కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై నీచ రాజకీయాలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై నీచ రాజకీయాలు

కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై నీచ రాజకీయాలు

Written By news on Monday, January 7, 2013 | 1/07/2013

 సహకార ఎన్నికలకు సంబంధించి జరుగుతున్న అక్రమాలను వివరించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు ఈ ఉదయం గవర్నర్‌ నరసింహన్ను కలిశారు. సహకార సంఘాల ఓటర్ల నమోదులో జరుగుతున్న అక్రమాలను వారు గవర్నర్‌కు వివరించారు. ఒక్క వారంలో 11లక్షల మంది సభ్యులుగా నమోదయినట్లు తెలిపారు. గవర్నర్ను కలిసినవారిలో పార్టీ ఎమ్మెల్యేలు బాలినేని శ్రీనివాసరెడ్డి, గుర్నాథరెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, సుచరిత తదితరులు ఉన్నారు. 

అనంతరం వారు మాట్లాడుతూ కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై నీచ రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. సభ్యత్వ నమోదు 
అక్రమాలకు అడ్డుకట్టవేయాలని గవర్నర్‌కు విన్నవించామని చెప్పారు. తక్షణమే విచారణ జరుపుతామని గవర్నర్ హామీ ఇచ్చినట్లు తెలిపారు. కోపరేటివ్ రిజిస్ట్రార్‌తో మాట్లాడతానని గవర్నర్ హామీ ఇచ్చారని చెప్పారు.
Share this article :

0 comments: