హైదరాబాద్, న్యూస్లైన్: రాష్ట్ర ప్రజల సంక్షేమానికి అహర్నిశలు కృషి చేసిన దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డిపై అభాండాలు తగవని తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్సీ మల్లుల లక్ష్మీనారాయణ అన్నారు. చంచల్గూడ జైల్లో ఉన్న వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని శనివారం ఆయనతో పాటు పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీచైర్మన్ చెర్ల రాధాకృష్ణ, అమర్చింత నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే సోమభూపాల్రెడ్డి తనయుడు శ్రీరామ్ భూపాల్రెడ్డి వేర్వేరుగా ప్రత్యేక ములాఖత్లలో కలిశారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ రాష్ర్టంలో జరుగుతున్న కుమ్మక్కు రాజకీయాలను చూడలేక జగన్కు అండగా ఉండేందుకు వైఎస్ఆర్ సీపీలో చేరుతున్నట్లు స్పష్టంచేశారు. ప్రస్తుత తరుణంలో రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీల కుటిల రాజకీయాలను సహించలేకపోతున్నానని, అందుకే కాంగ్రెస్కు రాజీనామా చేసినట్లు చీర్ల రాధాకృష్ణ అన్నారు. జగన్ నాయక త్వంలోని వైఎస్ఆర్సీపీలో చేరుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. కాంగ్రెస్, టీడీపీల నీచరాజకీయాల కారణంగా జైల్లో ఉన్న వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఎల్లప్పుడూ తమ మద్దతు ఉంటుందని శ్రీరామ్భూపాల్రెడ్డి అన్నారు. రాష్ట్రానికి విశేష సేవలు చేసిన రాజశేఖరరెడ్డి తనయుడిని ఇన్ని విధాలుగా ఇబ్బందిపెట్టడం అన్యాయమన్నారు. కాగా, మల్లుల లక్ష్మీనారాయణ, చీర్ల రాధాకృష్ణ వైఎస్సార్ సీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ సమక్షంలో పార్టీలో చేరారు.
Home »
» వైఎస్పై అభాండాలు తగవు :మల్లుల లక్ష్మీనారాయణ
వైఎస్పై అభాండాలు తగవు :మల్లుల లక్ష్మీనారాయణ
Written By news on Sunday, January 6, 2013 | 1/06/2013
హైదరాబాద్, న్యూస్లైన్: రాష్ట్ర ప్రజల సంక్షేమానికి అహర్నిశలు కృషి చేసిన దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డిపై అభాండాలు తగవని తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్సీ మల్లుల లక్ష్మీనారాయణ అన్నారు. చంచల్గూడ జైల్లో ఉన్న వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని శనివారం ఆయనతో పాటు పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీచైర్మన్ చెర్ల రాధాకృష్ణ, అమర్చింత నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే సోమభూపాల్రెడ్డి తనయుడు శ్రీరామ్ భూపాల్రెడ్డి వేర్వేరుగా ప్రత్యేక ములాఖత్లలో కలిశారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ రాష్ర్టంలో జరుగుతున్న కుమ్మక్కు రాజకీయాలను చూడలేక జగన్కు అండగా ఉండేందుకు వైఎస్ఆర్ సీపీలో చేరుతున్నట్లు స్పష్టంచేశారు. ప్రస్తుత తరుణంలో రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీల కుటిల రాజకీయాలను సహించలేకపోతున్నానని, అందుకే కాంగ్రెస్కు రాజీనామా చేసినట్లు చీర్ల రాధాకృష్ణ అన్నారు. జగన్ నాయక త్వంలోని వైఎస్ఆర్సీపీలో చేరుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. కాంగ్రెస్, టీడీపీల నీచరాజకీయాల కారణంగా జైల్లో ఉన్న వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఎల్లప్పుడూ తమ మద్దతు ఉంటుందని శ్రీరామ్భూపాల్రెడ్డి అన్నారు. రాష్ట్రానికి విశేష సేవలు చేసిన రాజశేఖరరెడ్డి తనయుడిని ఇన్ని విధాలుగా ఇబ్బందిపెట్టడం అన్యాయమన్నారు. కాగా, మల్లుల లక్ష్మీనారాయణ, చీర్ల రాధాకృష్ణ వైఎస్సార్ సీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ సమక్షంలో పార్టీలో చేరారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment