తెలుగు ప్రజలతో కాంగ్రెస్ ఆటలాడుకుంటోందని అందుకు ఆ పార్టీ మూల్యం చెల్లించుకోకతప్పదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు హెచ్చరించారు. తెలంగాణ, సీమాంధ్ర కాంగ్రెస్ నేతలని అధిష్టానం రెచ్చగొడుతోందన్నారు. ఉద్యమం చల్లారుతుందనుకున్నప్పుడల్లా ఓట్ల కోసం రెచ్చగొడుతోందని ఆరోపించారు. ప్రజలను రెచ్చగొట్టి లబ్దిపొందాలనుకోవడం తప్పు అన్నారు. తెలంగాణ అంశం విషయంలో కాంగ్రెస్ గందరగోళమైన వాతావరణాన్ని సృష్టించిందన్నారు.
తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన రెడ్డికి లభిస్తున్న ఆదరణను చూసి భయపడే ఈ విధంగా చేస్తోందన్నారు. ఎన్నికుట్రలు చేసినా 2014లో జగన్ను సీఎం కాకుండా అడ్డుకోలేరన్నారు.
తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన రెడ్డికి లభిస్తున్న ఆదరణను చూసి భయపడే ఈ విధంగా చేస్తోందన్నారు. ఎన్నికుట్రలు చేసినా 2014లో జగన్ను సీఎం కాకుండా అడ్డుకోలేరన్నారు.
0 comments:
Post a Comment