Home »
» దుబాయ్లో చిక్కుకున్న రాష్ట్ర వలస కార్మికులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా
దుబాయ్లో చిక్కుకున్న రాష్ట్ర వలస కార్మికులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా
రాయికల్(కరీంనగర్), న్యూస్లైన్: దుబాయ్లో చిక్కుకున్న రాష్ట్ర వలస కార్మికులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచింది. కార్మికులను ఆదుకునేందుకు వైఎస్సార్ సీపీ నాయకులు దుబాయ్ వెళ్లారు. స్వదేశానికి తిరిగి వచ్చేందుకు చేతిలో చిల్లిగవ్వలేక ఇబ్బంది పడుతున్న 50 మంది కార్మికులకు వైఎస్సార్ సీపీ కేంద్ర కమిటీ సభ్యుడు కె.కె.మహేందర్రెడ్డి రూ.5 లక్షలతో టికెట్లు కొనిచ్చారు. గల్ఫ్ కార్మికులకు యూఏఈ ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని మహేందర్రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దుబాయ్ వెళ్లిన వారిలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర నాయకులు జిట్టా రామచంద్రారెడ్డి, మ్యాడపాటి వెంకట్, సంక్షేమ సంఘం ప్రతినిధులు పెద్దిశెట్టి ప్రసాద్, కళ, ఆనంద్, రమేశ్రెడ్డి, సాయిరెడ్డి, బ్రహ్మానందరెడ్డి ఉన్నారు. కార్మికులు బుధవారం రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు.
0 comments:
Post a Comment