పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం

పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం

Written By news on Monday, January 7, 2013 | 1/07/2013

 వైద్యుల సూచన మేరకు త్వరలో షర్మిల పాదయాత్ర పునప్రారంభిస్తారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత బాజీరెడ్డి గోవర్థన్ తెలిపారు. పాదయాత్రలో కాలికి గాయం కావటంతో షర్మిల శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలిసిందే. కాగా ప్రజాసమస్యల పరిష్కారంలో సర్కార్‌ చూపుతున్న నిర్లక్ష్యాన్ని ప్రశ్నించడానికి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పలు కార్యక్రమాలను ప్రకటించింది. 

ఈ మేరకు ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 9న రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లోని సబ్‌స్టేషన్లను ముట్టడించాలని నిర్ణయించింది. పత్తిరైతుల సమస్యలపై త్వరలోనే వైఎస్‌ విజయమ్మ రెండు రోజుల దీక్ష చేపట్టనున్నారు. జగన్‌కోసం కోటి సంతకాల కార్యక్రమాన్ని ఈ నెల పది వరకు పొడిగించారు. స్థానిక సంస్థల ఎన్నికలపై ఈనెల 10 నుంచి ప్రతిరోజూ సమీక్షలు నిర్వహిస్తారు.
Share this article :

0 comments: