వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్పై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్ర బాబు నాయుడు చేస్తున్న వ్యాఖ్యలు చూసి ప్రజలు ఛీదరించుకుంటున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు సోమయాజులు తెలిపారు. బాబుకు మతిభ్రమించిందనే అలా మాట్లాడుతున్నారు అనే అనుమానం కలుగుతుందన్నారు. హైదరాబాద్లోనివైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయనవిలేకర్లతో మాట్లాడారు. చంద్రబాబు కుప్పం నుంచి తప్ప రాష్ట్రంలో ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి తెలుగుదేశం పార్టీకి లేదని ఆయన ఎద్దేవా చేశారు. సహకార ఎన్నికల్లో అధికార పార్టీ అక్రమాలకు పాల్పడుతుందన్నారు. అధికార పార్టీ ఓటమి భయంతో చట్టాన్ని అపహాస్యం చేస్తొందన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి నెలకొందని అన్నారు. నిజమైన రైతులకు ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుందని సోమయాజులు ఈ సందర్బంగా ఆరోపించారు.
Home »
» చంద్రబాబుకు మతిభ్రమించింది
చంద్రబాబుకు మతిభ్రమించింది
Written By news on Friday, January 25, 2013 | 1/25/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment