జగన్ కోసం జనం సంతకాలు కార్యక్రమంలో 30 వేల మంది ప్రవాస భారతీయులు పాలు పంచుకుని తమ సంతకాలు చేశారు. అమెరికా, ఆస్ట్రేలియా, కువైట్, దుబాయ్(యుఏఇ)లో ఈ సంతకాల కార్యక్రమం జరిగిందని వైఎస్సార్ కాంగ్రెస్ ఎన్నారై విభాగం కన్వీనర్ మేడపాటి వెంకట్ శనివారం హైదరాబాద్లో వెల్లడించారు. అమెరికా, ఆస్ట్రేలియాలోని తెలుగువారు ఆన్లైన్ ద్వారా పెద్ద సంఖ్యలో తమ సంతకాలు చేశారని వివరించారు.
ఎన్నారై విభాగం ప్రతినిధులు నరసారెడ్డి, సి.చంద్రశేఖర్ కువైట్లోనూ, ఛాయాదేవి, సోమిరెడ్డి, బ్రహ్మానంద్ దుబాయ్లోనూ సంతకాల కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టారని ఆయన తెలిపారు. వారాంతపు సెలవుల్లో వీరంతా గుమికూడి తెలుగువారు నివసించే ప్రాంతాల్లో ఇంటింటికీ తిరిగి డాక్యుమెంట్లపై సంతకాలు చేయించారు. ఈ సంతకాల ప్రతులను ఎప్పటికపుడు స్కాన్ చేసి ఆన్లైన్ ద్వారా హైదరాబాద్లోని పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపారని వెంకట్ వివరించారు.
0 comments:
Post a Comment