హెటిరో యాజమాన్య వైఖరిని వైఎస్ఆర్ టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు జనక్ప్రసాద్ తీవ్రంగా ఖండించారు. విశాఖ హెటిరో డ్రగ్స్ పరిశ్రమలో శనివారం ప్రమాదం జరిగి చనిపోయిన కుటుంబాలకు తక్షణమే ఆర్థిక సాయం అందించాలని ఆయన కోరారు. ఆ పరిశ్రమలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిచాలన్నారు. మృతుల కుటుంబాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసింది. హెటిరో డ్రగ్స్ సీ-బ్లాక్లో ప్రమాదం జరిగి ముగ్గురు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే.
http://www.sakshi.com/Main/Breakingstory.aspx?catid=518125&Categoryid=14&subcatid=0
http://www.sakshi.com/Main/Breakingstory.aspx?catid=518125&Categoryid=14&subcatid=0
0 comments:
Post a Comment