వైఎస్ పాదయాత్రతో పోలికే లేదు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ పాదయాత్రతో పోలికే లేదు

వైఎస్ పాదయాత్రతో పోలికే లేదు

Written By news on Saturday, January 5, 2013 | 1/05/2013

బాబు యాత్ర ప్రజల కోసమా, రికార్డుల కోసమా?

సాక్షి, హైదరాబాద్: సినిమా దర్శకులు, నటుల సలహాలు, సూచనలతో, సినీ పద్ధతిలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పాదయాత్ర చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. బాబు యాత్రకు, దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి మండుటెండల్లో చేసిన పాదయాత్రకు ఏ మాత్రం పోలికే లేదని పేర్కొన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైఎస్ 52 డిగ్రీల ఎండలను కూడా లెక్క చేయకుండా ప్రజలతో మమేకమైతే బాబు మాత్రం మార్నింగ్, ఈవెనింగ్ వాకింగ్ మాదిరిగా చల్లటి సమయంలో యాత్ర చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. ‘‘ప్రజల్లో ఎలా నటించాలో సినీ దర్శకులు చేసిన సూచనలను బాబు తూ.చ. తప్పకుండా పాటిస్తున్నారు. 

అంతేగాక సినిమా వారి మాదిరిగా 25 రోజులు, 50 రోజులు, 100 రోజుల పండుగలు నిర్వహిస్తున్నారు. కేకులు కట్ చేస్తున్నారు. రాష్ట్రానికి ఏదో వెలగబెట్టినట్టుగా బాబు తనకు తానే శిలాఫలకం వేయించుకోవడం సిగ్గుపడాల్సిన చర్య. ఏసీ బస్సుల్లో నిద్రిస్తూ, రోడ్డుపై ట్యాంకర్ల చేత నీళ్లు చల్లిస్తూ సాగించే యాత్రను కూడా పాదయాత్రే అంటారా?’’ అని ప్రశ్నించారు. బాబు యాత్ర ప్రజల కోసమా, తన రికార్డుల కోసమా స్పష్టం చేయాలని శ్రీకాంత్ డిమాండ్ చేశారు. వైఎస్ పాదయాత్రను బాబు అధిగమించారంటూ టీడీపీ నేతలు పోల్చడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రజలకు అందుబాటులో లేకుండా అర్ధరాత్రి వేళల్లో నడక సాగించడాన్ని ఏమని అర్థం చేసుకోవాలో టీడీపీ నేతలే చెప్పాలన్నారు.

తొమ్మిదేళ్లు ఏం చేశావ్?

బాబు పచ్చి అవకాశవాది అని, ఏరు దాటాక తెప్ప తగలేసే రకమని శ్రీకాంత్ మండిపడ్డారు. ఆయనకు నోరు తెరిస్తే అబద్ధాలు తప్ప ఒక్క నిజం పలకడం చేత కాదన్నారు. ‘‘తొమ్మిదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఒక్క మేలైనా చేశావా? వారి బాగోగులను ఏనాడైనా పట్టించుకున్నావా? వృద్ధులకు మూడు నెలలకు ఒకసారి పెన్షన్లిచ్చావు. రైతులను జైల్లో పెట్టించావు. ఏ ముఖం పెట్టుకుని ప్రజల మధ్యకొస్తున్నావు? మళ్లీ నిన్ను గెలిపించి చీకటి పాలనను కొనితెచ్చుకోమంటావా?’’ అని బాబును ప్రశ్నించారు. అసలు బాబుకు కళ్లు మూసినా, తెరిచినా వైఎస్ కుటుంబమే కళ్ల ముందు కనిపిస్తుంటుందని, అందుకే ఎక్కడికి వెళ్లినా వారిని దూషిస్తున్నారని అన్నారు.

కడప, పులివెందులవాసులు తరిమికొడతారు!

పదేపదే కడప, పులివెందుల రౌడీలు అంటూ తమ ప్రాంత ప్రజల మనోభావాలను బాబు దెబ్బ తీస్తున్నారని శ్రీకాంత్ మండిపడ్డారు. తొమ్మిదేళ్లు సీఎంగా పని చేసిన వ్యక్తి ఇంగితజ్ఞానం కూడా లేకుండా ఒక ప్రాంత ప్రజలను చులకన చేసి మాట్లాడటం సబబా అని ప్రశ్నించారు. మరోసారి కడప, పులివెందుల అంటూ తమ ప్రాంత ప్రజలను అవమానపరిస్తే బాబును వారే తరిమికొడతారని హెచ్చరించారు.
Share this article :

0 comments: