తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించాలని ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాశ్రావు సూచించారు. తెలంగాణ ఏర్పడితే 16 పార్లమెంటు సీట్లు గెలిపిస్తామని కాంగ్రెస్ నేత వయలార్ రవి భావించడం ఒట్టి భ్రమేనని, సీట్ల కోసమే రాష్ట్రం ఏర్పాటు చేయాలనుకుంటే ఎన్నికల్లో శృంగభంగం తప్పదన్నారు. శుక్రవారం సచివాలయంలో గోనె మీడియాతో మాట్లాడారు. ఎన్డీఏ హయాంలో మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేసిన బీజేపీ అనంతరం ఆ రాష్ట్రాల్లో పరాజయం పాలైందని, జార్ఖండ్ కోసం 30 ఏళ్లు పోరాడిన జార్ఖండ్ ముక్తి మోర్చాకు రాష్ట్ర ఏర్పాటు అనంతరం జరిగిన ఎన్నికల్లో ఓటమి తప్పలేదని గుర్తుచేశారు.
Home »
» సీట్ల కోసం పాకులాడితే శృంగభంగమే: గోనె
సీట్ల కోసం పాకులాడితే శృంగభంగమే: గోనె
Written By news on Saturday, January 19, 2013 | 1/19/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment