ఫిబ్రవరి 6వ తేదీ నుంచి మరో ప్రజాప్రస్థానం తిరిగి ప్రారంభించనున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ తెలిపారు. బుధవారం ఆమె పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లా ఇంజాపూర్ నుంచి షర్మిల పాదయాత్రను పున ప్రారంభించనున్నట్లు ప్రకటించారు.
షర్మిల కుడి మోకాలుకు గాయం కారణంగా డిసెంబర్ 15న పాదయాత్ర ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఆక్టోబర్ 18, 2012న ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన పాదయాత్ర అయిదు జిల్లాల్లో 24 నియోజకవర్గాల్లో 10 మునిసిపాల్టీలు దాదాపు నాలుగు వందల గ్రామాల నుంచి 822 కిలో మీటర్లు సాగింది.
డిసెంబర్ 14, 2012న రంగారెడ్డి జిల్లా ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని బీఎన్ రెడ్డి బహిరంగ సభలో షర్మిల కుడి మోకాలికి గాయమైంది. వైద్యుల సలహా మేరకు ఆమె డిసెంబర్ 18న మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్నారు. దాదాపు నెలరోజుల విశ్రాంతి అనంతరం షర్మిల గత ఆదివారం అపోలో వైద్యులను కలుసుకున్నారు. వైద్యుల సలహా మేరకు తిరిగి పాదయాత్ర చేయాలని ఆమె నిర్ణయించుకున్నట్లు వాసిరెడ్డి పద్మ తెలిపా
షర్మిల కుడి మోకాలుకు గాయం కారణంగా డిసెంబర్ 15న పాదయాత్ర ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఆక్టోబర్ 18, 2012న ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన పాదయాత్ర అయిదు జిల్లాల్లో 24 నియోజకవర్గాల్లో 10 మునిసిపాల్టీలు దాదాపు నాలుగు వందల గ్రామాల నుంచి 822 కిలో మీటర్లు సాగింది.
డిసెంబర్ 14, 2012న రంగారెడ్డి జిల్లా ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని బీఎన్ రెడ్డి బహిరంగ సభలో షర్మిల కుడి మోకాలికి గాయమైంది. వైద్యుల సలహా మేరకు ఆమె డిసెంబర్ 18న మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్నారు. దాదాపు నెలరోజుల విశ్రాంతి అనంతరం షర్మిల గత ఆదివారం అపోలో వైద్యులను కలుసుకున్నారు. వైద్యుల సలహా మేరకు తిరిగి పాదయాత్ర చేయాలని ఆమె నిర్ణయించుకున్నట్లు వాసిరెడ్డి పద్మ తెలిపా
0 comments:
Post a Comment