వైఎస్ విజయమ్మ ఆశీస్సులు తీసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం తనకు ఆనందంగా ఉందని కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి అన్నారు. మహానేత ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కిరణ్ సర్కారు సక్రమంగా అమలు చేయడం లేదని ఆయన ఆరోపించారు. పథకాలు సక్రమంగా అమలు చేస్తారేమోనని ఏడాదిగా ఎదురు చూసానని తెలిపారు.
కాంగ్రెస్ వైఖరితో తీవ్రంగా నిరాశ చెంది వైఎస్ఆర్సీపీలో చేరినట్లు ద్వారంపూడి తెలిపారు. ఈనెల 13నే పార్టీలో చేరినట్లు ఆయన చెప్పారు. చాలమంది ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ సీపీలోకి రాబోతున్నారని, ప్రభుత్వంపై ఎమ్మెల్యేలందరికీ వ్యతిరేకత ఉందని ద్వారంపూడి తెలిపారు. పార్టీ సీటు కోసం తాను వైఎస్ఆర్ సీపీలో చేరలేదని, సాధారణ కార్యకర్తగా పార్టీకి సేవ చేస్తానని ఆయన పేర్కొన్నారు
కాంగ్రెస్ వైఖరితో తీవ్రంగా నిరాశ చెంది వైఎస్ఆర్సీపీలో చేరినట్లు ద్వారంపూడి తెలిపారు. ఈనెల 13నే పార్టీలో చేరినట్లు ఆయన చెప్పారు. చాలమంది ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ సీపీలోకి రాబోతున్నారని, ప్రభుత్వంపై ఎమ్మెల్యేలందరికీ వ్యతిరేకత ఉందని ద్వారంపూడి తెలిపారు. పార్టీ సీటు కోసం తాను వైఎస్ఆర్ సీపీలో చేరలేదని, సాధారణ కార్యకర్తగా పార్టీకి సేవ చేస్తానని ఆయన పేర్కొన్నారు
0 comments:
Post a Comment