* సీబీఐ సాగిస్తున్న కక్షపూరిత దర్యాప్తును మాత్రమే వివరించాం
* తండ్రిలా సరైన న్యాయం జరిగేలా చూడాలని విన్నవించాం
* మా భేటీపై కొన్ని పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి
* వ్యక్తులను బట్టి న్యాయం మారుతోంది.. ధర్మాన, మోపిదేవిల వ్యవహారమే ఉదాహరణ
* లారీల్లో ఎన్ని సంచుల డబ్బులు పడతాయన్న లెక్కలు చంద్రబాబుకే ఎక్కువ తెలుసు
* 26 జీవోలు సక్రమమేనని సీఎం స్వయంగా చెప్పాక జగన్ అరెస్టుకు అర్థం లేదు
సాక్షి, న్యూఢిల్లీ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి కేసులో సీబీఐ సాగిస్తున్న కక్షపూరిత చర్యలను వివరించేందుకే రాష్ట్రపతితో భేటీ అయ్యామని, అయితే కొన్నిపార్టీలు, మీడియా చానళ్లు తమ భేటీని రాజకీయం చేస్తున్నాయని పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. జగన్పై విచారణ ఆపమని కానీ, క్షమాభిక్ష పెట్టమనికానీ కోరలేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికొచ్చింది మొదలుజగన్పై జరుగుతున్న కుట్రలు, బెయిల్ రాకుండా సీబీఐ వ్యవహరిస్తున్న తీరును ప్రణబ్ ముఖర్జీకి వివరించామన్నారు. ఇదే సమయంలో వివిధ సందర్భాల్లో జగన్పై జనం చూపెట్టిన ప్రజాదరణను ప్రణబ్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఈ అన్ని అంశాలు పరిగణనలోకి తీసుకొని ఓ తండ్రిలా, రాజ్యాంగ పెద్దగా సరైన న్యాయం చేయాలని మాత్రమే కోరామన్నారు.
జగన్ అక్రమ అరెస్ట్కు నిరసనగా చేపట్టిన ‘జగన్ కోసం-జనం సంతకం’ కార్యక్రమంలో సేకరించిన సంతకాలను రాష్ట్రపతికి అందించేందుకు మంగళవారం ఢిల్లీకి వచ్చిన విజయమ్మ బుధవారం పార్టీ నేత సోమయాజులు, ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి, ఎమ్మెల్యేలు శోభానాగిరెడ్డి, భూమన కరుణాకర్రెడ్డి, కె.శ్రీనివాసులు, గొల్ల బాబూరావు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్రావు, పార్టీ సీఈసీ సభ్యుడు కోన రఘుపతిలతో కలిసి విలేకరులతో మాట్లాడారు. సీబీఐ చార్జిషీట్ వేస్తే బెయిలొస్త్తుందన్న ఆశతోనే రాష్ట్రపతిని కలిశామని చెప్పారు. అయితే తాము క్షమాభిక్ష కోరుతూ ప్రణబ్ను వేడుకున్నట్లుగా కొందరు వ్యక్తులు, చానళ్లు తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు. ఇకపై ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని మానుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఇదే సమయంలో జగన్ కేసులో సీబీఐ వ్యవహరిస్తున్న తీరును ఆమె ఎండగట్టారు.
బాబుకు తెలిసిన లెక్కలు మాకు తెలియవు..
లక్ష కోట్ల రూపాయలు సంపాదించారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు పదేపదే జగన్పై ఆరోపణలు చేస్తున్నారని, నిజానికి అంత డబ్బెక్కడుందని విజయమ్మ ప్రశ్నించారు. ‘‘గతంలోనే మైసూరారెడ్డి ఈ లక్ష కోట్ల లెక్క చెప్పారు. జలయజ్ఞంలో వెయ్యికోట్లు, రెండు వేల కోట్ల అవినీతి కూడా దొరకడం లేదని అంటే చంద్రబాబు ఆదేశాలతో దానిని చివరికి లక్ష కోట్లుగా సృష్టించామని స్వయంగా మైసూరాయే చెప్పారు. ఇక ఎమ్మార్ కేసులో రూ.10వేల కోట్ల అవినీతి అని ఆరోపించారు. కానీ విజిలెన్స్ రూ.3వేల కోట్లని చెప్పింది. చివరికిఅన్నీ విచారించిన సీబీఐ.. ఏపీఐఐసీకి రూ.43 కోట్లు నష్టం వచ్చినట్లు తేల్చింది. ఇప్పటికే 70 శాతం విచారణ జరిపిన సీబీఐ మొత్తం లక్ష కోట్ల ఆరోపణలు చేసి నాలుగు చార్జిషీట్లలో కలిపి రూ.800 కోట్లు మాత్రమే అని లెక్క చెప్పింది’’ అని వివరించారు. అక్రమాస్తులు కూడబెట్టడం ఎలాగో తమకు తెలియదని, ప్రజలకుసేవ చేయడం మాత్రమే తెలుసని చెప్పారు. ‘‘ఎన్ని లారీల్లో ఎన్ని సంచులు పడతాయి, వెయ్యి లారీల్లో ఎంత సొమ్ము పడుతుందన్నది చంద్రబాబుకు, ఆయన కుమారుడికే ఎక్కువ తెలుసు. దోచుకోవడం, దాచుకోవడం వైఎస్కు తెలియదు. ఆయనకు కేవ లం రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే తెలుసు’’ అని వివరించారు.
ఎన్ని రోజులు జైల్లో పెడతారు?
సీబీఐ సాగిస్తున్న విచారణ ఒక్కొక్కరి విషయంలో ఒక్కో రకంగా ఉందని విజయమ్మ తెలిపారు. ‘‘18 నెలలుగా విచారణ చేస్తున్నా సీబీఐ చార్జిషీట్ వేయకుండా, విచారణ పూర్తి చేయకుండా ఆలస్యం చేస్తోంది. ఎంపీగా ఉన్నందున జగన్ సాక్షులను ప్రభావితం చేస్తారని సీబీఐ ఆరోపిస్తోంది. అరెస్ట్కు ముందు 10 నెలలు జగన్ బయట ఉన్నప్పుడు ఎవరినీ ప్రభావితం చేయలేదు. ఎంపీగా ఉంటే ఎన్ని రోజులు జై ల్లో పెడతారు? కల్మాడీ, కనిమొళి, రాజాలు ఎంపీలే. వారికి బెయిల్ ఇచ్చారు. జగన్కు ఎందుకివ్వరు?’’ అని ప్రశ్నించారు. దేశంలో ఎక్కడైనా ఒక్కొక్కరికీ ఒక్కో న్యాయం ఉంటుందా? అని అడిగారు. ఇదే సమయంలో 26 జీవోల అంశాన్ని ప్రస్తావించారు. ‘‘26 జీవోలు సక్రమమేనని ముఖ్యమంత్రి స్వయంగా చెప్పారు. మంత్రులు, అధికారులు అదే విషయాన్ని కోర్టుకు విన్నవించారు. జీవోలన్నీ సక్రమమే అయినప్పుడు జగన్ ఎలా దోషి అవుతారు? ఇక్కడ క్విడ్ ప్రో కోకు అవకాశం ఎక్కడుంది?’’ అని ప్రశ్నించారు.
మోపిదేవిని బలిపశువును చేశారు
ఈ జీవోల విషయంలో మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణకు ఓ న్యాయం, మంత్రి ధర్మాన ప్రసాద్కు మరో న్యాయం జరుగుతోందని విజయమ్మ అన్నారు. జీవోలతో ప్రమేయం ఉన్న ఒకరిని అరెస్ట్ చేస్తే మరొకరిని వదిలిపెట్టారని ఆరోపించారు. ఈ విషయంలో మోపిదేవిని ఉండవల్లి లాంటి వ్యక్తులు బలిపశువును చేశారన్నారు. అధికార పార్టీ నేత తమ్ముడన్న కారణంతో ఎంపీ లగడపాటి రాజగోపాల్ తమ్ముడు ల్యాంకో శ్రీధర్ను కేసు నుంచి తప్పించారన్నారు.
ఇక చంద్రబాబుపై సీబీఐ విచారణలోనూ ఇదే రుజువైందన్నారు. వ్యాపారం చేసుకునే వ్యక్తి ప్రైవేటు వ్యవహారాల్లో జోక్యం చేసుకోరాదని స్వయంగా ఆర్థిక మంత్రి ఇటీవల వ్యాఖ్యానించారని విజయమ్మ తెలిపారు. ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేష్యాదవ్ కేసులోనూ డింపుల్ యాదవ్కు సంబంధం లేదని సుప్రీంకోర్టు చెప్పిందని వివరించారు. జగన్కు సైతం అప్పటి ప్రభుత్వంతో ఎలాంటి సంబంధం లేకున్నా జైల్లో పెట్టించారన్నారు. జగన్పై కక్షపూరిత వైఖరికి నిరసనగా చేపట్టిన సంతకాల ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ విజయమ్మ కృతజ్ఞతలు తెలిపారు.
అఖిలపక్షంలో చెప్పిందే మా వైఖరి..
తెలంగాణపై పార్టీ అభిప్రాయం ఎలా ఉందని అడగ్గా..‘‘తెలంగాణపై గతంలోనే పార్టీ ప్లీనరీ సమావేశంలో, మొన్నటి అఖిలపక్షంలో మా వైఖరి చెప్పాం. దానికే మేం కట్టుబడి ఉన్నాం. వ్యక్తిగత అభిప్రాయాలు ఎన్ని వ్యక్తమైనా అఖిలపక్ష భేటీలో చెప్పిందే మా పార్టీ వైఖరిగా భావించాలి’’ అని విజయమ్మ బదులిచ్చారు. షర్మిల పాదయాత్ర మళ్లీ ఎప్పుడు మొదలవుతుందని అడగ్గా, ఈ నెల 28న వైద్యులు ఎంఆర్ఐ పరీక్ష చేస్తారని, ఆ తర్వాతే యాత్రపై నిర్ణయిస్తామన్నారు.
పీఎంఓ మానిటరింగ్ చేస్తున్నందునే రాష్ట్రపతిని కలిశాం: సోమయాజులు
‘‘గతంలోని 2జీ కేసును పూర్తిగా కోర్టు మానిటరింగ్ చేసింది. కానీ ప్రస్తుత జగన్ కేసులో లక్ష కోట్ల మేర అక్రమాలు జరిగాయని కాంగ్రెస్, టీడీపీలు ఆరోపణలు చేయడంతో ఈ కేసును స్వయంగా పీఎంఓ మానిటరింగ్ చేస్తోంది. అయితే ఇందులో లక్ష కోట్ల అభియోగాలు మోపిన సీబీఐ రూ.800 కోట్లకు మాత్రమే లెక్కలు చెప్పింది’’ అని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు సోమయాజులు పేర్కొన్నారు. న్యాయవ్యస్థపై తమకు అపార నమ్మకం ఉందని, అయితే సీబీఐ సాగిస్తున్న దర్యాప్తు సరైన రీతిలో లేనందునే న్యాయం కోసం రాష్ట్రపతిని కలిశామని వెల్లడించారు.
* తండ్రిలా సరైన న్యాయం జరిగేలా చూడాలని విన్నవించాం
* మా భేటీపై కొన్ని పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి
* వ్యక్తులను బట్టి న్యాయం మారుతోంది.. ధర్మాన, మోపిదేవిల వ్యవహారమే ఉదాహరణ
* లారీల్లో ఎన్ని సంచుల డబ్బులు పడతాయన్న లెక్కలు చంద్రబాబుకే ఎక్కువ తెలుసు
* 26 జీవోలు సక్రమమేనని సీఎం స్వయంగా చెప్పాక జగన్ అరెస్టుకు అర్థం లేదు
జగన్ అక్రమ అరెస్ట్కు నిరసనగా చేపట్టిన ‘జగన్ కోసం-జనం సంతకం’ కార్యక్రమంలో సేకరించిన సంతకాలను రాష్ట్రపతికి అందించేందుకు మంగళవారం ఢిల్లీకి వచ్చిన విజయమ్మ బుధవారం పార్టీ నేత సోమయాజులు, ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి, ఎమ్మెల్యేలు శోభానాగిరెడ్డి, భూమన కరుణాకర్రెడ్డి, కె.శ్రీనివాసులు, గొల్ల బాబూరావు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్రావు, పార్టీ సీఈసీ సభ్యుడు కోన రఘుపతిలతో కలిసి విలేకరులతో మాట్లాడారు. సీబీఐ చార్జిషీట్ వేస్తే బెయిలొస్త్తుందన్న ఆశతోనే రాష్ట్రపతిని కలిశామని చెప్పారు. అయితే తాము క్షమాభిక్ష కోరుతూ ప్రణబ్ను వేడుకున్నట్లుగా కొందరు వ్యక్తులు, చానళ్లు తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు. ఇకపై ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని మానుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఇదే సమయంలో జగన్ కేసులో సీబీఐ వ్యవహరిస్తున్న తీరును ఆమె ఎండగట్టారు.
బాబుకు తెలిసిన లెక్కలు మాకు తెలియవు..
లక్ష కోట్ల రూపాయలు సంపాదించారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు పదేపదే జగన్పై ఆరోపణలు చేస్తున్నారని, నిజానికి అంత డబ్బెక్కడుందని విజయమ్మ ప్రశ్నించారు. ‘‘గతంలోనే మైసూరారెడ్డి ఈ లక్ష కోట్ల లెక్క చెప్పారు. జలయజ్ఞంలో వెయ్యికోట్లు, రెండు వేల కోట్ల అవినీతి కూడా దొరకడం లేదని అంటే చంద్రబాబు ఆదేశాలతో దానిని చివరికి లక్ష కోట్లుగా సృష్టించామని స్వయంగా మైసూరాయే చెప్పారు. ఇక ఎమ్మార్ కేసులో రూ.10వేల కోట్ల అవినీతి అని ఆరోపించారు. కానీ విజిలెన్స్ రూ.3వేల కోట్లని చెప్పింది. చివరికిఅన్నీ విచారించిన సీబీఐ.. ఏపీఐఐసీకి రూ.43 కోట్లు నష్టం వచ్చినట్లు తేల్చింది. ఇప్పటికే 70 శాతం విచారణ జరిపిన సీబీఐ మొత్తం లక్ష కోట్ల ఆరోపణలు చేసి నాలుగు చార్జిషీట్లలో కలిపి రూ.800 కోట్లు మాత్రమే అని లెక్క చెప్పింది’’ అని వివరించారు. అక్రమాస్తులు కూడబెట్టడం ఎలాగో తమకు తెలియదని, ప్రజలకుసేవ చేయడం మాత్రమే తెలుసని చెప్పారు. ‘‘ఎన్ని లారీల్లో ఎన్ని సంచులు పడతాయి, వెయ్యి లారీల్లో ఎంత సొమ్ము పడుతుందన్నది చంద్రబాబుకు, ఆయన కుమారుడికే ఎక్కువ తెలుసు. దోచుకోవడం, దాచుకోవడం వైఎస్కు తెలియదు. ఆయనకు కేవ లం రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే తెలుసు’’ అని వివరించారు.
ఎన్ని రోజులు జైల్లో పెడతారు?
సీబీఐ సాగిస్తున్న విచారణ ఒక్కొక్కరి విషయంలో ఒక్కో రకంగా ఉందని విజయమ్మ తెలిపారు. ‘‘18 నెలలుగా విచారణ చేస్తున్నా సీబీఐ చార్జిషీట్ వేయకుండా, విచారణ పూర్తి చేయకుండా ఆలస్యం చేస్తోంది. ఎంపీగా ఉన్నందున జగన్ సాక్షులను ప్రభావితం చేస్తారని సీబీఐ ఆరోపిస్తోంది. అరెస్ట్కు ముందు 10 నెలలు జగన్ బయట ఉన్నప్పుడు ఎవరినీ ప్రభావితం చేయలేదు. ఎంపీగా ఉంటే ఎన్ని రోజులు జై ల్లో పెడతారు? కల్మాడీ, కనిమొళి, రాజాలు ఎంపీలే. వారికి బెయిల్ ఇచ్చారు. జగన్కు ఎందుకివ్వరు?’’ అని ప్రశ్నించారు. దేశంలో ఎక్కడైనా ఒక్కొక్కరికీ ఒక్కో న్యాయం ఉంటుందా? అని అడిగారు. ఇదే సమయంలో 26 జీవోల అంశాన్ని ప్రస్తావించారు. ‘‘26 జీవోలు సక్రమమేనని ముఖ్యమంత్రి స్వయంగా చెప్పారు. మంత్రులు, అధికారులు అదే విషయాన్ని కోర్టుకు విన్నవించారు. జీవోలన్నీ సక్రమమే అయినప్పుడు జగన్ ఎలా దోషి అవుతారు? ఇక్కడ క్విడ్ ప్రో కోకు అవకాశం ఎక్కడుంది?’’ అని ప్రశ్నించారు.
మోపిదేవిని బలిపశువును చేశారు
ఈ జీవోల విషయంలో మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణకు ఓ న్యాయం, మంత్రి ధర్మాన ప్రసాద్కు మరో న్యాయం జరుగుతోందని విజయమ్మ అన్నారు. జీవోలతో ప్రమేయం ఉన్న ఒకరిని అరెస్ట్ చేస్తే మరొకరిని వదిలిపెట్టారని ఆరోపించారు. ఈ విషయంలో మోపిదేవిని ఉండవల్లి లాంటి వ్యక్తులు బలిపశువును చేశారన్నారు. అధికార పార్టీ నేత తమ్ముడన్న కారణంతో ఎంపీ లగడపాటి రాజగోపాల్ తమ్ముడు ల్యాంకో శ్రీధర్ను కేసు నుంచి తప్పించారన్నారు.
ఇక చంద్రబాబుపై సీబీఐ విచారణలోనూ ఇదే రుజువైందన్నారు. వ్యాపారం చేసుకునే వ్యక్తి ప్రైవేటు వ్యవహారాల్లో జోక్యం చేసుకోరాదని స్వయంగా ఆర్థిక మంత్రి ఇటీవల వ్యాఖ్యానించారని విజయమ్మ తెలిపారు. ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేష్యాదవ్ కేసులోనూ డింపుల్ యాదవ్కు సంబంధం లేదని సుప్రీంకోర్టు చెప్పిందని వివరించారు. జగన్కు సైతం అప్పటి ప్రభుత్వంతో ఎలాంటి సంబంధం లేకున్నా జైల్లో పెట్టించారన్నారు. జగన్పై కక్షపూరిత వైఖరికి నిరసనగా చేపట్టిన సంతకాల ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ విజయమ్మ కృతజ్ఞతలు తెలిపారు.
అఖిలపక్షంలో చెప్పిందే మా వైఖరి..
తెలంగాణపై పార్టీ అభిప్రాయం ఎలా ఉందని అడగ్గా..‘‘తెలంగాణపై గతంలోనే పార్టీ ప్లీనరీ సమావేశంలో, మొన్నటి అఖిలపక్షంలో మా వైఖరి చెప్పాం. దానికే మేం కట్టుబడి ఉన్నాం. వ్యక్తిగత అభిప్రాయాలు ఎన్ని వ్యక్తమైనా అఖిలపక్ష భేటీలో చెప్పిందే మా పార్టీ వైఖరిగా భావించాలి’’ అని విజయమ్మ బదులిచ్చారు. షర్మిల పాదయాత్ర మళ్లీ ఎప్పుడు మొదలవుతుందని అడగ్గా, ఈ నెల 28న వైద్యులు ఎంఆర్ఐ పరీక్ష చేస్తారని, ఆ తర్వాతే యాత్రపై నిర్ణయిస్తామన్నారు.
పీఎంఓ మానిటరింగ్ చేస్తున్నందునే రాష్ట్రపతిని కలిశాం: సోమయాజులు
‘‘గతంలోని 2జీ కేసును పూర్తిగా కోర్టు మానిటరింగ్ చేసింది. కానీ ప్రస్తుత జగన్ కేసులో లక్ష కోట్ల మేర అక్రమాలు జరిగాయని కాంగ్రెస్, టీడీపీలు ఆరోపణలు చేయడంతో ఈ కేసును స్వయంగా పీఎంఓ మానిటరింగ్ చేస్తోంది. అయితే ఇందులో లక్ష కోట్ల అభియోగాలు మోపిన సీబీఐ రూ.800 కోట్లకు మాత్రమే లెక్కలు చెప్పింది’’ అని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు సోమయాజులు పేర్కొన్నారు. న్యాయవ్యస్థపై తమకు అపార నమ్మకం ఉందని, అయితే సీబీఐ సాగిస్తున్న దర్యాప్తు సరైన రీతిలో లేనందునే న్యాయం కోసం రాష్ట్రపతిని కలిశామని వెల్లడించారు.
0 comments:
Post a Comment