2013 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

ప్రతీ ఇంటా సంతోషాలు నిండాలి

Written By news on Tuesday, December 31, 2013 | 12/31/2013

ప్రతీ ఇంటా సంతోషాలు నిండాలి: వైఎస్ జగన్
హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరంలో రాష్ట్రంలోని ప్రతి ఇంటా సంతోషాలు నింపాలని ఆకాంక్షించారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. 2014లో రాష్ట్రంలోని 9 కోట్ల ప్రజల భద్రతకు, అభివద్ధికి, సంక్షేమానికి భరోసా లభించాలని ఆకాంక్షించారు.
 
క్యాలెండర్ల మార్పుతో పాటు 2014 ఈ రాష్ట్రంలోని, దేశంలోని ప్రజలందరి జీవితాల్లో మంచి మార్పునకు దారితీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు జగన్ తన శుభాకాంక్షల సందేశంలో పేర్కొన్నారు.

పేదల ఇళ్లల్లో.. మా ఫొటో ఉండేలా పరిపాలిస్తా

పేదల ఇళ్లల్లో.. మా ఫొటో ఉండేలా పరిపాలిస్తా: వైఎస్ జగన్వీడియోకి క్లిక్ చేయండి
చిత్తూరు: కొడుకు కోసం తెలుగువారి జీవితాలతో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ చెలగాటమాడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. హైదరాబాద్‌ నగరాన్ని వదిలివెళ్లాలట, మరి సోనియా గాంధీ ఎక్కడకు వెళ్లాలో చంద్రబాబునాయుడు, కిరణ్ కుమార్ రెడ్డిలు చెప్పాలని  వైఎస్ జగన్ ఘాటుగా ప్రశ్నించారు. సమైక్య శంఖారావంలో భాగంగా చిత్తూరు జిల్లాలోని మదనపల్లెకు వైఎస్ జగన్ మంగళవారం చేరుకున్నారు. అక్కడి బహిరంగ సభలో పాల్గొన్న ఆయన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిల వైఖరిపై మండిపడ్డారు.  వైఎస్ హయాంలో ప్రజలు సువర్ణయుగాన్ని చూశారని చెప్పారు. వైఎస్ పాలనలో ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ కూడా రాలేదని జగన్ గుర్తుచేశారు. అందరూ రండి ఎన్నికలకు పోదామని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. నేను సమైక్యవాదంతో ఎన్నికల్లోకి వస్తానని వైఎస్ జగన్ సవాల్ విసిరారు. చంద్రబాబు హయాంలో ఎనిమిది సార్లు విద్యుత్‌ బిల్లులు పెంచిన ఆయన ఇప్పుడు తగ్గిస్తానని హామీ ఇస్తున్నారని జగన్ విమర్శించారు.

మద్యపాన నిషేధాన్ని ఎన్టీఆర్ అమలుచేస్తే ఎత్తేసింది చంద్రబాబు అని ఆయన ధ్వజమెత్తారు. ఎన్టీఆర్ రూ.2కు కిలో బియ్యం ఇస్తే రూ. 5 పెంచింది చంద్రబాబు కాదా అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. అప్పులు పాలైన రైతన్న ఆత్మహత్య చేసుకుంటే తిన్నది ఆరగక చనిపోతున్నారన్నది చంద్రబాబు అని చెప్పారు. చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితి లేదని జగన్ తెలిపారు. చంద్రబాబు హయాంలో పెన్షన్లు 16లక్షలు మాత్రమేనని, కానీ పింఛన్లను 16నుంచి 78 లక్షలకు పెంచిన ఘనత వైఎస్సార్ దేనని జగన్ గుర్తుచేశారు. చంద్రబాబు రూ. 70పింఛన్ ఇస్తే వైఎస్సార్ రూ. 200కు పెంచారని చెప్పారు. వైఎస్సార్ సువర్ణయుగాన్ని మళ్లీ తీసుకొస్తానని, ప్రతి పేదవాడి గుండెచప్పుడు వింటానని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. నేను చనిపోయినా.. పేదల ఇళ్లల్లో నా ఫోటో, మానాన్న ఫోటో ఉండేలా పరిపాలిస్తానని వైఎస్ జగన్ ఘాటుగా జవాబులిచ్చారు.

Jagan speech in Madanapalle, Chittoor district

ఓపిక పట్టండి, మన ప్రభుత్వం వస్తుంది

ఓపిక పట్టండి, మన ప్రభుత్వం వస్తుంది: జగన్
చిత్తూరు : చిత్తూరు జిల్లాలో  వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి సమైక్య శంఖారావం కొనసాగుతోంది. డిసెంబర్‌ 27న మొదలైన రెండో విడత సమైక్య శంఖారావానికి  చిత్తూరు జిల్లా ప్రజలు బ్రహ్మారథం పడుతున్నారు.  మహిళలు, యువత , విద్యార్ధులు పెద్ద సంఖ్యలో వచ్చి సంఘీభావం తెలుపుతున్నారు.  వృద్దులు  నడవలేని స్థితిలో కూడా మహానేత వైఎస్ఆర్ తనయుడ్ని చూడటానికి తరలి వస్తున్నారు. 
తనకోసం వచ్చిన  ప్రతి ఒక్కరితో జగన్‌ ఆప్యాయంగా మాట్లాడుతున్నారు.  పెద్దాయన ఉన్నప్పుడు పించన్ వచ్చేదని..ఆయన పోయిన తరువాత రావడంలేదని ఓ వృద్దురాలు  చెప్పటంతో......  మన ప్రభుత్వం వచ్చిన తరువాత అప్లికేషన్ పెట్టు..నీకు న్యాయం జరిగేటట్లు చూస్తానని జగన్‌ ఆవృద్దురాలికి మాట ఇచ్చారు.

ఇక మహిళలు హారతులు పడుతూ జగన్‌కు గ్రామగ్రామాన స్వాగతం పలుకుతున్నారు. ఓ వికలాంగ వృద్దురాలు తనకు  పింఛన్ రావడంలేదని...అధికారులు పింఛన్ ఇవ్వడానికి నిరాకరించారని ఆమె తన గోడును వెలిబుచ్చింది. నడవలేని స్థితిలో ఉన్న ఆ వృద్దురాలుకు  జగన్‌ ధైర్యం చెప్పి పంపించారు.  నాలుగు నెలలు ఓపిక పట్టండి మన ప్రభుత్వం వస్తుంది అంటూ తనను కలవడానికి వచ్చిన వృద్దులకు జగన్ భరోసా చెప్పారు‌.  మరోవైపు మహిళలు చంటి పిల్లలను చంకన వేసుకుని  మహానేత తనయుడ్ని చూడటానికి వచ్చారు.

వైయస్ జగన్మోహన్ రెడ్డి సమైక్యశంఖారావం 30-12- 2013 photos





















జననేతకు బ్రహ్మరథం


సమైక్య శంఖారావం చేపట్టిన వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. పూలతో స్వాగతం పలుకుతూ, డప్పు వాయిద్యాల నడుమ నృత్యం చేస్తూ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఇప్పుడు తాము చల్లుతున్న పూలు జననేత అధికారంలోకి వచ్చాక తమకు పూల బాటలుగా మారుతాయని భావిస్తున్నారు.
 
సాక్షి, తిరుపతి: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన సమైక్య శంఖారావం, ఓదార్పు యాత్ర మూడో రోజైన సోమవారం కూడా విజయవంతంగా నడిచిం ది. దారి పొడవునా ప్రజలు ఎల్లలులేని అభిమానంతో ఆయనకు స్వాగతం పలికారు. పూలు చల్లుతూ, డప్పు వాయిద్యాలతో, కోలాటం చేస్తూ జననేతకు ఆహ్వానం పలికారు. వేలమంది పాఠశాల విద్యార్థులు జగన్‌మోహన్‌రెడ్డికి నీరాజనాలు పలికారు.
 
ఆదివారం రాత్రి  చౌడేపల్లెలో బసచేసిన ఆయన సోమవారం ఉదయం బయలుదేరారు. బసచేసిన ఇంటి నుంచి అరకిలోమీటరు దూరంలోని బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన వైఎస్ విగ్రహావిష్కరణ ప్రాంతానికి చేరుకోవడానికి రెండు గంటల సమయం పట్టింది. వందలాది మంది అభిమానులు జగన్‌మోహన్‌రెడ్డి కాన్వాయ్‌ను చుట్టుముట్టడంతో, ఎవరినీ నిరాశ పరచకుండా అందరినీ పలకరిస్తూ వచ్చారు. వైఎస్ విగ్రహావిష్కరణ చేసి కొద్దిసేపు ప్రసంగించాక, కొండామర్రి ప్రాంతానికి బయలు దేరారు. మార్గమధ్యంలో హైదరాబాద్ సెక్రటేరియట్ ఉద్యోగుల సంఘం నాయకులు అయనను కలుసుకున్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉండేలా సహకరించాలనే వారి కోరికను అంగీకరించారు.

అక్కడి నుంచి బయలుదేరగా మదనపల్లె మైనారిటీ నాయకులు అక్తర్ అహ్మద్ నాయకత్వంలో జననేతను కలుసుకున్నారు. దాదాపు 70 మసీదులకు చెందిన మత పెద్దలు, 30 మంది దర్గా కమిటీ సభ్యులు పలు వాహనాలతో బారులుతీరి నిలబడ్డారు. వారిని జగన్‌మోహన్‌రెడ్డి ఉర్దూలో పలకరించారు. రానున్న ఎన్నికల్లో ముస్లింలకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని వారు కోరారు. దీనికి స్పందించిన ఆయన పీలేరులో 37,500 మంది ముస్లిం సోదరులు ఉన్నారని, మదనపల్లెలో 24 వేల మంది ఉన్నారన్నారు. తన నిర్ణయం ముస్లింసోదరులకు ఆమోదయోగ్యంగానే ఉంటుందని తెలిపారు.

అక్కడి నుంచి బయలుదేరిన ఆయనకు గుంటూరు మార్కెట్ యార్డుకు చెందిన 50 మంది నూతలపాటి హనుమయ్య నాయకత్వంలో కలుసుకున్నారు. అక్కడే సమీపంలో ఉన్న గుంటూరు జిల్లా పెద్దకూరపాడు నియోజకవర్గానికి చెందిన దాదాపు 300 మందిని జననేత కలుసుకున్నారు. అనంతరం కొండామర్రికి చేరుకోగా ఆప్రాంతంలో నివసిస్తున్న సుగాలీలు జగన్‌మోహన్‌రెడ్డికి అఖండ స్వాగతం పలికారు. డప్పులు మోగిస్తూ, మహిళలు కూడా నాట్యం చేస్తూ ఆహ్వానించారు. అక్కడి నుంచి బయలుదేరిన ఆయన, బారులుతీరి నిలుచున్న విజయవాణి పాఠశాల విద్యార్థులను చూసి ఆగి వారిని పలకరించారు.

పిల్లల పేర్లు అడిగి తెలుసుకుని బాగా చదువుకోవాలంటూ దీవించారు. ఠాణా ఇండ్లు, బిల్లేరు క్రాస్ మీదుగా చింతమాకులపల్లె వద్ద వేచి ఉన్న అశేష జనవాహినిని కలుసుకున్నారు. అక్కడి నుంచి పుదిపట్ల గ్రామం చేరుకోగా, జిల్లా పరిషత్ పాఠశాలలకు చెందిన బాల బాలికలు ఆహ్వానం పలికారు. పూలను ఆయనపై చల్లి అభిమానాన్ని చాటుకున్నారు. బోయకొండ క్రాస్ వద్దకు చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

అనంతరం వైఎస్ మృతిని తట్టుకోలేక మరణించిన కణగాని ఆంజప్ప కుటుంబాన్ని ఓదార్చారు.  చదళ్ల, భగత్‌సింగ్ కాలనీల్లో రోడ్‌షో నిర్వహించి, పుంగనూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ప్రవీణ్‌కుమార్ రెడ్డి, అమరనాథరెడ్డి, సమన్వయకర్తలు ఆర్‌కే.రోజా, ఆదిమూలం, జిల్లా కన్వీనర్ నారాయణస్వామి, మహిళా కన్వీనర్ గాయత్రీదేవి, యువజన కన్వీనర్ ఉదయకుమార్, నేతలు పోకల అశోక్‌కుమార్, వై.సురేష్, వీరేంద్ర పాల్గొన్నారు.

ఇన్ని వేల కోట్లను ఎలా సంపాదించావయ్యా చంద్రబాబూ?



 ‘‘చంద్రబాబు.. అవినీతి గురించి మాట్లాడతారు. అయ్యా 1978లో మీరు రాజకీయాల్లోకి వచ్చారు. అప్పుడు మీ కుటుంబం ఆస్తి మొత్తం రెండున్నర ఎకరాలకు మించి లేదన్న సంగతి మర్చిపోయారా? ఇవాళ చంద్రబాబు ఆస్తి ఎలా ఉందీ అంటే.. మన రాష్ట్రంలోనే కాదు, పక్కన కర్ణాటక, తమిళనాడు చెన్నైలో ఎక్కడ చూసినా.. హెరిటేజ్ షాపులు వేలసంఖ్యలో కనిపిస్తాయి. మరి ఇన్ని వేల కోట్లను ఎలా సంపాదించావయ్యా చంద్రబాబూ? చంద్రబాబు అవినీతి గురించి మాట్లాడ్డమంటే.. ‘టైజం నాకు పట్టదు’ అని బిన్‌లాడెన్ మాట్లాడినట్టు ఉంటుంది. ‘నా అల్లుడు అంత అవినీతి పరుడు దేశంలోనే మరొకడు లేడు’ అని ఆయన సొంత మామ ఎన్టీఆర్ స్వయంగా లేఖలో రాశారు. ఇదే చంద్రబాబు గురించి కమ్యూనిస్టులు.. ‘చంద్రబాబు జమానా.. అవినీతి ఖజానా’ అనే పుస్తకమే ముద్రించారు.’’    
 - వైఎస్ జగన్
 
 ‘‘చంద్రబాబు అబద్ధాలు చెప్తారు.. మోసం చేస్తారు.. సీబీఐ కేసులంటారు.. జగన్‌ను ఎందుకు జైల్లో నుంచి తీసుకొచ్చారు అంటారు. జగన్‌మోహన్‌రెడ్డి ఒక్కరే కాదయ్యా.. ఈ దేశంలో ఎవరైనా ఒక వ్యక్తిని జైల్లో పెడితే.. ఎంక్వైరీ పూర్తి కాకుండా, ఆ వ్యక్తి అన్యాయం చేశాడని నేరం రుజువు కాకుండా.. ఆ వ్యక్తిని తీసుకెళ్లి జైల్లో సంవత్సరాలపాటు పెట్టడం ఎంతవరకు న్యాయం? అని చంద్రబాబును అడగదలచుకున్నా. అయ్యా నువ్వు, కాంగ్రెస్ పార్టీ ఇద్దరూ కుమ్మక్కై నన్ను 16 నెలలు జైల్లో పెట్టారు. ఏదో ఒక రోజు దేవుడు పై నుంచి కరుణిస్తాడు. దేవుడు నీ విషయంలో కూడా ఇదే చేస్తాడు. నన్ను 16 నెలలు పెట్టారు... నిన్ను కనీసం రెండు మూడు నెలలు పెడితే నీకెలా ఉంటుందో ఆ రోజు నిన్ను అడుగుతా చంద్రబాబూ!’’
 
 సమైక్య శంఖారావం నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి అవిశ్వాస తీర్మానంలో ప్రభుత్వాన్ని కాపాడడం వరకు నాలుగేళ్లుగా అడుగడుగునా కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో కుమ్మక్కై రాష్ట్ర విభజనకు కారణమవుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. ‘‘ఇవాళ రాష్ట్రాన్ని విడగొడుతున్నది సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ. ఆ సోనియా గాంధీతో కుమ్మక్కై ఇవాళ నువ్వు రాష్ట్రాన్ని విడగొట్టమని చెప్పడంలేదా?’’ అని ఆయన చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ప్రజలంతా ఉద్యమాలు చేస్తుంటే.. తిరుపతిలో గంటకుపైగా మీటింగ్ పెట్టి మాట్లాడిన చంద్రబాబు.. ఒక్కసారి కూడా సమైక్యం అన్న మాటే అనలేదని దుయ్యబట్టారు. ‘‘మొన్నటికి మొన్న కిరణ్‌కుమార్‌రెడ్డి ఏకంగా రూ.32 వేల కోట్ల మేర చార్జీలు పెంచి కరెంటు బిల్లులతో ప్రజలకు షాక్ కొట్టిస్తోంటే.. ప్రతిపక్షంలో ఉన్న వాళ్లంతా కూడా ఒక్కటై అవిశ్వాసం తీర్మానం పెడితే.. ఆ సమయంలో ప్రభుత్వాన్ని కాపాడడానికి చంద్రబాబు నాయుడు తన పార్టీ ఎమ్మెల్యేలకు విప్‌జారీ చేసిన మాట వాస్తవం కాదా? అని అడుగుతున్నా.

చంద్రబాబు నాయుడు ఆ వేళ అవిశ్వాసానికి మద్దతుగా ఓటు వేసి ఉంటే.. ఈ పాటికి కాంగ్రెస్ సర్కారే కూలిపోయి ఉండేది.. విభజన జరక్కుండాపోయేది’’ అని జగన్‌మోహన్‌రెడ్డి ఉద్వేగంగా ప్రసంగించారు. ఓట్ల కోసం, సీట్ల కోసం రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించటాన్ని నిరసిస్తూ జగన్‌మోహన్‌రెడ్డి కుప్పం నుంచి శ్రీకాకుళం దాకా తలపెట్టిన ‘సమైక్య శంఖారావం’ యాత్ర రెండో దశ రెండో రోజు సోమవారం చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో కొనసాగింది. పుంగనూరు నియోజకవర్గ కేంద్రంలో జరిగిన బహిరంగ సభకు భారీ ఎత్తున తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి జగన్ ప్రసంగించారు. ప్రసంగ సారాంశం ఆయన మాటల్లోనే..
 
 ‘‘మొన్నటికిమొన్న చంద్రబాబు తిరుపతిలో ఒక మీటింగ్ పెట్టి సుదీర్ఘంగా గంటకుపైగా మాట్లాడారు. చంద్రబాబు గర్జిస్తున్నారు.. ప్రజా గర్జన అని పేరు పెట్టి పిలుస్తున్నారు.. ఆ గర్జనలో చంద్రబాబు సమైక్య నినాదం తీసుకుంటారేమోనని నేను ఆశగా ఎదురుచూశాను. మన ఖర్మ ఏంటంటే.. చంద్రబాబు నాయుడు మారనే మారరు. గంటపాటు సాగిన మీటింగ్‌లో కనీసం ముప్పావు గంట జగన్‌మోహన్ రెడ్డిని తిట్టడం కోసమే కేటాయించారు. రాష్ట్రం మొత్తం సమైక్య ఉద్యమంతో ఉడుకుతూ ఉంది. సమైక్య నినాదం తీసుకోమని చంద్రబాబును ప్రతి రైతన్న కాలర్‌పట్టుకుని అడగబోతున్నాడు. ఉద్యోగం కోసం మేం ఎక్కడికి వెళ్లాలి అని ప్రతి విద్యార్థీ చంద్రబాబును కాలర్‌పట్టి నిలదీసే పరిస్థితి ఉంది. అయినాసరే చంద్రబాబు నాయుడి నోట స..మై..క్యం.. అన్న మాట రానేరాదు.
 
 ఎవరు చంద్రబాబూ కుమ్మక్కైంది?
 
 జగన్‌మోహన్‌రెడ్డి సోనియా గాంధీతో కుమ్మక్కయ్యారని చంద్రబాబు అంటున్నారు. ఎవరు ఎవరితోనయ్యా కుమ్మక్కైంది? ఆయన్ను నేను ఓ మాట అడగదలచుకున్నా.. జగన్‌మోహన్‌రెడ్డిని ఎవరయ్యా జైల్లో పెట్టించారు? జగన్‌మోహన్‌రెడ్డి మీద ఎవరయ్యా కేసులు పెట్టారు? ఆ దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి చనిపోయిన 18 నెలల తర్వాత, ఆ దివంగత నేత కొడుకైన జగన్ కాంగ్రెస్ పార్టీని విడిచి పెట్టి రెండు నెలలైన తర్వాత.. ఇదే కాంగ్రెస్ పార్టీ నేతలు, చంద్రబాబు కుమ్మక్కై కోర్టులకు పోవడం నిజం కాదా అని అడుగుతున్నా. ఇద్దరూ కలిసి ఆ దివంగత నేత మీద కేసులు వేశారు.. ఆ దివంగత నేత చెప్పుకోలేడని, ఆయనకు ఎవ్వరూ తోడుగా రారని, ఆయనను బజారుకు ఈడ్చాలని ఇద్దరూ కలసికట్టుగా ప్రయత్నం చేశారు. అంతేకాదు.. ఇద్దరూ చిత్తూరు ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిస్సిగ్గుగా కలసికట్టుగా పోటీచేశారు. చంద్రబాబు నాయుడిని ప్రసన్నం చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రులు.. హైదరాబాద్‌లో నడిబొడ్డున అమీర్‌పేటలో రూ.400 కోట్ల విలువ చేసే తొమ్మిది ఎకరాల భూమిని జీఎం నాయుడు అనే వ్యక్తికి ధారాదత్తం చేశారు. ఆర్‌టీఐ కమిషనర్ల పదవులనూ ఇద్దరూ కలిసికట్టుగా పంచుకునే ప్రయత్నం చేశారు. చివరకు చిన్న వర్తకులు, రైతులపై ప్రభావం చూపే ఎఫ్‌డీఐల మీద ఓటింగ్ సమయంలో.. దేశం మొత్తం చూస్తుండగా.. చంద్రబాబు కాంగ్రెస్‌తో కుమ్మక్కై తన రాజ్యసభ సభ్యులను గైర్హాజరు చేయించారు.. ఇది కుమ్మక్కు కాదా చంద్రబాబూ?
 
 ఆ హామీల సంగతేంటి బాబూ?
 
 చంద్రబాబు నాయుడిని ఒక మాట అడగదలచుకున్నా.. ఎన్నికలు వస్తున్నాయని చెప్పి హామీలిస్తున్నావ్ బాబూ.. మీ మామ ఎన్టీఆర్ రూ.2కే కిలో బియ్యం ఇస్తే.. దాన్ని రూ.5.25 చేసింది నువ్వు కాదా? నాడు పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తామని హామీ ఇస్తూ ఎన్నికలకు వెళ్లావ్... ఎన్నికలైపోయిన తర్వాత ‘ఈనాడు’ దినపత్రికలో.. మద్యపానం నిషేధిస్తే.. రాష్ట్రమంతా అధోగతి పాలవుతుందని పెద్ద పెద్ద అక్షరాలతో రాయించుకున్నది నువ్వు కాదా? మద్యపానాన్ని నిషేధించకపోగా.. ఊరుఊరునా బెల్టు షాపులు తెచ్చింది నువ్వు కాదా చంద్రబాబూ? ఇవాళ ఉచితంగా కరెంటు ఇస్తామంటున్న చంద్రబాబూ.. ఆ రోజు.. రూ.50గా ఉన్న హార్స్ పవర్ విద్యుత్ ను రూ.625కు పెంచింది నువ్వు కాదా? ఆ వేళ రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే.. రైతన్నకు ఉచితంగా కరెంటు ఇచ్చి ఆదుకోండీ అని ప్రతిపక్షాలంతా ధర్నాలు చేస్తూ ఉంటే.. కరెంటు తీగలు చూపించి.. ‘ఉచితంగా కరెంటు ఇస్తే.. ఆ తీగలు బట్టలు ఆరేసుకోవడానికే పనికివస్తా’యంటూ కొట్టిపారేసింది నువ్వు కాదా చంద్రబాబూ? ఆ వేళ రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే.. తిన్నది అరక్క వారు ఆత్మహత్యలు చేసుకున్నారన్నది మీ పార్టీ కాదా? అని అడుగుతున్నా.
 
 నువ్వా చంద్రబాబు అవినీతి గురించి మాట్లాడేది?
 
 చంద్రబాబు నాయుడు అవినీతి గురించి మాట్లాడుతున్నారు. ఇదే చంద్రబాబు నాయుడు.. కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై తన మీద సీబీఐ విచారణ జరగకుండా చూసుకున్నారు. శ్రీమంతులు గోల్ఫ్ ఆట ఆడుకోవడానికి, శ్రీమంతులు ఇళ్లు కట్టుకుని అమ్ముకోవడానికి చంద్రబాబు హైదరాబాద్ నడిబొడ్డున ఎంతో విలువైన 530 ఎకరాలను ఎమ్మార్ అనే సంస్థకు అప్పనంగా కేటాయించేస్తే.. అది కూడా సింగిల్ టెండరుకు ఇచ్చి అన్ని ఉల్లంఘనలకూ పాల్పడితే.. సీబీఐ చంద్రబాబును కనీసం ఎంక్వైరీకి కూడా పిలవదు. ఇదే చంద్రబాబు ఐఎంజీ భారత అనే సంస్థకు.. హైదరాబాద్ నడిబొడ్డున ఏకంగా 830 ఎకరాలను.. విలాసవంతమైన ఇళ్లు కట్టి శ్రీమంతులకు అమ్ముకోవడానికి ఇచ్చారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంటూ.. కేబినెట్‌కు కూడా పోకుండా ఒక డమ్మీ కంపెనీకి ఆయన భూములు అక్రమంగా కేటాయింపులు చేస్తే.. హైకోర్టు చంద్రబాబు మీద ఎంక్వైరీ చేయాలని ఆదేశాలిస్తే..  సీబీఐ చంద్రబాబుకు ఒక నోటీసు కూడా ఇవ్వకుండా చూడ్డానికి ఆయన కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కయ్యారు. ఇటువంటి వ్యక్తా అవినీతి గురించి మాట్లాడేది?
 
 ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా?: రాష్ట్రం సమైక్యంగా ఉండాలని ఓ వైపు ఉద్యమాలు జరుగుతూ ఉంటే.. చంద్రబాబు గంటలకు గంటలు మీటింగ్ పెట్టి.. అందులో సమైక్యం గురించి మాట్లాడకుండా.. సమైక్య ఉద్యమాన్ని తప్పుదోవ పట్టించేలా.. ఎన్నికల గురించి మాట్లాడ్డం అంటే ఇంతకంటే దుర్మార్గం ఏమైనా ఉంటుందా? ఇవాళ చంద్రబాబుకు చెప్తున్నాను.. మోసం చేస్తున్న కిరణ్ కుమార్‌రెడ్డికీ చెప్తున్నాను. ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్న సోనియా గాంధీకి చెప్తున్నాను. మీరు చేస్తున్న మోసం ఊరికే పోదు. పై నుంచి దేవుడనేవాడు కచ్చితంగా చూస్తున్నాడు. త్వరలో ఎన్నికలు వస్తాయి.. ఆ ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలందరం కూడా ఒక్కటవుదాం. ఆ ఎన్నికల్లో 30 ఎంపీ స్థానాలు మనంతట మనమే తెచ్చుకుందాం.. ఆ తర్వాత ఎవరు మన రాష్ట్రాన్ని ఎలా విడగొడతారో చూద్దాం. మన రాష్ట్రాన్ని ఎవరైతే సమైక్యంగా ఉంచుతారో వారినే ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోబెడతామని గట్టిగా చెప్తున్నాను.  కుయుక్తులు, కుమ్మక్కు రాజకీయాలతో చెడిపోయిన ఈ వ్యవస్థలో ఇవాళ జరుగుతున్న పోరాటం.. ఢిల్లీ అహంకారానికి, తెలుగువారి ఆత్మగౌరవానికి మధ్యే’’.
 
 జగన్‌మోహన్‌రెడ్డి వెంట యాత్రలో పాల్గొన్న నేతల్లో చిత్తూరు జిల్లా పార్టీ కన్వీనర్ నారాయణస్వామి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, ఎమ్మెల్సీ దేశాయి తిప్పారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డ్డి, తాజా మాజీ ఎమ్మెల్యేలు ఎన్. అమరనాథ్‌రెడ్డి, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, పార్టీ నాయకులు రోజా తదితరులు పాల్గొన్నారు.
 
 అసెంబ్లీ మొదటి భేటీలోనే ఎస్‌టీ జాబితాలో చేరుస్తాం
 వాల్మీకులకు జగన్ హామీ
 
 తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హామీకి తగ్గట్టుగానే తమ ప్రభుత్వం ఏర్పాటు కాగానే వాల్మీకి కులస్తులను ఎస్‌టీ జాబితాలో చేరుస్తామని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. చౌడేపల్లెలో సోమవారం ఉదయం తనను కలసిన వాల్మీకి రిజర్వేషన్ పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు పొదల నరసింహులు నేతృత్వంలోని ప్రతినిధి బృందానికి ఆయన ఈ మేరకు హామీ ఇచ్చారు. వాల్మీకుల డిమాండ్ సమంజసమైనదని, తమ ప్రభుత్వం ఏర్పాటు కాగానే జరిగే మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే సంబంధిత బిల్లును ఆమోదిస్తామని చెప్పారు. పార్టీ ఎన్నికల ప్రణాళికలో కూడా వాల్మీకులను ఎస్‌టీలుగా చేర్చాలన్న అంశాన్ని ఉంచామన్నారు. పార్టీ నేతలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్‌రెడ్డి, నారాయణస్వామి నేతృత్వంలో వాల్మీకి సంఘం నేతలు బొగ్గిట కృష్ణమూర్తి, హరికృష్ణ ఆయనను కలిశారు.    
 - సాక్షి ప్రతినిధి, తిరుపతి
 

విభజన పాపం చంద్రబాబుదే

Written By news on Monday, December 30, 2013 | 12/30/2013

విభజన పాపం చంద్రబాబుదే: వైఎస్‌ జగన్వీడియోకి క్లిక్ చేయండి
చిత్తూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.  కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కు రాజకీయాలు నడుపుతున్నాయని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. రాష్ట్ర విభజన పాపం చంద్రబాబుదేనని విమర్శించారు. సమైక్య శంఖారావంలో భాగంగా చిత్తూరు జిల్లాలోని పుంగనూరులో వైఎస్ జగన్ సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిత్తూరు సాక్షిగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, టీడీపీలు కలిసి పోటీ చేశాయని చెప్పారు.

ఎమ్మార్‌ కేసులో చంద్రబాబును విచారణకు పిలవలేదని జగన్ అన్నారు. కాంగ్రెస్‌తో కుమ్మకైనందుకే చంద్రబాబును కాపాడుతున్నారని ఆయన ఆరోపించారు. అవిశ్వాసంలో కాంగ్రెస్‌ను కాపాడింది చంద్రబాబేనని జగన్ విమర్శించారు. ఆనాడే అవిశ్వాసానికి ఓటేసుంటే ప్రభుత్వం కూలేదని, ఇప్పుడు విభజన ఉండేది కాదన్నారు. విశ్వాసం అనే పదానికి చంద్రబాబుకు అర్థం తెలియదని వైఎస్‌ జగన్ తెలిపారు.

Jagan speech in Chowdepalle, Chittoor dist

చంద్రబాబు తుపాకి రాముడు

చంద్రబాబు తుపాకి రాముడు: గట్టు
హైదరాబాద్ : వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తుపాకి రాముడు'' అని గట్టు ఎద్దెవా చేశారు. చంద్రబాబు తన తొమ్మిదేళ్ల పాలన గురించి ఏనాడు చెప్పుకోడని గట్టు అన్నారు. చంద్రబాబు హయాంలో అవినీతి ఎలా పెరిగిందో ఎకనమీ సర్వే చూస్తే తెలుస్తుందని చెప్పారు.

చంద్రబాబు వ్యాఖ్యలకు ప్రజలు నవ్వుకుంటున్నారని గట్టు తెలిపారు.  టీడీపీ ఒక డ్రామా కంపెనీగా గట్టు అభివర్ణించారు.  ప్రపంచంలో ఎవరు గెలిచిన సంబరాలు చేసుకోవడం చంద్రబాబుకు అలవాటైందని గట్టు రామచంద్రరావు విమర్శించారు.

సొసైటీ ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ హవా

కడప :వివిధ కారణాలతో వాయిదా పడిన సొసైటీ ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ సత్తా చాటింది. జిల్లావ్యాప్తంగా 21 సొసైటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో 12 సొసైటీలు నామినేషన్ల దశలో ఆగిపోగా, 8 సొసైటీలు పోలింగ్ దశలో ఆగిపోయాయి.  ఓటర్ల జాబితా ప్రచురణ నోటిఫికేషన్ వెలువడకుండానే బ్రాహ్మణపల్లె సొసైటీ ఎన్నిక ఆగిపోయింది. నామినేషన్ల దశలో ఆగిపోయిన 12 సొసైటీలలో నామినేషన్ల ఉపసంహరణ ఆదివారం సాయంత్రంతో ముగిసింది.

 ఏడు స్థానాలను  వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థులు  ఏకగ్రీవంగా కైవసం చేసుకున్నారు.   అనంతయ్యగారిపల్లె 13 డెరైక్టర్ స్థానాలు, అనంతసముద్రం 13, పెనగలూరు 7, బి.కోడూరు 10, చిన్నకేశంపల్లె 9, కొలిమివాండ్లపల్లె 9, మద్దిరేవుల వైఎస్‌ఆర్‌సీపీ 8, కాంగ్రెస్ 5 డెరైక్టర్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఈ డెరైక్టర్ స్థానాలన్నింటినీ వైఎస్‌ఆర్‌సీపీ అనుకూల అభ్యర్థులు కైవసం చేసుకోవడంతో ఈ ఏడు సొసైటీల్లో వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థులే ఛైర్మన్లుగా ఎన్నిక కానున్నారు. గొర్లముదివీడు సొసైటీలో 13 డెరైక్టర్ స్థానాలు ఏకగ్రీవం కాగా ఛైర్మన్‌గా స్వతంత్య్ర అభ్యర్థి ఎన్నిక కానున్నారు. నందలూరులో 12 స్థానాలకు, మట్లిలో 13 స్థానాలకు, వీరబల్లిలో అన్ని స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి.  బ్రాహ్మణపల్లె సొసైటీకి ఫిబ్రవరి 2న ఎన్నిక జరుగనుంది. మిగిలిన స్థానాలకు జనవరి 5వ తేదీన పోలింగ్ జరుగుతుంది.

అవకాశవాదం, రెండు నాల్కల ధోరణికి ఇంతకంటే నిదర్శనం మరొకటి ఉంటుందా?

బాబుది నయవంచన
      వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి
     వాసిరెడ్డి పద్మ, రాజేష్
     అధికారం కోసం బాబుకు
     ఓట్లు, సీట్లపైనే యావ అని విమర్శ
     రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఎందుకు కోరరని ప్రశ్న
 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 75 శాతం మంది ప్రజలు ‘సమైక్యంగా’ ఉంచాలని గర్జిస్తుంటే టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం ఓట్లు, సీట్ల కోసం నయవంచనకు పాల్పడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘాటుగా విమర్శించింది. తిరుపతి ‘ప్రజాగర్జన’ సభలో చంద్రబాబు గంటన్నరకుపైగా ఉపన్యసించినా.. ఎక్కడా ప్రజల ఆకాంక్ష మేరకు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరకపోవడం దురదృష్టకరమని పేర్కొంది. ఈ మేరకు ఆదివారం నాడిక్కడ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ, మాజీ ఎమ్మెల్యే మద్దాల రాజేష్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రాన్ని విభజించాలని చంద్రబాబు ఎందుకు కోరుకుంటున్నారని వారు సూటిగా ప్రశ్నించారు. రాష్ట్ర విభజనలో సోనియాగాంధీ, ఇతరులను తిడుతున్న చంద్రబాబు.. ఎలాంటి షరతులు లేకుండా రాష్ట్ర విభజనకు అనుకూలంగా ఆయనిచ్చిన లేఖ సంగతేంటి? అని నిలదీశారు.
 
 తెలుగువారికి అన్యాయం జరుగుతోందంటున్న బాబు.. ఆయన చేసిన అన్యాయాన్ని ప్రజలు ప్రశ్నిస్తుంటే ఎందుకు పట్టించుకోవడంలేదని ప్రశ్నించారు. చంద్రబాబు విభజన రాజకీయాలను ప్రజలు అసహ్యించుకుంటున్నారని చెప్పారు. ‘‘రాష్ట్రపతి వద్దకు ఆదివారం తెలంగాణ టీడీపీ నేతలను పంపించారు. అదే రాష్ట్రపతిని చంద్రబాబు రహస్యంగా కలిసి వస్తారు. మరోమారు సీమాంధ్రకు చెందిన నేతలను కూడా రాష్ట్రపతి దగ్గరకు పంపుతున్నారు. ప్రాంతాల వారిగా ఎమ్మెల్యేలను, నాయకులను చీల్చి, రాజకీయాలను చంద్రబాబు ఎందుకింత నీచంగా దిగజార్చుతున్నారు?’’ అంటూ దుయ్యబట్టారు. ఇన్నాళ్లు రెండు కళ్లు, కొబ్బరిచిప్పల సిద్ధాంతాలంటూ విచిత్ర వాదనలు చేసిన చంద్రబాబు.. తిరుపతి సభలో ప్రజలను కోతులుగా చిత్రీకరించి మాట్లాడటం దురదృష్టకరమన్నారు. బాబు తీరు చూస్తుంటే ‘రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి మాదిరిగా.. ఈ నారా చక్రవర్తి చిడతలు వాయించారు’ అని ఎద్దేవా చేశారు.
 
 బాబు అవకాశవాదానికి ఇదే నిదర్శనం: గతంలో వినాయకచవితి ఉత్సవాలకు హైదరాబాద్‌కు నరేంద్రమోడి వస్తానంటే, మోడీ రావడానికి వీల్లేదంటూ ప్రకటనలు చేసిన చంద్రబాబే ఈరోజు మోడీని పొగడం చూస్తుంటే బాబు అవకాశవాదం, రెండు నాల్కల ధోరణికి ఇంతకంటే నిదర్శనం మరొకటి ఉంటుందా?’ అని పద్మ, రాజేష్ ప్రశ్నించారు. ప్రజలు ఎన్టీఆర్ పాలనను కోరుకుంటున్నారని చెబుతున్న చంద్రబాబు.. మరి ఆయన తొమ్మిదేళ్ల పాలన తిరిగి తీసుకొస్తానని ఎందుకు చెప్పలేకపోతున్నారని సూటిగా అడిగారు. ఎన్టీఆర్ మద్య నిషేధం అమలు చేస్తే, ఆయన నుంచి అధికారం లాగేసుకున్న బాబు ఇష్టారాజ్యంగా బెల్ట్‌షాపులు నెలకొల్పిన మాట వాస్తవంకాదా? అని అన్నారు.  ‘‘తొమ్మిదేళ్లపాటు బాబు అధికారంలో ఉండి రైతులకు ఏం చేశారు? ఏ ఒక్కరోజైనా ఉచిత విద్యుత్ ఇవ్వాలనే ఆలోచన వచ్చిందా? ప్రాజెక్టులు ఒక్కటైనా నిర్మించారా? పంట రుణాల గురించి మాట్లాడుతున్న మీరు, మీ హయాంలో కనీసం వడ్డీ అయినా మాఫీ చేశారా?’’ అని ప్రశ్నిం చారు. ఆయన పాలనలో విద్యుత్ చార్జీలు, బస్సు చార్జీలు పెరగలేదని చెప్పడం, 24 గంటలపాటు విద్యుత్ ఇచ్చానని చెప్పడం సిగ్గుచేటన్నారు. అవినీతి గురించి చంద్రబాబు మాట్లాడడం చూస్తుంటే.. ‘ఒసామాబిన్‌లాడెన్ బతికుంటే శాంతివచనాలు వల్లించినట్లు’గా ఉంటుందని ఎద్దేవా చేశారు.
 

చౌడేపల్లి నుంచి జగన్ సమైక్య శంఖారావం

చౌడేపల్లి నుంచి జగన్ సమైక్య శంఖారావం
చిత్తూరు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం చౌడేపల్లి నుంచి సమైక్య శంఖారావం యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన చౌడేపల్లి, కొండమర్రి, లద్దిగాం, చందల్లా, పుంగనూరు గ్రామల్లో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలను ఆవిష్కరించనున్నారు. బిల్లేరు, పూదిపట్ల, భగత్సింగ్ నగర్ మీదగా జగన్ పర్యటన కొనసాగనుంది. లద్దిగాంలో అంజన్న కుటుంబాన్ని ఆయన పరామర్శించనున్నారు. అనంతరం పుంగనూరులో బహిరంగ సభలో జగన్ ప్రసంగిస్తారు.

యాత్రకు 1 నుంచి 3 దాకా విరామం

 చిత్తూరు జిల్లాలో రెండో విడత సమైక్య శంఖారావం యాత్రకు జనవరి 1 నుంచి 3వ తేదీ వరకు తాత్కాలిక విరామం ప్రకటించారు. ఈ మేరకు పార్టీ కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం, జిల్లా పార్టీ కన్వీనర్ నారాయణ స్వామి ఒక ప్రకటన విడుదల చేశారు. నూతన సంవత్సరం పుస్కరించుకొని ఈనెల 31, జనవరి 1 తేదీల్లో యాత్రను నిలిపి వేయాలని పార్టీ కార్యకర్తలు, నాయకులు, భద్రతా సిబ్బంది చేసిన అభ్యర్థన మేరకు జగన్ డిసెంబర్ 31 సాయంత్రమే యాత్ర ముగిస్తున్నారని తెలిపారు. మదనపల్లిలో బహిరంగసభలో ప్రసంగించిన అనంతరం జగన్ హైదరాబాద్‌కు వెళ్లిపోతారని, జనవరి 3న కోర్టుకు హాజరు కావాల్సి ఉన్నందున తిరిగి 4న తంబళ్లపల్లి నియోజకవర్గం బీ కొత్తకోట నుంచి యాత్ర పునః ప్రారంభిస్తారని తెలిపారు.

Why it was not named after unified.. Daadi

Written By news on Sunday, December 29, 2013 | 12/29/2013

Kiran deceiving people with his dual politics.. Jagan

చంద్రబాబు విభజన లేఖ గురించి మాట్లాడరే..: పద్మ

చంద్రబాబు విభజన లేఖ గురించి మాట్లాడరే..: పద్మ
హైదరాబాద్ : రాష్ట్ర విభజనపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రెండు నాల్కల ధోరణి అవలంభిస్తున్నారని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వాసిరెడ్డి పద్మ విమర్శించారు. తిరుపతి ప్రజాగర్జన సభలో చంద్రబాబు విభజన లేఖను వెనక్కు తీసుకుంటామని చెప్పకపోవడం విడ్డూరమని పేర్కొన్నారు. చంద్రబాబు గతంలో విభజన లేఖ ఇచ్చి తెలుగు ప్రజలు విడిపోవాలని  కోరుకున్నారని చెప్పారు.

ఎన్టీఆర్ పాలన గురించి మాట్లాడిన చంద్రబాబు.. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రి పనిచేసిన ఆయన తన పాలన గురించి మాట్లాడటం లేదని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలు కూడా నష్టపోకుండా ఉండాలంటే రాష్ట్రం సమైక్యంగా ఉండాలని పద్మ చెప్పారు. చంద్రబాబు తెలుగు ప్రజల్ని రెండు కోతులుగా చెప్పడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని గతంలో మతతత్వవాదిగా అభివర్ణించిన చంద్రబాబు నేడు అధికారం కోసం మోడీని ప్రశంసిస్తున్నారన్నారు. చంద్రబాబు సమైక్యాంధ్ర గురించి కాకుండా ఓట్లు వేయాల్సిందిగా ప్రాధేయపడుతున్నారని ఆరోపించారు.

భారత దేశాన్ని అవినీతి భారతదేశంగా చేస్తాను- చంద్రబాబు

సోనియాకు వినపడేలా 'జై సమైక్యాంధ్ర'

సోనియాకు వినపడేలా 'జై సమైక్యాంధ్ర'వీడియోకి క్లిక్ చేయండి
చిత్తూరు: ఢిల్లీలో ఉన్న యుపిఏ చైర్ పర్సన్ సోనియా గాంధీకి, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడులకు వినిపించేలా నినాదాలు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి సభికులకు పిలుపు ఇచ్చారు.  జగన్ పిలుపుతో చిత్తూరు జిల్లా రాయల్ పేట్ లో ప్రజలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎగువ ప్రాజెక్టులు నిండితే తప్ప దిగువకు నీరు రాని పరిస్థితి అని తెలిపారు.  జై సమైక్యాంధ్ర, జై తెలుగుతల్లి, జై వైఎస్ఆర్ అని నినాదాలు చేశారు. జనం బిగ్గరగా నినాదాలు చేశారు. రెండో విడత సమైక్య శంఖారావంలో భాగంగా జగన్ ఈరోజు రాయల్ పేట్ గ్రామం చేరుకున్నారు. జగన్ వస్తున్నారని తెలిసి అభిమానులు, కార్యకర్తలు, సమైక్యవాదులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు.  గ్రామంలో ఎటు చూసినా జనమే జనం. మేడలు,  మిద్దెలు జనంతో నిండిపోయాయి.

అశేష జనవాహినిని ఉద్దేశించి జగన్ మాట్లాడుతూ ఎగువ ప్రాజెక్టులు నిండిన తరువాతే దిగువకు నీరు వస్తుందని తెలిపారు. విభజన జరిగితే రాష్ట్రం ఏడారవుతుందని హెచ్చరించారు. రైతుల గురించి ఆలోచించే పరిస్థితిలేదని బాధపడ్డారు. ఓట్లు, సీట్లు కోసం రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, టిడిపి అధ్యక్షుడు చంద్ర బాబు నాయుడు కుమ్మక్కై రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని చెప్పారు. రాష్ట్ర బడ్జెట్ లో 50 శాతం ఒక్క హైదరాబాద్ నుంచే వస్తుందాని తెలిపారు. చంద్రబాబు నోట సమైక్య మాట రాదన్నారు. ప్రజాగర్జనలో చంద్రబాబు ఏం మాట్లాడతారు? అని ప్రశ్నించారు.  
వచ్చే ఎన్నికలలో తెలుగువాడి సత్తా చాటుదామని జగన్ అన్నారు. 30 లోక్ సభ స్థానాలను గెలుచుకుందామని చెప్పారు.


అంతకు ముందు పెందపంజాని మండలం నేలపల్లె గ్రామంలో జగన్  చెరకు రైతులను కలిశారు.  వైఎస్ఆర్ సిపి అధికారంలోకి రాగానే చెరకు రైతులకు గిట్టుబాటు ధర ప్రకటిస్తామని వారికి హామీ ఇచ్చారు. గిట్టుబాటు ధర ప్రకటించిన తరువాతే క్రషింగ్ కు అనుమతిస్తామని చెప్పారు.
 

సమైక్యగర్జన అని ఎందుకు పెట్టలేదు

సమైక్యగర్జన అని ఎందుకు పెట్టలేదు: దాడి
హైదరాబాద్: నేడు తిరుపతిలో జరిగే టీడీపీ ప్రజాగర్జనలో సమైక్య తీర్మణం చేస్తేనే చంద్రబాబును ప్రజలు విశ్వసిస్తారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు దాడి వీరభద్రరావు అన్నారు. ప్రజాగర్జనకు సమైక్యగర్జన అని ఎందుకు పేరు పెట్టలేదని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబుకు ధైర్యముంటే విభజన గర్జన అని పేరుపెట్టాలని సవాల్ విసిరారు. చంద్రబాబు ఆంధ్రుడై ఉండి సిగ్గుపడే విధంగా వ్యవహరిస్తున్నాడని దుయ్యబట్టారు. ప్రత్యేక తెలంగాణకు కారకుడు చంద్రబాబే కారకుడని ఆరోపించారు.

రాష్ట్రపతిని కలిసిన సమయంలో సమన్యాయం అన్నారే గాని,  రాష్ట్ర విభజన ఆపండి అనే పదాన్ని ఎందుకు వాడలేదని నిలదీశారు. సమన్యాయం చేయమనడం పరోక్షంగా రాష్ట్రాన్ని విభజించమని చెప్పడమేనని అన్నారు. 2004-2009లో వైఎస్సార్, జగన్‌లను తిడుతూనే రాజకీయాలు చేసినా బాబును ప్రజలు నమ్మలేదన్నారు. రాబోయే ఎన్నికలకు బాబు ఇదే పందాను ఎంచుకున్నారని అన్నారు. రాష్ట్రాన్ని విభజిస్తే ఏ రాష్ట్రనికి ప్రతిపక్ష నేతగా ఉండాలో తేల్చుకోవాలని ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలపై చంద్రబాబు స్పందించడం లేదని దాడి వీరభద్రరావు ధ్వజమెత్తారు.

నేడు జగన్ పర్యటన ఇలా..

నేడు జగన్ పర్యటన ఇలా..
పలమనేరు, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి సమైక్య శంఖారావం, ఓదార్పు యాత్ర  ఆదివారం పెద్దపంజాణి మండలంలోని కెళవాతి నుంచి ప్రారంభం అవుతుందని పార్టీ స్టేట్ ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం, జిల్లా కన్వీనర్ నారాయణస్వామి తెలి పారు.  

చదళ్లవారి పల్లె, కొళత్తూరు, తుర్లపల్లెక్రాస్, తుర్లపల్లె, కొత్తూరులో రోడ్‌షో ఉంటుందన్నారు. పుంగనూరు మండలం బత్తలాపురంలో పితాంబరం కల్పన కుటుంబాన్ని  ఓదారుస్తారని తెలిపారు. అక్కడ నుంచి తుర్లపల్లె క్రాస్, నేలపల్లె, దిన్నెపలెల్లో రోడ్‌షో ఉంటుందని చెప్పారు.  మండల కేంద్రమైన  పెద్దపంజాణిలో మహానేత వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని, బసవరాజుకండిగ, కోగిలేరు, గుడిపల్లె క్రాస్‌ల్లో రోడ్‌షో, రాయలపేటలో జరిగే బహిరంగ సభలో జగన్ మోహన్ రెడ్డి పాల్గొంటారని వివరించారు.  

కమ్మపాళెంలో డోలు నాగరాజు కుటుంబాన్ని ఓదార్చి, అక్కడి నుంచి చెన్నారెడ్డిపల్లె క్రాస్, సుద్దగుండ్ల పల్లె క్రాస్, కెళవాతి క్రాస్, వీరప్పల్లె, కొత్త వీరప్పల్లె, ఎ.కొత్తకోట క్రాస్, దాదేపల్లెల్లో రోడ్‌షోల్లో పాల్గొంటారని తెలిపారు. దుర్గ సముద్రంలో తోటి శంకరమ్మ కుటుంబాన్ని ఓదారుస్తారని, ఆ తర్వాత చారాలలో వై ఎస్‌ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారన్నారు. శెట్టిపల్లె, చిట్టిరెడ్డి పల్లెల్లో రోడ్‌షో నిర్వహించి రాత్రికి చౌడేపల్లెలో జగన్‌మోహన్‌రెడ్డి బస చేస్తారని వారు వివరించారు.

బాబు మోసం చేశాడు

బాబు మోసం చేశాడు
=1999లో ఎమ్మెల్యే టికెట్టు ఇస్తానని ఇవ్వలేదు
 =2004లో నా భార్యకు బలవంతంగా టికెటిచ్చారు
 =ఆమె ఓడిపోవడంతో ఉన్న ఉద్యోగమూ పోయింది
 =నా నిజాయితీని బాబు పట్టించుకోలేదు
 =పార్టీలో గుర్తింపు లేకుండా చేశారు
 =వేపంజేరి మాజీ ఎమ్మెల్యే గాంధీ

 
పలమనేరు, న్యూస్‌లైన్: తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం నిజాయితీగా, నిబద్ధతతో పనిచేశానని, పార్టీలో సముచిత స్థానం కల్పించకుండా తనను, తన కుటుంబాన్ని చంద్రబాబు మోసం చేశారని వేంపజేరి మాజీ ఎమ్మెల్యే ఆర్. గాంధీ ఘాటుగా విమర్శించారు. పలమనేరు నియోజకవర్గంలోని పెద్దవెలగటూరులో శనివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన పార్టీలో చేరారు.

అనంతరం పలమనేరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులతో కలసి విలేకరుల సమావేశం నిర్వహించారు. 1994లో వేపంజేరి ఎమ్మెల్యేగా పనిచేశానని, చంద్రబాబుకు ప్రధాన అనుచరునిగా ఉన్నానని చెప్పారు. అయితే చంద్రబాబు పార్టీలో సరైన గుర్తింపు ఇవ్వలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రెండు కళ్ల సిద్ధాంతమని, సమన్యాయమని ఆయన చెప్పిందానికల్లా అడ్డు చెప్పకుండా పోతే ఓకే అని, అలా కాదంటే తర్వాత ఎవరినీ పట్టించుకోరని విమర్శించారు. చంద్రబాబు వైఖరితో రాజకీయంగా ఎంతో నష్టపోయానన్నారు. ఒక్కసారి ఎమ్మెల్యేగా ఓడిపోతే ఆపై ఎందుకు కొరగాకుండా చూడడం ఆయన నైజమన్నారు.

1999లో తనకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని ఆపై మోసం చేశారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్న తన భార్యకు 2004లో చంద్రబాబు టికెట్ ఇచ్చారన్నారు. ఈ వ్యవహారం తనకు తెలియకుండా జరిగిందని, తమ కుటుంబంలో ఆయన చిచ్చుపెట్టే విధంగా వ్యవహరించి రాజకీయం నడిపిన ఘనుడని గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఎన్నికల్లో తన భార్య ఓటమి చెందిందని, ఎన్నికల్లో పోటీచేయడంతో ఉన్న ఉద్యోగం కూడా కోల్పోయి ఎంత ఇబ్బంది పడ్డామో ఆయనకేమి తెలుసన్నారు.

తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం దశాబ్దాలుగా పాటుపడినందుకు ఉద్యోగాలు పోగొట్టుకోవాల్సిన పరిస్థితి తలెత్తిందని వాపోయారు. తెలుగుదేశం పార్టీలో బాబుకు నమ్మకస్తునిగా మెలిగానని, అయితే ఆయన  తనను అసలు పట్టించుకోలేదన్నారు. జేబులో చంద్రబాబు బొమ్మలేకుండా బయటకు వెళ్లలేదన్నారు.  హైదరాబాద్‌లో తన బైక్‌కు సైతం పసుపు రంగు కొట్టించి చంద్రబాబు ఫొటోతో తిరిగేవాడినని తన ఆవేదనను వ్యక్తం చేశారు. అలాంటి నమ్మకంగా వ్యవహరించిన తనకు గుర్తింపు లేనప్పుడు ఎందుకు పార్టీలో ఉండాలని ఆయన ప్రశ్నించారు.

రాష్ట్ర సమైక్యత విషయంలో ఆ పార్టీ విధానాలు అసలు నచ్చలేదన్నారు. మొత్తం మీద ఈ కారణాలతో తాను ఆ పార్టీని వీడానన్నారు. సమైక్యాంధ్ర కోసం పోరాడుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడమే ఉత్తమమని నిర్ణయించుకొనే ఈ నిర్ణయం తీసుకున్నానన్నారు. ఎంపీ, ఎమ్మెల్యే టికెట్‌లు ఆశించి పార్టీలో చేరలేదని స్పష్టం చేశారు. సాధారణ కార్యకర్తలా పార్టీ బలోపేతానికి కృషిచేస్తానన్నారు.

2004 ఎన్నికల్లో తన భార్య ఓటమి చెందినప్పుడు తిరిగి ఉద్యోగం కావాలని దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డిని కలసి పరిస్థితిని వివరించానన్నారు. తాను ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకుడినైనా ఆయన సాయం చేశారన్నారు. అందుకే తనకు వైఎస్ అంటే వల్లమాలిన అభిమానమన్నారు. తాను పార్టీలో చేరినందున తనపై కూడా ప్యాకేజీ తీసుకున్నాననే ఆరోపణలు టీడీపీ నేతలు చేసే అవకాశం ఉందన్నారు.

తాను ఆనాడు వైశ్రాయ్ హోటల్‌లో బాబు వద్ద ప్యాకేజీలు తీసుకున్నట్లు చెప్పుకున్నారని, అదెంత నిజమో ఇప్పుడు తాను వైఎస్సార్‌సీపీ వద్ద ఏదైనా పుచ్చుకున్నాననే విషయంలోనూ అంతే నిజముంటుందని ఘాటుగా విమర్శించారు. ఈ విలేకరుల సమావేశంలో జిల్లా నాయకులు అమరనాథ రెడ్డి, మనోహర్, నారాయణ స్వామి, ఆదిమూలం, కేశవులు, వినయ్‌రెడ్డి, సునీల్, సీవీ కుమార్, హేమంత్, సుధా, వంగపండు ఉష తదితరులున్నారు.
 

జగన్‌కు జన స్వాగతం

జగన్‌కు జన స్వాగతం
=పెద్దవెలగటూరుకు తరలివచ్చిన కర్ణాటక అభిమానులు
 =వృద్ధులను ఆప్యాయంగా పలకరించిన జగన్
 =అనంతపురం బయల్దేరి వెళ్లిన జననేత

 
పెద్దపంజాణి, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి అడుగడుగునా అభిమానులు నీరాజనాలందించారు. శనివారం వేకువజామునుంచే అభిమానులు పెద్ద సంఖ్యలో పెద్దవెలగటూరుకు  తరలివచ్చారు. జననేత జయరామిరెడ్డి ఇంట్లో నుంచి బయటకు రాగానే జై జగన్, వైఎస్సార్ జిందాబాద్ అంటూ అభిమానుల నినాదాలతో ఆ గ్రామం దద్దరిల్లిపోయింది.  

కర్ణాటక రాష్ట్రం ఉగిని, హెబ్బిణి, బైరుకూరు, చిన్న నగవారం తదితర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో పెద్దవెలగటూరుకు చేరుకొని జగన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. ఆనంతరం ఆయన అందరినీ ఆప్యాయంగా పలకరించారు. అనంతపురం వెళుతున్న జగన్‌ను చూసేందుకు జనం  నిరీక్షిం చారు. రాజుపల్లెకు చేరుకోగానే పాఠశాల విద్యార్థులు, చుట్టు పక్కల గ్రామాలకు చెందిన అభిమానులు భారీగా రావడంతో ఆయన వాహనం నుంచి దిగి అభిమానులను ఆప్యాయంగా పలకరించారు.

జన నేత కోసం గంటల తరబడి వేచివున్న అభిమానులు ఆయన రాకతో కేరింతలు కొట్టారు. వారి అభిమానానికి పరవశించిపోయిన జగన్  కాన్వాయ్‌ను ఆపారు. రాజుపల్లె గ్రామస్తులు ఆయనకు పూల వర్షం కురిపించారు. రాజుపల్లెలో మాజీ ఎమ్మెల్యే, పలమనేరు నియోజకవర్గ కన్వీనర్ అమరనాథరెడ్డి కమ్మినాయనిపల్లెకు చెందిన భాను ప్రతాప్‌రెడ్డిని జగన్‌మోహన్‌రెడ్డికి పరిచయం చేశారు.

అనంతరం చీమనపల్లె రోడ్డు పక్కన ఉన్న మహిళలను, వృద్ధులను ఆప్యాయంగా పలకరించారు. ‘‘మీ చల్లని చూపే నాకు శ్రీరామ రక్ష’’ అంటూ వృద్ధుల వద్ద ఆశీర్వచనా లు తీసుకున్నారు. ఆయన తోపాటు జిల్లా పార్టీ కన్వీనర్ నారాయణ స్వామి, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి,   మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట పార్లమెంట్ పరిశీలకులు మిథున్‌రెడ్డితో పాటూ పలువురు ముఖ్య నేతలున్నారు.
 

వైఎస్సార్‌సీపీలోకి మాజీ ఎమ్మెల్యే గాంధీ

వైఎస్సార్‌సీపీలోకి మాజీ ఎమ్మెల్యే గాంధీ
జగన్ సమక్షంలో పార్టీలో చేరిక
 
పలమనేరు, న్యూస్‌లైన్: చిత్తూరుజిల్లా వేపంజేరి మాజీ ఎమ్మెల్యే ఆర్.గాంధీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్‌మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. ఆయన గతంలో తెలుగుదేశం ఎమ్మెల్యేగా పనిచేశారు. శనివారం ఉదయం ఆయన పలమనేరు నియోజకవర్గంలోని పెద్దపంజాణి మండలం పెద్దవెలగటూరులో జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా జగన్‌మోహన్ రెడ్డి  ఆయనకు కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్ర సమైక్యత విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు విధానాలు నచ్చకే తాను పార్టీని వీడినట్లు గాంధీ పేర్కొన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని పోరాడుతున్న జగన్‌మోహన్‌రెడ్డికి మద్దతు తెలిపేందుకు తాను వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీలో చేరానన్నారు.
 
 చిత్తూరు జిల్లాలో దశాబ్దాలుగా టీడీపీని అంటిపెట్టుకొని చిత్తశుద్ధితో పనిచేసే నాయకులంతా ఎందుకు పార్టీని వీడుతున్నారో చంద్రబాబు ఆత్మవిమర్శ చేసుకోవాలని కోరారు. పార్టీలో ఎన్టీఆర్ ఆశయాలెప్పుడో పోయాయని, ఇప్పుడంతా స్వార్ధపూరిత రాజకీయాలు నడుస్తున్నాయని చెప్పారు. తనకు ఎమ్మెల్యే, ఎంపీ పదవులు అవసరం లేదని సమైక్యాంధ్ర కోసం పాటుపడుతున్న జగన్‌మోహన్ రెడ్డి వెంట ఓ సైనికుడిలా, పార్టీలో సామాన్య కార్యకర్తలా పనిచేస్తానన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి, వైఎస్సార్‌సీపీ పలమనేరు నియోజకవర్గ సమన్వయకర్త  అమరనాథ రెడ్డి, పార్టీ జిల్లా కన్వీనర్ నారాయణస్వామి, రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు మిథున్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రాజ్యాంగ సవరణతోనే రాష్ట్రాలకు రక్ష

రాజ్యాంగ సవరణతోనే రాష్ట్రాలకు రక్ష
ఆర్టికల్ 3ని వక్రీకరించి రాష్ట్ర విభజన  వైఎస్సార్‌సీపీ నేత మైసూరారెడ్డి ధ్వజం


 హైదరాబాద్, న్యూస్‌లైన్: కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర ఎమ్మెల్యేలను సామ, దాన, దండోపాయాలతో విభజన బిల్లుకు అనుకూలంగా మలుచుకునేందుకు యత్నిస్తున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత ఎంవీ మైసూరారెడ్డి అన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్-3ని వక్రీకరించి ఓట్లు, సీట్లే లక్ష్యంగా ఢిల్లీ పెద్దలు రాష్ట్ర విభజనకు శ్రీకారం చుట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. విశాలాంధ్ర మహాసభ ఆధ్వర్యంలో ‘రాష్ట్ర విభజన ప్రక్రియ-సమాఖ్య స్ఫూర్తి’ అనే అంశంపై శనివారం మహాసభ కార్యాలయంలో జరిగిన చర్చా వేదికలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర విభజనతో, కాస్తో కూస్తో మిగిలి ఉన్న సమాఖ్య స్ఫూర్తిని ఢిల్లీ పెద్దలు కాలరాస్తున్నారన్నారు. స్పీకర్‌కు కూడా ఢిల్లీ నుంచే ఆదేశాలు, తాయిలాలు అందుతున్నాయని ఆరోపించారు.

ఒక ప్రాతిపదిక లేకుండా.. కమిటీ, కమిషన్ ఏదీ చర్చించకుండా  విభజన చేస్తున్నారని చెప్పారు. రాష్ట్ర అసెంబ్లీలో బిల్లుపై ఓటింగ్ పెట్టాలని డిమాండ్ చేశారు.  పాత్రికేయులు ఏబీకే ప్రసాద్ మాట్లాడుతూ రాజ్యాంగంలోని ఆర్టికల్-3ని సవరించడం దేశ సమగ్రతకు ఎంతో అవసరమని చెప్పారు. జస్టిస్ లక్ష్మణ్‌రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర శాసనసభలోగానీ, పార్లమెంట్‌లో గానీ కనీసం మూడింట రెండొంతుల మెజార్టీతోనే రాష్ట్రాల పునర్విభజన జరిగేలా రాజ్యాంగాన్ని సవరించాలని సూచించారు. లోక్‌సత్తా పార్టీ నేత జయప్రకాశ్ నారాయణ, మాజీ ఐపీఎస్ అధికారి సి.ఆంజనేయరెడ్డి  ఎన్.తులసిరెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, సి.నర్సింహారావు, కె.రవీంద్ర, పి.రామజోగయ్య, కె. నారాయణరావు, ఎ.మురళి, సయ్యద్ జాఫ్రీ, వీవీ కృష్ణారావు, విశాలాంధ్ర మహాసభ ప్రతినిధులురవితేజ, చక్రవర్తి ఇందులో పాల్గొన్నారు.

Jagan addressing media on 28th December 2013

YS Jagan visited Nanded Express fire accident site

2013 - జగన్ అలుపెరుగని పోరాటం

Written By news on Saturday, December 28, 2013 | 12/28/2013

2013 -  జగన్ అలుపెరుగని పోరాటం
ఈ ఏడాది మన రాష్ట్రంలో ఉవ్వెత్తున లేచిన ఉద్యమ కెరటం వైఎఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి. సమైక్యాంధ్ర ఉద్యమం తీవ్రస్థాయిలో సాగుతోంది. సమైక్య శంఖారావం పూరించి అలుపెరగని పోరాటం చేస్తున్న ఏకైన నేతగా జగన్ నిలిచారు. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అకాల దుర్మరణం తరువాత ఆయన ఆశయాల సాధనకు, ఆయన ప్రారంభించిన అభివృద్ధి, సంక్షేమ పథకాల కొనసాగింపునకు అనివార్యంగా జగన్ నాయకత్వ బాధ్యతలు స్వీకరించారు. జననేతగా జగన్ రోజురోజుకు ఎదిగే క్రమంలో లేనిపోని అభాండాలన్నీ మోపి అతనిని 2012 మే 27న  అరెస్ట్ చేసి జైలులో పెట్టారు.

ఈ ఏడాదే సమైక్య ఉద్యమం ఊపందుకుంది.  ఉద్యమానికి జైలు నుంచే జగన్ మద్దతు పలికారు. అంతేకాకుండా జైలులో ఉండే సమైక్య రాష్ట్రం కోసం నిరవధిక దీక్ష చేశారు. జనానికి ఇంకా చేరువయ్యారు. న్యాయం జగన్ పక్షాన ఉండటంతో ఎంతకాలం జైలులో ఉంచగలరు? ఈ ఏడాది అక్టోబరు 24న  బెయిలుపై విడుదలయ్యారు. పడిన కెరటం మళ్లీ పైకి లేచింది.  సమైక్య శంఖారావం పూరించారు. సమైక్యవాదులకు అండగా నిలిచారు. ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తున్నారు. రాష్ట్ర రాజధాని  హైదరాబాద్లో అక్టోబరు 26న భారీ స్థాయిలో సమైక్య శంఖారావం బహిరంగ సభ విజయవంతంగా నిర్వహించారు. సమైక్యవాదుల ఆశాజ్యోతిగా నిలిచారు.  జాతీయ స్థాయిలో సమైక్యవాణి వినిపించారు. దేశమంతటా పర్యటించి జాతీయ నాయకులను కలిశారు. సమైక్యతకు మద్దతు కూడగట్టారు.  దేశమంతా రాష్ట్రం వైపు చూసే విధంగా లోక్సభలో ఆంధ్రప్రదేశ్కు జరుగుతున్న అన్యాయం గురించి ఎలుగెత్తి చాటారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని నిజాయితీగా, పట్టుదలతో పోరాడుతున్న ఏకైక నేత జగన్.

 రాష్ట్రం విడిపోతే తలెత్తే సమస్యలు నదీ జలాలు - ఉద్యోగులకు జీతాలు - యువతకు ఉద్యోగాలు - కొత్త రాజధాని ఏర్పాటు.... వంటి సమస్యలన్నింటినీ ఏకరువు పెట్టారు. రాష్ట్రం విడిపోతే రెండు రాష్ట్రాలు నష్టపోతాయని హెచ్చరించారు. నీటి కోసం నిత్యం తన్నుకునే పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర సమైక్యంగా ఉంచడం కోసం చివరి క్షణం వరకు పోరాడతానని శపథం చేశారు. ఆ శపథానికి కట్టుబడి ముందుకు సాగుతున్నారు

ప్రమాదాలపై కమిషన్ లే తప్ప ఫలితంలేదు

ప్రమాదాలపై కమిషన్ లే తప్ప ఫలితంలేదు:జగన్
పుట్టపర్తి: రైలు ప్రమాదాలు, వోల్వో బస్సు ప్రమాదాలు జరిగిన తరువాత కమిషన్లు వేస్తున్నారు గానీ, ఫలితం ఉండటం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.  బెంగళూరు నుంచి నాందేడ్ వెళుతున్న ఎక్స్ ప్రెస్ రైలు   అనంతపురం జిల్లా కొత్తచెరువు సమీపంలోకి వచ్చిన తరువాత  బి ఒన్ ఏసి కోచ్ లోమంటలు వ్యాపించి 26 మంది దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. ప్రమాద వార్త తెలిసిన వెంటనే  తీవ్ర దిగ్భ్రాంతి చెందిన జగన్‌  కొత్తచెరువుకు చేరుకున్నారు. ఘటనాస్థలిని పరిశీలించారు. క్షతగాత్రులను, మృతి చెందిన వారి కుటుంబీకులను  పరామర్శించారు. అనంతరం పుట్టపర్తి రైల్వే స్టేషన్ లో ఆయన విలేకరులతో మాట్లాడారు.

16 నెలల వ్యవధిలో మూడు రైలు ప్రమాదాలు జరిగాయి. అనేక మంది ప్రయాణికులు దుర్మరణం చెందారు. పలువురు గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే  విచారణకు కమిషన్ వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటిస్తుంది. మళ్లీ మళ్లీ మూడు రైలు ప్రమాదాలు జరిగాయి. విచారణ నివేదికలు లేవు. ప్రమాదాలు ఎలా జరిగాయో తెలియదు. వివరాలు వెల్లడించరు. మళ్లీ ఈరోజు కూడా కమిషన్ వేస్తామంటారు. పలాన సమస్య వల్ల ఇంతమంది చనిపోయారు అని తెలియజేయరు. మళ్లీ ఆ సమస్య తలెత్తకుండా పరిష్కరించడానికి ప్రభుత్వాలు ప్రయత్నించడంలేదు. పాత  బోగీలు వాడుతున్నారని విమర్శించారు. ప్రజల జీవితాలతో ఆడుకోవద్దని జగన్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

ఓల్వో బస్సు ప్రమాదాలు నాలుగు జరిగాయి. నడిరోడ్డుపై నాలుగు ఓల్వో బస్సు లు దగ్ధమయ్యాయి. అనేక మంది చనిపోయారు. ఎన్ని ప్రమాద సంఘటనలు జరిగినా కారణాలు తెలియజేయడంలేదు. ఈ రకంగా ఇంతమంది చనిపోతుంటే కేంద్ర ప్రభుత్వం గానీ, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నాయని జగన్ ప్రశ్నించారు. ప్రజల జీవితాలతో చెలగాటం ఆడకుండా వారికి రక్షణ కల్పించాలని, భరోసా ఇవ్వాలని కోరారు.

విలేకరులు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానం చెబుతూ ఎక్స్ గ్రేషియా ఎంత ఇచ్చారనేది కాదన్నారు. 5 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా ప్రకటించి చేతులు దులుపుకుంటే సరిపోదని విమర్శించారు. ఎక్స్ గ్రేషియా 5 లక్షలలా, పది లక్షలా, 20 లక్షలా అనేది కాదని, ప్రజలకు భద్రత కల్పించమని కోరుతున్నామని చెప్పారు.

రైలు ప్రమాద బాధితులకు జగన్ పరామర్శ


రైలు ప్రమాద బాధితులకు జగన్ పరామర్శ
అనంతపురం : నాందేడ్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదంతో తీవ్ర దిగ్భ్రాంతి చెందిన వైఎస్‌ జగన్‌ అనంతపురం జిల్లా కొత్తచెరువుకు చేరుకున్నారు. ఘటనాస్థలిని పరిశీలించి.. ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులను, మృతిచెందిన వారి కుటుంబీకులను వైఎస్‌ జగన్‌ పరామర్శించారు. శోకసంద్రంలో ఉన్న మృతుల బంధువులు, కుటుంబాలను ఆయన ఓదార్చారు. ఈరోజు తెల్లవారుజామున కొత్తచెరువు వద్ద నాందేడ్‌ ఎక్స్‌ప్రెస్‌ మంటలు చెలరేగడంతో 26మంది సజీవదహనయ్యారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదచాయలు అలుముకున్నాయి.

Jagan's speech in Appanapalli

జగన్ నేటి సమైక్య శంఖారావం యాత్ర రద్దు

 చిత్తూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన  సమైక్య శంఖారావం యాత్ర నేడు రద్దు అయ్యింది. ఆదివారం నుంచి యాత్ర యథాతథంగా జరుగుతుందని ఆపార్టీ నేత, మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు.
అనంతపురం జిల్లా కొత్తవలస వద్ద ఈరోజు తెల్లవారుజామున నాందేడ్ ఎక్స్ ప్రెస్ లో ఘోర  ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై వైఎస్ జగన్ తీవ్ర దిగ్ర్బాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనా స్థలానికి  ఆయన బయల్దేరి వెళ్లారు. బాధితులను జగన్ పరామర్శించనున్నారు. ఈనేపథ్యంలో సమైక్య శంఖారావం యాత్ర వాయిదా పడింది.

ఈ శాపం పాలకుల పాపం

ఈ శాపం పాలకుల పాపం

విశ్లేషణ:  ఎమ్‌వీఎస్  నాగిరెడ్డి,  వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర వ్యవసాయ విభాగ కన్వీనర్

 ఈ ఏడాది ముంగారు వర్షాలు రైతును మురిపించాయి. వారం రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా అలుముకున్న రుతుపవనాలు పుడమి తల్లిని పులకరింప చేశాయి. ఈ ఏడాదైనా మంచి పంట రాకపోతుందా అన్న ఆశతో.. నిరుటి ‘నీలం’ గాయాలను లెక్క చేయకుండా  రైతు కాడి పట్టాడు. అదనుకు బ్యాంకులు రుణాలివ్వకపోయినా.. అప్పో సప్పో చేసి పదును పోకముందే విత్తనాలు విత్తాడు. ఐదారెళ్లలో ఎప్పుడూ లేనంతగా సాగు విస్తీర్ణం పెరిగింది. చేలో పచ్చదనం.. రైతు ముఖంలో సంతోషం.. మూన్నాళ్ల ముచ్చటే అయ్యింది. అర్రొంచిన వరి, కళ్లంలో మొక్కజొన్న, అప్పుడప్పుడే విచ్చుకుంటున్న ‘తెల్ల బంగారం’ ఒక్కసారిగా కకావికలయ్యాయి. తీరా పంట చేతికొచ్చే దశలో సర్వం తుడిచిపెట్టుకుపోయి రైతు యథావిధిగా కట్టుబట్టలతో మిగిలిపోయాడు. నెత్తిపై అప్పులకుప్ప.. వచ్చిపోయే నాయకుల కల్లబొల్లి మాటలు మాత్రమే మిగిలాయి. ‘పంట నష్ట పరిహారం’ అందని ద్రాక్షయ్యింది. కౌలు రైతు పరిస్థితి మరీ ఘోరం. బ్యాంకులో అప్పు పుట్టదు... పంట పరిహారమూ రాదు. చావే బతుకుకన్నా నయమన్న దశకు చేరువవుతున్న కౌలు రైతును ప్రభుత్వం గాలికొదిలేసింది. బ్యాంకు రుణాల్లో ఒక్క శాతం వాటా కూడా కౌలు రైతుకు దక్కని పరిస్థితి. ప్రకృతి కన్నెర్ర ... పాలకుల నొసటి వెక్కిరింతల మధ్య 2013 రైతన్నను ఉక్కిరిబిక్కిరి చేసింది. కన్నీరు తుడిచే నాయకుడు, రైతుకు.. నేనున్నానంటూ భరోసా ఇచ్చే నేత... ‘వ్యవసాయాన్ని పండగ’గా మార్చే ప్రభుత్వం రాకపోతుందా అన్న ఆశే రైతును 2014లోకి నడిపిస్తోంది.

 కడగండ్ల సాగు

 మన దేశ స్థూల జాతీయోత్పత్తిలో (జీడీపీ) వ్యవసాయ రంగం వాటా 14.5 శాతం కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీడీపీలో 21 శాతం. అంటే వ్యవసాయం లాభసాటిగా ఉంటేనే రాష్ట్ర గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, మొత్తంగా ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా ఉంటాయి. రాష్ట్రంలో ఖరీఫ్, రబీ సీజన్లలో 120 లక్షల హెక్టార్లలో వివిధ పంటలసాగు జరుగుతుంది. ఇందులో 40 లక్షల హెక్టార్లు వరి. 21.5 లక్షల హెక్టార్లలో పత్తి, 22 లక్షల హెక్టార్లలో నూనె గింజలు. 70 శాతంగా ఉన్న ఈ మూడు పంటల సాగే వ్యవసాయ రంగానికి ఆయువుపట్టు. ఈ మూడు పంటల సాగులో 70 శాతం కౌలు రైతులు, చిన్న రైతులు, వ్యవసాయ కార్మికులు చేసేదే. నేటి పాలకులు చెబుతున్న 0 శాతం వడ్డీ రుణాలు వీరికి చేరడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నది కూడా వీరే. ప్రకృతి కన్నెర్రకు తోడు ప్రభుత్వ అలసత్వంతో 2013 కౌలు రైతుకు శాపంగా మారింది.  నీలం తుఫానుకు తడిసి, రంగుమారిన పత్తి కొనుగోలుకు ప్రభుత్వం చొరవ చూపలేదు. కూలి ఖర్చులు గిట్టని ధరకు తడిసిన పత్తిని అమ్ముకోవాల్సి వచ్చింది. ఇక మంచి పత్తి విషయానికి వస్తే అధికారిక లెక్కల ప్రకారమే క్వింటాలుకి ఉత్పత్తి ఖర్చు రూ. 5,760 కాగా ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ. 3,900. వాస్తవంగా అమ్ముడుపోయింది మాత్రం రూ. 3,400-3,500కే. సీసీఐ సెంటర్లు దళారులకే తప్ప రైతులకు ఉపయోగపడలేదు. రైతుల ఉత్పత్తి మొత్తం వ్యాపారుల దగ్గరకు చేరిన తరువాతే ఎగుమతులను అనుమతించడంతో మేలో పత్తి ధర రూ. 5,000కు పైకి చేరింది.  రైతుకు పెట్టుబడి రాలేదుగానీ వ్యాపారులకు 20 నుంచి 30 శాతం లాభించింది. అలాగే ధాన్యం అమ్మకంలోనూ రైతులకు కనీస పెట్టుబడి రాలేదు. వరి పంటకు నష్టం వాటిల్లిన ప్రాంతాన్ని తగ్గించి నమోదు చేసి ఇన్‌పుట్ సబ్సిడీని మేమే పెంచాం అని ప్రభుత్వం గొప్పగా ప్రకటించింది. ఇన్‌పుట్ సబ్సిడీ అంటే ఒక పంట నష్టపోయిన రైతుకు వెంటనే రెండవ పంట విత్తనాలకు, ఎరువుల కొనుగోలుకు ఇచ్చే సబ్సిడీ సదుపాయం. పైలిన్, హెలెన్, లెహర్ తుఫానుల తరువాత గత ఏడాది నాటి నీలం తుఫాను నష్టపరిహారాన్ని రైతులకు ఇప్పుడు చెల్లించే ప్రయత్నాన్ని చే స్తున్నారు. రబీకి మినుము సాగు డెల్టా కౌలు రైతులకు ప్రధాన ఆధారం. దీనికి ప్రభుత్వ మద్దతు ధర రూ. 4,300 కాగా మార్కెట్‌లో రూ. 3,500కు  కొనేవారు లేక రైతాంగం రోడ్డెక్కింది. మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేస్తామంటూ తెలంగాణలో ఒకటి, కోస్తాంధ్రలో ఒకటి కొనుగోలు సెంటర్లను ప్రారంభించి, పది రోజులకే మూసివే శారు. పసుపు, మిర్చి, పెసర, కంది, జొన్న, సజ్జ ధరలు కుప్ప కూలి కనీస పెట్టుబడి కూడా తిరిగి రాలేదు.

 పాలకుల వెక్కిరింత

 ఏప్రిల్, మే నెలల్లో వచ్చిన వడగళ్ల వానలకు నిజామాబాద్ జిల్లాలో వరి పంట మొత్తం నేలపాలైంది. గాలివానలకు కడప జిల్లాలోనూ, మరికొన్ని చోట్ల అరటి తోటలు నేలపాలయ్యాయి. ఖరీఫ్ సీజన్‌లో కృష్ణా డెల్టాకు ఆగస్టు 6 వరకూ నీరు విడుదల కాకపోయినా ఖరీఫ్‌కు ప్రకృతి అనుకూలించింది. అనంతపురం సహా అన్ని జిల్లాల్లోనూ మంచి వర్షవర్షపాతం నమోదైంది. అన్ని పంటల సాగు పెరిగింది. కానీ అదే సమయంలో మహోధృతంగా వచ్చిపడ్డ పైలిన్ తుఫానుకు విజయనగరం శ్రీకాకుళం జిల్లాలు దెబ్బతిన్నాయి. అక్టోబర్ 20 వరకు రాష్ట్ర రైతాంగం  సంతోషంగానే ఉంది. అయితే అక్టోబర్ 22- 26 హెలెన్ తుఫానుకు కృష్ణా, గోదావరి డెల్టాలలోని వరి పైరు కొంత వరకూ ముంపునకు గురైంది. అత్యధికంగా తీతకు వచ్చిన పత్తి తడిసి, కాయలు కుళ్లి, పూత రాలి ఎకరానికి కనీసం 3 నుండి 5 క్వింటాళ్ల దిగుబడిని రైతులు నష్టపోయారు. రాష్ట్రంలో మొత్తం పత్తి ఉత్పత్తిలో 3/4వ వంతు తెలంగాణ జిల్లాల్లో పండుతుంది. అలానే మొక్కజొన్న కూడా. ఈ తుఫానుకు పత్తి, మొక్కజొన్న, మిర్చి, కూరగాయల పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. హెలెన్ తెరిపిచ్చేసరికి లెహర్ తుఫాను ముంచుకొచ్చింది. కృష్ణా, గోదావరి డెల్టాల్లో కోతకు వచ్చిన వరి పైరు నేలవాలి, గింజలు మొలకెత్తి తీవ్ర నష్టం సంభవించింది. గత ఏడాది బీపీటీ 5204 (సోనామసూరి) రకానికి అధిక ధర పలకడంతో ఈ ఏడు అనేక జిల్లాల్లో దాన్నే ఎక్కువగా సాగుచేశారు. చిన్న వర్షానికి, గాలికి కూడా పడిపోయి,  తొందరగా మొలకెత్తే లక్షణమున్న ఈ రకం వేసినందువల్ల 50 నుంచి 65 శాతం వరకు పంట నష్టం వాటిల్లింది. రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో సన్నకారు రైతులు, వ్యవసాయ కార్మికులే కౌలు రైతులుగా 75 శాతం సాగును చేస్తున్నారు. ప్రకటనలు తప్ప వీరికి ప్రభుత్వం నుండి అందిన సహాయం సున్నా. ధాన్యం పంటకు కోస్తాలాగా వేరుశనగ పంటకు అనంతపురం జిల్లా ప్రసిద్ధి. కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో మొత్తం ఎంత వేరుశనగ సాగవుతుందో అంత ఒక్క అనంతపురం జిల్లాలోనే సాగు చేస్తున్నారు. ఈ ఏడాది వర్షపాతం బాగున్నా తీత సమయంలో వచ్చిన తుఫాను, వర్షాలకు 60 శాతం వేరుశనగ పంటకు నష్టం వాటిల్లింది. నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించాలని, ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వాలని, రంగుమారిన ధాన్యాన్ని మద్దతు ధరకు కోనుగోలు చేయాలని రైతులు, రైతు సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. వరుస తుఫానుల వల్ల పని పెరిగి, కూలి రేట్లు బాగా పెరిగిపోయాయి. సకాలంలో కూలీలు దొరక్క రైతులు వ్యవసాయమంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. ఈ ప్రభావం కూడా ఎక్కువగా వ్యవసాయ కార్మికులైన కౌలు రైతులపైనే పడింది. కూలి చెల్లించాలంటే పంటను ఏదో ఒక ధరకు తక్షణం అమ్ముకోవలసిందే. క్వింటాలు ధాన్యం  ఉత్పత్తి ఖర్చు అధికారిక లెక్కల ప్రకారమే రూ. 1,760. అయితే ప్రభుత్వం ప్రకటించిన ధర రూ. 1,310 మాత్రమే. రంగుమాసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి నేటికీ ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తున్నది. నష్టాననికి గురైన నల్గొండ, వరంగల్ జిల్లాల్లో పత్తి సాగుకు, కృష్ణా, గోదావరి డెల్టాల్లో వరికి నేటికీ నిబంధనలు సడలించలేదు.

 ‘కోతల’ క్షోభ

 ప్రస్తుతం మరలా రబీ సీజన్ నడుస్తోంది. రబీ వ్యవసాయం ఎక్కువగా విద్యుత్ పంపు సెట్లపై ఆధారపడే సాగుతుంది. రాష్ట్ర విద్యుత్ డిమాండ్ 252 మిలియన్ యూనిట్లు ఉండగా, ఉత్పత్తి 241.199 మిలియన్ యూనిట్లుగా (డిసెంబర్ 23) ఉన్నది. కేవలం 5 శాతం విద్యుత్ కొరత ఉంటే వ్యవసాయరంగానికి విద్యుత్ సరఫరాను 7 గంటల నుండి 5 గంటలకు తగ్గించారు. అది కూడా సరిగా అందడం లేదని అప్పుడే సబ్‌స్టేషన్‌ల వద్ద రైతాంగం ధర్నాలు చేస్తున్నారు. ఏపాటి కొద్దిగ విద్యుత్ కొరత ఏర్పడ్డా వ్యవసాయ పంపు సెట్లకు కోత పెట్టడం అమానుషం. బోరుకు 7 గంటల పాటు కరెంట్ వస్తుందనే లెక్కన సాగుకు దిగిన రైతులకు ఏప్రిల్ నెలల్లో 4 గంటలు కూడా విద్యుత్ సరఫరా జరగక రైతులు పూర్తిగా నష్టపోయారు. రైతు ఒక ఎకరం సాగుతో 50 నుండి 60 మందికి పని కల్పిస్తున్నాడు. ప్రత్యక్ష, పరోక్ష పన్నుల ద్వారా రూ. 4 వేల నుండి 6 వేల వరకూ ప్రభుత్వానికి ఆదాయం వస్తోంది. నిజానికి ఇది సబ్సిడీ పథకం కానేకాదు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ సుస్థిరతకు,  ఆహార భద్రతకు తప్పనిసరి కార్యక్రమం. అలాంటి విద్యుత్ సరఫరా సమయాన్ని కుదించి, దాన్ని కూడా నిరంతరం సరఫరా చేయకపోవడం మూలంగా రైతు ఆర్థికంగా కుదేలవుతున్నాడు. అటు ప్రకృతి కన్నెర్ర చేయగా నడ్డి విరిగిన రైతాంగానికి ప్రభుత్వ వైఖరి పెను శాపంగా మారింది. దీంతో రైతు ఆర్థిక వ్యవస్థ, గ్రామీణ ప్రాంతాలు కళ తప్పి వెలవెలబోతున్నాయి.          
http://www.sakshi.com/news/opinion/leaders-negligence-on-agriculture-92216

Popular Posts

Topics :