిజాం కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు రంగారెడ్డి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ కాసాని జ్ఞానేశ్వర్ ప్రకటించారు. శుక్రవారం ఆయన పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మను కలిశాక విలేకరులతో మాట్లాడారు. జనవరిలో మంచి రోజు చూసుకుని పార్టీలో చేరతానని, ఈ విషయమై విజయమ్మతో చర్చించానన్నారు. ఆయన వెంట పార్టీ నేత ముక్కా రూపానందరెడ్డి ఉన్నారు.

జగన్ సీఎం కావడం ఖాయం: మంత్రి దానం

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అవడం ఖాయమని రాష్ట్ర కార్మిక శాఖమంత్రి దానం నాగేందర్ వ్యాఖ్యానించారు. బంజారాహిల్స్‌లోని తన నివాసంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. దానం సంచలన వ్యాఖ్యలతో విలేకరులు ఒకింత ఆశ్చర్యానికి గురవుతుండగానే... తాను చెప్పేది నిజమంటూ మళ్లీ అదేమాట చెప్పుకొచ్చారు. వైఎస్సార్ తన గుండెల్లో ఉన్నారని... ఆయన కొడుకైనా రోజూ స్మరించుకుంటాడో లేదో కానీ తాను, తన భార్య మాత్రం నిత్యం వైఎస్సార్‌ను తలచుకోకుండా ఉండమని తెలిపారు. నిత్యం వైఎస్సార్‌కు పూజలు చేస్తామని, దీపం వెలిగిస్తామని చెప్పారు. వైఎస్సార్ ఉంటే ఆ మనోధైర్యం వేరన్నారు.

'నిబంధనలకు విరుద్ధంగా సభ్యత్వనమోదు'

Written By news on Friday, December 21, 2012 | 12/21/2012

నల్గొండ: సహకార ఎన్నికల ఓటరు సభ్యత్వ నమోదు కార్యక్రమం అవకతవకలగా సాగుతోంది. జిల్లాలోని మేళ్ల చెరువు మండలం చింతలపాలెం సహకార కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా ఓటరు నమోదు కార్యక్రమం కొనసాగుతోంది. దీంతో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఓటరు సభ్యత్వ నమోదు సభ్యత్వ కార్యక్రమం ఇంకా కొనసాగడం వెనుక అధికార పార్టీ అండదండలు ఉన్నాయని వారు ఆరోపిస్తున్నారు.


గుంటూరు:సభ్యత్వ దరఖాస్తులు లేకుండా ఓట్లు నమోదు చేసిన ఘటన నాదెండ్ల సహకార సంఘ కార్యాలయంలో జరిగింది. దరఖాస్తులు లేకుండా సభ్యత నమోదు కార్యక్రమం కొనసాగడంపై వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకులు ఆందోళన బాట పట్టారు. ఇప్పటి వరకూ న మోదు చేసిన సభ్యత్వ దరఖాస్తులు చూపించాలని వైఎస్సార్‌సీపీ నేత మర్రి రాజశేఖర్ కార్యకర్తలతో కలసి కార్యాలయం ముందు బైఠాయించారు.


ప్రకాశం: సహకార ఎన్నికల ఓటర్ల నమోదులో ఢీసీఓ కొండయ్య అవకతవకలకు పాల్పడ్డారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటర్ల నమోదు కార్యక్రమంలో పక్షపాత వైఖరితో వ్యవహరించిన డీసీఓను వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు నిర్బందించారు.


Magazine Story 'BRAND JAGAN'

జగన్ కోసం 'జనం సంతకం' ఉద్యమం

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు,ఎంపి జగన్మోహన రెడ్డిపై కుట్రకు వ్యతిరేకంగా ఆ పార్టీ నేతలు, అభిమానులు, కార్యకర్తలు 'జనం సంతకం' అనే పేరుతో ఉద్యమం చేపట్టారు. కోటి మందితో సంతకాలు చేయించి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి పంపాలన్నది వారి ఉద్దేశం. పార్టీ ఎస్ టి విభాగానికి చెందిన నేత రవీంద్ర నాయక్ తొలి సంతకం చేశారు.

జనం సంతకం పేరుతో వైఎస్ఆర్ సీపీ నేతలు ఒక లేఖను విడుదల చేశారు. వైఎస్ జగన్ పై రాజకీయపరంగా బనాయించిన కేసులను తీవ్రంగా గర్హిస్తున్నాం. జగన్ ను దోషిగా చూపడానికి సిబిఐ అహర్నిశలూ చేస్తున్న ప్రయత్నాలు పరాకాష్టగా భావిస్తున్నాం. 200 రోజులుకు పైగా జగన్ ను అక్రమ నిర్బంధంలో ఉంచడాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఇప్పటికైనా జగన్ పై కక్ష సాధింపు ఆపాలని కోరుతున్నాం. ప్రభుత్వ వ్యవస్థల ఔన్నత్యాన్ని కాపాడాలని కోరుతున్నాం. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం చేస్తున్న విజ్ఞప్తి ఇది అని ఆ లేఖలో పేర్కొన్నారు.

ఆ రెండు పార్టీలు అక్రమాలకు పాల్పడుతున్నాయి

పాణ్యం, ఉల్లెందుకొండ సొసైటీల్లో భారీగా బోగస్ ఓట్లు నమోదు చేస్తున్న వారిని వైఎస్ ఆర్ సీపీ కార్యకర్తలు శుక్రవారంఅడ్డుకున్నారు. దీంతో వాతావరణంఒక్క సారిగా ఉద్రికత్తంగా మారి తీవ్ర ఘర్షణకు దారితీసింది. అయితే టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు అక్రమాలకు పాల్పడుతున్నాయని వైఎస్‌ఆర్‌సీపీ నేత గౌరు వెంకటరెడ్డి ఆరోపించారు. 

జగన్ ను కలిసిన కుటుంబ సభ్యులు

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని శుక్రవారం చంచల్ గూడ జైల్లో ఆయన కుటుంబ సభ్యులు కలిశారు. ఈ సందర్భంగా ఆయన కు కుటుంబసభ్యులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. జగన్ ను కలిసినవారిలో వైఎస్ విజయమ్మ, భారతి, కుటుంబ సభ్యులు ఉన్నారు. 

కాగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా చంచల్ గూడకు అభిమానుల తాకిడి పెరిగింది. వైఎస్ఆర్ సీపీ మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్సీ రెహ్మన్, హర్షద్ లు కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలను పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు రాష్ట్రవ్యాప్తంగా జరుపుకున్నారు. పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వైఎస్సార్‌ జిల్లాలో పార్టీ శ్రేణులు వృద్దులకు దుప్పట్లు పంపిణీ చేశారు. వైఎస్‌ అవినాశ్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నేతలు వృద్దాశ్రమాల్లో అన్నదానం నిర్వహించారు.

జగన్‌ పుట్టినరోజు వేడుకలు గుంటూరులో ఘనంగా జరిగాయి. కేక్‌ కట్‌ చేసి వేడుక నిర్వహించారు. వైఎస్‌ జగన్‌కు మేలు జరగాలని కోరుతూ సర్వమత ప్రార్ధనలు చేశారు. పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. తాడేపల్లి విజయకృష్ణ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి.

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదినం సందర్భంగా విశాఖలో వైఎస్‌ఆర్‌ సీపీ పలు సేవాకార్యక్రమాలు చేపట్టింది. వికలాంగులకు వీల్‌చైర్‌లు అందజేశారు. విశాఖలోని 72 వార్డుల్లో వృద్ధులు, పేదలకు పండ్లు, దుస్తులు పంపిణీ చేశారు.

కృష్ణాజిల్లాలోనూ జగన్ పుట్టినరోజు సందర్భంగా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించారు. రక్తదానంతో పాటు అన్నదానం చేశారు. బెజవాడలోని ఎస్ కేసివి అనాధ ఆశ్రమమంలో పిల్లలకు బట్టలు పంపిణీ చేశారు. జగన్ జన్మదిన వేడుకలు నిజామాబాద్ లో ఘనంగా జరిగాయి.

నగరంలోని మాధవ్ నగర్ సాయిబాబా ఆలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో జగన్ పేరిట అర్చనలు చేశారు. ఆయన త్వరలో జైలు నుంచి విడుదల కావాలని ఆకాంక్షించారు. కువైట్ లోనూ జగన్ జన్మదిన వేడుకలను ప్రవాసాంధ్రులు జరుపుకున్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా కాంగ్రెస్. సీబీఐ చేస్తున్న కుట్రలను నిరసిస్తూ ఈరోజు సాయంత్రం మాలియాలో సంతకాల సేకరణ చేపట్టనున్నారు.

'అభద్రతా భావంతోనే బొత్స వ్యాఖ్యలు'

పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణపై ఎమ్మెల్యే సుజయ కృష్ణా రంగారావు మండిపడ్డారు. బొత్స వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. వైఎస్ కుటుంబానికి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి అభద్రతా భావంతోనే బొత్స ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. తమ పార్టీ అంతర్గత వ్యవహారాల గురించి మాట్లాడటం సరికాదని సుజయ కృష్ణా రంగారావు హితవు పలికారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా ఆయన బొబ్బిలిలో రోగులకు పాలు, పండ్లు పంపిణీ చేశారు.

రాష్ట్రం అంతటా జగన్ జన్మదిన వేడుకలు

 రాష్ట్రమంతటా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి జన్మదిన వేడుకలను అభిమానులు, కార్యకర్తలు జరుపుకుంటున్నారు. కేక్ కట్ చేయడంతోపాటు జగన్ పేరిట ప్రత్యేక పూజలు, యాగాలు చేయిస్తూ అనేక సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పేద మహిళలకు చీరలు, విద్యార్థులకు నోట్ పుస్తకాలు, రోగులకు పండ్లు, వృద్ధులకు దుప్పట్లు, అన్నదానాలు, రక్తదానాలు చేస్తూ జగన్ పై తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. 

* మల్కాజ్‌గిరిలో విద్యార్థులకు నోట్‌పుస్తకాలు, వృద్ధులకు చీరలు పంపిణీ చేశారు. 
* కుత్బుల్లాపూర్‌లోని ఐడీపీఎల్ చౌరస్తాలో చండీయాగం నిర్వహించారు. పేదలకు అన్నదానం చేశారు. 
* ఉప్పల్‌లో వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. 
*రంగారెడ్డి జిల్లా మేడ్చల్‌లో వైఎస్‌ఆర్ సీపీ నేత సింగిరెడ్డి హరివర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో పేదలకు పాలు, పండ్లు పంచారు. 
* కృష్ణా జిల్లాలో మాజీ ఎమ్మెల్యే జేష్ట్య రమేష్‌బాబు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం, పేదలకు పండ్లు పంపిణీ చేశారు. 
* నిజామాబాద్ జిల్లా బాన్సువాడలో వైఎస్ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తలు కేక్ కట్ చేసి రోగులకు పండ్లు పంచారు. 
*ఖమ్మం జిల్లా వైరాలో పేదలకు చీరలు పంపిణీ చేశారు. మదిరలో వృద్ధులకు, వికలాంగులకు అన్నదానం చేశారు. భద్రాచలంలో వైఎస్‌ఆర్ విగ్రహం వద్ద కేక్ కట్ చేసి స్వీట్స్ పంచారు.
*తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పార్టీ కార్యాలయంలో జక్కంపూడి విజయలక్ష్మీ, ఆదిరెడ్డి అప్పారావు, బొమ్మన రాజ్‌కుమార్ ల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్స్ పంచారు. పి.గన్నవరంలో పేదలకు చీరలు, దుప్పట్లు, రోగులకు పండ్లు పంచారు. 
* నల్గొండ జిల్లా మిర్యాలగూడలో వైఎస్‌ఆర్ సీపీ నేత ఆదురి కరుణ ఆధ్వర్యంలో ఘనంగా వైఎస్‌ జగన్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. శాలిగౌరారం మండలంలో సంకినేని వెంకటేశ్వరరావు వర్గీయులు విద్యార్థులకు స్వీట్లు, రోగులకు పండ్లు పంచారు. కోదాడలో అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. 
* కరీంనగర్ హౌసింగ్‌బోర్డ్ కాలనీలో ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాశ్‌రావు అనాధ, వృద్ధుల ఆశ్రమంలో దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు. జిల్లాలోని హుజూరాబాద్‌లో పేదలకు పాలు, పండ్లు పంచారు. 
* విజయనగరం జిల్లా బొబ్బిలిలో ఎమ్మెల్యే ఆర్‌వీ కృష్ణరంగారావు ఆధ్వర్యంలో రోగులకు పాలు, పండ్లు పంపిణీ చేశారు. 
* కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో వైఎస్ఆర్ అనాథ ఆశ్రమంలో వేడుకలు జరిపారు. ప్రభుత్వాస్పత్రిలో రోగులకు పాలు, పండ్లు పంచారు. 
* చిత్తూరు జిల్లా చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కర రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. 
* ప్రకాశం జిల్లా కేసరగుట్ట కాలనీలో యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో వేడుకలు జరుపుకున్నారు. 
*మెదక్ జిల్లా జహిరాబాద్ ప్రభుత్వాస్పత్రిలో రోగులకు పాలు, పండ్లు పంపిణీ చేశారు.

YS Jagan birthday celebrations in state wide

YS Jagan Birthday celebrations in party office

వైఎస్సార్ సీపీలోకి వసంత నాగేశ్వరరావు

 నాప్కాబ్ ఉపాధ్యక్షుడు, మాజీ హోం మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత వసంత నాగేశ్వరరావు గురువారం వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీలో చేరారు. చందర్లపాడు మండలం రామన్నపేటలో ఏర్పాటు చేసిన దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని గురువారం వైఎస్సార్‌సీపీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో వసంత నాగేశ్వరరావుకు వైఎస్సార్‌సీపీ కండువా కప్పి ఆయన పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం నాగేశ్వరరావు మాట్లాడుతూ.. వైఎస్ హయాంలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. ఇంటిదగ్గర కూర్చున్న తనను ఎవరూ పట్టించుకోని రోజుల్లో వైఎస్ రాజశేఖరరెడ్డి గుర్తింపునిచ్చి కేడీసీసీ బ్యాంక్ చైర్మన్‌గా, నాప్కాబ్ ఉపాధ్యక్షుడిగా చేశారని గుర్తు చేసుకున్నారు. వైఎస్ రుణం తీర్చుకునేందుకు ఆయన తనయుడు స్థాపించిన పార్టీలో చేరి సామాన్య కార్యకర్తగా కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ఉదయభాను మాట్లాడుతూ.. విజయవాడ లోక్‌సభ నియోజకవర్గాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తానని ప్రజలను నమ్మించి ఎంపీగా గెలిచిన లగడపాటి రాజగోపాల్ తరువాత ఆ మాటల్ని మరచిపోయారని, ఎలాంటి అభివృద్ధి చేయలేదని విమర్శించారు

బాబూ.. చిదంబరంతో మాట్లాడలేదా: ఈటెల

చీకట్లో చేతులు కలిపి లోపాయికారీ ఒప్పందాలు చేసుకోవడంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును మించినవారు ఎవరూ లేరని టీఆర్‌ఎస్ నేత ఈటెల రాజేందర్ వ్యాఖ్యానించారు. గురువారమిక్కడ తెలంగాణభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు గత మూడేళ్లుగా కాంగ్రెస్‌తో కుమ్మక్కై ప్రభుత్వాన్ని కాపాడటమే ఏకైక లక్ష్యంగా పెట్టుకున్నారని ఆరోపించారు. ‘ఎఫ్‌డీఐలకు అనుకూలంగా రాజ్యసభలో ఓటేస్తామంటూ చంద్రబాబే స్వయంగా చిదంబరంతో ఫోనులో మాట్లాడిండు. చంద్రబాబుకున్న పరపతి, పరిచయంతో పాదయాత్రలో ఉన్నపుడే చిదంబరంతో 40 నిమిషాలపాటు ఫోన్‌లో మాట్లాడింది నిజంకాదా?’ అని ఈటెల ప్రశ్నించారు. కొద్దికాలం కిత్రం జరిగిన ఉప ఎన్నికల్లోనూ మూడు స్థానాల్లో కాంగ్రెస్, టీడీపీలు సహకరించుకు న్నాయని చెప్పారు. నర్సాపురంలో టీడీపీ అభ్యర్థికి ఓట్లేస్తే రామచంద్రాపురంలో కాంగ్రెస్‌కు టీడీపీవారు ఓట్లేశారని తెలిపారు. కడపలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో టీడీపీ చేతులు కలిపిన విషయం ప్రజలు మర్చిపోలేదన్నారు. 

సీబీఐ వాదన అవాస్తవం

హైకోర్టుకు నివేదించిన జగన్ న్యాయవాది పద్మనాభరెడ్డి
అరెస్ట్ వాన్‌పిక్ కేసులో మాత్రమేఅనడం సరికాదు
అన్ని కేసులకు సంబంధించి అరెస్టు జరిగినట్లేనని జస్టిస్ చంద్రకుమార్ గతంలో స్పష్టం చేశారు
రిమాండ్ రిపోర్ట్, కస్టడీ పిటిషన్లు కోర్టుకు సమర్పించిన న్యాయవాది
వాదనలు పూర్తి.. బెయిల్‌పై తీర్పు 24న

సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై గురువారం హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఈ నెల 24న తన నిర్ణయాన్ని వెలువరిస్తానని జస్టిస్ బి.శేషశయనారెడ్డి ప్రకటించారు. సీఆర్‌పీసీ సెక్షన్ 167(2) కింద తనకు బెయిల్ నిరాకరిస్తూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ జగన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలి సిందే. దీనిపై సీబీఐ వాదనలు బుధవారం ముగిశాయి. గురువారం జగన్ తరఫున సీనియర్ న్యాయవాది సి.పద్మనాభరెడ్డి తిరుగు సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన సీబీఐ వ్యవహారశైలిని ఎండగట్టారు. జగన్‌ను అరెస్ట్ చేసింది కేవలం వాన్‌పిక్ కేసులో మాత్రమేనని సీబీఐ వాదించిన నేపథ్యంలో, ఆయన అరెస్ట్‌కు సంబంధించిన అరెస్ట్ మెమో, రిమాండ్ రిపోర్ట్, పోలీస్ కస్టడీ పిటిషన్‌లో ఏముందో చెప్పాలని సీబీఐని జడ్జి కోరిన విషయం తెలిసిందే. సీబీఐ వాటికి సమాధానం దాటవేయడంతో, గురువారం వాదనలు మొదలవగానే అరెస్ట్ మెమో, రిమాండ్ రిపోర్ట్, పోలీస్ కస్టడీ పిటిషన్లను పద్మనాభరెడ్డి న్యాయమూర్తి ముందుంచారు. 

అన్ని కేసుల్లో జగన్ అరెస్ట్ జరిగింది...

అరెస్ట్ మెమో ప్రకారం వివిధ ఆరోపణలపై జగన్‌ను ఆర్‌సీ 19(ఎ)(1) కింద అరెస్ట్ చేశారని పద్మనాభరెడ్డి నివేదించారు. రిమాండ్ రిపోర్ట్, కస్టడీ పిటిషన్‌లో.. జగన్ తన తండ్రి ద్వారా సండూర్ పవర్ సహా ఇతర కంపెనీలకు పలు ప్రయోజనాలు చేకూర్చారని పేర్కొన్నట్లు తెలిపారు. సండూర్ పవర్ గురించి రిమాండ్ రిపోర్ట్, కస్టడీ పిటిషన్‌లో పేర్కొన్నప్పటికీ, దానిపై ఇంకా దర్యాప్తు చేయాల్సి ఉందని సీబీఐ సుప్రీంకోర్టుకు తెలిపిందని వివరించారు. ఈ సమయంలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ.. సీబీఐ ఇంకా దర్యాప్తు చేయాల్సి ఉన్న కేసుల్లో కూడా జగన్‌ను కస్టడీకి అడిగే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారా? అని ప్రశ్నించారు. అవునంటూ పద్మనాభరెడ్డి సమాధానమిచ్చారు. వాన్‌పిక్ సహా దర్యాప్తు చేయాల్సి ఉన్న మిగిలిన ఏడు అంశాలపై కూడా ప్రశ్నించేందుకు జగన్‌ను కస్టడీ కోరే అవకాశం ఉందన్నారు. దీనిని బట్టి మొత్తం 8 కేసుల్లోనూ జగన్‌ను అరెస్ట్ చేసినట్లేనని, కేవలం వాన్‌పిక్ కేసులోనే అరెస్ట్ చేశామని చెప్పడంలో అర్థం లేదని వివరించారు. 

కస్టడీ కోసం దాఖలు చేసిన పిటిషన్‌ను ఒకసారి పరిశీలిస్తే దర్యాప్తు పూర్తయిన, చార్జిషీట్లు దాఖలు చేసిన కేసుల్లో మాత్రమే కాక, అన్ని అంశాల్లో జగన్ రిమాండ్ కోరినట్లుగా తెలుస్తుందన్నారు. తన అరెస్ట్‌ను అక్రమంగా ప్రకటించాలంటూ జగన్ పిటిషన్ దాఖలు చేసినప్పుడు ఇదే హైకోర్టు న్యాయమూర్తి చంద్రకుమార్ తీర్పునిస్తూ.. వేర్వేరు నేరాల్లో జగన్‌కు భాగముందని దర్యాప్తు అధికారులు భావిస్తున్నప్పుడు, ఆయనను అన్ని కేసుల్లో అరెస్ట్ చేసినట్లు భావించాల్సి ఉంటుందని స్పష్టంగా చెప్పారంటూ కోర్టుకు నివేదించారు. అందులో భాగంగానే జగన్ పిటిషన్‌ను కొట్టివేయడమే కాక, జగన్‌ను అన్ని కేసుల్లోనూ సీబీఐ కస్టడీకి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారని తెలిపారు. కాబట్టి జగన్‌ను అన్ని కేసుల్లో అరెస్ట్ చేయలేదన్న సీబీఐ వాదనల్లో పసలేదని పద్మనాభరెడ్డి స్పష్టం చేశారు. 

ఆ కేసుల్లో బెయిల్‌ను ఎందుకు వ్యతిరేకిస్తున్నట్లు..?

రిమాండ్ రిపోర్ట్‌లో.. దర్యాప్తు చేయాల్సి ఉన్న ఏడు అంశాలతో సహా అన్ని అంశాల గురించి స్పష్టమైన ప్రస్తావన ఉందని ఆయన కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ‘జగన్‌ను సీబీఐ అన్ని కేసుల్లోనూ అరెస్ట్ చేయలేదనే అనుకుందాం. దర్యాప్తు పూర్తయి, చార్జిషీట్లు దాఖలు చేసిన కేసుల్లో మాత్రమే అరెస్ట్ చేశారని సీబీఐ చెబుతున్న వాదన నిజమని కొద్దిసేపు భావిద్దాం. అదే నిజమైతే ఆ కేసుల్లో బెయిల్ కోసం జగన్ దాఖలు చేసుకున్న పిటిషన్లను సీబీఐ ఎందుకు వ్యతిరేకిస్తున్నట్లు..?’ అని ప్రశ్నించారు. సీబీఐ న్యాయవాది పి.కేశవరావు జోక్యం చేసుకుంటూ.. లేపాక్షి, ఇందూ ప్రాజెక్ట్ అంశాలు తమ దర్యాప్తులో తేలిన విషయాలని, దర్యాప్తు చేయాల్సిన ఏడు అంశాల్లో అవి తరువాత చేరాయని అన్నారు. ఆ రెండు అంశాలు అసలు ఎఫ్‌ఐఆర్‌లో లేనేలేవని తెలిపారు. పద్మనాభరెడ్డి వాదనలు కొనసాగిస్తూ.. సీబీఐ ఎప్పటికప్పుడు రిమాండ్ పొడిగింపు కోరుతూ మెమోలు దాఖలు చేస్తూ వచ్చిందని, అదే విధంగా కస్టడీ పొడిగింపును కూడా కోరిందని వివరించారు. క్విడ్ ప్రో కోకు సంబంధించి వివిధ అంశాలపై దర్యాప్తు చేస్తున్నామని చెబుతూ వచ్చిందే తప్ప, నిర్దిష్టంగా ఫలానా అంశంపై, ఫలానా కంపెనీపై దర్యాప్తు చేస్తున్నామని చెప్పలేదన్నారు. 

వాన్‌పిక్ వ్యవహారంలో నాల్గవ చార్జిషీట్ దాఖలు చేసిన తరువాత, రిమాండ్ పొడిగింపు కోసం మెమో దాఖలు చేయడం సీబీఐ నిలిపివేసిందని వివరించారు. జగన్ బెయిల్ పిటిషన్ విచారణ సమయంలో దాఖలు చేసిన కౌంటర్‌లో కూడా.. జగన్‌ను వాన్‌పిక్ కేసులో మాత్రమే అరెస్ట్ చేసినట్లుగా సీబీఐ సుప్రీంకోర్టుకు చెప్పలేదని ఆయన కోర్టు దృష్టికి తెచ్చారు. వివిధ నేరాలకు సంబంధించి దర్యాప్తు సాగుతోందని, దర్యాప్తు కీలక దశలో ఉందని, ఈ దశలో బెయిలిస్తే, ఎంపీ, ఓ పార్టీ అధ్యక్షుడి హోదాతో సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని మాత్రమే సుప్రీంకోర్టుకు చెప్పిందని తెలిపారు. 

సీబీఐ వాదన పచ్చి అబద్ధం...

తాము 167(2) కింద చట్టబద్ధ బెయిల్ ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరామన్న సీబీఐ వాదన పచ్చి అబద్ధమని పద్మనాభరెడ్డి చెప్పారు. తామెప్పుడూ చట్టబద్ధ బెయిల్ కోసం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయలేదన్నారు. నిబంధనలకు అనుగుణంగా చట్టబద్ధ బెయిల్ కోసం నవంబర్‌లో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో మాత్రమే పిటిషన్ దాఖలు చేశామని తెలిపారు. కాబట్టి సుప్రీంకోర్టు 167(2) అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకునే ఉత్తర్వులు జారీ చేసిందన్న సీబీఐ వాదనల్లో అర్థం లేదని పేర్కొన్నారు. 

దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ.. ఇరుపక్షాలు ఈ విధంగా పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేస్తున్నప్పుడు, అసలు ఈ కోర్టు దేనిని నిజమని నమ్మాలి..? అసలు సుప్రీంకోర్టులో ఏం జరిగిందో తెలుసుకునేది ఎట్లా..? అని ప్రశ్నించారు. దీంతో ఒక చార్జిషీట్‌కు సంబంధించి మాత్రమే జగన్ అరెస్టయి, జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారని, మిగిలిన చార్జిషీట్లలో ఆయన సీఆర్‌పీసీ సెక్షన్ 309 కింద రిమాండ్‌లో ఉన్నారని, దీనికి సంబంధించి బాండ్లను కూడా సమర్పించారని పద్మనాభరెడ్డి తెలిపారు. దీనినిబట్టి మిగిలిన చార్జిషీట్లకు సంబంధించి జగన్ బెయిల్‌పై విడుదలైనట్లేనన్నారు. కోర్టు లేవనెత్తిన అంశాల ఆధారంగా ఆయనకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను కాలరాయలేరని నివేదించారు. సుప్రీంకోర్టు సైతం తన ఉత్తర్వుల్లో ఎక్కడా కూడా జగన్ 167(2) కింద బెయిల్ కోరినట్లుగా పేర్కొనలేదని వివరించారు. సీబీఐ తరఫున కేశవరావు వాదిస్తూ.. రిమాండ్ రిపోర్ట్‌లోని అంశాలను ప్రస్తావించారు. అందులో తాము జగన్‌ను ఓ నేరం కింద అరెస్ట్ చేశామని పేర్కొన్నామే తప్ప, నేరాల కింద అరెస్ట్ చేశామని చెప్పలేదన్నారు. దీని అర్ధం జగన్‌ను తాము అరెస్ట్ చేసింది కేవలం వాన్‌పిక్ కేసులో మాత్రమేనని తెలిపారు. సుప్రీంకోర్టులో జగన్ 167(2) కింద పిటిషన్ దాఖలు చేశారని తాము ఎన్నడూ చెప్పలేదని, 167(2) అంశాన్ని ప్రస్తావించారని మాత్రమే చెప్పామని ఆయన వివరించారు. వాదనలు విన్న న్యాయమూర్తి, ఈ బెయిల్ పిటిషన్‌పై సోమవారం తన నిర్ణయాన్ని వెలువరిస్తానని ప్రకటించారు.

sakshi

రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు


వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా శుక్రవారం పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. తమ నేత జైల్లో ఉన్నా ప్రజా సంక్షేమమే పరమావధిగా భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టడంతో పాటు ఆయన అరెస్టుపై తమ నిరసనను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెబుతామని పార్టీ నేతలు ప్రకటించారు. పార్టీ కేంద్ర కార్యాలయంతో సహా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా, మండల కేంద్రాల్లోనూ భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలు రక్తదాన, ఉచిత వైద్య శిబిరాలు, పేదలకు దుస్తులు, దుప్పట్లు, చీరల పంపిణీ, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు.

క్రిస్‌మస్‌కి డాడీని ఇంటికి రప్పించమని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం

అక్టోబర్ 5న బెయిల్ క్యాన్సిల్ చేశాక చాలా బాధపడ్డాను...
తర్వాత సడెన్‌గా హియరింగ్ వస్తే చాలా హ్యాపీగా ఫీలయ్యాను...
ఇక బెయిల్ వస్తుందని. డాడీ వస్తే ఎలా ఉంటుందో ఊహించుకుని,
దేవునికి థ్యాంక్స్ చెబుతూ ఒక పాట రాశాను. అది డాడీ చూసి చాలా బాగుందన్నారట. హ్యాపీగా అనిపించింది.
- వర్ష 


ఇందిర: డాడీతో టైం ఎలా స్పెండ్ చేసేవారు...
హర్ష: బెంగుళూరులో హెచ్‌ఎస్‌ఆర్ హౌస్‌లో డాడీ ఒళ్లో కూర్చుని సినిమాలు చూడడం బాగా గుర్తుంది. డాడీకి యాక్షన్ మూవీస్, అడ్వంచర్ మూవీస్ అంటే చాలా ఇష్టం. కానీ ఏ సినిమా ఒక్కసారికన్నా చూడరు. స్టార్‌వార్స్, లార్డ్ ఆఫ్ ద రింగ్స్, 10000 బిసి ... ఈ మూడు సినిమాలే నాకు తెలిసి ఆయన రెండుమూడుసార్లు చూసి ఉంటారు. ఒక్కోసారి సినిమా అయిపోయిన తర్వాత నేను, డాడీ ఆ సినిమా గురించి డిస్కస్ చేసేవాళ్లం.

ఎస్పెషల్లీ నేను చదివిన నవలలను సినిమాల కింద తీస్తే రెండిటిలోనూ తేడాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నీ చెప్పేదాన్ని! డాడీ చాలా ఇంట్రస్టింగ్‌గా వినేవారు.
వర్ష: అమ్మ మాకు చదువు చెప్పాక డాడీ ఒళ్లో కూర్చుని నేను, అక్క సినిమా చూసేవాళ్లం. అమ్మ కూడా జాయినయ్యేది. వాళ్ల ముగ్గురికీ యాక్షన్ మూవీస్ అంటే ఇష్టం. అప్పట్లో నాకు అంత నచ్చేవి కాదు. అందుకని వాళ్లు చూస్తుండగా నేను నిద్రపోయేదాన్ని. ఇదికాక డాడీతో కూర్చుని 8-9 మధ్య టీవీ షోస్ చూసేవాళ్లం. జాపనీస్ యానిమే అంటే డాడీకి, నాకు ఇష్టం... ఇంకా,బెంగుళూరులో ఉండగా డాడీతో ఓ గంటపాటు కబుర్లు చెప్పుకుంటూ వాక్ చేసేవాళ్లం.
హాలిడేస్ వచ్చాయంటే కంటిన్యుయస్‌గా మూవీస్ చూసేవాళ్లం. వెకేషన్‌కి వెళ్లినప్పుడు కూడా డాడీతో చాలా ఫన్ ఉండేది.

ఇందిర: డాడీలో మీకు నచ్చే విషయం...
హర్ష: డాడీతో ఉంటే చాలా ఫన్... మాతో ఉంటే ఎప్పుడూ నవ్వుతూనే ఉంటారు... దేనికీ ఫోర్స్ చేయరు. అది నాకు చాలా నచ్చుతుంది.
వర్ష: డాడీ ఏ విషయంలోనూ కంప్లయింట్ చేయరు. ఎప్పుడూ తిట్టడం కానీ, కోప్పడ్డం కానీ చేయరు.
ఇందిర: మీరు నైస్ అవడం వల్లా? డాడీ నైసా?

వర్ష: (నవ్వేసి) డాడీనే నైస్ కాబట్టి!
ఇందిర: డాడీతో మెమరబుల్ ఇన్సిడెంట్స్...

హర్ష: నాకు గుర్తున్న ఇన్సిడెంట్స్‌లో ఒకటి .... ప్రతి శనివారం నేను, వర్ష అమ్మతోపాటు పెయింటింగ్ చేసేవాళ్లం. ఓసారి డాడీ కూడా మాతో జాయినయ్యారు. పెయింటింగైతే చేయలేదు కానీ, నాది, వర్షది ఏదో పిక్చర్ గీసి, షేడింగ్ చేసివెళ్లారు. (నవ్వుతూ) బాగానే గీశారు.

వర్ష: నాకు నిద్రంటే ఇష్టం. సెలవుల్లో, ... ఆదివారాల్లో 9.30 అయినా లేవడం ఇష్టపడను. కానీ, డాడీ ఇంట్లో ఉన్నారంటే, 8-9 కల్లా బెడ్ దగ్గరికి వచ్చి షేక్ చేసి మరీ నవ్వుకుంటూ లేపేస్తారు. ఆయనకు మాతో స్పెండ్ చేయాలని ఉంటుంది కాబట్టి, తర్వాత ఆయనకు కుదరదు కాబట్టి, బద్ధకమున్నా డాడీకోసం లేచేసేదాన్ని.

హర్ష: ఇంకోటి... నా బర్త్‌డేకి ... డాడీ దగ్గర మంచి పేపర్స్ లేవు.. కలర్స్ లేవు... మామూలుగా ఆయన బిజీగా ఉండే మనిషి... కార్డులు చేయడం రాదు కదా! కానీ, కష్టపడి, పెన్నులు లేకపోయినా కలర్ పెన్సిల్స్ లేకపోయినా, ఉన్నదాంతో కార్డు చేసి, మంత్లీ క్యాలెండర్ మీద స్మైలింగ్ ఫేస్ గీసి, లెటర్ కూడా రాసి పంపారు. ఇప్పటిదాకా నాకొచ్చిన బెస్ట్ బర్త్‌డే గిఫ్ట్!

ఇందిర: డాడీ మీద మీకేమైనా కంప్లయింట్స్ ఉండేవా?
హర్ష: మేం బెంగుళూరులో ఉన్న రోజుల్లో అప్పుడప్పుడు డాడీ హైదరాబాద్‌కు వచ్చి 2-3 రోజులు వుండేవారు. బెంగుళూరు నుంచి హైదరాబాద్ పూర్తిగా షిఫ్టయినప్పుడు ఫ్రెండ్స్‌ని మిస్సవుతానని నాకు ఇష్టంలేకపోయినా, కనీసం డాడీతో రోజూ టైం స్పెండ్ చేయవచ్చునని అనుకున్నాను. కానీ, ఇక్కడికొచ్చాక డాడీ ఓదార్పుతో బిజీగా ఉండడంతో నెలకు ఒకసారే కలవగలిగేవాళ్లం. కానీ ఇంకా వరస్ట్ పార్ట్ ఏంటంటే... ఇప్పుడు అది కూడా లేదు. స్కూల్ ఉన్న టైంలో ములాఖత్ ఉండడంతో, ఎప్పుడో రెండు నెలలకోసారి రెండు గంటలు కలవగలుగుతున్నాం.

వర్ష: ఓదార్పు ఉండగా మేం కంప్లయింట్ చేసేవాళ్లం... మాకు టైం ఎక్కువ ఇవ్వండి డాడీ... అని! కానీ అప్పుడే నయం... ఇప్పుడు అసలు కుదరడం లేదు. ఓదార్పే బెటర్... అన్నివిధాలా... మాతో స్పెండ్ చేయకపోతే చేయకపోయారు... ఆయనకు నచ్చింది, తను కరెక్టనుకున్నది చేసుకుపోయేవారు. ఇప్పుడు ఏమీ చేయటానికి లేదు. అది చాలా బాధగా ఉంటుంది. అప్పట్లో టీవీలో చూసేవాళ్లం. ఫోన్‌లో మాట్లాడగలిగేవాళ్లం.ఇప్పుడు ఎక్కడా కనపడరు. మాట్లాడడానికి లేదు.

ఇందిర: పోనీ లెటర్లు అవీ రాయచ్చుగా...
హర్ష: రాస్తాం. నేను ఫ్రెండ్స్ గురించి, మూవీస్ గురించి ఎక్కువ రాస్తాను. డాడీ కూడా అప్పుడప్పుడు లెటర్స్ రాసి మమ్మీకి ఇచ్చి పంపుతుంటారు. దానిలో 2, 3 పేరాలు మూవీస్ గురించే ఉంటాయి.

వర్ష: నేనైతే ఏయే సబ్జక్టుల్లో ఎన్ని మార్కులు వచ్చాయో రాస్తాను. లెటర్స్ నిండా స్మైలింగ్ ఫేసెస్ పెడుతుంటాను... ఎందుకంటే డాడీ ఎప్పుడూ స్మైల్ చేస్తుండాలని! అప్పుడప్పుడు నలుగురం ఫ్యామిలీగా కలిసి ఉన్నట్టుగా కూడా బొమ్మలు గీసి పంపుతుంటాను.

ఇందిర: మరి డాడీ రిప్లైలు ఇస్తారా?
వర్ష: ఇస్తారు... నా హ్యాండ్ రైటింగ్ బాగుంటే మెచ్చుకుంటారు...కానీ, ఓసారి బాలేకపోతే, ‘నీ స్పెల్లింగ్స్‌లో చాలా తప్పులున్నాయి. నేను చెప్పేంత వాడిని కాదు. ఎందుకంటే... ఎప్పుడూ మమ్మీ అంటుంది - నావి కూడా బ్యాడ్ అని. కానీ మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. తప్పదు’ అని రాశారు. ప్రతి లెటర్‌లోనూ మా సిస్టర్‌కి చెప్తారు... నాతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలని... నా ఇంపార్టెన్స్‌ను గుర్తించాలని! (నవ్వుతూ) కానీ ఇన్నిసార్లు రాసినా, అక్క ఇప్పటికి కూడా గుర్తించలేదు.

హర్ష: అదే విషయం డాడీకి నేను రాశాను కూడా... నేను ఇప్పటికీ చెల్లెలి ఇంపార్టెన్స్ గుర్తించలేదని!
ఇందిర: స్కూల్లో ఫ్రెండ్స్ డాడీ గురించి ఏమైనా అడుగుతుంటారా?

హర్ష: ఫ్రెండ్స్ ఆ విషయం అసలు ఎత్తరు.. వాళ్లు చాలా అండర్‌స్టాండింగ్‌గా ఉంటారు.
వర్ష: నా ఫ్రెండ్స్ కూడా చాలా స్వీట్... ఇంత జరుగుతున్నప్పుడు ఎందుకులే అని అనుకుంటారేమో... ఎవరూ అడగరు.

ఇందిర: అసలు డాడీని ఎందుకిలా చేశారో తెలుసా?
వర్ష: ఓదార్పు చేయడం లీడర్స్ ఎవరికీ ఇష్టంలేదు. డాడీకి ఇంతమంది సపోర్ట్ ఇవ్వడం కూడా వాళ్లకి నచ్చలేదు. డాడీని ఎన్నాళ్లు కుదిరితే అన్నాళ్లు పెట్టేలాగా రాంగ్ డీల్స్ చేస్తున్నారు అందరూ. నాట్ ఫెయిర్!

హర్ష: అంతేకాదు, వాళ్లని వాళ్లు (హర్ష ఉద్దేశంలో ప్రత్యర్థులు) బెటర్ చేసుకునేకన్నా అవతలి వాళ్లని తక్కువ చేయడంలోనే ఎక్కువ కాన్సన్‌ట్రేట్ చేస్తున్నారు. డాడీని వాళ్లు అన్యాయంగా బాధపెడితే వాళ్ల సంగతి కూడా దేవుడే చూసుకుంటాడు. డాడీ అలా చేయరు కాబట్టి డాడీ పట్ల దేవుడు డెఫినిట్లీ కైండ్‌గా ఉంటారని అనుకుంటున్నాను.

ఇందిర: డాడీకి బెయిల్ రానప్పుడు చాలా బాధపడ్డారట కదా..
హర్ష: ప్రతిసారీ బెయిల్ వస్తుందీ... రాదు... అంటున్నప్పుడు చాలా బ్యాడ్‌గా ఫీలవుతాం. మా అందరికంటే మమ్మీ ఎక్కువ డిప్రెషన్ ఫీలవుతుంది. ఇంతకుముందు ఎప్పుడూ మమ్మీ ఏడవగా చూడలేదు. ఎప్పుడూ మమ్మల్ని హ్యాపీగా ఉండమని చెప్పే అమ్మే... అలా డిప్రెషన్లో ఉండి ఏడుస్తుంటే ఏం మాట్లాడాలో, ఏం చేయాలో అర్థం కాక హెల్ప్‌లెస్‌గా ఫీలయ్యి, సెలైంట్‌గా ఉంటాం. స్పేస్ ఇస్తే బెటరని వదిలేస్తాం.

వర్ష: వాళ్ల వెడ్డింగ్ యానివర్సరీకి కూడా అంతే! డాడీ పక్కన లేరని మమ్మీ చాలా శాడ్‌గా ఫీలయ్యింది... ఏడ్చింది... ఇంకోసారి ప్రేయర్‌లో కూడా అంతే... ఇంకా పేయర్ మొదలెట్టకుందే ఏడ్చింది. మాకేం చేయాలో అర్థం కాక... ఏదో మాట్లాడబోయి నెగిటివ్ మాట్లాతామేమో అనే భయానికి ఇంకా బ్యాడ్ అవుతుందని ఏం మాట్లాడకుండా కూర్చున్నాం.

ఇందిర: బెయిల్ వస్తుందనుకున్న రోజు... 7 ఎస్‌ఎంఎస్‌లు పంపావట!
వర్ష: స్కూల్‌కు వెళ్లినప్పుడు కనీసం ఓ ఇరవై సార్లయినా ప్రేచేసి ఉంటాను. టెన్షన్ అనిపించి స్కూల్ నుంచి బయటకు రాగానే కారులోకి రాగానే సెల్ తీసుకుని మమ్మీకి 7 ఎస్‌ఎంఎస్‌లు పంపాను. ఏమైంది... ఏమైంది... అని పంపాను. కానీ, ఆరోజు కూడా రాలేదు. చాలా బాధపడ్డాను. ఎందుకంటే, అందరూ ఇంత ప్రే చేస్తున్నారు... బైబిల్‌లో ఉంటుంది... ‘దేవుని పేరు మీద ఇద్దరు ముగ్గురు కలిసి ప్రే చేస్తే అనుకున్నది జరుగుతుంది’ అని! అందులోనూ చాలామంది ప్రే చేస్తున్నారు... కాబట్టి తప్పనిసరిగా జరుగుతుంది అనుకున్నాను.

ఇందిర: డాడీ బర్త్‌డే రోజు కలుస్తారు కదా... ఏం గిఫ్ట్ ఇస్తున్నారు?
హర్ష: క్రిస్మస్‌కి డాడీ ఇంటికి వస్తారని దేవుడ్ని ప్రార్థిస్తున్నాం. అందుకే, డాడీ కోసం తనకు నచ్చే ఎమేజింగ్ స్పైడర్‌మ్యాన్, డార్క్‌నైట్ రెజైస్ మూవీస్ కొన్నాను.

వర్ష: చాలా ఫోటోలు, రాతలతో కూడిన స్క్రాప్ బుక్ తయారుచేస్తున్నాం. ఆ పిక్చర్స్ పెట్టి, ఆ టైంలో ఏం జరిగింది... అవన్నీ రాస్తాను. స్క్రాప్‌బుక్కే కాకుండా కలర్‌ఫుల్ కార్డు కూడా తయారుచేస్తున్నాను డాడీకి... కాలిగ్రఫీలో ఇంతవరకు ఎప్పుడు రాయనంత అందంగా... స్పెషల్ కార్డును తయారుచేయాలనుకుంటున్నాను. చాలా స్మైలీ ఫేసెస్ పెట్టి!

ఇందిర: మీకన్నా ముందు ఈ పేపర్ వెళ్తుంది... మరి డాడీకి ఏం విషెస్ చెప్తారు?
హర్ష: హ్యాపీ బర్త్‌డే డాడీ! మీరు మాతో ఉంటే బాగుండేది... కానీ, మేమే మిమ్మల్ని కలవడానికి వస్తాం!
వర్ష: హాయ్, హ్యాపీ బర్త్‌డే డాడీ! మీరు బయటకొచ్చేసి మాతోపాటు ఉండుంటే చాలా బాగుండేది. ఇంట్లో చాలామందితోపాటు మీ బర్త్‌డే చేసుకునేవాళ్లం. బట్.. పర్లేదు... అక్కడ కూడా... మిమ్మల్ని చూడగలుగుతాం కదా అది చాలు...

హర్ష: క్రిస్మస్‌కి మాత్రం మీరు బయటకు రావాలి. లేకపోతే మీరు మన ఇంటి ట్రెడిషన్‌ని (చుట్టాలందరితో పులివెందులలో గడపడం) బ్రేక్ చేసినట్టవుతుంది.

ఇందిర: మీకు తాత ఎంత గుర్తున్నారు?
వర్ష: ఎప్పుడు అబ్బకు హాయ్ చెప్పినా వెంటనే ఎత్తుకునేవారు. అమ్మ నాకు శ్రేయ అని పెట్టాలనుకుంటే... అబ్బ తనకు ఇష్టమని వర్ష అని పెట్టుకున్నారు. అందుకే ప్రతిసారీ, ప్రతి వర్క్‌బుక్, ప్రతి షీట్‌లో, ఏ నోట్‌బుక్‌లో ఎప్పుడు ఆ పేరు రాసినా... అబ్బను తలచుకోకుండా ఉండలేను.
హర్ష: అబ్బ పోయి మూడేళ్లయినా చాలా ఏళ్లయినట్టు అనిపిస్తుంది. అంతేకాదు, అబ్బ పోయినప్పటినుంచీ మాకు ఏదీ సరిగా జరగడం లేదు.
ఇందిర: తాతలో, నాన్నలో... మీకు నచ్చే విషయాలు...
హర్ష: అబ్బకి, నాన్నకి - ఇద్దరికీ ప్రజలకు హెల్ప్ చేయడం చాలా ఇష్టం.. వాళ్లు చేసే ప్రతి పనినీ ఇష్టంగా చేస్తారు. మంచిగా చేస్తారు. ఒకసారి చేయాలనుకుంటే పట్టుదలతో చేయడం, చెప్పదలచుకున్నది సూటిగా చెప్పడం, ప్రతిరోజూ దేవునికంటూ కొంత టైం కేటాయించడం, స్పిరిచ్యువల్ గెడైన్స్... ఏది చేసినా ‘మేం చేస్తున్నాం’ అని అనుకోకుండా దేవుడు చేస్తున్నాడు అని అనుకుని చేయడం... నాకు ఇద్దరిలో నచ్చుతుంది.

వర్ష: ఈరోజు డాడీ ప్లేస్‌లో అబ్బ ఉండుంటే... ఇలానే డాడీలానే కామ్‌గా ఉండేవారు. ఇద్దరికీ అసలు ఎప్పుడూ కోపం రాదు. ఎవరిమీదా అరవరు... వాళ్లు థింక్ చేసే విధానం, యాటిట్యూడ్ ఒకేలా ఉంటుంది. ఇద్దరూ బైబిల్ బాగా చదువుతారు, ప్రేయర్స్ ఎక్కువ చేస్తారు. ఒకేలా ఆలోచిస్తారు. ఇద్దరికీ దేవుడంటే చాలా ఇష్టం. మేం కొంచెం పెద్దయిన తర్వాత మమ్మల్ని అబ్బ దగ్గర పెట్టాలని అమ్మకు చాలా ఉండేదట. అలా చేస్తే మేం కూడా అబ్బలాగా పేషన్స్‌తో ఉంటామని!

ఇందిర: వీటిల్లోంచి డాడీ దగ్గర నేర్చుకోవాలనుకునేవి...
హర్ష: కామ్‌గా ఉండడం, పేషన్స్‌తో ఉండడం... డాడీకి ఎప్పుడైనా ఫోన్లు వస్తుంటే.. ఇంకెంత సేపు మాట్లాడతారు... అని చెవిలో అరుస్తుండేవాళ్లం... అయినా కూడా ఎప్పుడూ మా మీద ఒక్కసారి కూడా ఆయన విసుక్కోరు... వేలితో ‘ఒక్క నిమిషం ఒక్క నిమిషం’ అని సైగ చేసేవారే తప్ప కోప్పడేవారు కాదు. మేమిద్దరం కొట్టుకున్నా, కొట్టుకోవద్దని కామ్‌గా చెప్తారు గానీ అరవరు.

వర్ష: అందరికోసం టైం కుదుర్చుకునేవారు. (నవ్వుతూ) కానీ, కజిన్స్ అందరినీ అక్క తనే పిలుస్తుంది... కానీ ఎవరితో మాట్లాడకుండా తన గొడవన తను పోయి పుస్తకాలు చదువుకుంటుంది... ఎవ్వరికీ ఇవ్వడానికి తన దగ్గర టైం ఉండదు... కానీ మా డాడీ అలా కాదు... అందరికీ ఇవ్వడానికీ టైం ఉంటుంది మా డాడీ దగ్గర. ఐ గెస్ అబ్బ కూడా అలానే! అమ్మ చెప్తూ ఉంటుంది... ఎంత పెద్ద పార్టీ పెట్టినా, ఏం చేసినా అందరితో రెండు నిమిషాలు అయినా అదే పనిగా వచ్చి మాట్లాడేవారట... డాడీ కూడా అంతే!

ఇందిర: ఇలా జరుగుతున్నందుకు దేవుని మీద ఎప్పుడూ కోపం రాలేదా?
హర్ష: ‘నువ్వు అనుకుంటే అయిపోదా’ అని దేవుడ్ని చాలాసార్లు అడగాలనిపించింది కానీ, ఆలోచిస్తే అనిపించింది... ప్రతి మనిషి విషయంలో దేవునికి ఒక ప్లాన్ ఉంటుంది! దేవుడు మనల్నీ చేశాడు... ప్రపంచంలోని అందర్నీ చేశాడు. ఎవరేంటో దేవునికి తెలుసు. అందరం ఆయన క్రియేట్ చేసినవాళ్లమే కాబట్టి ఆయనకు ఎవరిని ఏం చేయాలనేది బాగా తెలుసు. మనకు ఎవరేంటో తెలీదు కాబట్టి అన్నీ ఆయనకు వదిలేయటం బెటర్!

వర్ష: అయితే, ఇంతకుముందు ఉన్నదానికన్నా ముందు ముందు బాగా వుంటుందని హోప్ వుంది. అన్నీ బాగా అయిపోయేరోజు వస్తుందని, అప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే అంతా మన మంచికే జరిగిందని అప్పుడనిపిస్తుందని నాకు ఇప్పుడు అనిపిస్తుంది.


sakshi

అన్న పక్కనుంటే ధైర్యంగా అనిపిస్తుంది


ఇందిర: నిన్న జగన్‌గారిని కలిశారు కదా... ఏమన్నారు?
షర్మిల: వెళ్లగానే కౌగిలించుకుని, చాలా కన్సర్న్‌గా ‘ఎలా ఉన్నావు?’ అని అడిగాడు. కాలి గాయం గురించి కాసేపు మాట్లాడాక, నేనే పాదయాత్ర ఆపినందుకు చాలా బాధగా ఉందని చెప్పాను. వెంటనే అన్న ‘వాటి గురించి తర్వాత ఆలోచిద్దాం... ముందు నువ్వు బాగవడం ముఖ్యం’ అన్నాడు.
ఇందిర: మీ పాదయాత్రకు బ్రేక్ పడింది కదా... నెక్ట్స్ స్టెప్ గురించి ప్రస్తావన వచ్చిందా?
షర్మిల: అన్న నా గురించి మాత్రమే ఆలోచించాడు... నేను మాత్రం అన్న వచ్చేదాకా చేయగలిగి ఉంటే బాగుండేదని అనుకున్నాను. ఎనీహౌ నాకు నయమయ్యే లోపల అన్న బయటికొస్తాడని అందరం ఆశిస్తున్నాం... అప్పుడు తనే చేస్తాడు ఈ పాదయాత్ర!

ఇందిర: మీరు పాదయాత్ర చేస్తారనగానే... మీరు మరో పవర్ సెంటర్ అవుతారని కొందరు చెవులు కొరుక్కున్నారు...

షర్మిల: నేను అన్నకు ప్రత్యామ్నాయాన్ని కాదు, కేవలం ఆయన ప్రతినిధిని! ఆయన్ను రిప్లేస్ చేయగలిగిన వ్యక్తిని అంతకన్నా కాదు. ప్రస్తుతం తను మనకు అందుబాటులో లేడు కాబట్టి, ఆ ఖాళీని తాత్కాలికంగా భర్తీ చేయడానికి, పార్టీకి నావంతు సహాయాన్ని, సహకారాన్ని అందించడానికి వచ్చిన వ్యక్తిని మాత్రమే! అందుకే పదేపదే చెప్పాను... ‘నేను జగనన్న వదిలిన బాణాన్ని’ అని! మా మధ్య ఎవరు ఎన్ని విభేదాలు సృష్టించాలనుకున్నా అది జరగని పని! నాన్న నాకు, అన్నకు మధ్య దృఢమైన బంధం ఉండేట్టు పెంచారు. ఆయన ఎప్పుడూ అనేవారు - అధికారం, డబ్బు - ఎప్పుడూ వచ్చిపోతుంటాయి కానీ, మనుషులు, అనుబంధాలు - ఒక్కసారి పోగొట్టుకుంటే జీవితంలో తిరిగి రావు - అని! ఆ విలువ నాకు, అన్నకు బాగా తెలుసు కాబట్టి... అలాంటివి ఎప్పుడూ రావు!

ఇందిర: నాన్నకి, అన్నకి మధ్య ఉన్న సారూప్యత, వ్యత్యాసం...
షర్మిల: ఇద్దరికీ ఆడవాళ్లంటే విపరీతమైన అభిమానం, గౌరవం! వాళ్ల భావాలకి, వాళ్ల ఆలోచనలకి, వాళ్ల వ్యక్తిత్వానికి విలువ ఇస్తారు. ఇద్దరికీ ధైర్యం, మాటమీద నిలబడ్డం ఎక్కువ. ఇద్దరిదీ విశాలమైన హృదయం. ఇద్దరికీ క్షమాగుణం ఎక్కువ. ఇక ఇద్దరి మధ్య వ్యత్యాసం అంటే... నాన్న ఎవరినైనా నమ్మేసేవారు. ఆయన కొందరిని నమ్మి మోసపోయిన విషయాన్ని అన్న కళ్లారా చూడడంతో, అన్నకు జాగ్రత్త వచ్చిందనుకుంటా! అయితే, ఒక్క మనుషుల విషయంలోనే కాదు, ఒక మాట అనాలన్నా, ఒక పని చేయాలన్నా...అన్న ఆచితూచి వ్యవహరిస్తాడు.

ఇందిర: అంత ఆచితూచి వ్యవహరించే మనిషి... ఇన్ని కష్టాలు వస్తాయని తెలిసి కూడా కాంగ్రెస్ నుంచి బయటికి ఎందుకొచ్చారు?

షర్మిల: Sometimes commitment becomes more important than consequences. దేనికోసం నిలబడ్డామన్నది ఆలోచించకుండా, ముందు ముందు ఏమేం ఎదుర్కోవాల్సి వస్తుందోనని ఆలోచించడం పిరికివాడి లక్షణం. పర్యవసానాలను దృష్టిలో పెట్టుకుని ఇచ్చిన మాట తప్పడం దారుణం. అది చేయలేకే అన్న బయటికొచ్చేశాడు.

ఇందిర: నాన్న ఉన్నప్పటికీ, ఇప్పటికీ... అన్నలో వచ్చిన మార్పు....
షర్మిల: అన్న చిన్నప్పటినుంచీ బాధ్యతగా పెరిగిన వ్యక్తి. ఆలోచించకుండా, ఎమోషనల్‌గా ఏదీ చేసేవాడు కాదు. ఇప్పుడూ అంతే! అయితే ఇప్పుడు ఇంకొంచెం మెచ్యూర్డ్‌గా, ఇంకొంచెం బాధ్యతగాయుతంగా మెలగడం తన బాధ్యత అనుకుంటున్నాడు. అందుకే ఏం చేసినా నాన్నకి, దేవునికి సమాధానం చెప్పుకునేలా ఉండాలి అని తరచూ అంటూ ఉంటాడు... ఆలోచిస్తూ ఉంటాడు... జాగ్రత్తగా మెలుగుతున్నాడు కూడా!

ఇందిర: మరి మీ ఇద్దరి అనుబంధం విషయంలో..
షర్మిల: నాన్న పోయిన కొత్తల్లో... ఓరోజు అమ్మ నా గురించి ఎందుకో చాలా బెంగపడిందట! అదేరోజు ప్రేయర్ టైంలో అన్నతో - ‘ఇకనుంచి నువ్వు షర్మిని నీ పెద్దకూతురు అనుకో’ అని అందట! వెంటనే అన్న - ‘అదసలు నువ్వు నాకు చెప్పాల్సిన విషయమా’ అన్నట్టుగా అమ్మ వంక చూసి, చేయి పట్టుకుని తల ఊపాడట! తన ఎక్స్‌ప్రెషన్ చూడగానే అమ్మకు కొన్నేళ్ల క్రితం నాన్న అలాగే నా గురించి బెంగపడ్డ సందర్భంలో అన్న నాన్నతో అన్న మాటలు గుర్తొచ్చాయట - ‘ఎందుకు నాన్నా, మీరు షర్మి గురించి బెంగపడతారు? మీ తర్వాత నన్ను మించిన శ్రేయోభిలాషి ఈ భూమి మీద పాపకు ఇంకెవరుంటారు’ అని! ఆ మాటలు గుర్తు రాగానే అమ్మకు అనిపించిందట... తను అప్పుడు పైకి ఏమీ అనకపోయినా, నా విషయంలో అన్నకి కమిట్‌మెంట్ సంపూర్ణంగా ఉందని, తనకి నన్ను సొంత బిడ్డలా చూసుకునే పెద్దమనసు ఉందని! ఇంతకన్నా ఏం చెప్పను అన్న గురించి.. మా అనుబంధం గురించి!

ఇందిర: అన్న విషయంలో ఏం మిస్సవుతున్నారు?
షర్మిల: సెక్యూరిటీ! అన్న పక్కనుంటే ధైర్యంగా అనిపిస్తుంది. బట్ ఇదంతా తాత్కాలికమే... దేవుని దయవల్ల అన్న త్వరగానే బయటికొస్తాడు.

ఇందిర: దేవుని గురించి ప్రస్తావన వచ్చింది కాబట్ట్టి అడుగుతున్నాను - ఇంత జరుగుతున్న ఈ సమయంలో అన్నకు దేవుని మీద నమ్మకం సడలిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా?
షర్మిల: లేదు సరికదా... ఎక్కువైంది! నిన్న కూడా అంటున్నాడు - ‘14వ లోక్‌సభలో ఐదున్నర లక్షల అత్యంత మెజారిటీ వచ్చిందంటే, అది దేవుని అండలేకుండా సాధ్యమా? ఇన్నేళ్లయినా నాన్నమీద ప్రజల్లో ఇంత అభిమానం ఉందంటే... అది ఒక్క నాన్నవల్లో, మన వల్లో సాధ్యమా? పాపా, లైఫ్‌లో ఇంతదూరం వచ్చామంటే అదంతా దేవుని దయవల్లే’ అన్నాడు.

ఇందిర: మరి దేవుడు వేసిన ఈ శిక్షను ఎలా అర్థం చేసుకున్నారు?
షర్మిల: అసలు మీరు ఇది శిక్ష అని ఎందుకనుకుంటున్నారు? నో డౌట్... మానసికంగా, శారీరకంగా మా అందరికీ ఇది బాధ కలగజేసి ఉండవచ్చు. కానీ, ప్రతి బాధని శిక్ష అనుకోవడానికి వీల్లేదు. అసలు జీసస్ క్రైస్త్ జీవితాన్నే తీసుకోండి... ఆయన అందరి పాపాల్ని మోసి, శిలువ మీద చనిపోయాడంటే, దాన్ని ఆయనకు వేసిన శిక్ష అనుకుంటామా? దానికీ ఒక పర్పస్ ఉంది. అందరి పాపాల్ని మోయడానికి అలా జరిగిందే కానీ, అది శిక్ష అనుకుంటే ఎలా? ప్రతి కష్టం దేవుడు వేసిన శిక్ష అని భావించకూడదు.

ఇందిర: ఈ పరిణామాల్ని మీ ఫ్యామిలీ ఎలా తీసుకుంది?
షర్మిల: అన్న త్వరగా బయటికి రావాలని అనిల్ రెగ్యులర్‌గా ప్రేయర్స్ చేస్తుంటాడు. తనకి అన్న అంటే చాలా గౌరవం, ఇష్టం! అన్నకి కూడా అనిల్ అంటే చాలా అభిమానం. (నవ్వుతూ) ఎవరూ అనుకోరు కానీ, ఇద్దరూ రాజకీయాల గురించి బాగానే చర్చించుకుంటుంటారు. ఇక పిల్లల విషయానికొస్తే... రాజాబాబు, జిల్లీ వాళ్ల మామకు ఎందుకిలా జరిగిందని బోలెడు ప్రశ్నలు వేస్తూ ఉంటారు... అప్పుడప్పుడు కోపాన్ని కూడా వ్యక్తపరుస్తుంటారు. నేను పిల్లలకు చెప్పాను - ఈ లోకంలో అంతా పర్ఫెక్ట్ కాదు. అన్యాయం అన్నిచోట్లా జరుగుతుంది. కానీ, దేవుడి నిర్ణయమే తుది నిర్ణయం. ఆయన మంచివాళ్లకు ఎప్పుడూ మంచే చేస్తాడు.

ఇందిర: ఫైనల్లీ... మీ అన్నలో ఉన్న స్పెషాలిటీ...
షర్మిల: (నవ్వేసి) బెస్ట్ బ్రదర్ వన్ కెన్ హ్యావ్! అది పక్కనపెడితే, తనకున్న పాషన్, కమిట్‌మెంట్, కరేజ్. అన్నిటికీ మించి... కేవలం మాటమీద నిలబడినందుకు ఇన్ని కష్టాలు వచ్చినా ఏమాత్రం సడలని తన వ్యక్తిత్వం!

sakshi

భయపడడు... తొందరపడడు..

ఇందిర: జగన్ గారి గురించి... మీ అనుబంధం గురించి...
భారతి: నాకు 22, తనకు 23 ఉన్నప్పుడు మా పెళ్లయింది. ఇద్దరం ఎప్పుడూ కలిసే ఉండేవాళ్లం. నా పక్కన తను లేకపోవడాన్ని ప్రతి పనిలో మిస్సవుతున్నాను. ఒక పుస్తకం చదివినా, ఒక కథ చదివినా, ఒక దేవుని మాట విన్నా, చదివినా ఆయనకు చెప్పాల్సిందే... ఏదైనా తనతో షేర్ చేసుకోకుండా ఉండలేను. తనతో మాట్లాడుతూ ఉండాల్సిందే... అదేదో అలవాటైపోయింది... పెళ్లయిన కొత్తల్లో అయితే నువ్వు చదివినవన్నీ చెప్పాలా? అనేవారు. (నవ్వుతూ) వినాల్సిందే అనేదాన్ని! అయితే, నేను కూడా కొన్ని రోజుల తర్వాత తనకు ఏవి నచ్చుతాయో అవే చదవడం మొదలెట్టాను. జనరల్‌గా సొల్లు కొట్టడం జగన్‌కు ఇష్టం ఉండదు.మాట్లాడే మాటల్లో విలువ ఉండాలనేది ఆయన ఉద్దేశం. ఎవరైనా సొల్లు చెప్తే - ‘పనికొచ్చేవి మాట్లాడితే బాగుంటుంది... పనికిరాని మాటలు ఎంతసేపు మాట్లాడినా ఏం వుంటుంది’ అంటాడు. నేను కూడా అలానే ట్యూన్ అయ్యాను!

ఇందిర: ఆయనకు ఇప్పుడు మునుపటికన్నా ఎక్కువ తీరిక ఉంది కదా... ఎలా గడుపుతున్నారు?
భారతి: బాగా చదువుతున్నారు. రాష్ట్రాభివృద్ధికి సంబంధించి, ఏమేం చేయగలం, భౌగోళిక పరిస్థితులు, రాష్ట్రం అభివృద్ధి చేయడానికి కావలసిన వనరుల గురించి, నదుల గురించి స్టడీ చేస్తున్నాడు. రాష్ర్టంలో, దేశంలో జరుగుతున్న ఇష్యూస్ ఎఫ్‌డీఐ, రిజర్వేషన్స్ మీద క్షుణ్ణమైన అవగాహనకోసం లోతైన అధ్యయనం చేస్తున్నాడు. వాటికి సంబంధించిన బుక్స్, పేపర్స్ తెప్పించుకుంటాడు. వీటిని ఎలా పరిష్కరించాలో కూడా సమస్య లోతుల్లోకి వెళ్లి ఆలోచిస్తున్నాడు. ఇవికాక, నేనేదైనా పుస్తకాలు చదివితే వాటిలోని మంచి అంశాలను వినడం, అప్పుడప్పుడు చదవడం ఇష్టపడతాడు. మరీముఖ్యంగా లీడర్‌షిప్ పుస్తకాలంటే ఇష్టం... మహాత్మాగాంధీ, లింకన్, చర్చిల్ లాంటి పెద్దపెద్ద నాయకులు ఒక సిట్యూయేషన్‌ని ఎలా హ్యాండిల్ చేశారో తెలుసుకోవడం ఇష్టం. అందుకని అటువంటివాళ్ల పుస్తకాలు చదివినప్పుడల్లా చెబుతూ ఉంటాను.

ఇందిర: ములాఖత్ గురించి...
భారతి: నేను వారానికి రెండుసార్లు వెళ్లి జగన్ను కలుస్తాను. ఒక గంట సమయం దొరుకుతుంది... దానిలో చేసే పనుల గురించి మాట్లాడడమే సరిపోతుంది. పిల్లల గురించి కూడా ఒక రెండు వాక్యాలు తప్పించి, ... పర్సనల్‌గా మాట్లాడుకోవడానికి టైం ఉండదు. అందుకే, నాకు చెప్పాలని అనిపించినవన్నీ ఒక లెటర్లో రాసి ఇస్తూ ఉంటా.

ఇందిర: పిల్లలకు రిప్లై ఇచ్చినట్టు మీకూ ఇస్తారా?
భారతి: నెలకు ఒకసారి వస్తుంది. (నవ్వుతూ) జగన్‌ను దృష్టిలో పెట్టుకుని చూస్తే.. అది కూడా ఎక్కువే!

ఇందిర: జగన్‌గారిలో మీకు నచ్చే అంశాలు...
భారతి: పర్సనల్లీ... అన్నీ నచ్చుతాయి. జనరల్లీ మనుషుల్లో ఎవరికైనా ఒకరు నడిచేతీరు నచ్చదు, ఒకరు మాట్లాడే తీరు నచ్చదు, ఒకరు తినే తీరు నచ్చకపోవచ్చు.... కానీ జగన్‌లో నాకు నచ్చని అంశం అంటూ ఒక్కటి కూడా లేదు. ఇక ఒక వ్యక్తిగా, లీడర్‌గా... తను దేనికీ భయపడడు, తొందరపడడు, దేని గురించి నెగిటివ్‌గా ఆలోచించడం ఇష్టపడడు, చిరాకు పడడు... టెన్షన్ పడడు. బెయిల్ వస్తుంది... రాదు... అంటూ ఇంత ఊగిసలాట జరుగుతోంది కదా... అయినా చాలా కామ్‌గా ఉంటాడు... అదే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. అంతేకాదు, తను చాలా పాజటివ్ యాటిట్యూడ్ ఉన్న వ్యక్తి.

బయట ఇంతగా భయాలు ఉంటాయి కదా... అవన్నీ తనకు చెప్పడానికి ప్రయత్నిస్తే, రివర్స్‌లో తను మాకు చెబుతాడు - దేవుడ్ని నమ్మాలి. భయం మనల్ని దేవుని మీద విశ్వాసం నుంచి దూరం చేస్తుంది- అని! తనను చూసినప్పుడల్లా తనకవేమీ పట్టనట్టు అనిపిస్తాయి. ఎలాంటి సమస్య వచ్చినా హ్యాండిల్ చేయగలననే ధైర్యం జగన్‌ను చూసినప్పుడల్లా కలుగుతుంది. అందుకే, తన దగ్గరికి వెళ్లి వచ్చినప్పుడల్లా నాకు ఎనర్జీ వస్తుంది.

ఇందిర: ఓదార్పు తనలో తెచ్చిన మార్పు...
భారతి: ఓదార్పుకు వెళ్లే దాకా ప్రజల జీవన పోరాటం అంత దగ్గరగా చూడలేదు కదా.. వాళ్లను చూశాక తనలో ఎంతో మార్పు వచ్చింది. వాళ్లకు మామపై ఉన్న అభిమానం, దాన్ని జగన్ మీద చూపించిన తీరు జగన్‌ను ఎంత ప్రభావితం చేసిందో చెప్పలేను. వాళ్లు తనను ఒక కుటుంబ సభ్యునిగా ప్రేమ చూపించారు. తనూ వాళ్ల ఇళ్లలోకి వెళ్లాడు, వాళ్లతో ఒకరిగా ఉన్నాడు. వాళ్లు కూడా తనవాళ్లనే ఫీలవుతాడు అనుకుంటా!

ఓసారి తను నాలుగు రోజల బ్రేక్ తర్వాత ఓదార్పుకు తిరిగి వెళ్లబోతుంటే అడిగాను - ‘ఏం జగన్, నీకు హోం సిక్‌గా అనిపించదా... ఇంత ఆనందంగా వెళ్లిపోతున్నావు?’ అంటే... ‘ఇష్టమైన పని చేస్తున్నప్పుడు బాధ ఎక్కడినుంచి వస్తుంది... నాకు ప్రజలతో ఉండడం ఇష్టం. ఇష్టంగా చేస్తున్నప్పుడు బాధ ఎందుకుంటుంది. అయినా దేవుడు మనకు ఇంతమంది ప్రేమను ఆశీస్సులుగా ఇచ్చినప్పుడు దాన్ని ఆనందంతో స్వీకరించాలి కదా!’ అన్నాడు. అందుకే ఎక్కడికెళ్లినా, వాళ్లింట్లో మనిషిలా మెలుగుతాడు. మా చుట్టాలు చాలామంది అడిగేవారు... ‘జగన్ ఎక్కడ, ఎవరు, ఏది పెట్టినా తింటాడు. ఎలా చేయగలుగుతాడు’ అని అడుగుతారు. అదే విషయం ఓసారి నేను జగన్‌ను అడిగినప్పుడు - ‘వాళ్లు ఎంతో ప్రేమతో పెడుతుంటే ఎలా కాదంటాను.. ఆ ప్రేమను స్వీకరించకపోతే వాళ్లు బాధపడరా?’ అని అన్నాడు.

ఇందిర: మరి ఈ ఆరు నెలల్లో వచ్చిన మార్పు...
భారతి: ధైర్యం... అది ఏమాత్రం సడల్లేదు... అది లేకపోతే ఇంతదూరం వచ్చేవాళ్లం కాదు... ఇలా ఫైట్ చేసేవాళ్లం కాదు. కమిట్‌మెంట్... అది మొదటినుంచీ వుంది... ఇప్పుడు ఇంకా పెరిగింది. నాకు తెలిసి... ఇప్పుడు ప్రజలకు మంచి చేయాలనే పట్టుదల తనలో ఇంకా పెరిగింది.

ఇందిర: ఇదంతా మీలో ఏమైనా మార్పు తెచ్చిందా?
భారతి: ఒక్కోసారి అనిపిస్తుంది... జగన్‌కన్నా ఇది నాకే పెద్ద పరీక్షలా ఉందని... తనకన్నా నాలో ఎక్కువ మార్పు వచ్చిందని! మొదట్లో నేను చాలా భయపడేదాన్ని. పొసెసివ్‌నెస్ (నాది అనుకునే భావన) కూడా చాలా ఎక్కువ ఉండేది. మామ చనిపోయాక... ఓదార్పు మొదలెట్టాక... జగన్ ఫ్యామిలీతో ఎక్కువ టైం గడపట్లేదని చాలా అనుకునేదాన్ని. అయితే ఇప్పుడు ఆ స్వార్థం చాలా తగ్గింది - తను ఆ దిశలో నడవాలనుకున్నాడు... నేను సపోర్ట్ చేయక తప్పదు - దేవుడెప్పుడో దీన్ని కాంపెన్సేట్ చేస్తాడనుకుంటున్నాను. అంతేకాదు, ఇప్పుడు తను బయటకొచ్చి, నాకోసం కాదు... తనకు నచ్చినవి చేసుకుంటూ, హ్యాపీగా ఉంటే చాలు అనుకుంటున్నాను. అదే దేవుడ్ని పదేపదే ప్రార్థిస్తున్నాను. అంతేకాదు, దేవుని మీద నాకు పూర్తి నమ్మకం ఉంది... ఆయనే మమ్మల్ని నడిపిస్తాడని, దీనినుంచి దాటిస్తాడని!


sakshi

జగన్‌బాబు నాయకుడిగా ప్రూవ్ చేసుకున్నాడు

ఇందిర: ఇన్ని కష్టాల్లో కూడా జగన్‌గారు ఎప్పుడూ కూల్‌గా నవ్వుతూ ఉంటారు... అది మొదటినుంచి ఉన్నదా, అలవర్చుకున్నదా?

విజయమ్మ: ఇంత పేషన్స్ జగన్‌కు ముందునుంచి ఉందా అని చూసే అవకాశం అంతకుముందు ఎప్పుడూ కలగలేదు. ఏ కష్టం తెలీకుండా పెంచాం. అయితే కొన్ని క్వాలిటీస్ జన్మతః వచ్చినవి అయితే, వాళ్ల నాన్నను చూసి నేర్చుకున్నవి కొన్ని. రాజకీయాల్లో ఉన్నప్పుడు కొంచెం పేషన్స్ ఉండాలి, స్థితప్రజ్ఞత ఉండాలి అని మొదట్లోనే చెప్పేవారు వాళ్ల నాన్న.

ఇందిర: రాజశేఖరరెడ్డి గారి అన్నేళ్ల రాజకీయ జీవితాన్ని,జగన్ గారి మూడేళ్ల రాజకీయ జీవితాన్ని...ఎలా చూస్తారు?

విజయమ్మ: ఒక అడుగు ముందుకు వేస్తే, 10 అడుగులు వెనక్కి లాగే కాంగ్రెస్ పార్టీలాంటి పార్టీలో 26 ఏళ్లపాటు పోరాటం చేస్తూ, ప్రజల మన్ననలు పొంది, ఆ స్థాయికి రావడం చూశాను. తనకు పదవి వచ్చేసరికి పూర్తిగా స్థితప్రజ్ఞత వచ్చింది. ఆయన పడిన కష్టం స్లోగా ఉంటే, ఈయన తక్కువ టైంలో ఎక్కువ కష్టపడాల్సి వచ్చింది. వాళ్ల నాన్న 30 సంవత్సరాలపాటు పోరాటం చేస్తే ఈయన 3 సంవత్సరాల్లోనే అంత పోరాటం చేశాడు. అందులోనూ ఆయన పెరిగిన తీరు వేరు, జగన్ పెరిగిన తీరు వేరు.

ఏ కష్టం తెలీకుండా అపురూపంగా పెంచుకున్న జగన్, తను పడుతున్న కష్టాల్ని చాలా బాగా అధిగమించుకుంటూ వస్తున్నాడని అనిపిస్తుంది. జగన్‌ను చూడడానికి వెళ్లినప్పుడు మాతో అంటాడు -‘మనం మన చేతుల్లో లేము... 8 కోట్లమంది ప్రజలు మనవైపే చూస్తున్నారు. వాళ్ల ఆశలకు అనుగుణంగా మనమూ, మన నిర్ణయాలు ఉండాలి... వాళ్ల సమస్యలకోసం దీక్షలు, కార్యక్రమాలు చేయండి కానీ, నాకోసం వద్దు’ అన్నప్పుడు, నాకు వాళ్ల నాయన గుర్తొచ్చారు. ఈ మూడేళ్లు జరిగిన పరిస్థితులు తనని ఆవిధంగా మార్చాయనుకుంటా. తక్కువ టైంలో ఎక్కువ కష్టం రావడంతో పెద్దరికం, స్థితప్రజ్ఞత ఈయనకన్నా ముందే జగన్‌కు వచ్చిందని అనిపించింది.

ఇందిర: ఇదంతా రాజశేఖరరెడ్డి గారు పైనుంచి చూస్తున్నారు అనుకుంటే... కొడుకును చూసి ఏమనుకుంటూ ఉండుంటారు?
విజయమ్మ: ఆయనలాగే జగన్ కూడా కష్టాన్ని కష్టంగా తీసుకోకుండా, దాన్ని ఒక ఛాలెంజ్‌గా తీసుకుని నడుస్తున్నాడు కాబట్టి ఆయన గర్వంగా ఫీలవుతారని నాకనిపిస్తుంది. ...
ఇందిర: మీరు మూడు యాత్రలకు సాక్షి... (వైయస్సార్ పాదయాత్ర, జగన్ ఓదార్పు, షర్మిల మరో ప్రజాప్రస్థానం)!

ముగ్గురిలోనూ గమనించిన మార్పులు...
విజయమ్మ: పాదయాత్రలో ప్రజల కష్టాలు చూశాక రాజశేఖరరెడ్డిగారి హృదయం మెత్తబడింది! కోపమనేది చాలావరకు తగ్గిపోయింది! ఆయన మరింత ఓర్పుగా, సమతుల్యంగా తయారయ్యారనిపించింది! ఆ విషయాన్ని ఆయనే బహిరంగంగా చాలాసార్లు చెప్పుకున్నారు. అంతేకాక, ప్రజల కష్టాల పట్ల పూర్తి అవగాహనను, మునుముందు ఏమేం సాధించాలనే దానిపట్ల పూర్తి స్పష్టతను, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడానికి నిర్దిష్ట దిశను కల్పించి, భవిష్యత్ ప్రణాళికకు బాట వేసింది పాదయాత్ర!
ఉన్నత స్థానానికి కావలసిన లక్షణాలు జగన్‌లో మొదటినుంచీ ఉన్నా, ఆ స్థానంలో నిలబడటానికి కావలసిన వ్యక్తిత్వ వికాసాన్ని కల్పించడానికి మాత్రం ఓదార్పుయాత్ర తనకెంతో తోడ్పడింది. ఈ యాత్ర నుంచి తను ఎన్నో పాఠాలు నేర్చుకున్నాడు. వెల్లువెత్తిన ప్రజాభిమానం జగన్‌లో ఎంతో పరివర్తన తీసుకొచ్చింది. తనను ఇంకా హంబుల్‌గా చేసింది. బీదవారి జీవన శైలి చూశాక తన ఆలోచనా సరళిలో మార్పు వచ్చింది. వాళ్లకోసం అంకితభావంతో పనిచేయాలనే ఆలోచన ఇంకా దృఢపడింది.

ఇక షర్మిల గురించి చెప్పాలంటే... ఇంతకుముందు వాళ్ల నాయన చెప్పేది వినడమో, అన్న చెప్పేది వినడమో, పేపర్లలో చదవడమో ఉండేది. ఇప్పుడు రియల్‌గా తిరిగి చూస్తుంది కాబట్టి, ఇంత కష్టపడుతున్నారా అని తెలుసుకుంటోంది. తనూ కష్టపడుతోంది. అయితే, తను మొదటినుంచి ముసలివాళ్లను చూసినా, చిన్నపిల్లలను చూసినా ఎక్కువ స్పందించేది. వాళ్ల బాధలు, కష్టాలు తెలుసుకునేది. అందువల్ల ఇప్పుడు ప్రజల్లో ఈజీగా మూవ్ అవ్వగలుగుతోంది.

ఇందిర: కొంతమంది అంటున్నారు - అవసరం కోసం జగన్‌గారు తల్లిని, ఇప్పుడు చెల్లెల్ని రాజకీయాల్లోకి దించారని...
విజయమ్మ: అలా ఎలా అనుకుంటారు? పెద్దాయన 30 ఏళ్లు కష్టపడి, ఐదేళ్లు ప్రజల హృదయాలను హత్తుకునేంతగా పరిపాలన చేశారు. తర్వాత జగన్‌బాబు రెండున్నర సంవత్సరాలు కష్టపడి దాన్ని నిలబెట్టుకున్నాడు.

ఒక నాయకుడిగా ప్రూవ్ చేసుకున్నాడు. దాన్ని తను బయటికొచ్చేంతవరకు నిలబెట్టాలి అనే ఉద్దేశంతోనే మేం ప్రజల మధ్య తిరుగుతున్నాం తప్ప తనేదో మమ్మల్ని బలవంతంగా దీనిలోకి దించినట్టు మాట్లాడడం సబబు కాదు. ప్రజలు ఇప్పుడు జగన్‌బాబును నమ్ముతున్నారు. కాబట్టి తను జైలుకు పోయినప్పుడు, బయట కొంతమంది ఇక తను రాడు అని రకరకాలుగా మాట్లాడుతున్నప్పుడు, ప్రజలకు ధైర్యం చెప్పాల్సిన బాధ్యత మాకు ఉంది.

రాజశేఖరరెడ్డిగారు ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ‘ధైర్యంగా ఉండండి. మంచికాలం వస్తుంది’ అని చెప్తూ ఏ విధంగా పాదయాత్ర చేశారో, ఈరోజు పరిస్థితి అంతకంటే దారుణంగా ఉండడంతో, వాళ్లకు ధైర్యం చెప్పాల్సిన అవసరం ఏర్పడింది. నాకు ఆరోగ్యం సరిగా ఉండి, నడవగలిగితే నేనే పాదయాత్ర చేసేదాన్ని. అలా చేయలేకనే ఇంట్లో ఉండే పాపను బయటికి తీసుకురావాల్సి వచ్చింది తప్ప, జగన్ మమ్మల్నేదో బలవంతంగా దీనిలోకి దించినట్టు చెప్పడం సరికాదు. నిజానికి, మేమిలా కష్టపడుతున్నామని జగన్ తరచూ బాధపడుతూ ఉంటాడు.

ఇందిర: ఆయన ఒకటి రెండుసార్లు కోర్టుకు వచ్చారు కదా. బయటికి వచ్చి కాస్తంత స్వేచ్ఛావాయువులు పీల్చి మళ్లీ లోపలికి వెళ్లేటప్పుడు ఆయన ఫీలింగ్స్ ఎలా ఉంటాయో ఎప్పుడైనా చెప్పారా?

విజయమ్మ: ఆ ఒక్కసందర్భమనే కాదు...జగన్‌కు ఎప్పుడూ మమ్మల్ని ధైర్యపరచడంతోనే సరిపోతుంది. తన ఫీలింగ్స్ ఏంటో చెప్పుకోవడానికి పాపం, అవకాశం ఉండదు. తన సంగతి చెప్పలేను కానీ... రాష్ట్రపతి ఎన్నికలప్పుడు ఓటు వేయడానికని తను పోలీస్ సెక్యూరిటీతో అసెంబ్లీకి వచ్చినప్పుడు... ప్రెస్‌వాళ్లు ఏదో అడిగారని జగన్ వాళ్ల వైపు తిరిగి, ఓ అడుగు వేద్దామనుకున్న టైంలో... పక్కనున్న పోలీసు కుదరదని చెప్పి, తీసుకెళ్లిపోతున్నప్పుడు నాకెంత బాధనిపించిందో చెప్పలేను.

కూర్చున్నప్పుడు కూడా తను ఏదో ఖైదీ అన్నట్లు, క్రిమినల్ అన్నట్లు ఇద్దరు పోలీసుల మధ్య తనను కూర్చోబెడితే నాకు కన్నీళ్లాగలేదు. అక్కడే కాదు, ములాఖత్‌లో కూడా పోలీసులు ఎప్పుడూ అటూ ఇటూ తిరుగుతూనే ఉంటారు. స్వేచ్ఛగా మాట్లాడేదే ఉండదు. ఇంతవరకూ ఎప్పుడూ లేదట... ఇప్పుడు సిసి కెమెరాలు కూడా పెట్టారు. అంతేకాదు, ఓసారి అసెంబ్లీలో వాళ్ల నాన్న మాట్లాడిన స్పీచ్‌ల రికార్డులను విని, తనూ కొంత నేర్చుకుంటాడని పంపిద్దామని అనుకున్నప్పుడు జగన్ - జైల్ రూల్స్ ప్రకారం అలా చేయకూడదమ్మా - అని వద్దనేశాడు. అలాంటిది తను సెల్‌ఫోన్లు అవీ వాడతాడా!

వాస్తవ పరిస్థితులు ఇలా ఉంటే... ప్రత్యర్థులు ఏవేవో మాట్లాడతారు... ఏం చెప్పాలి?
అయినా, ప్రజలకు నిజానిజాలు తెలుసు. టైం వచ్చినప్పుడు వాళ్లే దానికి సమాధానం చెప్తారు.:

ఇందిర: మీ పట్ల, మీ పిల్లల పట్ల ఇంత ఎఫెక్షన్ చూపిస్తున్న ప్రజలను చూస్తే మీకేమనిపిస్తుంది?
విజయమ్మ: 200 రూపాయల పెన్షన్ పొందినవారికి ఉన్నంత గ్రాటిట్యూడ్ నాయకులకుగానీ, పదవులు పొందినవారికి గానీ లేదు. ప్రజలకు ఏమన్నా చేస్తే తప్పకుండా గుర్తుపెట్టుకుంటారు. అందుకే రాజశేఖరరెడ్డిగారిని ఇప్పటికీ ఇంతలా తలచుకుంటున్నారు. సరే, ఆయనంటే చేశారు... కానీ జగన్, షర్మిలలు ఇంకా ఏమీ చేయలేదు... అయినా వాళ్ల నాయన మీద ఉండే కృతజ్ఞత ప్రజలు ఈరోజు పిల్లల మీద చూపిస్తున్నారంటే... ఈ ప్రజలకు మేమేం చేస్తే రుణం తీరుతుంది... వాళ్లు అవకాశం ఇస్తే వాళ్ల జీవితాలను మెరుగుపరచడం తప్ప!

రాష్ట్రవ్యాప్తంగా జగన్ పుట్టినరోజు వేడుకలు

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, జననేత జగన్‌మోహన్‌ రెడ్డి పుట్టినరోజు వేడుకలను పార్టీ కార్యకర్తలు, అభిమానులు రాష్ట్రవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. అర్థరాత్రి కేక్‌ కట్‌ చేసి శుభాకాంక్షలు తెలిపారు. కొన్ని చోట్ల సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. 

జగన్ పుట్టినరోజును పురస్కరించుకొని గుంటూరులో పలు కార్యక్రమాలు జరిగాయి. స్థానిక షిర్డీసాయి దీన్‌దయాళ్‌ అంథుల పాఠశాలలో కేక్‌ కట్‌ చేశారు. విద్యార్థులకు పార్టీ నేతలు పండ్లు, దుప్పట్లు పంపిణీ చేశారు. అతిత్వరలోనే జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రజల మధ్యకు వస్తారన్న వారు విశ్వాసాన్ని వ్యక్తం చేశారు

'వైఎస్ఆర్ పేరు లేకపోవడం బాధాకరం'

Written By news on Thursday, December 20, 2012 | 12/20/2012

తెలుగు కళాకారుల సంక్షేమం కోసం మహానేత వైఎస్ఆర్ చేసిన కృషి మరువలేనిదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బాలినేని శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. తెలుగుభాషకు ప్రాచీన హోదా కల్పించడంలో విశేష కృషి చేసిన వైఎస్ఆర్ పేరు ప్రపంచ తెలుగు మహాసభల్లో కనిపించకపోవడం బాధాకరమని అన్నారు. ప్రభుత్వం పక్షపాత ధోరణితో వైఎస్‌ఆర్ పేరుతో ఉన్న కళాసంస్థలను అణగదొక్కుతోందన్నారు. సొసైటీ ఎన్నికల ఓట్ల నమోదు విషయంలో అధికారులు కాంగ్రెస్‌కు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అధికార దుర్వినియోగానికి పాల్పడితే ప్రజలు తిరగబడతారని బాలినేని హెచ్చరించారు.

Happy Birthday JAGAN anna


జగన్ బెయిల్ పై తీర్పు వాయిదా

హైదరాబాద్ : వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్టాట్యూరటీ బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును న్యాయస్థానం సోమవారానికి వాయిదా వేసింది. కాగా 167(2) స్టాట్యూటరీ గురించి సుప్రీంకోర్టులో వాదించినట్లు చెప్తున్న సీబీఐ వాదనలను జగన్ తరపు న్యాయవాది పద్మనాభరెడ్డి విభేదించారు

జగన్ బెయిల్ పై వాదనలు ప్రారంభం

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్టాట్యూటరీ బెయిల్ పిటిషన్ పై రెండోరోజు హైకోర్టులో వాదనలు ప్రారంభం అయ్యాయి. జగన్ తరపు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపిస్తున్నారు. పెట్టుబడుల కేసులో సీఆర్పీసీ సెక్షన్ 167(2) కింద బెయిలు కోరుతూ జగన్ హైకోర్టులో బెయిల్ పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

Sakshi Vedika with Dr. Shivabharat Reddy

జగన్‌పై కక్ష అందుకే..


 సోనియాగాంధీ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వానికి అనుకూలంగా లేనందుకే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై కక్ష సాధింపు చర్యలు కొనసాగిస్తున్నారని ఆ పార్టీ సీనియర్ నేత బాజిరెడ్డి గోవర్ధన్ దుయ్యబట్టారు. చంచల్‌గూడ జైల్లో ఉన్న జగన్‌ను బుధవారం ఆయన ప్రత్యేక ములాఖత్‌లో కలిశారు. అనంతరం జైలు బయట విలేకరులతో మాట్లాడుతూ.. ప్రభుత్వం కుట్ర పన్ని జైల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి జగన్ ములాఖత్‌లను పర్యవేక్షించి ఆయన్ను ఎవరూ కలవకుండా ఇబ్బందులకు గురిచేస్తోందని మండిపడ్డారు. దేశంలో చాలా మంది నాయకులపై సీబీఐ విచారణలు, ఆరోపణలు ఉన్నప్పటికీ యూపీఏ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నందునే వారిని పట్టిం చుకోవడంలేదని విమర్శించారు.

కానీ ప్రజల మేలుకోరే జగన్ యూపీఏకు అనుకూలంగా లేనందుకే ఆయన్ను జైలుపాలు చేసి బెయిల్ రాకుండా చేస్తున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నేత యనమల రామకృష్ణలకు జగన్ భయం పట్టుకుందన్నారు. గత ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోయిన యనమల.. వైఎస్ కుటుంబంపై కక్ష గట్టి జైలు అధికారుల కాల్ జాబితా, జగన్‌కు సౌకర్యాలపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని పేర్కొన్నారు. వస్తున్నా.. మీకోసం యాత్ర చేపట్టిన చంద్రబాబు ప్రజా సమస్యలపై కాకుండా తన సమస్యలను ప్రజలకు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. నీతి, నిజాయతీ లేని వ్యక్తులైన సీఎం కిరణ్ ఇందిరమ్మ బాటతో, చంద్రబాబు ‘వస్తున్నా.. మీకోసం’తో రాజకీయ లబ్ధి పొందేందుకు చూస్తున్నారని బాజిరెడ్డి విమర్శించారు.

కేసీఆర్ ప్రజలను మోసం చేస్తున్నారు: కొండా మురళి
తెలంగాణ పేరుతో టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి దుయ్యబట్టారు. చంచల్‌గూడ జైల్లో ఉన్న జగన్‌ను బుధవారం ప్రత్యేక ములాఖత్ ద్వారా కలిసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణపై కేంద్రం నిర్వహించే అఖిలపక్షానికి ఎవర్ని పంపించాలనే అంశంపై మరో రెండు రోజుల్లో పార్టీ కార్యాలయంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఓ ప్రశ్నకు బదులిచ్చారు. కొండా సురేఖ, కేసీఆర్‌ల వివాదం గురించి విలేకరులు ప్రస్తావించగా.. ‘‘మూడు నెలల్లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తామని ఉప ఎన్నికల్లో హామీ ఇచ్చిన కేసీఆర్‌ను ఎలా తెలంగాణ తెస్తారని నిలదీసినందుకు తన స్థాయి మరిచి సురేఖపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కొండా దంపతుల కృషి వల్లే తెలంగాణ వస్తుంది తప్ప.. 13 ఏళ్లుగా ప్రజలను మోసగించి కోట్లాది రూపాయలు వెనకేసుకున్న కేసీఆర్ వల్ల రాదు’’ అని మురళి స్పష్టంచేశారు.

Popular Posts

Topics :