వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి సంస్థల్లో పెట్టుబడుల విషయంలో రాంకీ కంపెనీ ఆస్తులను ఈడీ అటాచ్ చేయడం ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తప్పితే అదే జడ్జిమెంట్ కాదని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు వ్యాఖ్యానిం చారు. జగన్ను ఇబ్బందులు పెట్టేందుకు ప్రభుత్వ సంస్థలైన సీబీఐ, ఈడీలను ఉపయోగించుకొంటూ అధికార కాంగ్రెస్, ప్రతిపక్షం టీడీపీ కుమ్మక్కై సాగిస్తున్న కుట్రలు తారస్థాయికి చేరాయని దుయ్యబట్టారు. ఆయన మంగళవారమిక్కడ పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద మాట్లాడుతూ... రాంకీ సంస్థకు భూముల విషయంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం చేసిన మేలేమీ లేదని, అంతకు ముందు చంద్రబాబు హయాంలో కుదుర్చుకున్న ఒప్పందాన్నే కొనసాగించారని చెప్పారు.
Home »
» అదే జడ్జిమెంట్ కాదు: గట్టు
అదే జడ్జిమెంట్ కాదు: గట్టు
Written By news on Wednesday, January 9, 2013 | 1/09/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment